9, సెప్టెంబర్ 2021, గురువారం

తద్దినం ఎందుకు

 సైన్స్ : తద్దినం ఎందుకు ? మహాభారతంలో ఒక కధ ఉంది... కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రేవతి అనే అందమైన కూతు రు ఉండేది. అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు.


ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 చతుర్యుగాలు గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు.


దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ.. ఇప్పుడు భూమిపై 28 వ చతుర్యుగము నడుస్తుంది. అక్కడ మహా విష్ణు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ...


ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం...


ఆ చిత్రం పేరు "Interstellar" ఈ చిత్రం 2014 లో వచ్చింది. ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రం లో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు, కొడుకు ఉంటారు.

కూతురంటే అతనికి ప్రాణం. 


ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు.

తన కూతురు గదిలో దూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ దూళి చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో. అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవి శని గ్రహానికి(Saturn) దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని (Galaxy) ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్.


అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి ‘వార్మ్ హోల్’ (Warm hole) ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా. వార్మ్ హోల్ అంటే ఒక గాలక్సీ నుండి ఇంకో గాలక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి. అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని.. వగైరా వగైరా(etc etc..).. అప్పటికి ఆ హీరో కూతురు వయ్యస్సు 10 సంవత్సరాలు (ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి). ఆ తరువాత కధ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి (Black hole) ప్రవేశిస్తాడు. అయితే అది 4D లోకం. మనం ఉన్నది 3D ప్రపంచం. నాలుగవ డైమెన్షన్ కాలం.


అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట.

అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించ గలడన్న మాట. అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు. అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు.


ఇప్పుడు అర్ధం అయ్యిందా... అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే.

ఇక ఆ తరువాత కొంత కధ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు. అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది. కాని హీరో వయసు మాత్రం మారదు. ఎందుకంటే హీరో వెళ్లిన గ్రహంలో ఒక గంట భూమిపై ఏడు సంవత్సరాలతో సమానం.


పైన మహా భారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కధగానే తీసుకుంటాం. కాని ఆ కధలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే "సమయ విస్ఫారణం"(Time dilation), "కృష్ణ బిలం (Black hole), "వెచ్చని రంధ్రం” (Warm hole) వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మము యందు చెప్పడం జరిగింది.


అందుకే స్వామీ వివేకానంద అన్నారు.. "సైన్స్ అభివృద్ధి అయ్యేకొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది" అని.


ఇతర లోకాలకు, మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే "సమయ విస్ఫారణం” (Time dilation) అని నేటి సైన్స్ చెబుతుంది. మనం మహాభారతంలో చదువుకున్నాం. పాండవులు చివరి రోజులలో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాలు మీదుగా ప్రయాణం చేయడం. కాని, స్వర్గం ఉండేది భూమిపై కాదు. మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్లడం ఏంటి అని అనుమానం వస్తుంది. నాక్కుడా వచ్చింది.


పైన చెప్పిన వార్మ్ హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి. హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వార్మ్ హోల్స్ ఉన్నాయన్న మాట. అలాగే ఆది శంకరాచార్యుల వారు బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది. అంటే అక్కడ వార్మ్ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్ధం అవుతుంది.


మన హిందూ సనాతన ధర్మము ప్రకారం, మరియు గరుడ పురాణం బట్టి చూసినా చనిపోయిన వారికి 11 -15 రోజుల వరకూ ప్రతీరోజూ పిండ ప్రధానం చేస్తారు. ఆ తరువాత సంవత్సరం వరకూ నెలకొక్కసారి చేస్తుంటారు. ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు.


ఎందుకో తెలుసా, చనిపోయిన 11 – 15 రోజుల వరకూ జీవుడు భూమిపైనే ఉంటాడు. అందుకే ప్రతీరోజు పిండ ప్రధానం చేస్తాం. ఆ తరువాత జీవుడు స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరు కోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది గరుడ పురాణం ప్రకారం. ఆ సమయంలో భూమిపై నెలరోజుల కాలం ఆ లోకంలోని వారికి ఒకరోజుతో సమానం. అందుకే నెలకొకసారి చేస్తే వారికి రోజు కొకసారి పెట్టినట్టు. ఇక సంవత్సరం తరువాత స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకుంటారు. అప్పుడు సంవత్సరానికి ఒకసారే పెడతాం.


ఎందుకంటే అక్కడ ఒక రోజు, భూమిపై ఒక సంవత్సరంతో సమానం. ఇలానే ఎన్నో లోకాలు, ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి. ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే "సమయ విస్ఫారణం"(Time Dilation) అంటాం.


ఇట్లానే.. బ్రహ్మ దేవుఁడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినపుడు కూడా ఒక క్షణం పాటు అది ఒక సంవత్సరం అయ్యింది. అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా, జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్తాడు.


ఇలా మన పురాణాలలో ఎన్ని విషయాలు ఉన్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం, మన సంస్కృతిని కాదని ఏ తల తోక లేని పరమతం మాయలో పడుతున్నారు. మన తరువాత ఎప్పుడో వచ్చిన ఎడారి మతాలు ఇలాంటి విజ్ఞానంలో మన హిందూ సనాతన ధర్మమునకు దరిదాపుల్లో కూడా రాలేవు.


కుదిరితే ఈ వ్యాసం అందరికి పంపండి. కనీసం చదువుకున్న వాళ్లకు అర్థం అవుతుంది.


|| ఓం నమః శివాయ ||

హిందూ ధర్మ పరిరక్షకులు

 Hara Hara Mahadevaaa Shamboo Shankaraaa. *హిందూత్వానికి సైన్యముగా నాగసాధు అఖాడాలను ఏర్పాటు చేసిన శాశ్వత హిందూ ధర్మ పరిరక్షకులు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు.*


గమనిక: మనమందరం తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు 

 

ప్రపంచములో చాలా మందికి నాగసాధువులు అఖాడాలు అనేవారు ఉంటారనేది తెలిసినా అసలు వాళ్ళు ఎందుకు ఉంటారు - అలా ఎందుకుంటారు - దేనికోసం వాళ్ళు శూలం కత్తి గద వంటి ఆయుధాలు ధరించి ఉంటారనే ప్రాధమిక విషయాలే చాలా మందికి తెలియని విషయమైతే, అసలు వారిని హిందూ ధర్మానికి సైనిక వ్యవస్ధగా జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఏర్పాటు చేశారనేది 90 శాతం హిందువులకే తెలియని విషయం. అసలు ముందుగా వారెవరు, వారి జీవన విధానం ఏమిటి, ఎందుకు ఉత్తరభారతములోనే ఉంటారు, ఎందుకు మనుష్యులలోకి రారు, ఎందుకు కుంభమేళాలోనే వస్తారు, ఎందుకు వారికి సైన్యముకి ఉండే విధముగా ఆయుధాలు ఉంటాయి, ఇవన్నీచాలా మందికి సమాధానములు తెలియని ప్రశ్నలు. ముందుగా అసలు నాగసాధువులు అంటే ఏమిటి అఖాడాలు అంటే ఏమిటో చూద్దాము.

 

నాగ సాధువులను వివిధ అఖాడాలుగా ఒకే కాషాయ జెండా కిందకు వచ్చే సైన్యముగా ఏర్పరిచినది సాక్షాత్ శివావతారులైన ఆదిశంకరాచార్యుల వారే. నాగ అనగా హిమాలయాలలో కొండలలో నివసించే వారు అని అర్ధము. వారంతా అలా నాగసాధువులుగా ఏర్పడడానికి కఠోరమైన శారీరక శ్రమతో కూడిన సైనిక శిక్షణతో పాటు జ్ఞానమును వైరాగ్యమును కూడా అలవర్చుకున్నవారు. పరిపూర్ణమైన శారీరక మానసిక ధృడత్వం పొందిన వారే నాగ సాధువులు అవగలరు.

 

నాగసాధువులు పూర్వకాలం నుంచి ఉన్నప్పటికీ శంకరాచార్యుల వారు శివావతారులుగా గ్రహించగలిగి వారిచే ప్రేరణపొంది హిందూత్వ సైన్యముగా ఈ నాగసాధువులంతా హిందూత్వ ధర్మరక్షణకు కట్టుబడినవారు. తమకు తామే పిండప్రదానం చేసేసుకుని జీవన్ముక్తులుగా భావించగలిగే వైరాగ్య సంపన్నులు, శంకరాచార్యుల వారి సూచన మేర ఆయుధములని వినియోగించగలిగే యుద్ధ శిక్షణ కూడా పొందే వారు. రోజుకి ఒకసారి మాత్రమే తింటూ నైష్ఠిక బ్రహ్మచారులుగా ఉంటూ మంత్రసాధనతో తపస్సు చేసుకుంటారు. వారు ఇంద్రియ నిగ్రహం పొంది కట్టుకునే బట్టలను లెక్క చేయకుండా తలకు జటలనూ మరియు రుద్రాక్ష ధారణ చేయువారు. ఏకాంతముగా ఉత్తరభారత పర్వతాలలో నివసిస్తూనే ఈ దేశానికీ హిందువుల సంరక్షణకి మరియు ధర్మ రక్షణకి ఆది శంకరాచార్యుల వారి ప్రేరణచే పూర్తిగా కట్టుబడి ఉన్నవారు.

 

 

ఆదిశంకరాచార్యుల వారు ఈ నాగసాధువులు సైన్యముగా విడివిడిగా ఎవరికీదారే అన్నట్టుగా ఉండకుండా అఖాడా వ్యవస్ధ ఏర్పాటు చేశారు. అఖాడా అంటే యుద్ధ శిక్షణా శిబిరము లేదా సమూహం, ఒక్కొక్క అఖాడాకు ఒక నాయకుడు ఉంటారు, ఆ అఖాడాలలో ప్రతినాగసాధువూ యుద్ధశిక్షణనే కాక వైరాగ్యమును కూడా అలవర్చుకుంటారు.

 

అఖాడాలంతా ఆది శంకరాచార్యుల వారిచే వారి కాలములోనే నియమించబడిన హిందూత్వ సైన్యం. హిందూత్వ ధర్మరక్షణ అంటే కేవలం ధర్మ భోధతోనే కాదు, హిందూత్వానికి ఎప్పుడైనా ఏ కాలంలో అయినా ఎవరైనా సైన్యముతో శత్రువులుగా వస్తే హిందూ ధర్మమును మన క్షేత్రాలను కాపాడడానికి సైన్యము ఆవశ్యకమని తెలిసి దూరదృష్టితో ఆ కాలంలోనే ఆది శంకరాచార్యుల వారు హిందూత్వానికి సైన్యముగా నాగసాధువులను ఒకటి చేసి వాళ్ళని ఆయుధములను ఉపయోగించే విధముగా యుద్ధ శిక్షణ ప్రక్రియను మార్గదర్శనం చేసి వారిని దశనామి సాంప్రదాయాల అనుసారంగా వివిధ అఖాడాలుగా ఏర్పాటు చేశారు. జనం సంచారంలోకి రాని వీళ్ళని లక్షలుగా వీళ్ళ ఉనికి ప్రపంచానికి తెలియడానికి వీరిని కుంభమేళాలో అందరినీ ఒకచోటికి చేరమని చెప్పి అలాగే శంకర పరంపరలోని ఉత్తరామ్నాయ శంకరాచార్యుల వారి మాటకు కట్టుబడి ఉండమని ఆది శంకరాచార్యుల వారు వారికి మార్గదర్శనం చేశారు. ఈ విషయాలు అన్నీ కొన్ని పుస్తకాలలో లేక Blogలలో ఉన్నప్పటికీ హిందువుల ఐక్యత రుచించని వారు ఇంకా ఎన్నోవిషయాలు జనాలకు అందుబాటులోకి ఇవ్వరు. మనమే ప్రయత్న పూర్వకముగా తెలుసుకోవాలి, మునిపల్లె జ్యోతి స్వరూప్ అనబడే నేను ఉత్తరామ్నాయ శంకరాచార్య జద్గురువుల శిష్యులని అడిగి తెలుసుకున్న అనేక విషయాలలో కొన్ని ఇక్కడ వ్రాస్తున్నాను.

 

శంకరాచార్యుల వారిచే ఏర్పాటు చేయబడిన హిందూత్వ సైన్యమైన నాగసాధు అఖాడాలు హిందూత్వ ధర్మ యుద్ధం చేసిన సంధార్భాలు కూడా చరిత్రలో అనేకం ఉన్నాయి. క్రీశ 1664లో ఔరంగజేబు కాశీ విశ్వనాధ మందిరం పై తన సైన్యముతో దండయాత్ర చేసినప్పుడు నాగసాధువులే వచ్చి అతడి అక్కడి సైన్యాన్నిసమూలంగా సంహరించారు. వారికి భయపడి ఔరంగజేబు కాశీ విశ్వనాధ మందిరం పై దాడిని కొన్ని ఏళ్ల పాటు ఆపేసుకున్నాడు. ఈ చారిత్రక సత్యము The Illustrated Encyclopedia Of Hinduism అనే పుస్తకంలో పేర్కొనబడి ఉన్నది. తరువాత అక్బర్ కాలంలో కూడా అక్బర్ సైన్యము అమాయకులైన పూజారులను సాధువులనూ చంపడం తెలిసి అప్పటి ఉత్తరామ్నాయ శంకరాచార్య జగద్గురువుల సూచన మేర అద్వైత గురువులైన మధుసూధనానంద సరస్వతీ స్వామి వారు అక్బర్ సభకే వెళ్ళి ఈ హింసను ఆపమని కోరితే అక్బర్ నిరాకరించడంతో, స్వామి వారు నాగసాధువులకు కబురు పంపితే వారొచ్చి ఆ అక్బరు అక్కడి సైన్యాన్ని అంతా అతి క్రూరముగా ఖండఖండాలుగా నరికేశారు. ఆ భయానికి అక్కడి ప్రాంతీయ ముస్లిములు కొన్ని తరాలపాటు వందలయేళ్లు హిందువుల జోలికి పోలేదనే చారిత్రక సత్యాన్ని Soldier Monks & Militant Sadhus అనే పుస్తకంలో పేర్కొన్నారు. టిప్పు సుల్తాన్ మరియు షా జహాన్ సైన్యము కూడా హిందూ సాధువులు క్షేత్రాల జోలికి వచ్చి హిందూ సైన్యముతో సంహరింపబడ్డారని తెలుసుకోవచ్చు. నేడు 2020లో కూడా మహారాష్ట్రలో ఇద్దరు సాధువులని హిందూ ద్వేషులు హత్య చేస్తే నాగసాధువులు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే పరిష్కరించమని లేకపోతే త్వరలో తామే వచ్చి పరిష్కరించవలసి వస్తుందని తమ మాటగా తెలుపడం దానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు మొదలు పెట్టడమూ చూశాము. ఈ విధంగా శంకరాచార్యుల వారిచే ఏర్పాటు చేయబడిన హిందూత్వ సైన్యము హిందువులకి సైన్యం ఆవశ్యకమయినప్పుడు తప్పక వస్తారు.

 

శంకరాచార్యుల వారిచే పఠిష్ఠ సైన్యముగా వీరంతా ఉత్తరభారతంలో హిమాలయాలలో పర్వతాలలో ఉండేవారు కనుక వారు ఉత్తర ఆమ్నాయ పీఠ పరిధికి చెందుతారు. ఆది శంకరాచార్య స్వరూపులే తనచే స్థాపించబడిన నాలుగు ఆమ్నాయ పీఠాధిపత్య శంకరాచార్యుల వారని అందరూ గుర్తించాలని శివావతార ఆది శంకరాచార్యులవారే తెలిపారు. నేడు 12 నుంచి 14 అఖాడాలుగా ఉన్నాయి అందులో కొన్ని విష్ణు భక్తులుగా ఉంటారు, అయినప్పటికీ వారు కూడా ఆది శంకరులచే ఏర్పాటు చేసిన అఖాడా సైన్య వ్యవస్థలో ఒకరు కనుక వారితో పాటుగా అన్నీ అఖాడాలూ ఉత్తరామ్నాయ శంకరాచార్యుల వారికి ఆజ్ఞా బద్ధులు.

 

కుంభమేళా మొదటి రోజున ఏమవుతుందో చాలామందికి తెలియదు, కుంభమేళా మొదలు అయ్యేది ఆమ్నాయ జగద్గురు శంకరాచార్యుల వారి పూజతో, తరువాత కుంభమేళా స్నానాలు అవుతాయి. అప్పుడు అక్కడ నాగసాధువులు అఖాడాలు జగద్గురు శంకరాచార్యుల వారికి గౌరవ వందనం చేసి "మేము దేశం లోపలికి వచ్చి మా యుద్ధంతో చేయవలసిన పరిస్థితి ఏమైనా వచ్చినదా, అనుజ్ఞ ఇవ్వండి" అని అడుగుతారు.

ఒకవేళ వాళ్లే దేశంలోపలికి వచ్చి యుద్ధం మొదలు పెడితే హిందూత్వ శత్రువులు మిగలరు, అంత పరిస్థితి ఇంకా రాలేదు వచ్చినప్పుడు కబురు పంపిస్తాము అని సమాధానం ఇచ్చి పంపిస్తారు ఉత్తర ఆమ్నాయ జగద్గురు శంకరాచార్యుల వారు. అఖాడాలు అనుజ్ఞని తీసుకుని గౌరవ వందనం చేసి మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటామని చెప్పి వెళతారు. 

 

వీళ్ళ భయం అప్పటి రాజులకే కాక ఇప్పటి రాజకీయ నాయకులకి కూడా ఎప్పుడూ ఉంటుంది కానీ పైకి బయటపెట్టుకోరు. అందుకే వాళ్ళ జోలికి పోరు. మన హిందువులలో చాలా మంది ఈరోజు మాటలు ఏమిటయ్యా అంటే ఆది శంకరాచార్యుల వారి పరంపర విలువ తెలుసుకోకుండా చేతిలో Facebook Twitterలాంటివి ఉన్నవి కదా అని ప్రతి చిన్నదానికి శంకరాచార్యుల వారి పరంపరనే మనకు ఏమిచ్చారు ఏమి చేశారు అంటూ నోటికి వచ్చిన మాటలు అనేస్తారు. రాజకీయ నాయకులు ప్రణాళికాబద్ధంగా హిందూత్వ గురువులైన ఆది శంకరాచార్యుల వారి పరంపర నుంచి హిందువులని విభజించి పాలించే పద్ధతితో దూరం చేస్తూ వస్తున్నారు, హిందువులేమో చాలామంది వాళ్ళ ప్రణాళికకు అనుగుణంగా ఆదిశంకర పరంపరకు దూరం అవుతున్నారు.

 

మరి హిందూత్వానికి సైన్యమే ఏర్పాటు చేసిన వారు కదా మరి చతురామ్నాయ శంకరాచార్య జగద్గురువులు నేడు మన దేశంలోని సమస్యలు అన్నీ పరిష్కరించలేరా అంటే తప్పక పరిష్కరించగలరు, కానీ దానికి శాసనాధికారం ఉండాలి కదా! అనాది కాలముగా పరిపాలించే వాడు శాసనాధికారి అయితే ఆ రాజుని కూడా శాసించేవాడు గురువు కదా. ఎప్పుడో ఎందుకు శృంగేరి పరంపరలోనే వచ్చిన విద్యారణ్య స్వామి వారు పూనుకుని హరిహర రాయ బుక్కరాయలలను శాసనం చేసి అప్పటికే ఇస్లాం స్వీకరించిన వారిని తిరిగి హిందూత్వం స్వీకరింపజేసి వాళ్ళచే హిందూ సామ్రాజ్యాన్ని స్థాపింపచేయలేదా! అదే జరిగి ఉండకపోతే అసలు నేడు మన పరిస్తితి ఏంటి? హిందువులు మిగిలి ఉండేవారా! పాలకులపై శాసనాధికారం గురువులకి ఉండాలి కదా అప్పుడే కదా వాళ్ళు ధర్మ రక్షణ చేయగలిగేది! మరి రాజ్యాంగ వ్యవస్థలో ఆ అవకాశం ఉన్నదా? లేదు కదా! హిందువులు అందరూ ఇప్పటికైనా విషయం గ్రహించి హిందూ సైన్యాన్ని ఆదేశించగలిగే శంకర పరంపరకు కట్టుబడి ఉండాలి. అనేక రాజకీయ కోణాలలో దూరం చేయబడిన హిందువులంతా ఏకమయ్యి నాలుగు ఆమ్నాయ జగద్గురువులకి మనమంతా దగ్గరయ్యి జగద్గురువులని ఆశ్రయిస్తే అప్పుడు రాజకీయ నాయకులంతా ఓట్లకైనా లేక దేనికైనా హిందువుల కాళ్ళ బేరానికి వస్తారు.

 

అసలు చతురామ్నాయ జగద్గురువుల నినాదమే గోహత్య నిషేధం మరియు ఇది హిందూత్వ దేశగా ప్రకటించడం కదా! ఇది చాలామంది హిందువులకే తెలీదు. ఎన్నోసార్లు ప్రతి చిన్నదానికీ ఈ దేశంలో రాజ్యాంగ సవరణ జరిగింది. హిందువులు ఏకతాటిపై నిలిచి శంకర పరంపరకు కట్టుబడి ఉండి పాలకులపై వారి శాసనాధికారం తిరిగి వారికే రాజ్యాంగ సవరణతో ఇప్పిస్తే మనకు ఏది కావాలో వారే ఇప్పిస్తారు. దానికి ఉదాహరణ రామసేతు అయినా రామమందిరం అయినా సుప్రీం కోర్టులో నిలబడి గెలిచిన వాదాలు శంకరాచార్యుల వారి పీఠానికి చెందిన వారిదే అనేది తెలుసుకోవచ్చు, అలాగే గోహత్య నిషేధానికి కూడా పై స్థాయిలో కృషి చేస్తున్నదే కాక భారత దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించమనే ఆదేశం కూడా ప్రభుత్వానికి ఎప్పుడో ఇచ్చారనేది అందరూ గ్రహించాలి.

 

హిందూత్వ పరిరక్షణకు మనమేమి చేయాలి మరీ అనేది మనమంతా తెలుసుకోవలసిన అసలు విషయం, ఆది శంకరాచార్యుల వారు 72అవైదిక మతాలను ఖండించడమే కాకుండా షణ్మతాల రూపములో 6 మార్గాల ఆరాధనా విధానము కూడా ఇచ్చి - వేదము సూచించే అద్వైత స్థితి అయిన ముక్తి మార్గము చూపారు. దానిని మనకు తమ అనుగ్రహముతో సులువుగా అలవర్చుకునేందుకు నాలుగుదిక్కులలో నాలుగు ఆమ్నాయ పీఠాలను పెట్టి ముక్తి మార్గాన్ని సూచిస్తే, నేటి రోజున 70 శాతము హిందువులు పురోగతి మార్గములో కాకుండా తిరోగతి మార్గాలు వెతుకుతున్నారు తమకు తెలిసీ తెలియక. ఈ ప్రాపంచికములని దాటి పరమును చేరుకోడానికి నాలుగు ఆమ్నాయాలలో తన పరంపరను ఏర్పాటు చేశారు, ప్రాపంచికములో కూడా రాజ్యాంగము ఏర్పడక ముందు ఉన్న ప్రభువుల పై జగద్గురువులుగా శాసనం చేసేవారుగా జగద్గురువులుగా ఉండడమే కాక వాటితో పాటు సైన్య వ్యవస్థని కూడా ఇచ్చారు కదా ఇంకా ఏమి కావాలి !

 

ఏమి కావాలి అనుకోవడం కాదు, హిందూధర్మ పరిరక్షణకు గాను అన్నివిధాలలోనూ ఆది శంకరాచార్యుల వారు బీజమెప్పుడో దూరదృష్టితో వేశారు, దానికిగాను తన స్వరూపమే అయిన శంకర పరంపరను కూడా ఏర్పాటు చేశారు నాలుగు ఆమ్నాయ పీఠాలలో, మనము చేయవలసినదల్లా పైన సూచించిన విధముగా మనము వారిని భక్తితో చేరి తద్వారా హిందూ ధర్మానికి జగద్గురు ఆది శంకరాచార్యుల వారి మార్గదర్శకములో కట్టుబడి ఉండాలనేదే నేడు హిందువులందరూ గ్రహించాలని కోరుకుంటూ..


శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం 

నమామి భగవద్పాద శంకరం లోక శంకరం 🙏


హిందూ ధర్మ పరిరక్షకులైన జగద్గురు ఆది శంకరాచార్యుల వారికి జై 🙏 Haraaa Haraaa Mahaaadeeeev Shaboooo Shankaraaa.

ప్రశ్న పత్రం సంఖ్య: 28

 ప్రశ్న పత్రం సంఖ్య: 28  కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

 క్రింది అసంపూర్తిగా వున్న ఖాళీలను నింపండి. 

 

  1. అంగట్లో అన్నీ ఉన్నాయి _________ శని ఉంది.
  2. అంత్య నిష్టూరం కన్నా,________ మేలు
  3. అందని _______పుల్లన
  4. అందితే సిగ అందకపోతే ____
  5. అంబలి తాగేవాడికి ______ఎత్తేవాడు
  6. ఇంట గెలిచి __గెలవమన్నట్లు
  7. ఇంటి దొంగను ________కూడా పట్టలేడు
  8. ________గుడి పదిలం
  9. ఇంట్లో ఈగల మోత, వీధిలో _______మోత
  10. ఇంట్లో పిల్లి వీధిలో ___
  11. ఇంట్లో రామయ్య, వీధిలో ____
  12. ఊరంతా నాన్నకు లోకువ – నాన్న ____లోకువ
  13. ఋణ శేషము __ _____ వుండ కూడ దంటారు.
  14. ఏ అన్నమైతేనేం __అన్నమే పెట్టమన్నట్టు
  15. ఎంకి పెళ్ళి ___చావుకొచ్చిందట
  16. ఎంగిలిచేత్తో ___తోలని వాడు
  17. ఏ ఆకు రాలినా ____రాలదు
  18. ఏ ఎండకా _____పట్టినట్లు
  19. ఏ కర్రకు నిప్పంటుకుంటే _____ కాలుతుంది
  20. ఒక ఒరలో _____కత్తులు ఇమడవు

స్వభాషాధ్యాసకాళన్నశ్వాస

 *స్వభాషాధ్యాసకాళన్నశ్వాస.* *dr. వేదుల'శిరీష'.* kkd.

*ధీశాలి,అన్యాయంనెదిరించేవాడిని ఆరాధించినప్రజాకవి కాళోజి.

తెలుగుఅక్షర శ్వాస కాలంయోధుడు,

జాతికి అంకిత జీవన సాహితీశిఖరం.

*ప్రజాగోడుగొడవేనాగొడవన్న గరంస్వరం,

స్వరాజ్యకాంక్షస్వతంత్ర్యయోథకాళోజి,

స్వరాష్ట్రఆకాంక్ష భావనా వెలుగులై,

స్వభాషాయాస మనిషి మనసైనగళం,

మనిషితత్వం ప్రజాకవిత్వ కళాతత్వమై,

మానవతావాద ఓరుగల్లు భావన ఖిల్లాయై,

ప్రజాపక్ష అక్షర తెలుగు మాండలీకమైన,

సాంఘిక చైతన్య పద్మవి భూషణం.

అన్యభాషలునేర్చి ఆంధ్రమ్ము రాదనే వేలని,

నిలదీసినిగ్గుతేల్చిన నిబ్బర గరంస్వరం,

ప్రశ్నించే ప్రజాగళంపెన్ను- పోరాటంగన్నయ్,

భాషశ్వాసలోనే బతుకు వెలుగుందన్న స్ఫూర్తి,

మనసంతకం ఆస్థిత్వమంటూ, బాషాభివృద్ధితెగింపుకి అక్షర కదలిక కాళన్న.

జీవనదిగా,భాషోదయం ఆశల దిక్సూచి,

జాగృతిగ సాగిపోవుటేబతుకు,ఆగితే చావని,

మనసు వేదికగా-బాషా నమ్మకం మనిషై,

మనుగడ మార్గదర్శనం -సమాజఆశయ కళయినోడు ధిక్కారమైన ఆమ్ఆద్మీకాళోజి. తెలంగాణ బాషాదినోత్సవ ఉత్సాహం,

భాషామమకారం గౌరవాక్షర కేతనమైన,

కవిత్వకధనయశస్వి -అక్షర సాధన తపస్వి కాళోజి నారాయణే.

*dr. వేదుల శ్రీరామశర్మ 'sirisha',kkd.9866050220

ఉపయోగించే 21రకాల పత్రుల పేర్లను

 శ్రీ మహాగణాధిపతయే నమః 

        శ్రీ గురుభ్యో నమః


"వినాయక చతుర్థి "

పర్వదినాన గణేశుని పూజించడానికి ఉపయోగించే 21రకాల పత్రుల పేర్లను తెలుసుకొందాము...


*శ్రీ వరసిద్ధివినాయకుని పూజలో - ఉపయోగించే 21 రకాల పత్రి*


1.మాచీపత్రం ౼ మాచి ఆకు

2.బృహతీపత్రం ౼ వాకుడు ఆకు

                                   (వాక్కాయ ఆకు)

3.బిల్వపత్రం ౼ మారేడు ఆకు

4.దూర్వాయుగ్మం ౼ గరిక పోచ

5.ధత్తూరపత్రం ౼ ఉమ్మెత్త ఆకు

6.బదరీపత్రం ౼ రేగు ఆకు

7.అపామార్గపత్రం ౼ ఉత్తరేణి ఆకు

8.శిరీషపత్రం ౼ దిరిసెన ఆకు

9.చూతపత్రం ౼ మామిడి ఆకు

10.విష్ణుక్రాంతపత్రం ౼ విష్ణుక్రాంత ఆకు

11.దాడిమీపత్రం ౼ దానిమ్మ ఆకు

12.దేవదారుపత్రం ౼ దేవదారు ఆకు

13.కరవీరపత్రం ౼ గన్నేరు ఆకు

14.సింధువారపత్రం ౼ వావిలి ఆకు

15.జాజిపత్రం ౼ జాజి ఆకు

16.గణ్డకీపత్రం ౼ ఏనుగుచెవి ఆకు

17.శమీపత్రం ౼ జమ్మి ఆకు

18.అశ్వత్థపత్రం ౼ రావి ఆకు

19.అర్జునపత్రం ౼ మద్ది ఆకు

20.అర్కపత్రం ౼ తెల్లజిల్లేడు ఆకు

21.మరువకపత్రం ౼ మరువపు ఆకు


*సూచన :*


కొన్ని వినాయక చతుర్థి వ్రతకల్పాలలో "తులసీ

పత్రం సమర్పయామి అని ఇస్తున్నారు, శాస్త్రప్రకారం వినాయకుని పూజకు ఏ సందర్భంలోనూ తులసీదళాలు ఉపయోగించరాదు.  

 "శ్రీ శివపురాణంలో"

తులసీదళానికి బదులుగా "శిరీష దళము" అని ఉన్నది...

బ్రహ్మశ్రీ మల్లాది చన్ద్రశేఖరశాస్త్రిగారి

 పౌరాణికసార్వభౌమ అభినవవ్యాస 

బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రిగురువుగారి జన్మదినంసందర్భంగా

వారికి సాష్టాంగప్రణామాలు


-#మరుమాముల_వెంకటరమణశర్మ


'పురాణ’ పురుషుడు: 

బ్రహ్మశ్రీ మల్లాది చన్ద్రశేఖరశాస్త్రిగారి జీవన రేఖలు


తల్లిదండ్రులు: దక్షిణామూర్తిశాస్త్రి, ఆదిలక్ష్మమ్మ

ఎక్కువగా ప్రభావం చూపినవారు: పితామహులు (తాతగారు) రామకృష్ణ చయనులవారు

చదువు: వేదం, తర్కం, వేదాంతం, మీమాంస, వ్యాకరణం, పంచదశి, వేదాంత భాష్యం...

భార్య: సీతారామ ప్రసన్న


సంతానం: ఆరుగురు మగ పిల్లలు... రామకృష్ణ, వీరరాఘవశర్మ, రామనాథ్, రామారావు, దత్తాత్రేయ, దక్షిణామూర్తి; ఇద్దరు ఆడపిల్లలు... ఆదిలక్ష్మి, సరస్వతి. కొడుకులందరూ వారికి నచ్చిన చదువులు చదివి మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. కుమార్తెలు గృహిణులు. అల్లుళ్లు దెందుకూరి నర్సింహమూర్తి, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి. ఒకరు జేఎన్టీయూలోనూ, మరొకరు ఎల్.ఐ.సీలోనూ ఉన్నతోద్యోగులు. పెద్దబ్బాయి విజయవాడలో బ్యాంక్ ఆఫీసర్‌గా రిటైరైతే మరో అబ్బాయి రాఘవ బుల్లితెర నటుడు.


పురాణాలతోబాటు నేను జంధ్యాల పాపయ్యశాస్త్రి, గొట్టిముక్కల, ధూళిపాళ వంటి వారి పద్యకావ్యాలు, గుర్రం జాషువా గబ్బిలం, ఫిరదౌసి వంటి ఖండకావ్యాలు చదివాను. నాటకాలంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ టీవీలో ఏదైనా మంచి సీరియల్ వస్తుంటే చూసి ఆనందిస్తుంటాను. ప్రతిరోజూ వేదపారాయణం చేస్తుంటాను.


ఇటీవల పత్రికలతో సహా ప్రతి ఒక్కరూ పురాణ కాలక్షేపం అనే మాటను వాడుతున్నారు. అది శుద్ధ తప్పు. పురాణప్రవచనం అనాలి తప్పితే పురాణ కాలక్షేపం అనకూడదు. కాలక్షేపం ఏమిటి? అలా అనడమంటే పురాణాలకున్నటువంటి ప్రాశస్త్యాన్ని తగ్గించినట్లే!


పురాణ’ పురుషుడు:


ఆయన పురాణ ప్రవచనం చెబుతుంటే ఎంతటివారైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే!

ధర్మసందేహాలు కార్యక్రమంలో శ్రోతల సందేహాలకు సమాధానాలు చెబుతుంటే ఆ వారం టి.ఆర్.పి. రేటింగ్ కచ్చితంగా ఆ చానల్‌దే! వారపత్రికలో పాఠకుల సందేహాలకు సమాధానాలు చెప్పేది ఆయనే అయితే ఆ పత్రికకే అత్యధిక పాఠకాదరణ! భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికిగాని, తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గాని, శ్రీశైలంలో భ్రమరాంబా మల్లికార్జునుల కల్యాణానికి గానీ వ్యాఖ్యానం చెబుతుంటే అందరి చెవులూ అటు వొగ్గవలసిందే!

ఆయన గళం నుంచి వెలువడే ప్రతిమాటా సప్రామాణికం, సవ్యాఖ్యాన సహితం!

ఈపాటికే అర్థమై ఉంటుంది ఆయనే మల్లాది చన్ద్రశేఖర శాస్త్రిగారని!

ఇది ఆయన ఇన్నర్‌వ్యూ...

మాది గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా, గోరంట్ల అగ్రహారం. అప్పట్లో హైదరాబాద్ సంస్థానాధీశుడైన కిషన్ ప్రసాద్ వద్ద పెద్ద ఉద్యోగి అయిన మల్లాది లక్ష్మీనారాయణ, సుందరీబాయి దంపతులకు పిల్లలు లేకపోవడంతో మా తాతగారు రామకృష్ణ చయనులవారిని దత్తత తీసుకున్నారు. దాంతో మాకు హైదరాబాద్ మల్లాదివారని పేరొచ్చింది. మా తాతగారు పదిభాషలలో అనర్గళంగా మాట్లాడేవారు. ముహూర్తాలు పెట్టడం నుంచి శ్రౌత, స్మార్త, తర్క, మీమాంస, వేదాంతం వరకూ ప్రతి ఒక్క శాస్త్రమూ ఆయనకు కొట్టిన పిండే! ఆయన పరమ నైష్ఠికుడు.

ఆచార వ్యవహారాల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు. ఆయన ముగ్గురు మగసంతానంలో మా నాన్నగారు మధ్యలోనివారు. మళ్లీ వీరందరి సంతానంలో నేనే పెద్దవాడిని. అందువల్ల తాతగారికి నేనంటే చాలా ఇష్టం. 1925 ఆగస్ట్ 22 అర్ధరాత్రి, అంటే తెల్లవారితే వినాయక చవితి అనగా పుట్టాను. నేను నాలుగు నెలల వాడిగా ఉన్నప్పుడే తాతగారు నన్ను తనవెంట తీసుకొచ్చు కున్నారు. నాయనమ్మ కృష్ణవేణి సోమిదమ్మ గారే నన్ను సాకారు. తాతగారే నాకు ఉపనయనం చేశారు. ఆయన వద్దనే తర్క ప్రకరణాలు, శ్రౌతస్మార్తాలు అభ్యసించాను.

మా తండ్రిగారు దక్షిణామూర్తి శాస్త్రి పుష్పగిరి ఆస్థాన పండితులు. ఆర్షసంప్రదాయాన్ని ఆయన వద్దనే అలవరచుకున్నాను. పెత్తండ్రి వీరరాఘవ శాస్త్రిగారు తర్కవేదాంత పండితులు. పినతండ్రి హరిశంకరశాస్త్రిగారు తెనాలిలో వేదవిద్యాపరీక్షాధికారిగా పని చేసేవారు. నేను వేదాధ్యయనం ఆయనవద్దే చేశాను. కంభంపాటి రామ్మూర్తి శాస్త్రిగారి వద్ద పూర్వమీమాంస, వ్యాకరణం నేర్చుకున్నాను. తెలుగు మాత్రం వీధిబడిలో చదువుకున్నాను.

తాతగారికి నేను పురాణ ప్రవచనం చెప్పాలని కోరిక. ఇంగ్లిషు చదువులు చదివితే, ఉద్యోగం చేస్తానంటానని నేను దేనికీ పరీక్షలు రాయ నివ్వకుండా జాగ్రత్తపడ్డారు. అయితే నాకేమో పురాణాలు చెప్పడం ఇష్టం ఉండేది కాదు. అది గ్రహించిన తాతగారు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని ‘‘చూడు నాయనా, పురాణ ప్రవచనం చెప్పాలంటే సంస్కృత వాఙ్మయం తెలిసి ఉండాలి. నిశిత పరిశీలన కావాలి. అన్వయం చెప్పగలిగి ఉండాలి. వేదాంతం, తర్కం, ఛందస్సు తెలిసుండాలి. కాబట్టి దీన్ని అంత తేలికగా తీసేయకు’’ అని చెప్పేవారు.

నా పదిహేడవ యేట మా తాతగారు కాలం చేశారు. ఆయన దూరమైనా ఆయన సంకల్పం మాత్రం ఎప్పుడూ నన్ను విడిచిపోలేదు. అమరావతిలో మా ఎదురింట్లో ఉండే జాగర్లమూడి రామశాస్త్రిగారికి కంటిలో శుక్లాలు వచ్చి చూపు తగ్గిపోవడంతో నన్ను పిలిచి రోజూ సాయంత్రం నాలుగు నుంచి 6 గంటల వరకు నాచేత పద్యాలు చదివించుకుని వినేవారు. మా ఊరిలో గోళ్లమూడి ప్రసాదరావుగారనేవైద్యుడు రోజూ సాయంకాలం సైకిల్ మీద రోగులను చూడటానికి వెళ్తుండేవాడు. ఆయన అలా వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు నా పద్యాలు వినేవాడు.

ఓరోజు ఆయన నా దగ్గరకొచ్చి, ‘‘మీరు పద్యాలు చదువుతున్న తీరు బాగుంది. నేను ఒంటరిగా ఉన్నాను. ఏమీ తోచడం లేదు. కాబట్టి మా ఇంటికొచ్చి పద్యాలు చదివి పెట్టండి’’ అని అడిగాడు. నేను మొహమాటం కొద్దీ కాదనలేక ఆయన ఇంటికెళ్లాను. ఆయన ఎప్పటి నుంచో అటకమీద దుమ్ముపట్టి ఉన్న భాస్కర రామాయణాన్ని తీసి నా చేతికిచ్చాడు. నేను అందులో నుంచి పద్యాలు చదువుతుంటే ‘‘మీరలా పద్యాలు చదివితే నాకెలా తెలుస్తుంది, వాటికి అర్థం తెలిస్తే కదా ఆనందించగలిగేది’’ అన్నాడు. దాంతో నాకు తోచిన రీతిలో అర్థాలు చెబుతూ పద్యాలను చదివి వినిపించాను.

నా పద్యశ్రవణం కాస్తా కొందరు గ్రామస్థుల చెవిన పడడంతో ఊరిలోనివాళ్లు కొందరు డాక్టరు గారి దగ్గరకొచ్చి ‘‘ఇదేదో సాయంత్రం పూట పెట్టుకుంటే మేము కూడా వచ్చి వింటాం కదా’’ అన్నారు.

దాంతో డాక్టరుగారు తమ ఇంటి వసారాను కడిగించి పురాణ ప్రవచనం జరిగే విధంగా పీఠం, ఫొటో, పుస్తకం పెట్టారు. నేనూ చొక్కావిప్పి, ఉత్తరీయం ధరించి విభూతి రేఖలు దిద్దుకుని అచ్చం పౌరాణిక ప్రవచకుడిలా తయారై ఆ సాయంత్రం భాస్కరరామాయణాన్ని గ్రామస్థుల ముందు చెప్పాను. ఈవిధంగా దాదాపు నెల రోజులకు పైగా జరిగింది. ఊరిలో నాకు మంచి పేరొచ్చింది. అప్పటికి నాకు అర్థమైంది నేను పుట్టింది పురాణ ప్రవచనం చెప్పడానికేనని!

కొన్నాళ్లు గడిచాక బెజవాడ వెళ్లి వేదాంత శాస్త్రం చదవాలనే కోరికతో అమరావతి నుంచి బయల్దేరి గుంటూరు వచ్చాను. తీరా బస్టాండుకొచ్చాక పరిచయస్థులు కొందరు కనిపించి ‘‘పుష్పగిరి పీఠాధిపతులు ఇప్పుడు నరసరావుపేటలో ఉన్నారు. త్వరలో ఆయన మకాం మార్చేస్తారట. ఈలోగా నువ్వొకసారి వెళ్లి ఆయన దర్శనం చేసుకోవచ్చు కదా’’ అన్నారు. దాంతో నేను వెంటనే నరసరావుపేటకు బయల్దేరాను.

స్వాములవారి దర్శనం చేసుకోగానే ఆయన నాతో ‘‘నువ్వు అమరావతిలో పురాణ ప్రవచనం చక్కగా చెప్పావని తెలిసింది. నాకు కూడా వినాలని ఉంది, ఇవ్వాళ ఇక్కడ పురాణం చెప్పు’’ అన్నారు. ఆ మాటలను ఆదేశంగా తీసుకుని ఆయన ముందు వాల్మీకి రామాయణం చెప్పాను. స్వామివారు చాలా సంతోషించి, ‘‘నిన్ను నెలకు 40 రూపాయల గ్రాసం మీద పుష్పగిరి ఆస్థానంలో పురాణ పండితునిగా నియమిస్తున్నాను’’ అన్నారు. దాంతో నేను వారితోపాటే ఊరూరూ తిరుగుతూ ఏడాదిన్నరపాటు పురాణ ప్రవచనం చెప్పాను.

ఆ తర్వాత మా పెత్తండ్రి మల్లాది వీరరాఘవశాస్త్రిగారు బెజవాడలో బ్రహ్మసత్రయాగం జరుపుతుంటే ఆయన కోరిక మేరకు అక్కడ సుమారు సంవత్సరంపాటు ప్రవచనం చేశాను. నా ఇరవై అయిదవ ఏట నా వివాహం ఈమనికి చెందిన సీతారామ ప్రసన్నతో జరిగింది. సరిగ్గా ఏడాది తర్వాత అంటే 1951లో నాకు కొడుకు పుట్టాడు. తాతగారి జ్ఞాపకార్థం రామకృష్ణ అని పేరుపెట్టాను. ఆ తర్వాత మరో ఐదుగురు మగపిల్లలు, ఇద్దరాడపిల్లలు.

వీరందరికీ చదువులు, పెళ్లిళ్లు, పురుళ్లు, పుణ్యాలు... అన్నీ పురాణ ప్రవచనాల ద్వారా ఆర్జించిందే తప్ప మరో విధంగా వచ్చింది లేదు. నా ప్రవ చన కార్యక్రమంలో పడి ఒక్కోసారి రెండేసి నెలలు కూడా ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చేది. అటువంటప్పుడు నా భార్య ఎంతో ఓపికతో ఒంటి చేతిమీద ఇంటిని సమర్థించేది. ఆమె సహకారమే లేకపోతే నేను ఏమీ చేయగలిగేవాడినే కాదు! నా ప్రవచనాలను రాష్ర్టమంతా పంచగలిగి ఉండేవాడినీ కాను! ఈ వృత్తి ద్వారా నేను లక్షలార్జించి మేడలూ మిద్దెలూ కట్టిందీ లేదు అలాగని దారిద్య్రంతో బాధపడిందీ లేదు. భగవంతుడు ఏది అనుగ్రహిస్తే అదే భాగ్యంగా భావించాను!

బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి రాజకీయ ప్రముఖులతోబాటు చిత్తూరు వి.నాగయ్య, ఘంటసాల, ఎస్వీరంగారావు, కన్నాంబ వంటి వెండితెర వేల్పులు నా ప్రవచనాలను ఎంతో ఇష్టపడేవారు. ఓసారి చిత్తూరు నాగయ్యగారు నన్ను ఇంటికి పిలిచి భోజన వస్త్రాలతో సత్కరించి, చేతికి స్వర్ణకంకణం తొడిగారు.

అప్పట్లో చాలామంది నన్ను సినిమాలలో నటించమని అడిగేవారు. నాకు ఇష్టం లేక అందరినీ తిరస్కరించాను. నేను ప్రవచనం చెబుతుండగా శ్రోతలు వింటున్నట్లుగా ఉండే దృశ్యాన్ని చిత్రీకరించాలని కొందరు దర్శకులు ప్రయత్నాలు చేశారు కానీ ఎందుకనో అది కూడా వీలు పడలేదు.

నాకున్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా గుంటూరులో ఒక తను నా పేరు చెప్పుకుని నేను వస్తానని ప్రచారం చేసుకుంటూ పురాణ ప్రవచనంతో పొట్టపోసుకుంటున్నట్లు తెలిసింది. నేనతనికి బుద్ధి చెప్పాలనుకున్నాను. ఓసారి అతను నన్ను కలిసినప్పుడు నా అంతట నేనే పురాణ ప్రవచనం చెబుతానని చెప్పాను. అతనెంతో సంతోషించి భారీ ఏర్పాట్లు చేశాడు.

నా ఉద్దేశం ఏమిటంటే నాకు తెలియకుండా నా పేరు చెప్పుకున్నందుకు పదిమంది ముందు అతని పరువు తీసేయాలని! తీరా నేనెళ్లి మైకుముందు కూర్చుంటే గొంతు పెగల్లేదు. కనీసం శుక్లాంబరధరం కూడా పలకలేక స్టేజీమీదినుంచి దిగిపోయాను. ఆ సంఘటనతో భగవంతుడెప్పుడూ భక్తుల పక్షపాతే కాని, అహంభావుల పక్షం వహించడని తెలుసుకున్నాను. ఈనాటివరకు మళ్లీ అటువంటి ఆలోచనలు చేయలేదు.

ఆ తర్వాతెప్పుడూ అటువంటి పరిస్థితీ నాకు ఎదురవలేదు. అదే కాదు, భగవంతుడి దయవల్ల అనారోగ్యం కాని, జలుబు చేయడం, గొంతు బొంగురుపోవడం వంటివి కానీ నన్నెప్పుడూ బాధించనే లేదు. అన్నేసి గంటలపాటు ప్రవచనాలు చెప్పినా, గొంతు తడారిపోవటం, కంఠశోష వంటివి ఎప్పుడూ ఎరగను. ఇప్పటివరకూ నేను 250 దాకా రామాయణ ప్రవచనాలు, 300 మహాభారత ప్రవచనాలు, 200 భాగవత ప్రవచనాలూ చెప్పాను.

ఇవిగాక ప్రతియేటా ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవాడిని. దూరదర్శన్‌లోనూ, సప్తగిరి చానల్‌లోనూ ప్రవచనాలు చెబుతుంటాను. నాకిప్పుడు ఎనభై ఐదేళ్లు దాటాయి. ఒంట్లో ఓపిక సన్నగిల్లుతోంది, ప్రయాణాలు చేయలేకుండా ఉన్నాను. దాంతో 2011 జనవరి నుంచి నేను పురాణ ప్రవచనాలు చెప్పడం మానివేశాను.

అయితే ఇటీవల శ్రీవేంకటేశ్వర భక్తిచానల్, సప్తగిరి చానల్ వారు నా వద్దకొచ్చి ‘‘మీరు మా చానల్‌లో ప్రవచనం చెప్పవలసిందే’’ అని పట్టుబట్టడంతో మా ఇలవేల్పు పట్ల నాకున్న భక్తి, గౌరవం మేరకు వారిని కాదనలేకపోయాను. అందుకే అప్పుడప్పుడూ ఆ చానల్స్ వారికి మాత్రమే చెబుతున్నాను.

భగవంతుడు నాకిచ్చిన దానికి నేనెప్పుడూ అసంతృప్తి పొందలేదు. వైదిక ధర్మ ప్రచారం చేయడాన్ని, భగవంతుని లీలలను గానం చేయడాన్ని బాధ్యతగా భావించాను తప్పితే బరువనుకోలేదు. ఎవరికోసమూ ప్రత్యేకంగా చెప్పలేదు. సభలో భాగ్యవంతులున్నారా, పండితులున్నారా, పామరులున్నారా అని ఎన్నడూ ఆలోచించలేదు.

ఎవరినీ పనిగట్టుకుని పొగడలేదు. ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించాను. కాకపోతే పదేళ్లకొకసారి సామాజిక పరిస్థితులలో మార్పు వస్తుంటుంది కదా, అందుకు అనుగుణంగా మారుతూ వచ్చానంతే! అదెలాగంటే అప్పట్లోలా ఇప్పుడు పద్యాలు చెబుదామన్నా వాటిని విని ఆనందించేవారు లేరు కదా, అందుకు తగ్గట్టుగానే నన్ను నేను మలచుకున్నాను. అప్పుడే కాదు, ఇప్పటికీ నేను ఏ ఘట్టం చెబుతుంటే ఆ ఘట్టంలో పూర్తిగా లీనమవుతాను.

అది శోకరసమైతే నాకు దుఃఖమొస్తుంది. సంతోషకర సన్నివేశమైతే ఆనందంతో పరవశించి పోతాను. కాబట్టే ఇన్నేళ్లు గడిచినా, నా ప్రవచనం వినడానికొచ్చే ప్రేక్షక జనంలో తగ్గుదల లేదు. అయితే నేను మాత్రమే గొప్పగా చెప్పగలను అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇప్పటివాళ్లు కూడా బాగానే చెబుతున్నారు. ఆదరణ కూడా బాగానే ఉంటోంది. ఈ సంస్కృతి చిరకాలంపాటు వర్ధిల్లాలన్నదే నా ఆకాంక్ష!

సేకరణ:సాక్షి ఫన్ డే 'పురాణ పురుషుడు':

ప్రశ్న పత్రం సంఖ్య: 27

 ప్రశ్న పత్రం సంఖ్య: 27  కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

పరికరాలు -ఉపకరణాలకు  సంబంధ క్రింది ప్రశ్నలకు జవాబులు  తెలుపండి

  1) స్టౌమీద వేడిగా వున్న అన్నం గిన్నెను దింపటానికి వాడే ఉపకరణం ఏమిటి. 

2) స్క్రూలను బిగించటానికి వాడే పరికరం ఏమిటి 

3) దిక్కులను సూచించేటందుకు వాడే పరికరం పేరు ఏమిటి. 

 4)  కారు మలుపులు తిప్పటానికి దీనిని తిప్పుతారు. 

 5) స్త్రీలకు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయటానికి వాడే సాధనం పేరు ఏమిటి. 

6) కాగితాల మీద నిర్ణిత పొడవు గీతాలు గీయటానికి వాడే పరికరం. 

7) ద్రవపదార్ధాలను కొలవటానికి దీనిని వాడుతారు. 

8) కూరగాయల బరువు తూకం వేయటానికి వాడే పరికరం.  

9)  పాల చిక్కదనాన్ని కొలిచే సాధనాన్ని ఏమంటారు. 

10) రెండు బట్టలను కలిపి ఉంచటానికి కుట్టే చేతి పనిముట్టు ఏమిటి. 

 11) కాగితాలను కలిపి సత్వరం కొట్టటానికి వాడే చేతి సాధనం 

12)  జ్వేరం వచ్చినప్పుడు యెంత టెంపెరచారు వుందో తెలుసుకోవటానికి వాడే పరికరం. 

 13) కూడికలు చేయటానికి చేతిలో పెట్టుకొనే వాడే పరికరం. 

14) హృదయస్పందన తెలుసుకొనేటందుకు వాడే పరికరం.  

15) పొలంలో మడిదున్నటానికి వాడే ఒక వాహనం పేరు చెప్పండి. 

16) మానవ శక్తితో నడిచే ద్విచక్ర వాహనం ఏది. 

17) మీ ఇంట్లో ఫాను తిరగటానికి, ఆపటానికి దేనితో నియంత్రిస్తారు. 

 18)జీర్ణాశయంలో రుగ్మతలను ఈ స్కోపుతో చూస్తారు అది ఏది. 

19) నక్షత్రాలను చూడటానికి వాడే పరికరం పేరు ఏమిటి. 

 20) కంటికి కనపడని సూక్ష్మమైన వాటిని చూడటానికి వాడే పరికరం ఏది. . 


ప్రశ్న పత్రం సంఖ్య: 26 జవాబులు

 ప్రశ్న పత్రం సంఖ్య: 26  కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

ఇది మహిళలకు శ్రావణ మాసపు ప్రేత్యేకం 

 పూర్తిగా బంగారం కాబట్టి. 

క్రింది ప్రశ్నలకు జవాబులు   

  1)బంగారము ఏ రంగులో ఉంటుంది -  పసుపు రంగులో ఉంటుంది 

2) బంగారములో కల్తీ కలపటానికి కంసాలి ఏ లోహాన్ని వాడుతారు . సాధారణంగా రాగినికలుపుతారు 

3) బంగారం నాణ్యత ఏవిధంగా చెపుతారు. - నాణ్యత కరేట్లతో తెలుపుతారు. 

 4) ఈ రోజులలో కంసాలి వారు మజ్దురుతో పాటు ఎంతశాతం తరుగులక్రింద తీసుకుంటున్నారు. - సాధారణంగా 10 శాతం తరుగుల క్రింద తీసుకుంటున్నారు.  

 5) తక్కువ బరువు బంగారాన్ని ఈ గింజ ఎత్తు అని అంటారు అది ఏ గింజ - గురిగింజ 

6) KDM బంగారంలో బంగారం శాతం యెంత ఉంటుంది 92 శాతం బంగారం 8 శాతం కాడ్మియం ఉంటుంది. 

7) ఆర్నమెంట్ బంగారంలో రాగి శాతం యెంత ఉంటుంది - దాదాపు 9 శాతం రాగి ఉంటుంది. 

8) ఒక కారేట్కు ఎన్ని గ్రాములు - 200 మిల్లి గ్రాములు 

9) సేచ్ఛమైన బంగారాన్ని ఆభరణాలు చేయటానికి వాడరు ఎందుకంటె 

1) అది మెత్తగా ఉంటుంది  2) అది చాలా కఠినంగా ఉంటుంది 3) ఇవియేవి నాకు తెలియదు. జవాబు- 1  

10) కంసాలి బంగారాన్ని మీకు తెలియకుండా తీసుకోటానికి వాడే ద్రవ పదార్ధాన్ని ఏమంటారు. - ద్రావకం అంటారు . 

 11) మీరు ఆభరణం చేయటానికి కంసాలి ఇచ్చినప్పుడు వన్నె కన్నా మీ ఆభరణం వన్నె తక్కువగా ఉంటుంది కారణము ఏమిటి. - అందులో రాగి కలపటం వలన 

12) ఎన్ని క్యారట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా పేర్కొంటారు. -24 క్యారట్ల బంగారాన్ని  

 13) క్యారెట్ల సంఖ్య తగ్గినా కొద్దీ బంగారం -  నాణ్యత తగ్గుతుంది. 

14) పెద్ద పెద్ద బంగారం షాపులలో రాళ్లకు తూకం లేదు అని ప్రకటిస్తారు దాని అర్ధం ఏమిటి.  

సాదర్బంగా కొంతమంది రాళ్లు వున్నఆభరణాన్ని మొత్తం తూకం వేసి బంగారం ధర వసూలుచేస్తారు కానీ నిజానికి రాళ్లు బంగారంకన్నా తక్కువ ధర కలిగి ఉంటాయి.  రాళ్లను ప్రేత్యేకంగా తూకం వేసి వాటి ధరను వేరుగా తీసుకోవటాన్ని " రాళ్లకు తూకంలేదు" అని ప్రకటిస్తారు. 

15)  ONE GRAM GOLD ఆభరణాలు నిజంగా బంగారంతో చేసినవా? జవాబు: కాదు బంగారం పూత ఉంటుంది. 

16) ద్రవరాజాంలో కలిపే ఆమ్లములు (ACIDs) ఏవి వాటి నిష్పత్తి యెంత. - బంగారాన్ని కరిగించే ద్రావకానికి ద్రవరాజం అంటారు ఇది నైట్రిక్ ఆమ్లము మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లముల్ మిశ్రమము వీటిని 1:3 రేషియోలో కలుపుతారు.  ఇది ప్రమాదకరమైన ద్రవము. 

17)Hallmark gold అనగా ఏమిటీ Bureau of Indian Standards (BIS) వారిచే ఆమోదించబడినది అని అర్ధము. 

 18) బంగారం సాంద్రత యెంత ఉంటుంది - బంగారం సాంద్రత 19,300 kg/m

అందుకే దీనిని హెవీ మెటల్ అంటారు 

19) బంగారం సాంద్రత దానిలో కలిపే రాగి, వెండి, కాడ్మియం మొదలగు లోహాలకన్నా ఎక్కువా లేక తక్కువా - జవాబు తక్కువ 

 20) ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాలలో భారతదేశం ఎన్నవ స్థానంలో వుంది. - భారతదేశం 11 వ స్థానంలో వుంది. 

ఈ ప్రశ్నపత్రం మీకు విజ్ఞానదాయకంగా ఉంటే 

తెలపండి. ఇంకొక ప్రశ్న పత్రంతో మళ్ళి కలుద్దాం. 

  

పరబ్రహ్మ - విశ్వము

 అనాదిగా మన మహర్షులు భాగవత్తత్త్వాన్ని గూర్చిన అనేక అన్వేషణలు చేశారు.  వాళ్ళ జ్ఞాన ఆవిష్కరణాలే ఉపనిషతులు ముండకోపనిషతు లో ఒక రెండు మంత్రాలను పరిశీలిద్దాం. మొదటి ముండకంలో 6వ మంత్రం అక్షర తత్వమైన ఆ పరబ్రమ్మను ఆవిష్కరిస్తుంది గమనించండి. 

6. యత్ తదద్రేశ్య మగ్రాహ్య మగోత్రమ్ అవర్ణమ్ 

అచక్షు: శ్రోత్రం తదపాణిపాదమ్ !

నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం 

తదవ్యయం యద్ భూతయోనిం పరిపశ్యంతిధీరా: !!

కళ్లు మొదలైన జ్ఞానేంద్రియాలకు గోచరంకానిదీ, చేతులు మొదలైన కర్మేంద్రియాలకు దొరకనిదీ, ఉత్పత్తిలేనిదీ, రంగు లేనిదీ, కళ్లు చెవులు చేతులు కాళ్లు లేనిదీ, శాశ్వతమైనదీ, అంతటా వ్యాపించినదీ, అత్యంతమూ సూక్ష్మమైనదీ సృష్టికి మూలకారణమైనది ఐన అక్షరతత్త్వాన్ని జ్ఙానులు సకల జగత్తుకూ మూలంగా అంతటా చూడగలరు

అక్షర తత్త్వం నుండి ఈ విశ్వం ఎలా ఉత్పన్నమైనదో ఈ మంత్రం తెలియచేస్తుంది. 

7. యథోర్ణనాభి: సృజతే గృహ్ణతే  

యథా పృథివ్యామ్ షధయ: సంభవంతి !

యథా సత: పురుషాత్ కేశలోమాని 

తథా క్షరాత్ సంభవతీహ విశ్వమ్ !!

సాలెపురుగు ఎలా తన గూడును నోటి నుండే వెలికితీసి తనలోకే తీసుకుంటుందో, భూమినుండి మూలికలన్నీ ఎలా ఉద్భవిస్తాయో, మానవుని తలమీద, శరీరంమీద ప్రయత్నం లేకనే వెంట్రుకలు ఎలా పెరుగుతాయో అలాగే అక్షరతత్త్వం నుండి విశ్వం ఉత్పన్నమౌతుందిముండకోపనిషత్తు

మన మహర్షులు మనకు ఈ జగత్తుకు సంబందించిన రహస్యాలను ఛేదించి మనకు అందించారు. 


దగ్గులు హరించుటకు

 దగ్గులు హరించుటకు సులభ యోగాలు - 


 * దానిమ్మ కాయ పెచ్చులను వేయించి చూర్ణం చేసుకుని పూటకు 5 గ్రాముల చూర్ణం తేనెతో తీసుకొనుచున్న కోరింత దగ్గు తగ్గిపోవును . 


 * శుద్ధిచేసిన కొబ్బరి నూనె పూటకు 10ml చొప్పున తీసుకొనుచున్న కోరింత దగ్గు తగ్గిపోవును . 


 * మర్రిచెట్టు పైన బెరడు తెచ్చి నీడన అరబెట్టి చూర్ణం చేసి ఆ చూర్ణం 20 గ్రాములు పావు లీటర్ నీటిలో వేసి కాచి వడపోసుకొని అందులో పాలు మరియు పంచదార కలుపుకుని తాగుచుండిన యెడల 3 నుంచి 5 దినములలో దగ్గు తగ్గిపోవును .


 * పిప్పిలి గింజను ఆముదపు దీపమున కాల్చి తమలపాకు కు కొంచం తేనె రాసి ఆ తమలపాకులో ఈ కాల్చిన పిప్పిలి గింజని పెట్టి నమిలి మింగుచున్న యెడల దగ్గులు నయం అగును.


 * తులసి పువ్వులను అల్లపు రసంతో మర్దించి శనగల వలే మాత్రలను చేయవలెను పూటకి ఒక మాత్ర చొప్పున మంచినీటితో సేవించిన దగ్గులు తగ్గిపోవును . 


       పైన సూచించిన యోగాలలో మీకు సులభమైన యోగాన్ని ఎంచుకుని సమస్య నివారణ చేసుకోవచ్చు .