24, డిసెంబర్ 2022, శనివారం

భూపరీక్ష విధానం

 [22/12, 3:27 am] +91 98850 30034: వాస్తు శాస్త్రము నందు భూపరీక్ష విధానం - సంపూర్ణ వివరణ . 


   గృహనిర్మాణం చేయవలసిన భూమిని మొదట బాగుగా పరీక్ష చేయవలెను . భూపరీక్ష చేయక గృహనిర్మాణం చేసినచో సర్వము నిష్ఫలమగును. భూమి అంతయు ఒకేవిధముగా లేదు . కొన్ని స్థలములు చవిటినేలలు గాను , కొన్ని ఊట భూములుగాను , కొన్ని రాతి భూములుగాను ఉండును. అందుకే గృహనిర్మాణం చేయవలసిన భూమి అందుకు తగిన లక్షణములు కలిగి ఉన్నదో లేదో పరీక్షించి తరువాత గృహనిర్మాణం చేయవలెను అని మహర్షులు తెలియచేసారు. అందుకే మొదట స్థలపరీక్ష అవసరం. 


 *  స్థలపరీక్ష మొదట పద్దతి. - 


       గృహము కట్టదలచిన స్థలములో ఒక హస్త ప్రమాణం ( మూరెడు ) లోతున చిన్న గొయ్యిని తవ్వి ఆ గోతినిండా సూర్యాస్తమయం అయిన తరువాత నీరుపోసి తరువాత ఉదయం చూసినయెడల కొంచెమైనను నీరు ఆ గోతిలో ఉన్న ఆ భూమి ఆ గృహనిర్మాణానికి ప్రశస్తమైనది. నీరు నిలవక బురద మాత్రమే ఉన్న ఆ భూమి మధ్యమమైనది , నీరు పూర్తిగా ఇంకిపోయి మన్ను పొడిపొడిగా లేదా భూమి నెర్రెలు కొట్టిన ఆ భూమి గృహనిర్మాణానికి పనికిరాదు . ఇదే పద్దతి భూమి యందు భూగర్భజలాన్ని కనుగొనుటకు కూడ వాడవచ్చు. 


 * స్థలపరీక్ష రెండొవ పద్దతి. - 


      గృహనిర్మాణం చేయదలచిన భూమి మధ్యభాగమున హస్తము లోతున ఒక గొయ్యి తవ్వవలెను . ఆ తవ్విన మన్నుతోనే మరలా ఆ గొయ్యిని పూడ్చవలెను . అలా పూడ్చగా మన్ను మిగిలినచో ఆ భూమి గృహనిర్మాణమునకు ప్రశస్తమైనదిగా తెలియును. మన్ను తక్కువ అయినచో ఆ స్థలము గృహనిర్మాణమునకు అనువైనది కాదు అని తెలుసుకోవలెను . మన్ను సరిపోయిన మధ్యమము . 


          పైన తెలిపిన రెండు పద్ధతులు అందరు మహర్షులు అంగీకరించి ఉన్నారు. 


         అలా గొయ్యి తవ్వుచున్న సమయంలో వివిధరకములు అయిన పురుగులు , కప్పలు , కీటకములు , ఊక , ఎముకలు , భస్మము మొదలైనవి కనపడుట యజమానికి మంచిది కాదు. బొగ్గులు , కాలిపోయిన కర్రలు , గవ్వలు మొదలైనవి కనపడిన స్థలము నందు గృహనిర్మాణం చేసి అందు నివసించుచున్న రోగములచేత , దరిద్రముచేత భాధలు పడుదురు. శల్యము ( ఎముక ) భూమి యందు ఆరు అడుగులకు పైగా లోతులో ఉన్నచో ఎటువంటి కీడూలేదని పురాతన వాస్తుశాస్త్ర గ్రంధాలలో ఉన్నది. 


          దర్భలతో కూడుకొని ఉన్న భూమి గృహనిర్మాణానికి శుభప్రదమైనది. రక్తవర్ణం గల భూమి రాజ్యసంపదలు , వాహనయోగం కలిగించును. కాశిగడ్డివలె పచ్చటి భూమి విశేష ధనయోగమైనది. సాధారణ గడ్డితో కూడి ఉండు నల్లటి భూమి గృహనిర్మాణానికి యోగ్యమైనది కాదు. 


 వాస్తుశాస్త్రం నందు భూపరీక్ష విధానం - సంపూర్ణ వివరణ  - 2 . 


   అంతకు ముందు పోస్టులో భూపరీక్షా విధానం గురించి తెలియచేసాను . ఇప్పుడు ఎటువంటి ప్రదేశాలలో గృహనిర్మాణం చేయవలెనో , ఎటువంటి ప్రదేశాలలో గృహనిర్మాణం చేయకూడదో , భూములలో రకాల గురించి సంపూర్ణంగా వివరిస్తాను. 


 *  మద్ది , రావి , తులసి , గరికె , విష్ణుక్రాంత , కొండగోగు , బూరుగ , సుగంధి , చిలుకలు , పావురములు , హంసలు మొదలైనవి కలిగి ఉండిన భూమి శైలభూమి అనబడును. ఈ భూమికి తూర్పు , ఉత్తరములలో నదీప్రవాహములు , చెరువులు , నూతులు , నీటితో ఉన్న గుంటలు ఉన్నచో శ్రేష్టము . అట్టి నీటివనరులు దక్షిణ పశ్చిమములలో ఉండరాదు. ఇట్టి భూమిలో ముండ్లతో ఉన్న చెడ్డ వృక్షములను తీసి గృహనిర్మాణం చేయుట ఐశ్వర్య ప్రదము. 


 *  బీటలు బారిన భూమి మరణము కలుగచేయును. పాముపుట్టలు కలిగిన భూమి ధననాశనము కలుగచేయును. శల్యములు కలిగిన భూమి నిత్యము నష్టములను కలుగచేయును. విషమాకారముగా ఉన్న భూమి శత్రుభయము కలుగచేయును. 


 *  పుర్రెలు , రాళ్లు , పురుగులు , పాముపుట్టలు , బొరియలు , గోతులు , ఎలుకలు , ఇసుక , పొట్టు , బొగ్గులు , వృక్షముల వేళ్ళు , బురద , పెంకు ముక్కలు , బూడిదతో ఉన్న భూములు , ముండ్లచెట్లు , కోట సమీప ప్రదేశములు , దుష్టమృగములు సంచరించు ప్రదేశములు , ఇనుము కరిగించి పనులు చేయు స్థలములు , నాలుగు వీధుల మధ్యస్థలము , వీధి శూలలు గల ప్రదేశములు గృహనిర్మాణానికి పనికిరావు. ధనక్షయం , కులక్షయం , నానావిధములు అయిన కష్టాలను కలుగచేయును . 


 *  బొంతజెముడు , ఇరుగుడు మొదలైన చెట్లతో , చిన్న ఇసుకరాయి గల భూములు , ఎక్కడ తవ్వినను నీటిజలాలు లేని భూములు ఆగ్నేయ భూములు అనబడును. ఇవి దరిద్రము కలుగచేయును . 


 *  నక్కలు , కంకరరాళ్ళు గల భూమి వాయువ్యభూమి అనబడును. ఇది గృహనిర్మాణానికి పనికిరాదు. దరిద్రము కలుగచేయును. 


 *  వృక్షములు కల భూమి వారుణ  భూమి అనబడును. ఇందు గృహనిర్మాణం చేసి నివసించువారలకు సకల సంపదలు కలిగి అభివృద్ది దాయకంగా ఉండును. 


 *  ముండ్లు గల వృక్షములు , దొంగలు సంచరించు ప్రదేశములు , కారము , తీపివాసన గల భూములు , ఎక్కడ నిలబడిన తలనొప్పి వచ్చునో అట్టి భూములలో మానవులు గృహనిర్మాణం చేయరాదు . వాటిని రాక్షస భూములు అని పిలుస్తారు. 


 *  బూరుగచెట్టు , పొగడ , తాండ్ర, సరుగుడు చెట్లు , గాడిదలు , ఒంటెలు , పందులు , చండాలురు , చౌడునేలలు , దుర్వాసన కల భూములు పిశాచ భూములు అనబడును. ఇవి గృహనిర్మాణమునకు యోగ్యములు కావు. సర్వనాశనం కలుగచేయును . 


 *  చింత, బూరుగు , గానుగ , వెదురు , పత్తి , జిల్లేడు , దాసాని , ముళ్ళులేని వృక్షములు , హంసలు , సాధుజంతువులతో ఉన్న భూములు వైష్ణవభూములు అనబడును. ఇట్టి భూములకు ఉత్తరదిక్కున నదీప్రవాహములు , తటాకములు , నూతులు ఉండటం శ్రేష్టము . 


 *  అరటి , పనస, మామిడి , పొన్న , పొగడ , నెల్లి , వావిలి , పొదరి , నల్లకలువ , మొదలగు వృక్షములు ఉండి సువాసన గల భూములు ధన , ధాన్య సమృద్ధిని కలుగచేయును. 


 *  వావిలి , వసంత, గరిక , మోదుగ , తెల్లగన్నేరు , మల్లిక , ఉడుగ , ఇప్ప మొదలగు వృక్షములతో ఉండి బూడిద వాసన గల భూములయందు గృహనిర్మాణం చేసినచో అన్నవస్త్రములు , సుఖం , ఐశ్వర్యము కలుగును. 


 *  ఉడుగ చెట్లు , పిల్లులు , ముంగీసలు , కుందేళ్లు , చక్రవాక పక్షులు , తోడేళ్ళు గల భూములు , శౌర్య , వీర్య , సకలసంపదలు కలుగచేయును . 


           వాస్తు శాస్త్రం అనేది మూఢనమ్మకం కాదు. మానవుడు తాను నిర్మించుకున్న గృహము నందు సుఖముగా , సంతోషముగా సరైన గాలి , వెలుతూరు వచ్చే విధముగా ఒక పద్దతి ప్రకారం ఎలా గృహనిర్మాణం చేయాలో మన పూర్వీకులు మనకు తెలియచేసిన గొప్పవరం ఈ వాస్తుశాస్త్రం. 


   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

[23/12, 6:01 am] +91 98850 30034: సిరిధాన్యాలు గురించి సంపూర్ణ వివరణ  - ఔషధ గుణాలు  .


 కొర్రలు యొక్క ఉపయోగాలు  -


 *  కొర్రలు విరిగిపోయిన అంగములను అత్యంత వేగముగా అతుకొనునట్టు చేయును .


 *  శరీరానికి అమితమైన పుష్టిని ఇచ్చును.


 *  కొర్రలు నాలుగు రకాలుగా ఉండును. పసుపు, ఎరుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉండును. నలుపు , తెలుపు రంగులు శ్రేష్టమైనవి.


 *  శరీరం నందు వేడిని కలిగించును.


 *  జ్వరమును, కఫమును హరించును .


 *  జీర్ణశక్తిని పెంచును.


 *  రక్తమును వృద్దిచేయును.


 *  నడుముకు మంచి శక్తిని ఇచ్చును.


 *  అతిగా తినిన వాతమును పుట్టించును . దీనికి విరుగుళ్లు నెయ్యి, పంచదార.


 *  గర్భస్రావం అయిన స్త్రీకి కొర్రగంజి ఇచ్చిన మంచి మేలు చేయును . బలము కలిగించును.


 *  కొర్రబియ్యపు అన్నం గేదె పెరుగుతో తినుచున్న ఎప్పటి నుంచొ ఉండి మానని మొండి వ్రణాలు సైతం మానును .


 *  కొర్రబియ్యపు అన్నం తినటం వలన రక్తపైత్య రోగం మానును .


 *  కొర్రబియ్యముతో పరమాన్నం చేసుకుని తినుచున్న అజీర్ణశూలలు (నొప్పి ) మానును .


 * కొర్ర బియ్యములో 11.2 % తేమ , 12.3 % మాంసకృత్తులు , 4.7% కొవ్వులు , 3.2% సేంద్రియ లవణాలు , 8% పిప్పి పదార్థం , 60.6 % పిండిపదార్ధం ఉండును. ఇందు మాంసకృత్తులు , సేంద్రియ లవణములు, పిప్పి పదార్ధములు , కొవ్వులు ఎక్కువుగా ఉన్నందువల్ల ఆహారవిలువ ఎక్కువుగా ఉన్నది. జిగురు పదార్దాలు అత్యల్పముగా ఉండును.


 * కఫ సంబంధ వ్యాధులు , మధుమేహం కలవారు , ఆరోగ్యవంతులు ఈ ధాన్యముతో వండిన అన్నాన్ని తగినంత కూరలు మరియు మజ్జిగని కలుపుకుని తినవచ్చు.


 * కడుపులో అల్సర్ , జిగట విరేచనాలు , రక్తప్రదరం , శుక్రనష్టం, శ్వేతకుసుమ, కుష్టు , క్షయ మొదలయిన ఉష్ణసంబంధ వ్యాధులతో బాధపడేవారు కొర్రలు ఉపయోగించరాదు.


   సామలు యొక్క ఉపయోగాలు  - 


 *  సామలు తో చేసిన అన్నం చమురు కలిగి మృదువుగా , తియ్యగా , వగరుగా ఉండును. 


 *  చలవ , వాతమును చేయును . 


 *  మలమును బంధించును . 


 *  శరీరము నందు కఫమును , పైత్యమును హరించును . 


 *  ఈ బియ్యముతో పరమాన్నం చేసిన అద్భుతమైన రుచితో ఉండును.


 * గుండెల్లో మంటకు మంచి ఔషదం.


 * కీళ్లనొప్పులు మరియు ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారికి మంచి ఔషధం . 


  రాగుల యొక్క ఉపయోగాలు  - 


 *  వీటికి మరొక్క పేరు తవిదెలు , చోళ్ళు అని కూడా పిలుస్తారు . 


 *  రాగులను ఆహారముగా తీసుకోవడం వలన వెంట్రుకలకు బలమును ఇచ్చును. 


 *  శరీరంలో పైత్యమును పెంచును. ఎక్కువుగా తీసుకోవడం వలన తలతిప్పుట చేయును . 


 *  మేధోరోగం అనగా అధిక కొవ్వు సమస్యతో ఇబ్బందిపడేవారు ఆహారంలో రాగులను చేర్చుకోవడం వలన దేహములోని కొవ్వుని బయటకి పంపును . 


 * రాగులను జావలా చేసిన అంబలి అని అంటారు. దీనిని లోపలికి తీసుకోవడం వలన మేహరోగాన్ని అణుచును. 


 * రాగులను లొపలికి తీసుకున్నచో పైత్యమును పెంచును. రాగులను జావలా చేసి తీసుకున్నచో శరీరంలో పైత్యాన్ని హరించును . రాగిజావలో మజ్జిగ కలుపుకుని సేవించినచొ ఎక్కువ ఫలితం ఉండును. 


 *  కఫాన్ని పెంచును. చలవ చేయును . 


 *  శరీరంలో పైత్యం వలన కలుగు నొప్పులను పొగొట్టును.


 *  ఆకలిదప్పికలను అణుచును.


 *  విరేచనం చేయును . రక్తంలోవేడిని తీయును. 


 *  రాగుల్లో  పిండిపదార్ధాలు 72.7 గ్రా , కొవ్వుపదార్ధాలు 1.3 గ్రా , మాంసకృత్తులు 7 గ్రా , క్యాల్షియం 330 మీ.గ్రా , భాస్వరం 270 మి.గ్రా , ఇనుము 5 .4 మి.గ్రా , పొటాషియం 290 మి.గ్రా , పీచుపదార్థం 3.6 మి.గ్రా . శక్తి 331 కేలరీలు .


 *  రాగులలో ఇనుము అధికంగా ఉండటం వలన మలమును సాఫీగా బయటకి వెళ్లేవిధముగా చేయును . 


 *  మెరకభూముల్లో పండే రాగులు మంచిరుచిని 

కలిగించును. రాగుల్లో ఎరుపు, నలుపు రంగులు కలవు.


 *  రాగులు నానబెట్టి ఎండబెట్టి దోరగా వేయించి మెత్తగా విసిరి ఆ పిండిని పాలల్లో కలుపుకుని తాగడం గాని లేదా జావలా కాచుకొని తాగుచున్న అతిమూత్రవ్యాధి హరించును . 


 *  రాగిజావలో మజ్జిగ కలుపుకుని తాగుచున్న శరీరంలో వేడి పోవడమే కాదు మూత్రబంధన విడుచును.

 

 

   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

[24/12, 3:33 am] +91 98850 30034: ఎన్ని మందులు వాడినా తగ్గని మొండి దురదలు తగ్గించుట కొరకు నెను ప్రయోగించిన ఔషధ విధానం  - 


   అల్లం , ధనియాలు , జీలకర్ర , వాము , తులసి , నిమ్మరసం , తేనే వీటికి సమానంగా 3 గ్రాముల చొప్పున తీసుకుని రోజుకి రెండుసార్లు ఉదయం పరగడుపున , సాయంత్రం ఆహారానికి రెండు గంటల ముందు తీసికొనవలెను. కేవలం 2 నుంచి 3  రోజులలో ఎటువంటి మొండి దురదలు అయినా మాయం అవుతాయి. 


 గమనిక  -


      టీ మరియు కాఫీ పూర్తిగా ఆపి వేయాలి .


  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

మేలుజాతి గుఱ్ఱములు

 మేలుజాతి గుఱ్ఱములు - వాటి ఆయుఃప్రమాణము .


 * అప్పుడే కొత్తగా ముందరి దంతములు కనిపించుచున్న గుఱ్ఱము యొక్క వయస్సు నెలరోజులు . ముందరి దంతములు కొంచం లావుగా అయ్యి కొంచం పొడువు పెరిగిన దాని వయస్సు రెండునెలలు అని కనుగొనవలెను. 


 * కొత్తగా మధ్యలో దంతములు కనిపించుచున్న దాని వయస్సు 3 నెలలు అని గమనించవలెను. ఆ దంతములు స్పష్టంగా కనిపించినచో నాలుగు నెలలు . మిగిలిన దంతములు వచ్చిన గుర్రము యొక్క వయస్సు 8 నెలలు . 


 *  ఆ దంతములు ఎరుపు రంగులో మారిన ఆ గుర్రము యొక్క వయస్సు రెండు సంవత్సరాలు . గుఱ్ఱముకి పుర్తిగా దంతములు రావడానికి 5 సంవత్సరాల సమయం పట్టును. 


 *  గుర్రముకి 5 సంవత్సరాలు వచ్చు సమయంలో దంతములు తెల్లగా అవ్వుట , స్థిరచిత్తము కలుగుట , కన్నులు దృష్టి స్పష్టంగా కనిపించుట , బలం , శరీరము నందు తేజస్సు అధికముగా అవ్వుట జరుగును. 


 * గుర్రము యొక్క బాల్యదశ 5 సంవత్సరములు . గుర్రము యొక్క జీవితకాలం 32 సంవత్సరాలు . 


 *  గుర్రము యొక్క శరీరం పైన సుడులు 10 ఉండవలెను. 10 కంటే తక్కువ అయిన ఆ అశ్వము అల్పజీవి అగును. అంతేకాక ఆ గుర్రము యొక్క యజమానులకు కూడా కీడుగల్గును. 


 *  తల చిన్నగా ఉన్న గుర్రము అనేక చిక్కులను ఎదుర్కొని 5 సంవత్సరముల లోపలనే మరణించును. అలా జరగనిచో 5 సంవత్సరములలోపు ఆ గుఱ్ఱముని పాలించు యజమాని మరణించుట తధ్యం. 


 *  మెడమీద జూలు నందు సుడి , దేవమణి ఆకారంలో సుడి కలిగిన అశ్వము యజమానికి శుభం చేకూర్చును . 


 *  ముట్టెయందు , కేశాంతము నందు , నోటికి ఇరుపక్కలా ఉండు మూలలయందు సుడులు కలిగిన అశ్వము యజమాని సకలశుభాలు ఇచ్చును. 


 *  ముందరి కాళ్ళకి సుడులు కలిగియున్న అశ్వమును బాహువర్తతు రంగమనబడును.ఈ అశ్వమును పాలించు అధికారి యుద్ధములు యందు విజయాన్ని సాధించును. 


*  పద్మము , కులిశము , చెంబు , చామరం , తోమరము , చక్రము , రోకలి , మొగ్గ , శంఖువు , చంద్రుడు , మణి ఖడ్గము మొదలగు ఆకారాలలో తెల్లని బొల్లి ఉండుట మంచిది . 


 * శూలము , అరదండము ఆకారాలలో మరియు నీలివన్నె పచ్చ రంగు కలిగిన బొల్లులు ఉండరాదు. అందువలన కీడు సంభవించును. తలయందు , క్రింద పెదవి యందు , ముక్కు పైన బొల్లి ఉండరాదు. 


 *  ఎక్కువ , తక్కువ దంతములు కలిగినది , పిల్లి కండ్లు కలిగినది , ఒక కన్ను దృష్టి కలిగినది , ఒక బీజము కలిగినది , పిల్లిచెవులు కలిగినది , రెండు పిల్లలని ఈనే గుర్రము , పెద్ద పెద్ద గిట్టలు కలిగినది మున్నగు దోషములు కలిగిన అశ్వములును పెంచరాదు. 


 *  నాలుగు కాళ్ళ యందు తెలుపు కలిగిన అశ్వము ని పంచకళ్యాణి అందురు . అది తన యజమాని కి సర్వదా జయము కలిగించును. 


 *  నాలుగు కాళ్ల ను , చెవుల యొక్క కొనలను , తోకయును , ముఖము పైన వక్షస్థలం పైన తెల్లని రంగు కలిగియున్న అశ్వముని "యష్టమంగళి " అనుదురు . ఆ గుఱ్ఱమును పాలించువాడు ధరణిని  యేలును . 


 * గుర్రముని అధిరోహించు సమయమున అగ్నిని , వాయుదేవుని దలచుకొని అధిరోహించవలెను. 


   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 

తేలుకాటు నివారణా యోగాలు

 తేలుకాటు నివారణా యోగాలు  -


 *  జీలకర్ర నూరి సైన్ధవ లవణం కలిపి ఇచ్చిన తేలుకాటు బాధ తగ్గును.


 *  ఉత్తరేణి ఆకు రసం తేలుకాటు పైన రుద్దిన తేలు విషం దిగును.


 *  జిల్లేడు పాలల్లో నేపాళం గింజలోని పప్పు నూరి తేలుకాటు వేసిన చోట అంటించాలి. గోమూత్రం 20 మి.లీ .లో పసుపు వేసి తాగించాలి . విషం దిగును .


 *  ఉత్తరేణి చెట్టు వేరు బియ్యం కడుగుతో నూరి తాగించవలెను . తేలు విషం హరించును .


 *  తులసి వేరును అరగదీసి ఆ గంధాన్ని తేలు కుట్టినచోట అంటించుచున్న తేలు విషం విరుగును.


 *  దాల్చినచెక్క నూనె తేలు కుట్టినచోట దూదిలో ముంచి పెట్టిన నొప్పి తగ్గును.


 *  గుగ్గిలం పొడి తేలు కుట్టినచోట పెట్టి నిప్పు వేడి చూపించిన విషాన్ని లాగేస్తుంది.


 *  జీలకర్ర నూరి తేలు కుట్టినచోట అంటించిన నిప్పువేడి చూపిన విషం తగ్గును.


 *  కుంకుడుకాయ తడిపి దాని గుజ్జుతో తేలుకుట్టిన చోట రుద్దిన బాధ తగ్గును.


 *  ఎర్ర చేమంతి పువ్వుల రసం తేలు కుట్టినచోట వేస్తే విషప్రభావం దిగును .


 *  గచ్చకాయలోని పప్పు నీళ్లతో అరగదీసి ఆ గంధమును తేలు కుట్టినచోట వేసి ఒక కాటన్ బట్ట కాల్చి ఆ పొగ గంథం పూసిన చోట చూపించవలెను.ఈ విధంగా చేసిన తేలు విషం దిగును .


 *  ఇంగువను నీళ్లతో అరగదీసి ఆ గంధమును తేలు కుట్టినచోట దళసరిగా పూసి గుడ్డ ముక్క కాల్చి ఆ పొగ చూపించిన విషం దిగును .


 *  మోదుగ గింజలను జిల్లేడు పాలతో నూరి ఆ గంధాన్ని తేలుకుట్టినచోట పూస్తే తేలు విషం దిగును .


   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  .


సేవకుడు తప్పుచేసినపుడు

 శ్లోకం:☝️

*దాసే కృతాగసి భవేదుచితః ప్రభూణాం*

*పాదప్రహారితి మానిని నాతిదూయే ।*

*ఉద్యత్కఠోరపులకాంకుర కంటకాగ్రైర్*

*యద్భిద్యతే పదమిదం తవ సా వ్యథా మే ॥*


భావం: సేవకుడు తప్పుచేసినపుడు యజమాని కోపంతో తన్నడం సరైనదే. నేను నీకు దాసుడును నీ విషయంలో అపరాధం చేసినందుకు నన్ను నీవు పాదప్రహారం చేసినందుకు బాధపడను. కాని నీ పాదస్పర్శచేత నా శరీరం పులకించి నిక్కబొడిచిన ముళ్ళలాంటి రోమాల వల్ల కోమలమైన నీ పాదానికి నొప్పికలిగిందేమోనని నేను బాధపడుతున్నాను.

నంది తిమ్మనగారి పారిజాతాపహరణంలో సత్యభామ కృష్ణుని తన్నిన సన్నివేశంలాంటిది ఈ శ్లోకం.

మూల పురుషుడు ఎవరు

 చాలామందిలో ఆలోచనలలో ఉన్న విషయం.. బ్రాహ్మణుడే శూద్రులను అణచి వేశాడు. అందువల్ల బ్రాహ్మణుడు అహంకారి. అని. కానీ చాలామందికి తెలియని విషయాలు ఏమిటంటే! మీ మీ జాతి లేక వంశ మూల పురుషుడు ఎవరు? ఒక ఋషి ఉంటాడు. శూద్రుడ లేక బ్రాహ్మణుడా, క్షత్రియుడ, వైశ్యుడ అని కాకుండా ఎవరినైనా సరే చూడండి. గోత్రం పేరు ఒక ఋషి ఉంటాడు. ఆ ఋషి ద్వారా మీ వంశం వృద్ధి చెంది మీ వరకు వచ్చింది. అన్ని జాతులలో ఋషులు, యోగులు ఉన్నారు. ఎవరికి సందేహం వద్దు. అక్షరసత్యం. మీ చేతకాని తనం, చెప్పుడు మాటలు వినడం వల్ల బ్రాహ్మణ ద్వేషం పెరిగింది. బ్రహ్మవిద్య నేర్చిన వాడే బ్రాహ్మణుడు. పుట్టుకతో వచ్చేది కాదు బ్రాహ్మణత్వం.


జాతి భేదాలతో ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ధర్మ ద్రోహులు అవ్వకండి 

హిందూ ధర్మం జాతి నీ అనుసరించి ఉద్భవించింది కాదు 

హిందూ ధర్మం

జ్ఞానం మీద ఆధారపడి నడిచింది. 

జన్మించిన కులం వల్ల కాదు. 


(వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..) 


1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.


2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.


3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు ..


4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.


5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు. 


6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.


7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు. 


వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. 


8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.


9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.


ఇంకా ..


1. ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.


2.  ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)


3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.


ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు


1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.


2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..


3. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు. 


4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.


5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.


6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14)


7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది  ( విష్ణుపురాణం 4.1.13). 


8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5).


9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).


10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.


*ఈ సందేశాన్ని కూడా మీ బంధువులకు స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి*


*తెలియని విషయాలు తెలుసుకునే అదృష్టాన్ని వారికి అందించటంలో సహాయపడండి*

23, డిసెంబర్ 2022, శుక్రవారం

సంసార వాసనలు 

సంసార వాసనలు 

మన జ్ఞ్యానులు మనలను సాధకులుగా మార్చే దిశలో అనేక మహాత్ముల  కధలు చెపుతూవుంటారు నిజానికి జిజ్ఞాసువులకు ఇటువంటి కధలు ఎంతో ఊతం ఇచ్చి ముముక్షువులుగా మారుస్తాయి వాటిలోని యదార్ధకత గూర్చి విచారించకుండా అవి మానలను ముకుక్షుకత్వము వైపు మరలుటకు ఎంతవరకు దోహదపడతాయి అనేది గమనించితే మన సాధనా మార్గం సుగమము అవుతుంది.    అటువంటి ఒక కధ ఇక్కడ పేర్కొంటున్నాను. 

సర్వసంగ పరిత్యాగి అయిన ఒక యోగీశ్వరుడు పూర్తిగా దిగంబరుడుగా వుంటూ అడవిలో దొరికే పండ్లు, ఫలాలు మాత్రం స్వేకరిస్తూ సాదారణ జన జీవనానికి దూరంగా అంటే మనుషులకు పూర్తిగా దూరంగా వుంటూ కేవలం మోక్షార్థిగా జీవనం గడుపుతున్నాడు. మనలాంటి సాధారణ మానవులు అతనిని చూస్తే అంతకంటే విరాగి, స్థితప్రజ్ఞుడు, సన్యాసి ఇంకొకరు ఉండలేరు అని తలవక పోము . ఒకరోజు మన యోగపుంగవులు అడవిలో చెట్టుక్రింద ఒక బండమీద పడుకొని ఉండగా గగన మార్గంలో పార్వతీ పరమేశ్వరులు వెళ్ళటం మన యోగపుంగవులు గమనించారు.  అమ్మవారు ఈశ్వరునితో స్వామి మీ భక్తుడు పూర్తిగా విరాగిగా వుంటూ నిత్యం మిమ్ములనే స్మరిస్తూ వున్నాడు అతనికి మోక్షాన్ని ఎప్పుడు ప్రాసాదిస్తున్నారని అడిగింది.  దానికి స్వామి ఇంకా అతనిలో సంసారపు వాసనలు పోలేదు అటువం టప్పుడు యెట్లా మోక్షానికి అర్హుడు అవుతాడు అని సెలవిచ్చారు. అది విన్న మన యోగపుంగవులు పరుగు పరుగున ఈశ్వరుని సన్నిధికి వెళ్లి స్వామీ నేను నా సంసారం పూర్తిగా త్యజించి అడవిలో ఎలాంటి వాసనలు లేకుండా యతిగా జీవనం గడుపుతూ నిత్యం మోక్షార్థినై జీవిస్తున్నాను, జగన్మాత కూడా నా అవస్థ గమనించి మోక్షము ప్రసాదించవలసిందిగా మీకు తెలిపింది,   నాకంటూ  ఏదిలేదు. మరి నేను ఎలా సంసారపు వాసనలు కలిగి వున్నాను అని ప్రశ్నించారు. దానికి పరమేశ్వరులు ప్రసన్న వదనంతో నాయనా నీవన్నది నిజం. నిజానికి నీవు అత్యంత కఠినమైన దీక్షతో మోక్షార్థిగా జీవనం  గడుపుతున్నావు. నిన్ను చేస్తే ఎవరయినా సర్వసంగ పరిత్యాగి అంటే నీవే అని అంటారు అందులకు సందేహంలేదు. నీవు ఎలాంటి సుఖాలను, భోగాలను పొందకుండా అన్నిటిని వీడి పూర్తిగా యతిగా జీవిస్తున్నావు. కానీ ఇంకా నీలో సంసారపు వాసనలు సూక్ష్మంగా వున్నాయి అని అన్నారు. అవి ఏమిటని మన యతీశ్వరులవారు అడుగగా దానికి స్వామి నీవు పడుకునేటప్పుడు తలకింద చేయి ఎందుకు పెట్టుకున్నావు అది సుఖం మీద జాస కాదా అని  వివరించారు. అప్పుడు యతీశ్వరులు చేయి కూడా తలక్రింద పెట్టుకోకుండా పడుకొంటూ అనతికాలంలోనే ఈశ్వర సాన్నిధ్యాన్నిపొందారట. 

సాధక మిత్రమా యెంత కఠినంగా సాధన చేస్తేనో కానీ మోక్షం లభించదు.  మనం నిత్యం సంసారిక జీవనంలో వుంటూ అనేకులతో అనేక విధాలుగా సామాజిక, ఆర్ధిక పరంగా సంబంధాలు పెట్టుకొంటూ రోజులో కొంత సమయాన్ని మాత్రమే సాధనకు కేటాయిస్తూ జీవిస్తున్న మనం పైన పేర్కొనిన యోగపుంగవులుతో పోల్చుకుంటే ఏపాటివారము అని మనము ఆలోచిస్తే మన సాధన ముందుకు వెళుతుంది. మన జీవనంలో సాధనకు ఎక్కువ సమయం లవుకిక జీవితానికి తక్కువ సమయం కేటాయిస్తే కానీ మనం సాధనలో ప్రగతి సాధించలేము. కానీ మనం సమాజంలో వుంటూ గృహస్థ జీవనం గడుపుతూ ఎంతవరకు సాధించగలం అనేది ప్రస్నార్ధకమే.

ఇది చదివిన సాధకులు తమసాధనలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అభిలషిస్తూ 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః  

మీ భార్గవ శర్మ

మనిషి ఎలా జీవించాలి ??

 *మనిషి ఎలా జీవించాలి ??*

        

మనిషి ఎలా బతకాలో చెప్పింది వేదం. చక్కగా చూస్తూ, చక్కగా వింటూ, మంచిగా మాట్లాడుతూ ఎవరికీ అధీనుడు కాకుండా ఉంటే మనిషి నూరేళ్లు బతుకుతాడని వేదం చెబుతోంది.


ఎవరి ధనాన్నీ దొంగిలించకూడదు. అంటే, ధనార్జన ధర్మంగా ఉండాలి. అంతేకాదు- ద్వేషం లేని ప్రేమైక సమాజం మంచిదని వేదం బోధించింది.


ఉపనిషత్తులో ఓ మాట ఉంది. నిత్యం ఏదో ఓ మంచి విషయాన్ని వింటూ ఉండాలి. చదువుతూ ఉండాలి. చదివినదాన్ని మననం చేసుకుంటూ ఉండాలి.


ఎన్ని కష్టాలొచ్చినా సత్యాన్ని వదులుకోకూడదు. నైతికంగా పతనం కాకూడదు. నేను, నాది అన్న సంకుచిత భావనను వదిలిపెట్టాలి. చేసేవాడు, చేయించేవాడు ఆ భగవంతుడే అనుకుంటే- ఫలితాలమీద ఆపేక్ష ఉండదు.


‘మా, మేము, నా’ అనే స్వార్థానికి కౌరవులు జీవితంలో మొదటిస్థానం ఇచ్చారు. రెండో స్థానం ప్రపంచానికి, మూడో స్థానం భగవంతుడికిచ్చారు. ఫలితం అందరికీ తెలిసిందే.


పాండవులు తమ జీవితంలో మొదటి స్థానాన్ని భగవంతుడికి ఇచ్చారు. ద్వితీయ స్థానాన్ని నిస్వార్థ బుద్ధితో ప్రపంచానికిచ్చారు. తరవాత తమ గురించి ఆలోచించారు. అందుకే భారత యుద్ధంలో విజేతలయ్యారు.


ఎవరైనా జీవితంలో ప్రథమస్థానం భగవంతుడికి  ఇవ్వాలి. స్వార్థాన్ని మరచి పరోపకారానికి పాటుపడి త్యాగాలు చేయాలి. ఆ పైనే తమ గురించి ఆలోచించాలి. అప్పుడే జీవితం సంతోషభరితం అవుతుంది.

ప్రతి మనిషీ ప్రపంచంలో ఒకడిగా తనదైన ముద్రవేయాలి తప్ప మందలో ఒకరిగా కలిసిపోకూడదు.


విలువలతో కూడిన జీవితం గడపడం, సక్రమమైన మార్గంలో ప్రయాణించడంవల్లే మనిషి లక్ష్యాలను చేరుకోగలుగుతాడు.


ఈ దేశంలో పుట్టిన సద్గురువులు ఎందరెందరో మానవసేవను మాధవసేవగా భావించారు. పరోపకారమే లక్ష్యంగా బతికారు. వినమ్రతతో దానధర్మాలు చేశారు. మనుషులు ఋషుల్లా మారారు. సంఘసేవకు నడుం బిగించారు. సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ మహాత్ముడయ్యాడు.

కాలడి నుంచి హిమాచలం వరకూ కాలినడకన వెళ్ళి నిష్ఠగా ధర్మాన్ని ప్రబోధించిన శంకరాచార్యులు జగద్గురువయ్యారు.


వారందరూ సంఘ శ్రేయం కోసం తమ జీవితాలు ధారపోసి చిరస్మరణీయులయ్యారు.


ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు సాగదు.


సింహం నోరు తెరుచుకుని ఉన్నంత మాత్రాన వన్యమృగం దాని నోటికి అందదు కదా! అసలు మన ఆలోచనలనుబట్టే ప్రపంచం ఉంటుంది. మన దృష్టి మంచిదైనప్పుడు లోకం మంచిగానే కనిపిస్తుంది. చెడుగా చూస్తే ప్రపంచం చెడ్డగానే కనిపిస్తుంది. ఇతరులకు మేలు చేయకపోయినా కీడు తలపెట్టకుండా ఉండటం మంచిది.


ప్రియంగా మాట్లాడితే శత్రువులైనా క్రమంగా మిత్రులవుతారు. సమాజశ్రేయానికి ప్రతి మనిషీ కృషిచేయాలి. నైతిక విలువలు పాటించి న్యాయమార్గంలో నడవాలి. ప్రేమను, జ్ఞానసంపదను అందరికీ పంచాలి. అప్పుడు మనిషి మనీషి అవుతాడు. అతడిలో భగవంతుడు కొలువై ఉంటాడు! అటువంటి ధన్యజీవులే ధరిత్రిని సంతోష ధామంగా, పుణ్యమూర్తులు నడయాడే ఆనందనందనంగా తీర్చిదిద్దడంలో కీలక భూమిక పోషించగలుగుతారు.


సేకరణ

భువనవిజయం తెలుగు వెలుగు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

భువనవిజయం తెలుగు వెలుగు 


కాఫీ విత్ మధు ☕️


విజయవాడ ఆకాశవాణి కేంద్రం

డిసెంబర్ 1న వజ్రోత్రోత్సవ సంవత్సరంలోకి ప్రవేశించింది 


'రేడియో జంక్షన్'లో శబ్దమాంత్రికులు


ఇప్పుడవన్నీ జ్ఞాపకాలు. కానీ అప్పుడవి విద్వత్ జ్వలిత క్షణాలు. ఒక్కసారి ఇ కాదు, చాలాసార్లు గుర్తుకొస్తూ ఉంటాయి. 


నా చిన్నతనంలో విజయవాడ

రేడియోలో బందా కనకలింగేశ్వరరావు, పింగళి లక్ష్మీకాంతం, బాలమురళీ కృష్ణ, తెన్నేటి హేమలత, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, ప్రయాగ నరసింహశాస్త్రి, వింజమూరి శివరామారావు, కందుకూరి రామభద్రరావు, ఆమంచర్ల గోపాలరావు, జి.వి.కృష్ణారావు, కూచిమంచి కుటుంబరావు, అన్నవరపు రామస్వామి, దండమూడి రామ్మోహనరావు, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, వి.బి. కనకదుర్గ, నండూరి సుబ్బారావు, సి. రామ్మోహనరావు, ఎ.బి. ఆనంద్, లింగరాజు శర్మ మొదలైనవారి పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి. 


వీళ్ళలో చాలామందిని చూడను కూడా చూశాను. ఎక్కువమంది సూర్యారావు పేటలో మా మేనమామగారి ఇంటికి చుట్టుపక్కల ఉండేవారు. బందాగారు గొప్పనటులు. పౌరాణిక నాటకాలలో అనేక పాత్రలు పోషించారు. కృష్ణుడు, కర్ణుడు, బిల్వమంగళుడు ఇంకా ఎన్నెన్నో..! వారి మహత్తర నటనా జీవితం ఒక ఎత్తయితే; కూచిపూడి యక్షగానాలను, నాట్య సంప్రదాయాలను ఉద్ధరించడం మరోఎత్తు. కూచిపూడిలో 'కళాక్షేత్రం' నాట్య పాఠశాలను స్థాపించారు. కూచిపూడి నాట్య బృందాలను దేశ మంతటా తిప్పుతూ ప్రదర్శనలు ఇప్పించి కూచిపూడి నాట్యాన్ని జగద్విదితం చేశారు. 


ప్రయాగ నరసింహశాస్త్రి వినోదాల వీరయ్యగా, మొద్దబ్బాయిగా రకరకాల పేర్లతో శ్రోతల్లోకి చొచ్చుకు పోయి వినోదాన్ని పంచారు. జానపద గీతాలను చక్కని చతురోక్తులతో శ్రావ్యంగా పాడి రక్తికట్టించేవారు. 


ఇక గానగంధర్వుడు బాలమురళి గురించి ఎంత చెప్పినా తనివితీరదు. సంగీతమే బాలమురళిగా ఈ భూమి మీద అవతరించింది. వాళ్ల వల్ల రేడియోకి పేరు వచ్చిందా, రేడియో వల్ల వాళ్లకు పేరు వచ్చిందా? ఏమో! చెప్పలేను. 


విత్తు ముందా, చెట్టుముందా లాంటి ప్రశ్న అది. ఏది ఏమైనా వాళ్ళందరూ సంగీత సాహిత్య స్రష్టలు, ద్రష్టలు. వారి వారి రంగాలలో వెలుగులు ప్రసరింపచేసినవారు. 


తరువాత కాలంలో మరికొన్ని పేర్లు వినబడుతూ వచ్చాయి. వారు కూడా సంగీత సాహిత్యాది కళలను ఆపోసన పట్టిన అగస్త్యులే!. విద్యలకన్నిటికీ వెన్నెల మెరుగుగా, మెరుగు వెన్నెలగా రజని; 


కర్ణాటక సంగీత విద్వాంసులు ఓలేటి, అమరావతికథల సృష్టికర్త సత్యం శంకరమంచి; తన గంభీర స్వరంతో రేడియోలో రామాయణ, భారత, భాగవతాలు వినిపించి ప్రతీ ఇంటినీ నైమిశారణ్యం చేసిన ఉషశ్రీ, ఒక్క పాటేమిటి, ఒక్క పద్యమేమిటి, నాటకమేమిటి, ఏదైనా అలవోకగా రాయగల సరస్వతీ పుత్రుడు, సంస్కృతాంధ్ర పండితుడు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ; 


హాస్యానికి రంగూ రుచీ వాసనలు అద్ది, తమలపాకుతో హాస్యం కానీ తలుపు చెక్కతో కాదు అని, రేడియో కోసం ప్రత్యేకంగా రెండు మూడు నిముషాలు నిడివి ఉండే సౌండ్ కార్టూన్స్ చెళుకులను గుప్పించిన పన్నాల సుబ్రహ్మణ్య భట్టు....


ఇలా ఎందరో సంగీత, సాహిత్య ప్రక్రియల ద్వారా ఆనందాన్ని కలిగించారు. 


విజయవాడ ఆకాశవాణి ప్రస్థానం 1948 డిసెంబర్ 1న ప్రారంభమై అద్వితీయంగా 74 ఏళ్లపాటు సాగి వత్సవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో ఆ మరపురాని మనీషులందరినీ తలుచు కోవడం మహదానందంగా ఉంది.


1972లో అంటే విజయవాడ ఆకాశవాణి ప్రసారాలు ప్రారంభమైన 28 ఏళ్ల తర్వాత రేడియోలో చేరిన నవతరం మరొకటి ఉంది. మేలిమి బంగారం లాంటి ఆ సృజనకారులలో అగ్రగణ్యుడు 'మా రాముడు'. అదేనండి! రేడియో రామం! ఇల్లలికిన ఈగలాంటివాడు. వాడి ఇంటి పేరు వాడికే గుర్తులేదు. రేడియో రామంగానే ప్రసిద్ధుడు. 


స్వరాన్ని, శబ్దాన్ని ఎంత కావాలో అంతవరకే తూకం వేసి ఒడిసి పట్టుకుంటాడు. గొప్ప శబ్దమాంత్రికుడు. ఆకాశవాణి ప్రతి ఏటా జాతీయ స్థాయిలో నిర్వహించే నాటక, రూపక పోటీల్లో మొదటి బహుమతి వాడిదే. 


రేడియో నాటకాలకు, రూపకాలకు, పిక్చర్ అండ్ సౌండ్ అనే నూతన శబ్ద ప్రక్రియకు తలుపులు, కిటికీలు తెరిచినవాడు రామం. చాలామంది సినిమా యాక్టర్లు మేము

డాక్టర్లు కాబోయీ యాక్టర్లమయ్యామంటుంటారు. 


రాముడు రేడియోలో సౌండ్ ఇంజనీరు కావాలనుకుని వచ్చి మన అదృష్టం కొద్దీ ఎనౌన్సరయ్యాడు. మరో ఘనాపాటి మల్లాది సూరిబాబు. సుస్వర సంగీతలోలుడు. పాటల ఊట. రసికులు మెచ్చే పాటలు రేడియో కోసం ఎన్ని స్వరపరిచాడో లెక్కలేదు. 


కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నాడు. కలగా కృష్ణమోహన్ గురించి, సుధామ గురించి కూడా మాట్లాడుకోవాలి. 


కృష్ణమోహన క్కు పాటంటే ప్రాణం. స్వరాలతో ఆడుకోవడం సరదా. అతనో పాటల పూవుల వంతెన. సుధామ ఒక సాహితీ భాండాగారం, కవి విమర్శక పండితులు. ఇద్దరూ విజయవాడలో పనిచేశారు.


మా తరువాత విజయవాడ రేడియోలో చేరిన బహుముఖ ప్రజ్ఞాశాలి జయప్రకాష్. శబ్ద నాటక శిఖర మతను. రామం తరువాత ఆ వారసత్వాన్ని నిలబెడుతూ ఆకాశవాణి వార్షిక బహుమతులు ఎనిమిది గెల్చుకున్నాడు. విజయవాడ రేడియోను తలుచుకున్నప్పుడు తప్పనిసరిగా గుర్తుచేసుకుని శిరస్సు వంచి సభక్తికంగా, సగౌరవంగా నమస్కరించ వలసిన వాచికాభినయ ప్రతిభామూర్తులు, నట దిగ్గజాలు, స్వరకర్తలు మరి కొందరున్నారు. స్వర

సామ్రాజ్ఞి శారదా శ్రీనివాసన్, నండూరి విఠల్, అద్దంకి మన్నార్, ఎన్.సి.బి జగన్నాథాచార్యులు, ఎం.వీరభద్రరావు (సినిమాల్లోకి వెళ్ళాక సుత్తి వీరభద్రరావు), గొల్లపూడి మారుతీరావు, మల్లిక్... వీళ్ళంతా విజయవాడ ఆకాశవాణి ప్రాంగణంలో నిలిచి ఎదిగిన వెలుగు దీపాలు.


విజయవాడలో 'రజని' డైరెక్టరుగా ఉన్నకాలం స్వర్ణయుగం. అప్పుడు ఆయన చుట్టూరా కవులు, గాయకులు, పండితులు ఉండేవారు. ఏదో ఒక మాట పుచ్చుకుని, పాట అందుకుని పాడుతూ ఉండేవారు. 


అక్కడి చెట్లు కూడా ఆపాటకు తలలూపుతూ ఉండేవి. ఏనాటి ముచ్చట్లివన్నీ! 40 ఏళ్ళ క్రితం మాటలు. ఇటీవల వరకు పనిచేసి విజయవాడ రేడియోకు వన్నెతెచ్చిన వాళ్ళలో సి.ఎస్. రాంబాబు, మల్లేశ్వరరావు కూడా ఉన్నారు. 


చిక్కని కవితలు, కథలు అల్లుతారు. ఏ సమస్యనీ, ఏ సందర్భాన్నీ వదిలిపెట్టరు. దేనినైనా చిత్రిక పట్టగలరు. నేను వార్తల మనిషిని. నాకు సహచరులుగా, సహోద్యోగులుగా, పెద్దలుగా పనిచేసిన వారిలో అతి ముఖ్యులు కొందరున్నారు. ఆర్.వి.వి.కృష్ణారావు, బి.నారాయణరావు, భండారు శ్రీనివాసరావు, కొప్పుల సుబ్బారావు, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, తిరుమలశెట్టి శ్రీరాములు, డి.వెంకట్రామయ్య... వాళ్ళందరూ హృదయులు, సంస్కారవంతులు, మంచితనం మూర్తీభవించిన మూర్తిమత్వం వాళ్ళది. 


ఇంకా ఏవరినైనా స్మరించకుండా వదిలిస్తే మన్నించండి! రేడియోకు అనిర్వచనీయమైన ఆకర్షణ ఉండేది. ఇందులో పనిచేసిన మాకంటే బయటనున్న వారికి సంగతి బాగా తెలుసు. 


విశ్వనాథ సత్య రాయణ, జంధ్యాల పాపయ్యశాస్త్రి, పీసపాటి నరసింహమూర్తి, విన్నకోట రామన్నపంతులు, రామచంద్ర కాశ్యప, పుచ్చా పూర్ణానందం, తుమ్మల కారామమూర్తి, ఆచంట వెంకటరత్నం నాయుడు,

గోపాలకృష్ణ, సి. రాఘవాచారి, నండూరి రామ్మోహనరావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ,తు ర్లపాటి కుటుంబరావు, వావిలాల గోపాల కృష్ణయ్య, చలనచిత్ర దర్శకులు జంధ్యాల, సినీనటి అన్నపూర్ణ (ఒకప్పుడు ఉమ), ఎ.వి.ఎస్. పొట్టి ప్రసాద్, గుండు హనుమంతరావు.. ఒకరా ఇద్దరా...! 


విజయవాడ రైల్వేజంక్షన్ ఎలాగో రేడియో జంక్షన్ అలా!. ఇలా అందర్నీ దర్శించే భాగ్యం కలిగింది. దొరకునా ఇటువంటి సేవ!


ప్రయాగ రామకృష్ణ

పునరావృతం చేయరు.

 శ్లోకం:☝️

*నిర్దోషపూర్ణా యది తే బహుత్ర*

*కుర్వంతి దోషాన్సుజనాః కదాచిత్ |*

*విజ్ఞాన దోషాన్ ఝటితి త్యజన్తి*

*పునర్న కుర్వంతి కృతాన్పరంతు ||*


భావం: పెద్దమనుషులు చాలామట్టుకు దోషరహితంగా ఉన్నప్పటికీ, కొన్నిసార్లు వారు కూడా తప్పులు చేస్తారు. *ప్రమాదో ధీమతామపి* . కాకపోతే వారు తప్పులు చేసినప్పటికీ త్వరగా సరిదిద్దుకుంటారు. మరి పునరావృతం చేయరు.

మహోన్నతుడు, శ్రీ పి. వి. నరసింహారావు !

 " విశ్వంలో మహోన్నత ఆర్ధిక సంస్కరణల రూప శిల్పి, తెలుగు తేజం,  శ్రీ పి. వి . నరసింహారావు గారు "                                     తెలుగు నేలపై జన్మించి, బహు భాషలలో పాండిత్యం సాధించిన మహోన్నతుడు, శ్రీ పి. వి. నరసింహారావు !       

నిత్య నూతన దివ్య తేజో ప్రకాశమై, తెలుగు వారి ఖ్యాతిని దిగ్దిగంతాలలో నిలిపిన అత్యత్తమ సుసంస్కారి, శ్రీ పి. వి. !

ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయాన, చక్కని రీతిలో, భారతీయ మేధాశక్తిని చూపిన ధీశాలి ! 

భారత దేశపు సమున్నత సంస్కృతిని,సనాతన ధర్మ సువికాసాన్ని పరిఢవిల్లచేసిన పండితోత్తముడు ! 

న్యాయకోవిదునిగ విశ్వ వ్యాప్త ప్రశాంతతకు ఆయన చేసిన కృషి నిరుపమానం !

విశ్వ సాంకేతిక, వైజ్ఞానిక, విద్యా, సాంస్కృతిక, ఆర్థిక సంస్కరణల రూప శిల్పిగ ఆయన చరిత్రలో మహోన్నత స్థానమలంకరించిన దార్శనికత !

తెలుగు వారి శక్తి సామర్ధ్యాలు, వారిలోని అంతర్గత సాంకేతిక పరిజ్ఞానాలకు విశ్వ వేదిక కల్పించిన మహోన్నతుడు ! 

భారత దేశపు ప్రధానిగ, క్లిష్టమైన పరిస్థితులలో సైతం ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, విశ్వంలో శాశ్వత సువర్ణాక్షరాల దివ్య సుప్రకాశం ! 

నేడు శ్రీ పి. వి. నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నా మనఃపూర్వక నివాళి ! 

🙏🙏🙏🙏🙏

గుళ్లపల్లి ఆంజనేయులు 


సరళమైన భాష, వినసొంపైన భాష, సులువుగా నేర్వగలిగిన బాష, తెలుగు ! ఆత్మీయతానురాగాల పుట్టినిల్లు " తెలుగు భూమిపై " సుమారుగా వేయి సంవత్సరాల క్రితం, రాజరాజనరేంద్రుడి స్ఫూర్తితో, రాజమహేంద్రవరంలో, ఆంధ్ర మహాభారత గ్రంథ రచనకు శ్రీకారం చుట్టిన నన్నయ్య నిత్య స్మరణీయుడు ! మహర్షి వేద వ్యాసుని సంస్కృత భారత గ్రథానికి, చక్కని రీతిలో గొప్ప విలువలతో కూర్చిన దివ్య శోభతో, " ఆది కవి నన్నయ్య ", సుమధుర తెలుగు పద్యాలతో, బహు చక్కటి పదబంధాలతో, తనదైన ప్రత్యేక విశిష్టత చాటుతూ, కడు పసందైన రీతిలో, ఎంతో రమణీయమైన విధంగా, " ఆంధ్ర మహాభారత గ్రంథ " రచనకు రూపుదిద్దిడం, మిక్కిలి ఆదరణీయం ! 18 పర్వాల ఆంధ్ర మహాభారత గ్రంథాన్ని, మహా కవులు, కవిత్రయంగా పేరొందిన, నన్నయ, తిక్కన, ఎఱ్ఱాప్రగడలు చక్కని పసందైన రీతిలో, జనరంజకంగా, అందరికీ అర్ధమయ్యే విధంగా, చక్కటి తెలుగు పద్యాలతో, రమణీయమైన పదబంధాలతో విశ్వానికి అందించడం, తెలుగు వారి అదృష్టం ! తెలుగు భాష, బహు ప్రాచీనమైనదై, విశ్వంలో తనదైన ప్రత్యేకతను చూపడం ఎంతో ప్రశంసనీయం ! తెలుగు వారి తోడ్పాటుతో, వివిధ రంగాలలో అనునిత్యం కానవచ్చెడి విశ్వ వ్యాప్త సువికాస నిత్య దివ్య తేజో దీప్తి ! సృష్ట్యాదిగ, జరుగుతున్న, విశ్వ వ్యాప్త నిత్య అభ్యుదయంలో తెలుగు ప్రాంతాల ప్రాశస్త్యం, వర్ణనాతీతం ! చక్కని నదీనదాలతో, ప్రకృతి ప్రసాదించిన పర్వతాల మధ్య పెరిగెడి వృక్ష సమృద్ధితో తెలుగు భూమి నిత్య శోభాయమానం ! పచ్చని పొలాలు, పశుపక్ష్యాదుల నిత్య సుహృద్భావం తోడుగా తెలుగు నేల, అన్నపూర్ణగా విరాజిల్లడం ఎంతో అదృష్టం ! తెలుగు వారి మేధాశక్తి, వారికి పుట్టుకతో వచ్చే వారసత్వ దివ్య భవ్య సుప్రకాశ తేజో దీప్తి ! తెలుగు ప్రాంత గ్రామీణ వాతావరణం, వారికి ఉగ్గుపాలతో పెక్కు రంగాలలో సులభమైన తీరులో సునిశిత పరిశీలనా శక్తినివ్వడం గొప్ప విశేషం ! వివిధ రంగాలలో నేడు విశ్వ వ్యాప్తంగా తెలుగు వారు, తమ మేధాశక్తిని, విశ్వ సంపూర్ణ నిత్య నూతన అభివృద్ధికై, అనునిత్యం వినియోగించడం ఎంతో ప్రశంసనీయం ! ✍️గుళ్లపల్లి ఆంజనేయులు