21, అక్టోబర్ 2021, గురువారం

హిందూ కుటుంబాల

 హిందూ కుటుంబాల అశాంతికి కారణం..!?


1.ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా వచ్చింది. అయన నిజ జీవితంలో, ముగ్గురు భార్యలను పెళ్లి చేసుకున్నాడు.

ఈసినిమాకథలో "హీరోయిన్ తో పాటు, ఇద్దరమ్మాయిలను, ఒక రాజకీయ నాయకుడి కొడుకు బలత్కారం చేయబోతే.. 

రౌడీ నాయకుడిని ఎదిరించి,

అమ్మాయిలు కోర్టుకు వెళ్తారు. వాళ్ల తరఫున న్యాయవాదిగా నటించాడు పవన్ కళ్యాణ్."


ఈ సినిమా మొత్తంలో, పవన్ కళ్యాణ్ చేసే ఆర్గుమెంట్ యొక్క గొప్పతనాన్ని గ్రహించడమే ప్రధాన అంశం. ఈ కేసులో నేరారోపణ అయిన వ్యక్తి తరఫున నటుడు ప్రకాష్ రాజ్ వాదిస్తాడు.

వాదనలో భాగంగా, అమ్మాయిలను ప్రకాష్ రాజ్ *గుచ్చి గుచ్చి అడుగుతూ...* "ఎప్పుడైనా శృంగారంలో నీవుపాల్గొన్నవా?" అని ఒకమ్మాయిని అడుగుతాడు... 

అమ్మాయి చివరికి, అనేక గందరగోళాలల తర్వాత, *"నేను,* నా బాయ్ ఫ్రెండ్ తో, *ఇష్టంతో పాల్గొన్నాను"* అంటుంది.


2.వారం రోజుల క్రితం, మార్క్సిస్ట్ విమర్శకుడు కే.కే. రంగనాథాచార్యులు మరణించాడు. ఆయన శిష్యుడైన, *ఆంధ్రజ్యోతి సంపాదకుడు*, కే. శ్రీనివాస్ ఆయన స్మృతి వ్యాసం రాస్తూ... "రంగనాథాచార్యులు సంప్రదాయాలను తిరస్కరించాడు".. అని,

 అతనిలోని ఇదే గొప్పక్వాలిటీ, *అదే తనని ఆకర్షించింది* అన్నట్టుగా, వ్యాసం మొదలు పెట్టాడు.


ఈ రెండు విషయాలు *మనకేం నేర్పిస్తున్నాయో* విజ్ఞులైన వాళ్లంతా ఆలోచించాలి.


1.సినిమా చూసిన *ఆడపిల్లలు* పవన్ కళ్యాణ్ *సినిమాలో చెప్పినట్టుగా చేస్తే, తప్పేముంది అనుకోవడం* ......సమాజంలో ఏ రకమైన, ఎటువంటి సందేశం ఇచ్చే విధంగా ఉందో, ఒక్కసారి ఆలోచించండి. 

2.సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఒక రచయిత, మేధావిగా చెప్పుకునే వ్యక్తి, "సంప్రదాయం తిరస్కరించడం, గొప్ప అభ్యుదయమనీ సమాజానికి *చెప్పాలని ప్రయత్నించడం"* 

*ఎలాంటి ఆలోచనలు కల్పిస్తుందో,* ఒక్కసారి ఆలోచించండి.


మనం రామాయణం, మహాభారతం... ఈ ప్రపంచానికి *కుటుంబవ్యవస్థను , రాజనీతిని ఇచ్చిందని మురిసిపోతాం.* సౌదీ అరబియాలో రామాయణం పాఠ్యపుస్తకాల్లో కి ఎక్కిందని ఆనందపడిపోతున్నాం. 

మరి *మన దగ్గర కుటుంబాలు శాంతిగా ఉన్నాయా..?* 


ఇటీవల *వార్తల్లో ..*

తండ్రిని చంపిన కొడుకులు, భార్య భర్తల మధ్యహత్యలు ..అన్నదమ్ముల మధ్య హత్యలు, అన్నాచెల్లెళ్ల మధ్య హత్యలు ,

అత్తా కోడళ్ళ మధ్య హత్యలు... 

*ఇదంతా సీరియల్స్ ప్రభావమా ! లేక

*సినిమాల ప్రభావమా...! లేక

*ఇంకా వేటి ప్రభావం*❓❓


ఈ దేశంలో ఒక పదేళ్లలో కోట్లమంది యువకులు ఏ దేశాల్లో లేనంతగా పెరిగిపోతారు. *వాళ్ల మీద ఎవరి ప్రభావం ఉంటుంది..?*

a.రాణా ప్రతాప్, శివాజీ, భగత్ సింగ్, రామ్ ప్రసాద్ బిస్మిల్ ,ఉద్యమ సింగ్ , *వివేకానంద వంటి వాళ్ళ ప్రభావం ఉందా..*

లేక 

b.జూనియర్ ఎన్టీఆర్ ..మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ ..విరాట్ కోహ్లీ, ఏ ఆర్ రెహమాన్... 

వీళ్ళ ప్రభావం ఉందా? ఆలోచించండి.


మన యువత *పొద్దున లేచినప్పటి నుంచి,* 1.బూతులు ..రోతలు ..వెగటు పుట్టించే వెకిలి కార్యక్రమాలు..వంటి వినోద కార్యక్రమాలు చూడడం ఎవరు ఆపగలరు.!? 

2.అతి చౌకగా దొరికే ఇంటర్నెట్ రకరకాల సైట్లు, దుర్మార్గపు కార్యక్రమాలు చేసి, యువతను ధ్వంసం చేసే వారిపట్ల నియంత్రణ లేనటువంటి వ్యవస్థ... మన యువతను ఎటు వైపు తీసుకెళ్తున్నాయి.

ఇది 

*మనం తక్షణం, ఆలోచించాల్సిన విషయం.*


*చిన్న పిల్లలు* కూడా, రోజుకు గంటల తరబడి ఇలాంటి దృశ్యాలుచూడడం వల్ల, మానసిక మైనటువంటి నేరస్తులుగా, మారుతున్నారు. నాలుగేళ్ళ పిల్లవాడు రోజూ అనేకసార్లు 

టీవీలలో వేల సార్లు హత్యలు ... అత్యాచారాలు చూస్తున్నాడు.. ఇటీవలకాలంలో అత్యాచారాలు చేసిన వాళ్లలో మైనర్లు ఉండడం మనం చూశాం.


*ఫ్రాన్స్ యథార్థ విషాద కథ:*

 1914 - 1918 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో, ఫ్రాన్స్ విజేతగా నిలిచింది. 

అదే ఫ్రాన్స్ 1945 రెండో ప్రపంచ యుద్ధంలో *ఘోరంగా ఓడిపోయింది.* 


మొదటి ప్రపంచ యుద్ధంలో విజయగర్వంతోనున్న ఫ్రాన్స్ లో, 1926లో టెలివిజన్ వచ్చింది. దానితోపాటు జూదగృహాలు, క్యాషినోస్... క్లబ్బులు ,పబ్బులు విపరీతంగా తెరుచుకున్నాయి. 

*దాంతో ప్రజలు అన్ని రకాల దురలవాట్లకు బానిసలు అయిపోయారు.*

వాళ్లలో దేశం పట్ల అభిమానం నశించింది. 

ఆ తర్వాత జాతీయత కోల్పోయి 

దేశం పతనం వైపు అడుగులు వేసింది. 


1945 లో చాలస్ డిగొల్.. ఫ్యాన్స్ అధ్యక్షుడు అయ్యాక చేసిన *మొట్టమొదటి పని -*

ఆ దేశంలో *థియేటర్లు కూల గొట్టించాడు.* బార్లు ,పబ్బులు ,క్లబ్బులు *మూసివేయించాడు.* ఫ్రాన్స్ పై యువతరంలో గొప్ప గౌరవభావాన్ని, జాతీయతను రగిలించాడు. 

ఆ తర్వాత దేశం బీ ఫ్రెంచ్ & బై ఫ్రెంచ్... అనే స్థాయికి వెళ్లింది.


ఇప్పుడు 

మన దేశంలో

*హిందూయువత కూడా,*

ప్రాన్స్ ఎదుర్కొన్న ప్రమాదంలో పడింది. 


యువకులు ఒకరకంగా భ్రష్టమార్గంలో ప్రయాణిస్తుంటే;

మహిళలు, వృద్ధులు, 

ఇంకా చెప్పాలంటే,

*అన్ని వయసుల వాళ్లు*,

*ఏదో రకమైన దురలవాట్లకు బానిసలవుతున్నారు.*


ఇవన్నీ దురలవాట్లు అని మనం అంటే- *వామపక్షవాదులు* ఏది అలవాటు ..ఏది దురలవాటు ...అన్న దానిపై మొదట చర్చ జరగాలంటారు. 


ఇక యువతీ యువకులకు *అనేక పోర్న్ సైట్స్... విశృంఖల సినిమాలు...* అందు బాటులోకి వచ్చాయి. ఈ దుష్పరిణామాల ప్రభావం... కుటుంబాలపై పడింది.

(దీని ఫలితాలు మరో పదేళ్లు పోతేగాని మనకు అర్థం కావు.)

అందుకే,

మనం సంప్రదాయాలు, శాస్త్రాలు, గురువులు, ఇతిహాసాలు ,ఆచారాలు ,కట్టుబాట్లు, నమ్మకాలు రోజురోజుకు డొల్లతనంగా కనిపిస్తుంది. కనుకనే, హిందూ కుటుంబంలో శాంతి లేదు..


ప్రతివారూ ఆస్తులు, సంపాదన, కెరీరిజం పేరుతో.. *తమ సంతానాన్ని యంత్రాల్లా* తయారు చేస్తున్నారు. 


*"తక్కువ సంతానం - ఎక్కువ సంపాదన",*

 ఇప్పుడు హిందూ జాతికి ప్రమాదంగా మారింది. 

ఉన్న ఇద్దరినీ విదేశాలకు పంపడం.. ఒక వర్గం చేస్తే... 

వారిని అనుకరిస్తూ, 

*డబ్బు లేని వారు కూడా*, లక్షలు లక్షలు పెట్టి చదివించాలనే తాపత్రయం, వాళ్ళ కుటుంబ వ్యవస్థను ఆర్థికంగా ధ్వంసం చేస్తున్నది. 

*ఈ క్రమంలో* వారి యువతలో అధికభాగం, అజ్ఞానంతో, 

విపరీతమైన వృధా ఖర్చు చేస్తూ, 

*తాగుబోతులుగా* మారిపోతున్నారు. 

హైదరాబాదులో అధిక సంపాదనకల్ల software ఉద్యోగులు, ఎక్కువమంది విడాకులు తీసుకుంటున్నారు. ఈ విషయంపై tv లో కూడా live చర్చ జరిగింది  

ఫలితంగా వారి

కుటుంబాలు ధ్వంసమై పోతున్నాయి.


అసలు కథ ఇక్కడే మొదలవుతుంది... 

డ్రైవర్లుగా ,పనివాళ్లుగా ,వంటవాళ్ళుగా ,అటెండర్లుగా... 

*ధనికుల ఇళ్ళల్లో పని చేయడానికి ఒక వర్గం ప్రజలు* చేరుతున్నారు. 

తదనంతర కాలంలో ఏం జరుగుతుందో మన కళ్ళతో చూస్తున్నాం. 


ఇక మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థ ఉన్న వాళ్ల *ఆడపిల్లల్ని* కళాశాలల్లో..పాఠశాలల్లో ట్రాప్ చేసి, మతం మార్చి, పెళ్లి చేసుకుంటున్నారు. 

వీళ్ళు కష్టపడి, సంపాదించుకున్న *సంపదంతా,* 

ఒక్క క్షణంలో వాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది.


ఇక *అవసరంలేని ఆర్భాటాలతో,* రకరకాల కార్యక్రమాలు చేసి, అప్పులపాలవుతున్నారు ఇంకొందరు. 


అలాగే  

ఏ రాజకీయ వ్యవస్థ దేశానికి మేలు చేస్తుందో ఆలోచించే *సాధారణ పరిజ్ఞానం కూడా,*

 *మన కుటుంబాల్లో ఉండడం లేదు.* 


*ఇక ఆధ్యాత్మిక రంగం* పుచ్చి పోయింది.

*పూర్వం* ప్రతి కుటుంబానికి కుల గురువు ఉండేవాడు. లేదా పురోహితులు ఉండేవాడు. వాళ్లతో చర్చించి, ఎంత అవసరమో అంతే స్థాయిలో ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ, ధర్మబద్ధంగా శాంతిగా ప్రజలు జీవించారు. 

*ఇప్పుడు* 

1 స్వామీజీ లంతా ఎవరి దారి వారిదే.. 

2 టీవీ ల్లో దర్శనంఇచ్చే మహా మహా పండితులు, అనేక రకాలవివాదాస్పద విషయాలు,

 ప్రజలకు బోధించి, సరైన జ్ఞానం ఇవ్వకుండా..  

భ్రష్టులను తయారు చేస్తున్నారు. 

3.ఇక ఉపాసకుల పేరుతో, జ్యోతిష్యుల పేరుతో మరికొందరు ఇంకో దారిలో ఉన్నారు.


మరోవైపు మన హిందువులు పన్నులు చెల్లిస్తూ, నడిపిస్తూ ఉన్న వ్యవస్థల్ని, *ఒక వర్గం* ప్రజలు హాయిగా అనుభవిస్తున్నారు. 


*రాజకీయ అవ్యవస్థలన్నీ* మనకు తెలియనివి కావు. *లౌకికవాదం అనే ముసుగు తొడుక్కుని,* వారి ప్రయోజనాలు వారు నెరవేర్చుకుంటున్నారు. 


దురాశ, అజ్ఞానం, తెలియని తనం, 

సోమరితనం వీటన్నింటి కారణంగా,

*సగటు హిందువు*,

 తన కుటుంబంలో 

సరైన పాత్ర పోషించే లేకపోతున్నాడు.


మనకు తెలియకుండా

మన హిందూ కుటుంబాల్లో ప్రవేశిస్తున్న *పాశ్చాత్యీకరణ..* కుటుంబాల్లోని పిల్లల భవిష్యత్తును ధ్వంసం చేస్తున్నది. 


*మరోవైపు* చదువుకున్న వాళ్ళు.. 

వైట్ కాలర్ మనస్తత్వంతో 

*సంపాదన ప్రెస్టేజ్ గా భావించి,* 

జీవితమంతా అదే maniaలో బతికేస్తున్నారు.


ఉమ్మడి కుటుంబ జీవన.. సంబంధబాంధవ్యాలు.. 

కౌన్సిలింగ్ లేకపోవడం వల్ల,

*ఎన్నో కుటుంబాలు* పెళ్లి తర్వాత,

 విడాకుల వైపు మళ్లుతున్నాయి.


అందుకే ఇటీవల కాలంలో కేంద్రం త్రిపుల్ తలాక్ చట్టం తెచ్చినప్పుడు, ఓవైసీ గణాంకాలు చెప్తూ, *"హిందూ కుటుంబాల్లో ఉన్నంత విడాకుల రేటు, ముస్లిం కుటుంబాల్లో లేదు"* అన్నాడు.


ఈ విచ్ఛిన్నం కావడానికి కారణాలను 

మనం అన్వేషించాల్సిన అవసరం ఉంది.  

హిందూ కుటుంబాల్లో అశాంతికి కారణం 

మనం వెంటనే కనిపెట్టాలి.


మనకు

 1.హిందూ దేవాలయాల్లో కౌన్సెలింగ్ లేదు.. 

2 టీవీలో సీరియల్ తప్ప, ఇంకేమీ లేవు. 

3 సినిమాల్లో.. క్రైం..ద్రోహం.. అత్యాచారం..హింస.. శరీరక ప్రేమ.. ఇవే ప్రధాన విశేషాలు. 

ఇలాంటి అద్భుతాలు చెప్పే సినిమానటులు, ఇవాళ మనకు సెలబ్రిటీలు, ఆరాధ్యులు.

ఒక 

స్వామీజీని, సినిమా నటిని, 

ఒకచోట కూర్చోబెట్టి, ఓటింగ్ జరిగితే.... 

ఓట్లన్నీ ఆమెకే పడుతాయి. 


మనకు మంచి చెడ్డ నేర్పించాల్సిన *మీడియా,* 

రాజకీయ అంశాలను, వివాదాస్పద అంశాలను,

 తన వ్యక్తిగత స్వార్థంతో, వండి ఓర్చి,

మనకదించి,  

ఏది న్యాయం ఏది అన్యాయమో?

తెలియకుండా చేస్తున్నది. 


మన కుటుంబాల్లో, ఇలాంటి కౌన్సిలింగ్ లేని కారణంగా, 

విశ్వవిద్యాలయాల్లో *చదువుకుంటున్నాం అనేవాళ్ళు*,

"హిందూ మత ఆఛార, సంప్రదాయాలను, తిరస్కరించాలి" అనే భావాన్ని సులభంగా తలపై మోస్తున్నారు. 


మనం చెప్పే సద్గుణ సంపదంతా,

*ఈ దుష్ట శక్తులు,*

 తమ అందమైన ముఖాలతో,

తమ అబద్దపు వాదనలతో,

 ఒక్క క్షణంలో ధ్వంసం చేస్తున్నారు. 


*సోషల్ మీడియా* ఒక విప్లవం అని మనం అనుకుంటున్నాం... 

దానితో పాటుగా, 

మోయలేనంత విజ్ఞానం అజ్ఞానంతో కలిసి,

 మన మెదళ్ళలోకి ఎక్కుతుంది.  


జ్ఞానం అజ్ఞానాలను వేరుచేసే *హంసను,*

మనం తక్షణం పట్టుకుని రాకపోతే, అతి త్వరలోనే

మన హిందూ కుటుంబవ్యవస్థ, పైకి కనిపించే మేడిపండు మాత్రమే అవుతుంది .


(సీతా నవమి సందర్భంగా.. 

కుటుంబ వ్యవస్థ పై ఆవేదనతో... 

ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు- డా. భాస్కర యోగి వ్యాసం)

కామెంట్‌లు లేవు: