30, మే 2023, మంగళవారం

తొలితరం కవులు

 శుభోదయం🙏

            చొప్పకట్ల.


అ ధి క్షే పం !

   తొలితరం కవులు విమర్శకులు అధిక్షేపణల్లో కూడా హుందాతనం పాటించేవారు.

      జలసూత్రం రుక్మణీనాధశాస్త్రిగారు.(జరుక్ శాస్త్రి.) విశ్వనాధకవిత్వాన్నెత్తిపొడుస్తూ,పైపద్యాన్ని ప్రవచించారట!

        చివరి సంబోధన "పాషాణపాకప్రభూ!"-చదువుకున్నవిశ్వనాధ ఫక్కున నవ్వుకున్నారట!

         చిత్తగించండాపద్యం.విశ్వనాధకవితకు తగినజోడీ!


కించిత్తిక్త కషాయ షాడబరసక్షేపాతిరేకాతి వా

క్సంచార ప్రచయావకాశములలో కవ్యుద్ఘ

గండాశ్మముల్

చంచల్లీల నుదాత్తవాగ్గరిమతో సాధించి వేధించుమా!

పంచారించి ప్రవహ్లికాకృతి కృతిన్ పాషాణపాకప్రభూ!!

                      -జరుక్ శాస్త్రి.


        కవితాశైలులను ఆలంకారికులు,

1ద్రాక్షాపాకం.

 2కదళీపాకం.

  3నారికేళపాకం.

అనిమూడురీతులుపేర్కొన్నారు.

          శిలాపాకం!వాటన్నిటినీ మించిందింది.యెమతప్రయత్నించినా అర్ధమవ్వదనిసారాశం!

        చూశారా?కవులు ఒకరినొకరెంతచక్కగా తిట్టుకుంటారో??


👆మరో సమూహములో అవధాని మిత్రులు శ్రీ రాయపెద్ది వారు పంచుకొన్నది..🙏🙏🙏

వారిసౌజన్యంతో-

కామెంట్‌లు లేవు: