23, జులై 2024, మంగళవారం

మూడువన్నెల జెండాను

 సీ ॥

దేశభారతి యొక్క క్లేశమంతయు బాప 

సాగించి యుద్ధమ్ము త్యాగనిరతి 

స్వాతంత్ర్యమును దెచ్చి బావుటా నెగిరించి 

మువ్వన్నెలను బూసి మురియజేసి 

మనకింత స్వేచ్ఛను మమతతో పంచిన 

వీరసైనికులలో పేరుబడసి 

వెంకయార్యుడు మించె పింగళి వంశంపు 

రాకాశశాంకుడై రాణకెక్కి 

తే.గీ. 

సంస్మరించెద మీనాడు సన్నుతించి 

వెంకయార్యుని భక్తితో వంకలేక 

కేతన మ్మెగిరించిన నేడు ప్రీతినొంది 

మూడువన్నెల జెండాను మోయుదమ్ము 

*~శ్రీశర్మద*

కామెంట్‌లు లేవు: