29, సెప్టెంబర్ 2024, ఆదివారం

హైందవం వర్ధిల్లాలి 15*

 *హైందవం వర్ధిల్లాలి 15*



సభ్యులకు నమస్కారములు.


*ధర్మ మరియు దేశ ద్రోహులను పసిగట్టాలి, నిరోధించాలి*:-  

ధర్మ మరియు *దేశ ద్రోహుల ఆగడాలకు విచ్చలవిడితనానికి అంతముండుట లేదు*. ప్రశాంతమైన ఊరేగింపులపై రాళ్ళ వాన, ప్రజా వాహనాల, ప్రజా ఆస్తుల విధ్వంసం, *మత విద్వేషాలు రెచ్చగొట్టే శిక్షణలు, వ్యాఖ్యలు, ఉపన్యాసాలు, ఏ జనాల ఓట్లతో గెలుస్తారో ఆ జనాల ఉనికికే ప్రమాదం తెచ్చే రాజాకీయ నాయకులు, జిహాదీ ఉగ్ర సంస్థలకు, లవ్ జిహాదీలకు "అప్రచ్చన వత్తాసు". విదేశాలలో మంత్రాంగాలు. జిహాదీలకూ బంగారు భూమి గా మారింది భారత దేశం.* నిజాయితీగా , నిష్పక్షపాతంగా వార్తలు అందించవలసిన శ్రవణ (Radio), శ్రవణ దృశ్యమాన మాధ్యమాలు (Tv) మరియు దిన, వార, మాస పత్రికలు వాస్తవాలను ప్రసారం చేయడానికి మాత్రమే పరిమితం కాకుండా గ్రూప్ లు కట్టి అందులో *అధికంగా దేశ ప్రతిష్ట దిగజార్చే వార్తలకు* పనికట్టుకుని పెద్ద పీట వేస్తున్నాయి.


ఇదిలా ఉండగా కొన్ని పార్టీల రాజకీయ నాయకులు మరియు కొన్ని మతాల దుష్ట నాయకుల *అపవిత్ర కలయిక* తో కుతంత్రాల రచన జరిగి అల్లర్లకు పునాదులు పడి రైళ్లు, ఇతర వాహనాల మరియు ప్రభుత్వ మరియు దేశ వాసుల వ్యక్తిగత ఆస్తులకు కూడా నిప్పు బెట్టడం జరుగుతున్నది. ఇటువంటి అపవిత్ర కలయిక దేశపు ఉనికికే ప్రమాదం.

 *ఇది కల్పితం కాదు*. 

దేశ వాసులందరికి ఇది పాత సమాచారమే. తగులబెట్టినవన్నీ దేశ సంపద , ప్రజల శ్రమ ఫలితము, ప్రజలు కట్టిన పన్నులే (taxes ) అను స్పృహ జనాలకు ఎప్పుడు కలగాలి. *కొందరి దుష్టుల వలన యావత్ దేశం సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నది*. 


ప్రజాస్వామ్యమంటే ఇదేనా. ఇంత విచ్చలవిడితనం ఇతర దేశాలలో కనిపిస్తుందా. *దేశ మరియు ప్రజా రక్షణ వ్యవస్థను గూడా రాజాకీయ నాయకులు ప్రభావితం చేస్తున్నారు*. . ఇవన్నీ చూస్తూ ఉంటే *సెక్యులరిజం ఒక మిధ్య* లాగానో ఇంకా చెప్పాలంటే హిందూ మతం పై శ్రద్ధ కంటే ఇతర మతాలే అధికమా అను భావన కల్గుతున్నది. సనాతనమైన మన భారతీయ సంస్కృతి, చరిత్ర సమసిపోవలసిందేనా. *వీటన్నిటికీ మన బాధ్యత వుందా లేదా లేదా*. ఇవన్నీ గమనిస్తుంటే భారత దేశంలో హిందూ ధర్మ, సంస్కృతి, సంప్రదాయాల పునరుద్ధరణ ఐక్యత అవశ్యమని అనిపించుట తథ్యము. *కావున హిందు ధర్మ, సంస్కృతికి ఊపిరులాూదడానికి ప్రతి మనసా వాచా కర్మణా ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*.


ధన్యవాదములు

*(సశేషం)*.

కామెంట్‌లు లేవు: