మ.వరమై జాతికి మేలొసంగును సదా పల్గాకులన్ గాంచి దు
ర్భరమౌ వారల నీతి మార్చి సుమతిన్ వర్తింప విజ్ఞానులై,
పరపీడా రతి దుర్గుణాస్పద మసంభావ్యమ్ము నౌనంచు నం
దరి మేలుం గనునట్లు ధర్మ గతి నొందంజే యగా భారతీ!౹౹ 45
ఉ.ఏమని చెప్పినన్ జనులకేమగు? సత్యమటంచు నమ్మ నా
కే మరియాద దక్కునని యీల్గుచు నుందు రసత్య వాదనో
ద్దామముతో నమాయకుల దైన్యములన్ కనిపెట్టి దుర్మదుల్
తామొనరించు ద్రోహము నధర్మము నెన్నగ లేరు భారతీ!౹౹46
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి