*'భాగవతం వింటే బాగవుతాం'*
_శ్రీ పోతన భాగవత మధురిమలు_
(6-215-ఆ)
ఎల్ల తనువులందు నిరవొంది తనతోడఁ
బొందు చేసినట్టి పొందుకాని
పొందు పొందలేఁడు పురుషుండు గుణము నా
గుణినిఁ బోలు నట్టి గుణి భజింతు.
*భావము:-* సమస్త జీవుల దేహాలలో నివసిస్తున్నా జీవులు ఆ అంతర్యామిని గుర్తించడం లేదు. వారు తమలో తాము స్నేహం చేస్తున్నారే కాని పరమాత్మతో పొందు చేయడం లేదు. గుణాలలో చిక్కుకున్న జీవులు గుణాలకు అధీశ్వరుని దర్శింపలేకున్నారు. అటువంటి గుణవంతుడైన భగవంతుణ్ణి స్తుతిస్తున్నాను.
శ్రీ భక్త పురందరదాసు వారి కీర్తనతో *గణేశుని స్తుతిస్తూ*..... శుభోదయం.
*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*
ధర్మో రక్షతి రక్షితః
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి