*************శ్రీ ఆదిశంకర పరివార్ ************
శ్లో ll శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే! శివస్యహృదయంవిష్ణుః విష్ణోశ్చహృదయగ్ంశివః ll యధాశివమయోర్విష్ణురేవంవిష్ణుమయశ్శివఃl
యధాంతరంనపశ్యామితధామేసతవస్వస్తిరాయుషీll
అద్వైతం అంటే..సమస్త ప్రాణికోటి కీ అన్ని మతాల వారికీ...అవిరోధమైనదనీ.. ఆమోదయోగ్యమైనదనీ.. *ఆబ్రహ్మస్తంబపర్యంతం*బ్రహ్మ నుంచి గడ్డిపోచ వరకూ.. విశ్వమంతా బ్రహ్మ మేననీ.. అద్వైతం చెప్తుంది!
మంllయచ్చకించిజ్జగత్సర్వందృశ్యతేశ్రూయతే పివాlఅంతర్బహిశ్చతత్సర్వంవ్యాప్యనారాయణస్థితః!*ఈశావాz స్యమిదగ్ంసర్వం* "త్వయిమయి సర్వత్రైకో విష్ణుః" ఇత్యాది శృతి ఉపనిషత్ లు బోధించడం సర్వలోకవిదితమే కదా!
శ్రీ కృష్ణ పరమాత్మ యే శివ సహస్రనామ స్తోత్రం రచించారని.. నిత్యం శ్రీ కృష్ణ పరమాత్మ భస్మధారణ చేసి శివపూజ చేసేవారని మహాభారతం లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది!
*రుద్రాణాంశంకరశ్చాస్మి*ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశోzర్జునతిష్ఠతి*ఇత్యాది గీతాచార్యుల వాక్యాలు వినలేదా?!
*****ప్రస్తుతవిషయం*****
శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి... శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య స్వామి వారి పై .. ద్వేషం తో..అసూయతో.. శంకరసిద్ధాంతంపై చతురామ్నాయ పీఠాలు ఆయనస్థాపించలేదని.. పంచాయతన/షణ్మతస్థాపన.. ఆయనచేయలేదనీ/ చెప్పలేదనీ... శంకరులపై తనకున్న ద్వేషాన్ని ప్రకటించడం చూస్తున్నాం!
అసలు శంకరలు ఉద్భవించినదే... వైష్ణవ,శైవ, శాక్తేయ,గాణాపత్య, సౌర, ఇత్యాది పాషండుల బుద్ధి మాంద్యం నిరోధించుటకనీ.. .. అవైదికమైన మతాలను, కర్మలను.. జంతుబలులు మద్యమాంసాది నివేదపూర్వక క్షుద్ర తాంత్రిక దుష్ట ఉపాసనలని, నిర్మూలించి..
శుద్ధ వైదిక శ్రౌత,స్మార్త, కర్మలు, యజ్ఞ,తపో దానాది స్మృత్యుక్త ధర్మ కర్మలనుప్రతిపాదిస్తూ.. ప్రజలలో..భక్తి శ్రద్ధ ఉపాసనాది కర్మలననుష్ఠించాలని...
(అనేక దేవతాస్తోత్ర ప్రస్థానత్యభాష్య. ప్రకరణ గ్రంధాలు రచనాపూర్వక అద్వైత జ్ఞానం ప్రచారం చేయుట ఇత్యాది లోకకల్యాణములు)
తద్వారా జ్ఞాన సముపార్జన చేసి మోక్షం పొందాలని..జన్మసార్ధక్యం చేసుకోవాలని ప్రబోధించుటకొరకు శ్రీశంకరులు ఆవిర్భవించారని ఆస్తికులందరికీ తెలిసినదే!
ఇప్పుడు శ్రీ చిన్న జీయర్ స్వామి ఇవన్నీ విస్మరించి
శ్రీ శంకరాచార్య స్వామి వారి పై.. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడం అవి..వైరల్ కావడంతో.. అద్వైత అనుయాయులు ఆదిశంకర పరంపర..శిష్యకోటి తీవ్ర మనోవేదనకు గురయ్యారు! ఇది చాలా బాధాకరమైనవిషయం!
అధవా ఆయన ఏదైనా పొగిడి నా...ప్రకటించినా... హేళనగా... వ్యంగ్యంగా.ఉండడమేకాక... న్యూనతాభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది!
ఇలాంటివి ప్రచారం చేయడం వారిస్థాయికి తగునా?!ఇది వారి కి అగౌరవము కాదా?!.ఇలాచేయడం శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి కి పరిపాటే!అని
ప్రజలుభావించడంవారికిమర్యాద అంటారా?
ఇలాంటివి అనేకం ఆయన ప్రసంగాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి!ఆమధ్య శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో ముచ్చింతలలో శ్రీ రామానుజ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జగద్గురువు శ్రీ రామానుజ స్వామి వారేనంటూ...అవిరోధమైన అద్వైతులను నిశ్చేష్టులనుచేశారు!
(ఈ కలియుగంలోజగద్గురువు ఆదిశంకరాచార్య స్వామివారు అని సర్వలోక విదితమే!)
1000సం:ల క్రితమేజన్మించిన శ్రీరామానుజా చార్యులనుజగద్గురువుఅని...సమతావాదిఅని..
తమ ఆనందాన్ని ప్రకటిస్తూ..వారిలోని శంకర పక్షపాత బుద్ధిని ఆవిష్కరించారు!
శ్రీ శంకరులు *చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషామనీషామమ!*అని.. ద్వి సహస్రాబ్ది పూర్వమే..నాడే శ్రీ కాశీ క్షేత్రంలో..మనీషా పంచకం ద్వారా సమతా దృష్టి నెలకొల్పారు!ఇదితెలిరదేమో!
కృతయుగంలో వ్యాసులవారు,, త్రేతాయుగంలో వసిష్ఠులవారు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణపరబ్రహ్మ కలియుగంలో జగద్గురువు ఆదిశంకరాచార్య స్వామి వారు అన్న చరిత్ర సర్వజనవిదితమే కదా!
అయినా.. ఆయన బుద్ధిలో వక్రదృష్టియే సుస్థిరమని చాటుకున్నారు!గతంలో.. రామేశ్వరం లో..
శ్రీ రామలింగ ప్రతిష్ఠ శ్రీ సీతారాములు చేయలేదని శ్రీ రామ చంద్ర మూర్తి రామేశ్వరమే వెళ్ళలేదని తమ భేద దృష్టిని లోకానికి చాటి చెప్పారు!
ఇటీవల శివ స్వరూపం.. లింగం/ప్రతిమ ఏదైనా కూడా ఇళ్ళలో పెట్టరాదు!శివుడు శ్మశానవాసుడు ఇళ్ళలో ఉండరాదు! ఎవరైనా కోరికోరి శ్మశానంలో ఉండరు కదా!అని..శివభక్తులను మనోవేదనకు గురి చేశారు!
ఇంకా ..దుర్మణాలు.. ఆత్మ హత్య ఉరి, విషం తాగుట మశూచి కలరా క్షయ, కరోనా మరియు యాక్సిడెంట్లో దుర్మరణం పొందిన వారికి.. ఆశౌచంలోనే... నారాయణబలిచేయడం తమకుతెలియదా?ఇవి అశుభసమయంలోజరిగేవేకదా!
కర్మలో ఆబ్దికాది పితృ కార్యాలలో విష్ణు స్థానం కల్పించారు కదా!అది అశుభం అంటారా!?
నమో రుద్రా విష్ణవే మృత్యుర్మేపాహి..అని..
అగ్నావిష్ణూసజోషసేమావర్ధంతువాంగిరఃl
విష్ణు ర్యోనింకల్పయితు...విష్ణోఃపృష్ఠమసి..
ఇత్యాది మంత్రాలు వినలేదా?!శుభాzశుభాలనేవి
పురుషతంత్రం!మనో కల్పితం!
పరమాత్మ తత్త్వం వస్తుతంత్రమనీ..దానికి ఎలాంటి వివక్షలేదనీ.. అది నిర్గుణ నిరాకార నిరంజన నిర్వికార నిర్విశేష నిష్కల నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమనీ..అదే పరమాత్మయనీ... దానికి వేరైన..
తదితరములైన సగుణ సాకార కర్మ బ్రహ్మము.. మాయా ప్రకృతికి చేరినదనీ యరుగరా?! ఇవన్నీ గమనించాలని మామనవి!
ఇలాంటి శివ కేశవ భేదాన్ని కల్పించి.. సృష్టించి.. ప్రచారాలద్వారా ప్రజల్లో కొత్త అలజడి సృష్టిస్తున్నారు! శివ-కేశవ ద్వేషాన్ని రగుల్చుతున్నారు! దీనివలన వారుసాధించేదేమీ లేదు! *శివ* శబ్దం అంటే.. జ్ఞానం, మంగళం,భద్రం, ఐశ్వర్యం, శుభం, ఇత్యాది అర్ధములని సకలశాస్త్ర, పురాణాల నిర్వచనం! శివుడు లేని ప్రాణి ఉండదు! దేహంలో శివుడు లేకపోతే శవమే!ఇది సకలశాస్త్రాల సారము! ఇంతగా... ఇలాంటి... ప్రేలాపనల వలన అపవాదులు..పాషండులని..శివద్వేషులు..అనే పేరు మోయడం తప్ప సాధించేదిఏమీలేదు!
కావున ఈ..జగద్గురునింద శివ దూషణాదులు వెంటనే ఉపసంహరించుకోవాలి! ఈవిధంగా చేసిన ప్రసంగాలు వెనక్కి తీసుకోవాలని....
ఇకపై ఇలాంటి..శివ/శంకర దూషణ...భాషణలు.. చేయరాదని శ్రీ ఆదిశంకర అద్వైత పరివారము సవినయంగా కోరుతున్నది!లేనిచో.. ఆధ్యాత్మికంగా పాపము, భౌతికంగా భక్తజనఆగ్రహం ఎదుర్కొంటారని.... మా విజ్ఞప్తి! జయజయశంకర 🚩 హరహరశంకర 🚩 హరిః ఓం 🙏 నగురోరథికమ్ 🚩 💓
ఇలాంటి దుఃసంఘటనలని స్మార్త, అద్వైత అనుయాయులు.. సిద్ధాంతులు అందరూఖండించాలి!నిరసించాలి!
జయజయశంకర 🚩
శ్రీ జగద్గురు చరణ సేవకులు:సాగి వేంకటేశ్వర శాస్త్రి మాచర్ల పురోహిత (సర్వజనహిత) సోzహమ్ 🚩 శివోస్మి 🚩
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి