5, మార్చి 2026, గురువారం

శాశ్వత సుఖం పొందవచ్చు

 శ్రీరామ (102)


                             శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


దాహం వేసినప్పుడు మంచినీరు గాజు గ్లాస్ లో త్రాగవచ్చు, లోహపాత్రలోగాని, వెండిపాత్రలోగాని, బంగారు పాత్రలోగాని, నవరత్నఖచిత పాత్రలోగాని త్రాగవచ్చు.

" దాహము మొదలైన వ్యాధులకు చికిత్స చేసుకుంటూ,అది చికిత్స అని తెలుసుకోకుండా,

అజ్ఞానంవల్ల భోగాలు అనుభవిస్తున్నాను అనుకుంటాడు మానవుడు "

అంటున్నారు భర్తృహరి మహాయోగి.


శ్లో// తృషా శుష్యత్యాస్యే పిబతి సలిలం శీతమధురం/

క్షుథార్త శ్శాల్యన్నం కబళయతి మాంసాది కలితమ్/

ప్రదీప్తే కామాగ్నౌ సుదృఢతర మాలింగతి వధూమ్/

ప్రతీకారం వ్యాధే స్సుఖ మితి విపర్యస్యతి జనాః//


(దప్పికతో నోరు ఎండిపోతున్నప్పుడు చల్లని మంచినీరు త్రాగుతాము. 

ఆకలి బాధ తీర్చుకొనుటకు వ్యంజనములతో అన్నం తింటాము.

దేహంలో కామాగ్ని ప్రజ్వలించి నప్పుడు స్త్రీని గాఢంగా కౌగిలించుకుంటాము.

ఈవిధంగా క్షుత్పిపాసాది రూపంలో ఉన్న రోగములకు,పానీయ,ఆహార,స్త్రీసంభోగాదులతో చికిత్స చేసుకుంటూ,అజ్ఞానం వల్ల భోగములు అనుభవిస్తున్నాము అని అనుకుంటున్నారు జనులు)

భోగాలలో మునిగిపోకుండా, ఏకాగ్ర చిత్తంతో ఈ వ్యాధులకు కారణం తెలుసుకుంటే, ఆత్మజ్ఞానం లభించి మానవుడు శాశ్వత సుఖం పొందవచ్చు అని తెలియజేయటమే మహాయోగి ఆశయం.


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

5-3-'26.

కామెంట్‌లు లేవు: