*శ్రీమన్నారాయణీయము*
*89వ దశకము - వృకాసురవధ - భృగు పరీక్షణము - ఎనిమిదవ శ్లోకము*
*331. సుప్తం రమాంకభువి పంకజలోచనం త్వాం*
*విప్రే వినిఘ్నతి పదేన ముదోత్థితస్త్వమ్*
*సర్వం క్షమస్వ మునివర్య ! భవేత్ సదా మే*
*త్వత్పాదచిహ్నమిహ భూషణమిత్యవాదీః*
*భావము :*
*ప్రభూ ! ఒకప్పుడు సరస్వతీ నదీతీరమందున్న మహర్షులకు, త్రిమూర్తులయందు మిక్కిలి సాత్వికుడెవ్వడనే సందేహం కలిగింది. ఈ విషయము తెలుసుకోవటానికై వారు భృగుమహర్షిని నియోగించారు. అప్పుడతడు బ్రహ్మలోకానికి వెళ్లి ఆయన యెడ అనాదరం చూపగా, అతనిపై బ్రహ్మదేవునికి కోపము కలిగింది. దానికి అతడు ఏ విధంగానో ఓర్చుకున్నాడు. కైలాసానికి వెళ్లి శంకరునిపై చులకన భావంతో ప్రవర్తించగా, ఆయనకు కోపము కలిగి భృగు మహర్షిని చంపబోయాడు. అప్పుడు పార్వతీదేవి శంకరుని వారించింది. చివరికా మహర్షి నీ దగ్గరికి వచ్చాడు.*
*శ్రీపతీ ! ఆ సమయంలో, పద్మాలవంటి కన్నుల గల నీవు, రమాదేవి యొక్క ఒడిలో నిద్రిస్తున్నావు. అప్పుడు భృగుమహర్షి తన కాలితో నిన్ను తన్నాడు. నీవు నిద్ర నుండి లేచి, ఏమాత్రమూ కోపించక, "మునివర్యా ! నా తప్పులన్నింటినీ క్షమించు. నీ పాదచిహ్నం నాకెప్పుడూ ఆభరణంగా ఉంటుంద"ని మిక్కిలి ఆదరంతో, ప్రశాంతంగా పలికావు.*
🙏🙏🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి