16, జూన్ 2026, మంగళవారం

అంతర్వాహినిగా

 🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏


*🌼 సరస్వతి నదిని అంతర్వాహినిగా మారిపొమ్మని శపించింది ఎవరు*


🌼🌿🌼🌿🌼🌿🌼🌿


స్కంద పురాణం వైష్ణవ ఖండం వేంకటాచల మహత్యం లో సరస్వతి నది గురించి పేర్కొన్న అంశాలు ఈ పోస్ట్ కి ఆధారం.


ఒకసారి సరస్వతి దేవికి ఒక కోరిక కలిగింది. తాను కూడా ఒక నదిగా మారి మానవుల పాపాలను నాశనం చేసి వారిని ఉద్దరించాలి అలాగే తనకు గంగ కంటే గొప్ప పేరు ప్రఖ్యాతులు కలగాలని కోరిక కలగడం తో ఇదే విషయాన్ని బ్రహ్మ దేవుని తో చెప్పింది. సరస్వతి దేవి కోరిక విన్న బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి గంగ కంటే గొప్పపేరా అని నవ్వుకుని సరే నీవు నదిగా మారుతావులే అని చెప్పి నారములకు అధిపతి ఐన శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేయమని చెబుతాడు.


దాంతో సరస్వతిదేవి బదరిక్షేత్ర సమీపంలో 

దీక్ష తీసుకొని శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేయడం మొదలుపెడుతుంది.


బ్రహ్మ దేవుని నుంచి అనేకమంది ప్రజాపతులు ఉద్భవించారు. వారిలో పులస్త్య ప్రజాపతి ఒకరు. ఆయన తన వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే గొప్ప వారసుడు తన వంశం లో పుట్టాలి అనే కోరికతో బదరి క్షేత్రానికి వచ్చి తపస్సు చెయ్యాలని భావిస్తాడు.


అలాగే తపస్సు చేయడానికి ముందు ఆచమనం చెయ్యాలి కాబట్టి నీటికోసం వెతుకుతాడు. కానీ ఆయనకు ఎక్కడా నీళ్ళు దొరకవు.


చుట్టూ చూడగా ఒక చోట దీర్ఘ తపస్సులో లీనమైన 

సరస్వతి దేవి కనిపిస్తుంది. సరస్వతి దేవి ముందు ఒక కమండలం ఉండడం తో అమ్మవారి ముందుకు వెళ్ళి తనకు జలం ఇవ్వాలని అడుగుతాడు. కానీ తీవ్ర తపస్సులో ఉన్న అమ్మవారికి అతడి మాటలు వినపడవు. దాంతో అతడు పదే పదే అడిగిన అమ్మవారు వినిపించుకోక పోవడంతో ఆగ్రహించి నువ్వు నాకు కనీసం ఆచమన జలం కూడా ఇవ్వలేదు. మళ్ళీ నదిగా మారి మానవులను ఉద్దరించాలి అని తపస్సు చేస్తున్నావు.


నువ్వు కోరినట్టే నదిగా మారుతావు కానీ కొంత కాలం తరువాత అంతర్వాహినిగా మారిపోతావు అని శపిస్తాడు.


అతడి మాటలకు అమ్మవారి తపస్సు భగ్నమై అతడి శాపవాక్కు విని సరస్వతి దేవికి కూడా విపరీతమైన ఆగ్రహం వచ్చి. ఉత్తమ వారసుడు కలగాలని తపస్సు చేయడానికి వచ్చావు కదానీ వంశానికి కళంకం తెచ్చే లోక కంటకుడు పరస్త్రీ వ్యామోహం తో సర్వనాశనం అయ్యే వాడు నీ వంశం లో పుడతాడు అని శపిస్తుంది సరస్వతి దేవి.


దాంతో అమ్మ వారి పాదాల పై పడి క్షమించమని వేడుకుంటాడు. కరుణామూర్తి ఐన అమ్మవారు. నా శాపాన్ని ఉపసంహారం చెయ్యను. నేను చెప్పినట్టే ఒక దుర్మార్గుడు నీకు మనవడుగా పుడతాడు.

కానీ నివు కోరినట్లు ఉత్తముడు వంశానికి వన్నె తెచ్చే వాడు ధర్మపరాయణుడు భాగవతోత్తములలో శ్రేష్టుడు చిరంజీవి ఐన వాడు కూడానీ వంశం లో పుడతాడు అని ఆశీర్వాదించగ పులస్త్యుడు అమ్మవారికి నమస్కరించి వెళ్ళిపోతుండగా. అప్పుడు సరస్వతి దేవి నీ శాపాన్ని ఉపసంహరించు అనగా అతడు అమ్మా నాకు అంత శక్తి లేదు నన్ను మన్నించు అని చెప్పి వెళ్ళిపోతాడు.


సరస్వతి దేవి శాపం మూలంగా పులస్త్య ప్రజాపతి కుమారుడు అయిన విశ్రవసు బ్రహ్మ కు కైకసి కి 

లోక కంటకుడు ఐన రావణుడు మరియు వర ప్రభావంతో భాగవతోత్తముడు రామ భక్తుడు అయినా విభీషణుడు జన్మించారు.


కానీ సరస్వతి దేవి తిరిగి తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయి ఏం వరం కావాలో కోరుకో అనగా అప్పుడు సరస్వతి దేవి తన కోరికను చెప్పగా శ్రీ మహావిష్ణువు నీవు కోరినట్టే గొప్ప నదిగా మారి వేదాలలో అత్యంత శ్రేష్ఠమైన నదిగా కీర్తిపొందుతావు. స్వామి ఇచ్చిన వరము ప్రకారం ఋగ్వేదం లో సరస్వతి నదిని అత్యంత శ్రేష్ఠమైన నదిగా పేర్కొన్నారు. కానీ శాపం ప్రకారం ద్వాపరయుగాంతం లో అంతర్వాహిని గా మారి కలియుగ మానవులకు అందుబాటులో ఉండవు అని అంటాడు. దాంతో సరస్వతి దేవి స్వామిని ప్రార్థించి కలియుగ మానవుల పాపాలను నాశనం చేసి వారిని ఉద్ధరించే అవకాశం తనకు ఇమ్మని అడుగగా అప్పుడు స్వామి వెంకటాచలం లో స్వామీ పుష్కరిణీ లో తీర్థ రూపంలో ఉండమని చెప్పగా సరస్వతి దేవి తీర్థ రూపంలో తిరుమల లో స్వామి పుష్కరిణీ లో కొలువుదీరి ఉంది.మహాభారతం లో కూడా సరస్వతి నది గురించి అనేక చోట్ల ప్రస్తావించారు.


నోట్:- చాలా మంది సరస్వతి నదిని వ్యాసుడు శపించాడు అని అన్నారు. కానీ వ్యాసుడు శపించలేదు. ఆధి ఎవరో కల్పించిన విషయం ఆ మాటకు ఎలాంటి పురాణ ప్రమాణం లేదు.


ఓం శ్రీమాత్రే నమః 


🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏

కామెంట్‌లు లేవు: