20, సెప్టెంబర్ 2022, మంగళవారం

ధర్మాకృతి

 ధర్మాకృతి : మాతృమూర్తి 


తమ అక్కగారిని పరామర్శించడానికి వచ్చిన మహాలక్ష్మమ్మ గారు తన పుత్రునే సన్యాసిగా ముండన కాషాయదండ కమండలాదులతో కడసారిగా దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. చిదంబర అగ్నిప్రమాదం తరువాత గిణిని గుండెలకు హత్తుకొని తండ్రితో కూడా కుమారుని ఎక్కడికీ పంపనని పలికిన మాతృమూర్తి తన వెంటనే వచ్చిన కుమారుని శ్రీమఠానికి సమర్పించి తిరుగు ముఖం పట్టారు.


మహాలక్ష్మమ్మ గారికి గిణి అంటే ప్రత్యేక అభిమానం అని మనం ముందే చెప్పుకొన్నాము. చిన్నతనం నుంచీ ఆమె తma కుమారుని దగ్గర కూర్చోబెట్టుకొని అనేక పురాణ కథలు చెప్పేవారు. అనేక శ్లోకాలు నేర్పించేవారు. చిలుక పలుకుల గిణి అమ్మ చెప్పినవన్నీ ఇట్టే గ్రహించి తన రమ్యమైన కంఠంతో ఒప్పగించేవారు. అమ్మగారిది ధర్మశాస్త్రంలో గట్టి పాండిత్యమున్న నాగేశ్వర శాస్త్రి కుమార్తె అవడం వలన నిప్పులు కడిగే ఆచారము. స్వామివారి మడి మరి వారిదేనేమో. సుబ్రహ్మణ్య శాస్త్రిగారు హేజీబు కుమారుడు. ఆయనవి రాచపోకడలు. సంగీతాలు, స్నేహాలూనూ. 


గిణికి అప్పుడ్ పదమూడేండ్లు. ఎప్పుడూ కొంగు పట్టుకొని తిరుగుతూ నవ్వుతూ నవ్విస్తూ విసిగిస్తూ సంతోష పెడుతూ తననలరించే ఈ ముద్దుల తనయుడు ఈ పాలుగారే పసివాడు నిస్సంగునిగా, నిర్లిప్తునిగా జీవితాంతం సన్యాసిగా గడపబోతున్నాడా?” లొట్టలు క్రొంబొదుగులో జిలు ముట్టియగ్రుమ్ముదూడ నా చిత్తిని చేతబట్టుకొని సింహఘటాలి నెదుర్ప జూచెదో” అంటారు విశ్వనాథవారి దశరథుడు. అప్పటికి శ్రీరామునికి పదునారేండ్లు. బ్రహ్మర్షి విశ్వామిత్రుని తోడు ఉంది. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. మన గిణికి పట్టుమని పదమూడేండ్లు కూడా నిండలేదే! మళ్ళీ తన కుమారుని తాను కనులారా చూడలేదు. మాట్లాడలేదు. ఈ హఠాత్సంఘటనకు బిత్తరపోయారామె.


కామకోటి పీఠాచార్యుల వారికి, వారి పూర్వాశ్రమ బంధువులు, తండ్రితో సహా యావన్మందీ సామాన్య శిష్యగణంతో పాటు వచ్చి నమస్కారం చేసుకొంటారు. వారికి ప్రత్యేక మర్యాదలు ఏమీ ఉండదు. తల్లిగారు మాత్రం ఎదురుబడరు. పీఠాధిపతుల మర్యాదననుసరించి పరదేవతకు తప్పించి నమస్కరించే అవకాశం లేదు. అయితే తల్లి ఎదురుబడితే యతి అయినప్పటికీ నమస్కరించక పోతే ధర్మభంగం అవుతుంది. అందువల్లనే వారు తల్లిగారిని కలుసుకోరు. ఈ విషయం పరంపరగా శ్రీమఠంతో పరిచయమున్న మహాలక్ష్మమ్మ గారు ఎరుగుదురు. ఈ ఎరుక వారికి మరింత దిగులు కలుగజేసి ఉంటుంది.


తరువాత కాలంలో కూడా ఎవరైనా వారి ముందు శ్రీవారి ప్రస్తావన తెస్తే తల్లి తండ్రులిద్దరూ మౌనంలోకి జారిపోతుండేవారు. బహుశః తమ పుత్రుడు లోకోద్ధరణకై అవతరించిన దైవాంశ సంభూతుడని సరిపెట్టుకొన్నారేమో! పదమూడు సంవత్సరములుగా పెంచుకొన్న మమకారం, ప్రేమ ఆశలు సమూలంగా తెంపుకొని తన గారాలపట్టిని మనకై సమర్పించి వెనుదిరిగారు జగన్మాత. జీవన్ముక్తుని కన్న ఆ తల్లిదండ్రులు ధన్యులు. వారిపై తరాలు క్రింది పదితరాలు తరించాయి. స్వామివారి కాలంలో జీవించి వారిని దర్శించిన మనందరం తరించాము.


పట్టుబట్టి అమ్మతో శ్రీమఠానికి బయలుదేరిన గిణి శ్రీమఠానికి అధిపతులుగా ఒంటరిగా మిగిలిపోయారు. తరువాతి కాలంలో చాటుగా దర్శించాలనీ, పుత్రుని వాక్యములు వినాలనీ మహాలక్ష్మమ్మగారు రెండు మూడు పర్యాయములు ప్రయత్నించారట. అది తెలుసుకొనిన స్వామివారు అర్థాంతరంగా ఆ ఊరినుంచే మకాం ఎత్తేశారట. సన్యాసాశ్రమపు నిస్సంగత్వం క్షణికంగానైనా చెదిరిపోతుందేమోనన్న ఒక healthy fear. అయితే తమ 95ఏళ్ళ వయస్సులో వారి అమ్మగారి గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు స్వామివారి కన్నులలో ఆ పదమూడేళ్ళ మెరుపు, మురిపం ఉత్సాహం కన్పించాయి.


1932 జూన్ 14వ తేదీన శ్రీవారు బుగ్గ గ్రామంలో విద్వద్గోష్ఠిలో మునిగి ఉన్నారు. దూరంగా చేతిలో తంతితో మఠం మేనేజర్ నిలుచుని ఉండడం గ్రహించారు. కుంభకోణం నుంచేనా టెలిగ్రాం అని అడిగారు. ఔనని సమాధానం వచ్చింది. శ్రీవారు మౌనముద్రాంకితులయ్యారు. సభ నిశ్శబ్దంగా ఉంది. స్వామి మనస్సులో ఉవ్వెత్తున లేస్తున్న భావతరంగాలు కనులనుండి బయటకు దూకటానికి ప్రయత్నిస్తున్నట్లున్నాయి. మరుక్షణంలో తమాయించుకొన్నట్లు కన్పించారు. మాతృనిర్యాణం విన్న సన్యాసి ఏం చేయాలి అని పండితులను ధీరోదాత్తమైన కంఠధ్వనితో ప్రశ్నించారు. పండితులకు విషయం అర్థం అయింది. చింతాక్రాంతులయ్యారు. స్వామివారు నిదానంగా లేచి బయలుదేరారు. శిష్యులందరూ భగవన్నామ సంకీర్తనతో సామిని అనుసరించారు. స్వామి అక్కడకు రెండు మైళ్ళ దూరంలో నున్న జలపాతంలో స్నానం చేశారు. పండితులు, పామరులు, పరివారం యావత్ శిష్యగణమూ శ్రీవారి వెనుకనే స్నానం చేశారు. మఠపక్షాన భూరిదానాలు చేయబడినవి. పదవ రోజున పెద్ద ఎత్తున అన్నదానం చేయబడింది.


శ్రీవారు అవతారం చాలించేరోజు ఉదయాన అమ్మగారి జన్మ స్థలమైన ఇచ్చంగుడి వేదపాఠశాలలో పెట్టడానికి తీసుకొని వెళుతున్న మహాలక్ష్మమ్మగారి పటం శ్రీవారి ముందుంచబడింది. అప్పటికి శ్రీవారు చాలాకాలంగా మౌనంగా, సహజ సంవిన్మయీస్థితిలో ఉన్నారు. అయినా ఆ పటాన్ని చూసి, చేతితో ప్రేమగా స్పృశిస్తూ అమ్మ అంటూ గౌరవాదరాలతో అలా ఎంతోసేపు చూస్తూనే ఉన్నారట. ఆ రోజున స్మరించిన ఇంకో విషయం తనకు సన్యాస దీక్ష ఈయబడిన కలవై శ్రీవారు ఏ ఊరిలో ఉన్నా ప్రతిరోజూ సంధ్యావందనం అయిన వెంటనే కనులు మూసుకొని ఖచ్చితంగా ఒక గంట జపం చేసేవారు. ఇది శ్రీమఠంలో ‘ఒరుగంట జపం’గా ప్రసిద్ధి. ఆ ఒక గంట జపం అయిపోయిన తరువాత కలవై వైపుకు తిరిగి నమస్కారం చేసేవారు. అక్కడి గురు పరమ గురువుల అధిష్ఠానాల మధ్య అనేక రోజులు ఆవాసం చేశారు. కలవై అంటే కలయిక అనే అర్థం కూడా ఉన్నది. ఆ రోజు పదిగంటల సమయంలో అకస్మాత్తుగా కనులు తెరిగి కలవై వైపు నమస్కారం చేసి కలవై అన్నారట. అక్కడున్న పారిషదులు శీవారు కలవై వెళ్ళాలనుకుంటున్నారేమో అనుకున్నారు. ఈవిధంగా తమ అవతార విరమణ సమయంలో స్వామి తమ జన్మకారకులయిన తమ అమ్మగారిని, పునర్జన్మ కారకులయిన గురు పరమ గురువులను స్మరించుకొన్నారు. స్వామిని మనకు ప్రసాదించిన వారు మనందరకూ నిరంతరమూ స్మరణీయులు.


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

శబ్దార్థములరీతి

 శబ్దార్థములరీతి శంకరాంబికలిట్లు

అర్ధనారీశ్వరాకృతిని దాల్చి

మమ్మేల వచ్చిరి మమతానుబంధమ్ము

ముప్పరిగొన్నట్లు ముదముమీర

తల్లియైతానంత తనయుల పోషించు

జనకుడై తానంత సంస్క రించు

భువనాల భయమంత పోగట్టు కళలోన

నైపుణ్యమున్నట్టి నిపుణమతులు కాలకంఠుడతడు కాపాడు జగమెల్ల

కామాక్షి మాతయై కరుణజూచు

ఆ.వె.భక్త జనులకెపుడు ప్రాపుగా నుండగా

భయము వీడి మనము బ్రతుక వచ్చు

మాయ తెరను ద్రుంచ మనలోన కలరయ్య

వెదికి చూడ నీకు వేద్యమగును

(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

పృధ్వీలింగం( కాంచీపురం)🙏

 https://www.facebook.com/100043481421388/posts/pfbid02K3o6EiCJjy9k2UAhFcZGjUWw7A7LDT7BHgR4jKv5B6JBm3wsG7u7ma5QsaRh8cxSl/

🙏ఏకామ్రేశ్వరుడు-- 

పృధ్వీలింగం( కాంచీపురం)🙏


🙏🌹🙏🌹🙏🌹


పంచభూతలింగాలలోని "పృధ్వీలింగం"గా పరమేశ్వరుడు వెలిసిన క్షేత్రం కాంచీపురంలోని "ఏకామ్రేశ్వరుని" దేవాలయం. 


దక్షిణభారతదేశంలోని అతి పురాతనమయిన పట్టణాల లో "కంచి" ఒకటి.చెంగల్పట్టు నుండి అరక్కోణంకు  ఉన్న రైలుమార్గంమధ్యలో ఈ పట్టణం ఉంది. తిరుపతి నుంచి కంచి 110 కి.మీ దూరంలో ఉంది.

              శ్రీ చక్రస్వరూపిణి అయిన దేవిని ఉపాసించేందుకు కంచిలోని "శ్రీకామాక్షిదేవి" ఆలయం చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.దాదాపు వంద దేవాలయాలతో స్వర్ణనగరంలా విలసిల్లే కాంచీపురం వైష్ణవులకూ,శైవుల కూ ఆరాధ్య మైనది. బ్రహ్మ యజ్ణంచేసి "వరదరాజ" రూపంలో విష్ణువును వెలయింపజేసిన తపోభూమి ఇది.


ఇక్కడనే పార్వతిదేవి తన భర్త అయిన పరమేశ్వరుడు మామిడిచెట్టు రూపంలో వెలిసినట్లు భావించి సేవించిం దని ప్రతీతి. ఆచోటనే "ఏకామ్రేశ్వర దేవాలయం" ఉంది. ఇది కంచిలోని అన్ని ఆలయాలకన్నావిశాలమైనది,  ప్రాచీనమైనది.ఇక్కడ గొపురాలు,ప్రాకారాలు స్థంభాలు అన్నీ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. 

 

                       శివ రూపంలో వెలిసిన ఇక్కడి మామిడిచెట్టు 3500 సంవత్సరాల నాటిదని చెబుతారు. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం. ప్రస్తుతం ఈ మామిడివృక్షం యొక్క  కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో, దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు.


స్థలపురాణం.....

పార్వతిదేవి శివునికన్నులు మూయడం, అందువల్ల  జరిగిన పరిణామాలు వలన పార్వతిదేవి తపస్సుకు బయలుదేరడం , ముందుగా కాశిలో తపస్సు చేయడం, అక్కడనుంచి కంచివచ్చి మామిడి చెట్టుక్రింద సైకిత లింగంచేసి పూజలు చేస్తూ ఉండటం, పరమశివుడు  అమ్మవార్ని పరిక్షింపదలచడం, తత్ఫలితంగా శివుని జటాఝూటం నుండి గంగానది పోంగడం, పార్వతిదేవి ఇసుకతో చేసిన లింగం కోట్టుకునిపొకుండా ఆలింగనం చేస్కోవడం, శివుడు సంతొషించి అనుగ్రహించడం,  అమ్మవారు అక్కడనుంచి అరుణాచలం వెళ్లి అర్దనారీశ్వరులుగా ఏకమవడం అందరికీ తెలిసినదే కదా! అందువలన ప్రస్తావించలేదు.


        ఇక్కడి ఏకామ్రేశ్వరలింగం "పృధ్వీలింగం" కనుక ఇక్కడి మట్టికూడా చాలా గొప్పదంటారు. ఈ క్షేత్రంలో చేసిన మంచిపని ఏదయినావెంటనే  ఫలిస్తుందనీ,అది నానాటికీ పెరుగుతుందని కూడా అంటారు.


 కంచిలో ఉండటానికి వసతికి, భోజనానికి ఏ ఇబ్బంది ఉండదు. అన్నీ గుడికి అందుబాటులోనే ఉంటాయి.


🙏🌹🙏🌹🙏🙏

తెలుసుకోవసిన సత్యలు.

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸


_*జీవిత పయనంలో తెలుసుకోవసిన అక్షర సత్యలు.*_ 


1. అజ్ఞానం : - అంటే ఏమిటి ?


నన్ను నేను తెలియక విషయాదులయందు ప్రవర్తించుట, శరీరమును సుఖపెడితే వచ్చే ఆనందము సత్యమని, ఇంద్రియాలు, మనసు వీటివల్ల కలిగే సుఖదుఃఖ అనుభవాలే సత్యమని, ఇవి లేకపోతే నేను లేను అనుకొనుటే అజ్ఞానము.


2. జ్ఞానము :- అంటే ఏమిటి ?


నేను దేహమును తెలుసుకొను వాడను కాని నేను దేహమును కాను. నేను ఆత్మ స్వరూపుడను, నేను మనసును తెలుసుకొనువాడను కాని మనసు యొక్క అనుభవములు నావి కావు. నేను మనసును కాను. నేను ఆత్మస్వరూపుడను. నేను ప్రకాశరూపుడను. ప్రజ్ఞా స్వరూపుడను. ఈ ప్రజ్ఞయే పిపిలికాది బ్రహ్మపర్యంతము 'నేను' గా ప్రకాశింప బడుతున్నదని తెలుసుకొనటయే జ్ఞానము.


3. విజ్ఞానము :- అంటే ఏమిటి ?


ఇట్లు తెలిసిన జ్ఞానమును తనకు అన్వయించుకొని, తన స్వరూపమే జ్ఞానమని, తక్కినదంతయు అన్యముగా నిరశించి, జ్ఞానమే తానైన స్థితి విజ్ఞానము. 


4. సుజ్ఞానము :- అంటే ఏమిటి ?


పైన చెప్పిన అనుభవములకు కారణము ఎఱుక అనియు. (ఎఱుకన్నా, జ్ఞానమన్నా ఒక్కటే). ఈ ఎఱుకే జీవుడి అజ్ఞానమును, ఈశ్వరుడిగా జ్ఞానస్థితినీ, పరబ్రహ్మగా మౌనస్థితిని పొందుతున్నదనియూ, కాలప్రభావమున మరలా ఎఱుక సంకల్పించి, జీవేశ్వర జగత్తుగా మారవచ్చుననియూ, త్రిగుణముల యొక్క సామ్యావస్థే పరబ్రహ్మమనియు, త్రిగుణముల యొక్క వ్యవహారమే సృష్టి అనియూ, ఇది కాలచక్రముగా అనేక బ్రహ్మాండములను పరిపోషించుచున్నదనియూ ఎరిగి, త్రిగుణములను నిరశించి, ఎరిగే ఎఱుకను వీడి, ఎఱుకను నిరశించి బయలగుటే సుజ్ఞానము...

.

.

.

అర్థం పురుషార్థాల్లో ఉత్తమమైందని 

పంచతంత్ర వాక్యం. 


ధర్మమార్గంలో కలిగిన అర్థమే పురుషార్థంగా గ్రహింపదగింది. 


ఒక్కొక్క నీటిబొట్టు పడుతుంటే క్రమంగా కుండ నిండిపోతుంది. అలాగే ధనం కూడా క్షణం క్షణం కణకణం సాధించుకోవాలి. 


ఆత్రంగా నీటితో నింపబోతే కుండవిచ్చిపోవచ్చు. నీరు నేలపాలు కావచ్చు. ధనార్జన విషయంలో ఒక క్రమపద్ధతి అవలంబించాలని విజ్ఞులు చెబుతారు.


డబ్బుంటే చాలు కానిదేదీలేదన్న ఆలోచన నేడు చాలామందిలో ప్రబలంగా ఉంది. సంపాదనకు అధర్మమార్గం తొక్కడమూ సాధారణమైంది. ద్రవ్యం ధర్మార్జితం కావాలన్నారు పెద్దలు. అధర్మ మార్గాల్లో సంపాదించి విశేషంగా దానాలు చేస్తున్న ఎందరినో లోకం కొనియాడుతుంటుంది. వారు ఏ రకంగా ఆర్జించారన్నది పట్టించుకోదు. దానం చేసే ధనం న్యాయమార్గంలో సంపాదించినదై ఉండాలి.


ఒక ఊళ్లో పేద పండితుడు యాచకవృత్తిలో ఉంటూ ఓ ఇంటికి భోజనానికి వెళ్లాడు. ఉత్తమురాలైన ఇల్లాలు భోజనం పెట్టింది, చేతులు కడుక్కోవటానికి వెండి చెంబుతో నీళ్లిచ్చింది. పండితుడు ఇంటికి వచ్చేటప్పుడు గృహిణి ఇచ్చిన వస్తువులతో పాటు వెండిచెంబు కూడా సంచిలో చేరింది. ఆమె గమనించలేదు. ఇంటికి వచ్చాక సంచి తెరిచి చూసి అతడు ఖిన్నుడయ్యాడు. తనవల్ల ఎప్పుడూ ఇలాంటి తప్పు జరగలేదు. ఎంత ఆలోచించినా అలాంటి దుర్బుద్ధి ఎలా కలిగిందో అర్థంకాలేదు. తానెలా వెండిచెంబు సంగ్రహించాడో తెలియలేదు. ఆతిథ్యం ఇచ్చిన ఇంటికి వెళ్ళి, సిగ్గుపడుతూ- తన అపరాధం మన్నించమని వేడుకున్నాడు. వెళ్లిపోతూ 'తల్లీ... నీ భర్త ఏం చేస్తుంటారు' అని అడిగాడు. ఆ గృహిణి దుఃఖిస్తూ. తన భర్త దారి దోపిడులు చేసి సంపాదిస్తున్నాడని ఇదంతా పాపమని చెప్పినా వినడం లేదని, ఆ పాపం పోవడంకోసం తాను దాన ధర్మాలవంటి సత్కార్యాలు చేస్తున్నానని పలికింది. అప్పుడా పండితుడు- అన్యాయార్జితమైన విత్తంతో చేసిన దానధర్మాలుగాని, అన్నప్రసాదనంగాని స్వీకరించరాదని శాస్త్రాలు చెబుతున్నవనే విషయం గుర్తుకు తెచ్చుకున్నాడు. సంపాదించిన ధనం అన్యాయార్జితమైతే సత్ఫలితాలను ఇవ్వదు సరికదా, తప్పుడు ఆలోచనలు కలిగిస్తుంది.


తాను సంపాదించిన సొమ్ము ఉత్తమమైంది. తండ్రినుంచి సంక్రమించిన సొమ్ము మధ్యమం. సోదరుడినుంచి వచ్చినది అధమం. ఇక, స్త్రీవల్ల పొందినది అధమాధమమని శాస్త్రవచనం. విజ్ఞులు పరుల సొమ్ముకు ఆశపడకూడదు.


సంపాదించేటప్పుడు మేరు పర్వతమంత సంపాదించాలి. దానం చేసేటప్పుడు ఆ ధనాన్ని గడ్డిపరకగా చూడాలని పెద్దలు చెబుతారు. ధనానికి దానం, భోగం, నాశనం అనే మూడు గతులు ఉన్నాయి. తాను అనుభవించక, ఒకరికి పెట్టక పోగుపెట్టే ధనానికి నాశనం తప్పదు. ధర్మం, అగ్ని, రాజు, దొంగ- ఈ నలుగురూ ధనానికి దాయాదులు. వీరిలో జ్యేష్ఠుని అంటే ధర్మాన్ని అవమానిస్తే మిగిలిన ముగ్గురూ కోపిస్తారు. అంటే- ధర్మంలేనివాడి ధనం అగ్నిపాలో, రాజుపాలో, దొంగలపాలో అవుతుందని భావం...

.

మనిషి జీవిస్తున్నాడు 

కానీ జీవించడం తెలియదు


మనిషి పని చేస్తున్నాడు కానీ 

ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అని తెలియదు


అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి తన గురువుగా స్వీకరించి తన తక్షణ కర్తవ్యమేమిటో తెలుపమని వేడుకున్నాడు.


కార్పణ్యదోషో పహతస్వభావః

పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః 

యచ్ర్ఛేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే

శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నమ్‌


‘‘నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియడం లేదు. ఆందోళన, పిరికితనం నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుణ్ణి, నీకు శరణాగతుణ్ణి. నాకు నిజంగా ఏది శ్రేయస్కరమో దాన్ని ఉపదేశించు’’ అని ప్రార్థించాడు. 


జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలంటే, ప్రామాణిక పరంపరకు చెందిన ఆచార్యుణ్ణి ప్రతి ఒక్కరూ తమ ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించవలసిన ఆవశ్యకతను పై సందర్భం సూచిస్తుంది. అటువంటి ఆచార్యుడు కచ్చితంగా విశుద్ధ కృష్ణ భక్తుడై ఉండాలి.


భగవద్గీత విన్న అర్జునుడు దృఢ నిశ్చయుడై, మనస్సులో ఉప్పొంగిన ఉత్సాహంతో... ధనుస్సు చేతపట్టి నిలచి, వీరోచితంగా పోరాడాడు. విజయాన్ని సాధించాడు. 


అర్జునుణ్ణి తన కర్తవ్యం వైపు నడిపించేలా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినదేమిటి? 


భగవద్గీతలో శ్రీకృష్ణుడు అస్త్ర శస్త్రాల గురించి గానీ, యుద్ధ నైపుణ్యాల గురించి గానీ ప్రస్తావించలేదు. మన నైపుణ్యాలు, నేర్పరితనం లాంటివేవీ... మన జీవితంలో ఎదురయ్యే ఆత్రుత, ఆవేదనల నుంచి మనల్ని కచ్చితంగా రక్షించగలవని చెప్పలేమనడానికి ఇదే నిదర్శనం. అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించింది... జీవిత సత్యాల గురించి. తద్వారా, ఉన్నత జీవన విధానాల పట్ల అర్జునునికి ఉన్న అపోహలను కృష్ణుడు మార్చేశాడు.


ఈ దేహం మనం కాదు, మనమంతా ఆత్మ స్వరూపులం అంటూ మానవ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో జీవుని నిజమైన స్వరూపాన్ని గురించి వివరించాడు. సమస్త జీవులు ఆధ్యాత్మిక స్వరూపాలని, అయితే ప్రస్తుతం ఈ భౌతిక దేహంలో బంధితులై జీవిస్తున్నారన్న సత్యాన్ని బోధించాడు. 

.

పకృతి జీవజాతితో సమానంగా 

మానవజాతి మనగడ సాగిస్తుంది 


అయితే మానవులు 

కట్టుబాట్లు పెట్టుకున్నారు పేరుకు మాత్రమే 


కానీ 


అన్ని జీవుల మాదిరిగానే మానవుడు బ్రతకాలని కోరుకుంటున్నారు 


మనిషి కట్టుబాట్లలో ఉన్న 

మనసు మాత్రం పకృతి పరంగానే సంచరిస్తుంది


మానవ జాతిలో 

ఎవరిని నమ్మకూడదు 

ఎవరిని ప్రేమించకూడదు 

ఎవరిపై నమ్మకాలు పెట్టుకోకూడదు ఎక్కువ

ఎందుకంటే అందరూ మోసం చేసేవారు అందరూ వదిలి వెళ్ళిపోయేవారు

.

కన్నతల్లి అయినా ఎవరైనా మోసం చేయవచ్చు 

కన్న తండ్రి అయిన ఎవరైనా మోసం చేయవచ్చు 

అన్నదమ్ములైన మోసం చేయవచ్చు

అక్క చెల్లెలు అయినా మోసం చేయవచ్చు

భార్య కూడా మోసం చేయవచ్చు

భర్త కూడా మోసం చేయవచ్చు

బిడ్డలు కూడా మోసం చేయవచ్చు

కొడుకులు కూడా మోసం చేయవచ్చు

.

అందరు మోసం చేస్తారు ఏదో ఒకనాడు తప్పకుండా

అందరు మోసపోతారు ఏదో ఒకనాడు తప్పకుండా


అందుకే ఎవరి మీద ఎక్కువ అంచనాలు వేయకూడదు

ఎక్కువ ప్రేమ పెట్టుకోకూడదు

ఎవరిపై ఎక్కువ నమ్మకాలు పెట్టుకోకూడదు

ఎవరిని కంట్రోల్ లో పెట్టాలని చూడకూడదు


అందరూ ఇలా ఉంటే బాగుండు అని అనుకోకూడదు

ఎవరు మీరు అనుకున్నట్లు ఉండరు ఉండరు ఉండరు ఉండలేరు ఇది రాసి పెట్టుకోండి.


సర్వేజనాసుఖినోభవంతు.


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

కృష్ణుడి గురించి చెప్తుంటే

 #Karthikeya2 సినిమా అద్భుతమే కాదు నాకైతే మహా అద్భుతమే అని చెప్పొచ్చు👌👌👌🚩


మన చరిత్రని స్పృశిస్తూ ఎన్నో అద్భుతమైన కథలు చెప్పొచ్చు అని మొత్తుకుంటూనే ఉన్నాం ఎప్పటినుంచో... ఇప్పటికి కుదిరింది ఏదో డైరెక్టర్ #Chandumondeti గారి పుణ్యమా అని... ఆ దిక్కుమాలిన ప్రేమకథలు, వెంటపడడం, ఆమె/అతడు లేకపోతే జీవితమే వ్యర్థం అన్నట్టు దిక్కుమాలిన కథలు చూపించి యువతను పెడదోవ పట్టించే సినిమాలే అన్నీ.


మ్యూజిక్ డైరెక్టర్ #kaalabhairava భలే చేశారు సంగీతం. ఆద్యంతం అద్భుతమైన సంగీత ప్రవాహంలా సాగింది. 


#AnupamKher కనిపించే 10 నిమిషాలు, కృష్ణుడి గురించి చెప్తుంటే భక్తితో, భావోద్వేగంతో మనసు కదిలిపోతుంది ఒక్కసారిగా....అసలు కృష్ణుడు దేవుడు అనే భక్తితో కన్నా ఒక గురువుగా స్వీకరిస్తే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను దాటి అద్భుతాలు చూడొచ్చు అనే అనుపమ్ ఖేర్ గారి సందేశం సినిమాకి హైలెట్.


🚩గీతతో కోట్లమందికి దారిచూపించిన అతనికన్నా గురువెవ్వరు❓


🚩రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవ్వరు❓


🚩నమ్మినవారి కోసం ఎంతటి వలయాన్నైనా ఛేదించే అతనికన్నా గొప్ప నమ్మకస్తుడు ఎవరు❓


🚩యుద్ధం చేస్తే ఇన్ని లక్షల మంది తెగటారిపోతారు, ఇన్ని లక్షల లీటర్ల రక్తం ఏరులై పారుతుంది, యుద్ధం వద్దు సంధి ముద్దు అని చెప్పి ఒప్పించాలని శతకోటి ప్రయత్నాలు చేసిన అతనికన్నా ముందుచూపున్న గొప్ప శాంతిదూత ఎవరు❓


🚩చూపుతోనే మనసులోని మాటచెప్పే అతనికన్నా గొప్ప సైకాలజీస్ట్ ఎవరు❓


🚩వేణుగానంతోనే గోవుల్ని, గోపికల్ని కట్టిపడేసే అతనికన్నా గొప్ప మ్యూజిషియన్ ఎవరు❓


🚩నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు❓


🚩ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు❓


🚩 నమ్ముకున్న వాళ్ళ వెంట ఉండి విజయమో వీర స్వర్గమో కర్త్యవం ముఖ్యం ఫలితం దైవాధీనం అని చెప్పి నడిపించిన అతనికన్నా గొప్ప దార్శనికుడు ఎవరు❓


🚩కరువూ కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజేవ్వరు❓


🚩హోమ యాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న అతన్ని మించిన డైమటాలజిస్ట్ ఎవరు❓


🚩అన్ కంట్రోలబుల్ ఆర్.పి.యం.తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతన్ని మించిన డైనటిక్ ఇంజనీర్ ఎవరు❓


🚩మరణం ఎప్పటికైనా తథ్యం అని గీత ద్వారా చెప్పి నడిపించే అతనికన్నా గొప్ప వీరాగి ఎవరు❓


🚩అతనొక ఫైటర్, సింగర్, టీచర్, వారియర్, మ్యూజిషియన్, మేజిషియన్, దార్శనికుడు అనంతంలో నిండియున్న సృష్టి🚩


కృష్ణుడు అంటే సత్యం, ఆనందం, పరబ్రహ్మ స్వరూపం. అన్ని దైవ స్వరూపాలు ఆత్మ తత్వాన్ని బోధించేవే.


చిన్న అంశంతో ముడిపెట్టి కథని మలిచిన తీరు అద్భుతం. #ChandooMondeti గారిని అభినందించాలి. మన ఋషులు అత్యంత శక్తివంతమైన దార్శనికులు.


ఇలాంటివి మరిన్ని రావాలనే సమయం తీసుకుని ఇలా రాస్తున్నాను. ప్రోత్సహిస్తేనే మంచి కథలు వస్తాయి, తద్వారా కొంతైనా చెడు ప్రభావం తగ్గుతుంది అని ఏదో ఆశ


#జయహోసనాతనధర్మం🚩

19, సెప్టెంబర్ 2022, సోమవారం

అమ్మవారిని ఆరాధించే ఐదు పద్ధతులు

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*అమ్మవారిని ఆరాధించే ఐదు పద్ధతులు ఏమిటి.....!!???* 🙏🏻

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


🔱🔱🔱🔱🔱🔱🔱🔱


  🥀మొదటిది విగ్రహారాధన. అమ్మవారి యొక్క విగ్రహమునో లేక చిత్రపటమునో పూజగదిలో పెట్టుకుని పూజిస్తాము.  స్త్రీ సాక్షాత్తూ అమ్మవారి యొక్క అంశ స్వరూపమే కాబట్టి, నవ రాత్రులయందు లేక పుణ్య దినములయందు, కుమారీ పూజనో లేక కౌమారీ పూజనో చేస్తాం.ఇదంతా బాహ్య పూజ.


  🥀రెండో  విధములో, అమ్మవారి యొక్క రూపమును లేక పాదములను మనసులో  నిలిపి పూజిస్తాము. దీనినే మానసిక పూజా లేక అంతర్ముఖ పూజ అని కూడా అంటారు.


  🥀మూడవ విధానములో, కుండలినీ రూపముగా అమ్మవారిని  ఆరాధించటం


కుండలిని రూప ఆరాధనకు వచ్చేసరికి, బాహ్య మరియు అంతర అనే రెండు విధానములకు అవకాశమే లేదు. కుండలిని అంతా అంతర్ముఖమే.


🥀నాలుగవ విధానం శ్రీచక్ర ఆరాధన. ఈ విధానములో మనము  శ్రీ చక్రమును ఒక యంత్ర రూపముగా కానీ, లేక ఒక ప్రతిమ రూపముగా కానీ, సంపాదించి    పూజిస్తాము. కానీ ఇది కూడా,  బాహ్య పూజాయే.


🥀ఇక ఐదవ విధానములో,  మనం పద్మాసనంలో కూర్చుని ఉంటే మన శరీరమే శ్రీచక్రము అని అర్థం చేసుకోగలుగుతాము మరియు మన ఉపాదిలో అనగా శరీరంలో కొలువై ఉన్న,  మహాశక్తి అయినటువంటి శ్రీ కనకదుర్గా మాతను,  దహరాకాశములో అనగా మన హృదయ స్థానములో,  లేక చిత్తాకాశములో  అనగా బృగు మధ్య స్థానములో ( అజ్ఞాచక్రములో),  లేక చిదాకాశములో, నిలిపి పూజించగలుగుతాము.


శంకరులు, "సౌందర్యలహరి" లోని పదకొండవ శ్లోకాన్ని, శ్రీచక్ర స్వరూపాన్ని గూర్చి వర్ణిస్తూ, ఇలా రచించారు,


" *చతుర్బిః శ్రీకంఠైః - శివయువతిభిః  పంచభిరపి* 

 *ప్రభిన్నాభిః శంభో - ర్నవభి రపి మూలప్రకృతిభిః* 

 *త్రయశ్చత్వారింశ* - *ద్వసుదళకళాశ్రత్రివలయ* 

 *త్రిరేఖాభిః సార్దం - తవ శరణకోణాః పరిణతాః"* 


అనగా,అమ్మవారు కొలువై ఉండే శ్రీచక్రము,నాలుగు శివ కోణములు మరియు ఐదు శక్తి కోణములు కలిగి, సృష్టికి మూల కారణమైన తొమ్మిది మూల ప్రకృతులతోనూ,అష్టదళపద్మమూ,షోడశదళ

పద్మమూ, మేఖలా త్రయము, రేఖా త్రయము, అనే భూపురత్రయముతోనూ కలిసి, నలభై నాలుగు అంచులు కలిగి ఉంటుంది.


భైరవ యామళము అనే గ్రంథంలో శ్రీ చక్రం గురించి ఇలా ఉంది...


శివాశివుల (అనగా పార్వతీ పరమేశ్వరుల) యొక్క శరీరమే శ్రీచక్రము.


శ్రీ చక్రములోని,   త్రికోణము, అష్టకోణములు, దశకోణములు రెండూ, చతుర్దశారము అనే ణదు శక్తి చక్రములు.


బిందువూ, అష్టదళ పద్మమూ, షోడశదళ పద్మమూ, చతుర్దశ దళ పద్మమూ, అనబడే నాలుగూ, శివ సంబంధమైన చక్రములు.


శివశక్తి చక్రముల కలయికే శ్రీచక్రము.


త్రికోణము అనే శక్తి చక్రంలో బిందువు అనే శివ చక్రము కలిసి ఉంటుంది. అలాగే అష్టకోణము అనే శక్తి చక్రములో,  అష్టదళ పద్మము అనే శివ చక్రము కలిసి ఉంటుంది. శక్తి చక్రములైన దశకోణములు రెండింటిలోనూ,  షోడశదళపద్మము కలిసి ఉంటుంది. చతుర్దశారము అనే శక్తి చక్రంలో, భూపురము చేరి ఉంటుంది. అలా, శ్రీచక్రము నవచక్రాత్మకము.


 *శ్రీచక్రము యొక్క కోణములు ఎన్ని .....* 


"త్రయశ్చత్వారించత్" అంటే నలుబది మూడు కోణములు అన్నది శాస్త్రము.  


అవి ఏమిటి అంటే..!?, 


1)  శక్తి చక్రములలోని "త్రికోణానికి" ఉన్న 

       ఊర్ధ్వకోణము  = 1


2)  శక్తి చక్రములలోని "అష్టకోణానికి" ఉన్న 

      కోణములు = 8


3)  శక్తి చక్రములలోని రెండు దశకోణముల లోపలా        మరియు బయట ఉన్న కోణములు= 20


4) శక్తి చక్రములలోని  చతుర్దశార కోణములు = 14 


వెరసి నలుబది మూడు (43)  కోణములు.


"నవభి రపి మూలప్రకృతిభిః"  శ్రీ చక్రమునకు కారణమైన 9 కోణములే,  ప్రపంచమునకు కారణమైన 9 యోనులు. ఈ నవ యోనులే పిండాండ కారణమైనటువంటి 9 ధాతువులు.


 "కామికా తంత్రము" అనే గ్రంథము, ఈ తొమ్మిది ధాతువులనూ  విశ్లేషిస్తుంది.


చర్మము రక్తము మాంసము మెదడు మరియు ఎముకలు అనే "అయిదు ధాతువులు" శక్తి  సంబంధమైనవి.


మజ్జ అనగా ఎముకలలోని గుజ్జు,  శుక్లము అనగా వీర్యము,  ప్రాణము మరియు జీవము "శివ మూలకములు".


నవ ధాతుమయమే మానవ శరీరం.


శ్రీ చక్రములోని మధ్య బిందువే దశమయోని. ఆదిపరాశక్తి అయినటువంటి శ్రీ కనకదుర్గా మాత.


 శ్రీ చక్రము మరియు శ్రీచక్రార్చన రెండు విధములు. 1)  సమయాచారము మరియు 2) కౌలాచారము.


మనది సమయాచారము. మనం పూజించే శ్రీచక్రములో, పైకి శీర్షములు కలిగిన త్రిభుజములు నాలుగు , క్రిందికి శీర్షములు కలిగిన త్రిభుజములు ఐదు ఉంటాయి.


కౌలాచారములో పూజింపబడే శ్రీచక్రములో

పైకి శీర్షములు కలిగిన త్రిభుజములు ఐదు, క్రిందికి శీర్షములు కలిగిన త్రిభుజములు నాలుగు ఉంటాయి


శ్రీ చక్రమును అర్థము చేసుకోవటమే మహాభాగ్యము.

               

🙏🏻 *శ్రీ మాత్రే నమః* 🙏

*బ్రహ్మా ముహూర్తం

 *బ్రహ్మా ముహూర్తం* అంటే ఏంటి ? బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలా ?


బ్రహ్మా ముహూర్తం..!! ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.. దీనికి సరైన అర్థం, పరమార్థం మాత్రం చాలామందికి తెలియదు. బ్రహ్మా ముహూర్తం తెల్లవారుజామున అని తెలుసు కానీ.. కరెక్ట్ సమయం మాత్రం చాలామందికి తెలియదు.అసలు *బ్రహ్మా ముహూర్తం* అంటే ఏంటి ? బ్రహ్మాముహూర్తంలో నిద్రలేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారు ? బ్రహ్మా ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత ? బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు నిద్రలేవాలి ? ఇలాంటి అనుమానాలన్నింటికీ.. పరిష్కారం దొరికింది. తెలుసుకోవాలని ఉందా.. అయితే.. ఈ ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోండి.

   

*బ్రాహ్మా ముహూర్తం*

సుర్యోదయానికి 48 నిమిషాల ముందు సమయాన్ని బ్రాహ్మా ముహూర్తం అంటారు.

   

*ఆఖరి నిమిషాలు*

రాత్రిభాగంలోని ఆఖరి 48 నిమిషాలను.. సూర్యోదయానికి ముందు 48 నిమిషాలను బ్రహ్మా ముహూర్తం అంటారు.

   

*పూజలు*

బ్రహ్మా ముహూర్తం పూజలు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా చెబుతారు.

   

*విద్యార్థులకు*

విద్యార్థులు బ్రాహ్మా ముహూర్తం లో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని నమ్ముతారు.

   

*జీవక్రియలు*

మన శరీరంలో జీవ గడియారం ఉంటుంది. దీన్ని అనుసరించే మన జీవక్రియలన్నీ జరుగుతాయి. అలాగే ఉదయం మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు బ్రహ్మా ముహూర్తంలో చదువుకుంటే చక్కగా గుర్తుంటుందట.

   

*ఒత్తిడి*

అలాగే ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మరిచిపోతాం కాబట్టి మెదడు ఉత్తేజంతో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దంగా ఉంటాయి. ఈ అన్ని కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది.

   

*పెద్దవాళ్లు ఎందుకు లేవాలి* ?

ఆయుర్వేదం ప్రకారం రాత్రి తోందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు రావు.


*ఫ్రెష్ ఆక్సిజన్*

రాత్రంతా చెట్లు వదిలిన ఆక్సిజన్ వేకువ జామున కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణం లో మనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్ కు వెళ్లేవారికి ఇది చాలా ఉపయెాగ పడుతుంది.


*గృహిణులు ఎందుకు లేవాల*ి.?

గృహిణులకు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు , పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారి సంరక్షణ , వంట పనులు,ఇంటి పనులతో క్షణం తీరిక లేకూండా గడుపుతారు. అలాంటి వారికి ఒత్తిడి లేని మానసిక ,శారీరక ఆరోగ్యం చాలా అవసరం.


*ఆందోళన* 

బ్రహ్మా ముహూర్తంలో లేవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.ఉదయాన్నే నిద్రలేస్తే...ఇంటిపనులన్ని... ఆందోళన లేకుండా అయిపోతాయి....


*సూర్యోదయము* 

ప్రతిరోజూ సూర్యోదయము చూసే అలవాటు ఉన్నవారికి గుండె,మెదడు,ప్రశాంతంగా ఆరోగ్యంగ ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి....


*ఆరోగ్యము* 

బ్రహ్మా ముహూర్తంలో నిద్రలేవడం వల్ల సూర్యుని లేలేత కిరణాలు మన పైన ప్రసరిస్తాయి సూర్యరశ్మి లో ఉండే విటమిన్ డి ఎముకల బలానికి సహయపడుతుంది.....



మీ......✍🏻........!!!!


*దయచేసి షేర్ చేయండి అందరికి తేలియజేయండ*ి

యజ్ఞోపవీతం_బరువు

 యజ్ఞోపవీతం_బరువు

ఒకరోజు కవిత్వం అంటే ఆసక్తి లేని ఒక రాజు వద్దకు బాగా బక్కచిక్కిన ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి తాను రచించిన ఒక కృతిని ఆయన ముందుంచుతాడు. కవిత్వమన్నా, బ్రాహ్మణులన్నా చులకన భావం కల ఆరాజు, హేళనగా "నీకిప్పుడు ఈ పుస్తకమెత్తో, నీయెత్తోధన మివ్వాలా" అంటాడు.

దానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు "అంత అవసరం లేదు మహారాజా, ఈ ఉదయం నేను యజ్ఞోపవీతం మార్చుకున్నాను, నావద్ద తీసివేసిన 'జీర్ణయజ్ఞోపవీతం' ఉన్నది దానెత్తు ఇచ్చిన చాలునంటాడు.

వీడో పిచ్చాడనుకుని ఆరాజు, కోశాధికారితో వీనికోరెండు కాసులిచ్చి పంపమంటాడు.

దానికా బ్రాహ్మణుడు, తనకు ఆ యజ్ఞోపవీతమెత్తే కావాలని పట్టబడతాడు.

దానికా రాజు 'సరదాగా ఆ వేడుక చూద్దామనుకుని, త్రాసు తెప్పించి తూచి ఇమ్మని ఆజ్ఞాపిస్తాడు'.

కానీ, వింత ! ఎంత ధనం వేసినా, ఆ రాజ్యంలో సమస్త సంపదలు కూడా దానికి సరతూగలేదు.

దానికి కారణం, ఆ బ్రాహ్మణుని గాయత్రి మంత్ర అనుష్ఠానబలం. 

దానితో ఆ రాజుకు కనువిప్పు కలిగి, ఆ బక్క బ్రాహ్మణుని శక్తి తెలియవచ్చి, పాదాక్రాంతుడవుతాడు.

జై గాయత్రీమాత

(ఒక మహాత్ముడు పంపిన కధ)🙏🏻🙏🏻🙏🏻

స్నేహ బంధం

 స్నేహ బంధం 

ప్రకృతిలో తియ్యనిది స్నేహం అని అంటారు.  మనకు స్నేహితులు అనేకరకాలుగా తారస పడతారు. కొందరు మన చుట్టుప్రక్కల ఉండటం వలన స్నేహితులుగా వుంటారు. కొందరు మనం చదువుకునే పాఠశాలలోనో లేక కళాశాలలోనో మనతో చదువుకోవటం వలన స్నేహితులుగా అవుతారు.  ఇంకా కొంతమంది మన ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలలో మనతో వుండి పరిచయం ఏర్పడి మిత్రులుగా అవుతారు. స్నేహితులు ఏరకంగా వున్నా కూడా ఒక స్నేహితునికి ఇంకొక స్నేహితుడు సహాయ సహకారాలు అందించుకోవటం చాలా  మంచిది. కొంతమంది వ్యసనపరులకు వారి వ్యసనాల ద్వారా కూడా స్నేహితులు ఏర్పడవచ్చు. 

గతంలో మంచి మార్గంలో నడవనివారు కూడా ఒక మంచి స్నేహితుని సాన్నిధ్యంలో మంచివారుగా మారవచ్చు కూడా. అందుకేనేమో "సావాసదోషే గుణీభవన్తు" అని అంటారు. సావాసం వలన మంచి గుణాలు అలవడితే అంతకంటే సంతోషించవలసింది  లేదు. కానీ కొన్ని సందర్భాలలో చెడుగుణాలు కూడా స్నేహ ప్రభావంతో కలుగవచ్చు.  ఉదాహరణకు నీవు మంచివాడివే కానీ నీకు ఒక వ్యక్తి నీవల్ల ఏదో ఆశించి అంటే నీ ఉద్యోగాన్ని ఆసరాగా తీసుకోనో, లేక నీ వృత్తిని, వ్యాపారాన్ని ఆసరాగా తీసుకొని తాను లబ్ది పొందాలని కుతంత్రించి నీకు ఆప్త స్నేహితుడిగా నీతో స్నేహం చేసి నీకు దుర్వాసనలు అలవాటు చేయవచ్చు కూడా నీవు అతను చుపించిన కపటపు ప్రేమను నిజమని నమ్మి అతని మాయకు బలికావచ్చు కూడా ఇలా దొంగ స్నేహితుల మోసాలకు బలైన వారు ఎందరో.  చివరకు కానీ తెలియదు నీవు అతని చేతిలో మోసపోయావని.  అప్పటికే సమయం మించిపోతుంది. ఇలాంటి వారిని నమ్మక ద్రోహులని, నమ్మించి మోసగించేవారని, తడిగుడ్డతో గొంతులు కోసేవారని అనటం మనం నిత్యము వింటున్నాము. 

స్నేహం చేసే ముందు ఆ వ్యక్తి నడవడిక గూర్చి తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఇక కొందరు చాలా సన్నిహితంగా వుంటూ వుంటారు వారినే మనం ప్రాణస్నేహితులు అంటాం.  వారిరువురు "ఛాయా ప్రచ్ఛాయ" లాగ వుంటారు లేక వారిరువుమద్య బంధం "త్వమేవ అహం" అన్నట్లు అంటే వాడే వీడు అన్నట్లు ఎప్పుడు వుంటారు అని అంటారు. నిజానికి ఒక స్నేహితునికి ఆసరాగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు వాళ్లదే నిజమైన స్నేహబంధం. మన శాస్త్రాలు ఇద్దరు వ్యక్తులకు మధ్య ఏడు మాటలు కలసిన, లేక ఏడడుగులు కలసి నడచిన స్నేహం కలుగుతుందని పేర్కొన్నాయి.  అందుకే వివాహంలో వధూవరులను ఏడడుగులు కలిపి నడిపిస్తారు.  అంతేకాదు మన సాంప్రదాయంలో వివాహాన్ని "ఎడడుగుల సంబంధం" అని అంటారు. పెండ్లయిన భార్య భర్తలు ఇద్దరు జీవితాంతం మంచి స్నేహితులుగా మూడు పురుషార్ధాలను (ధర్మ, అర్ధ, కామాలను)  కలసి కట్టుగా ఆచరించాలని అనేక ప్రమాణాలను చేయిస్తారు. అందులో భాగంగా అగ్నిసాక్షిగా కూడా ప్రమాణాన్ని చేయిస్తారు. స్నేహ సంబంధాన్ని మధురమైన బంధంగా మనం అనుకుంటాం. నిజానికి స్నేహబంధాన్ని నిలుపుకోవటం ప్రతి స్నేహితుడు చేయవలన పని. ఈ విషయాలు తెలియక ఈ రోజుల్లో అనేకమంది దంపతులు పెండ్లి అయిన ఒక ఏటికే విడాకులకు కోర్టుల చుట్టూ తిరుగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. 

స్నేహ బంధం ఒక తియ్యని అనుభూతి. కానీ స్నేహితం అనేది ఇద్దరు స్నేహితులల్లో ఒకరు జీవించి ఉన్నంతవరకే ఉంటుంది. మరి ఈ స్నేహబంధం శాస్వితంగా వుంటూ ఎల్లప్పుడూ మధురానుభూతిగా ఉండాలంటే యెట్లా అంటే దానికి ఒక స్నేహితుడు సదా మనకు తోడుగా వుండి మనలను రక్షిస్తూవుండే వాడు కావలి మరి ఎవరు ఆలా వుంటాడు అంటే ఒకే ఒక్కడు మనకు అలంటి స్నేహితుడు దొరుకుతాడు  అతడే ఆ పరమేశ్వరుడు. ఎప్పుడైతే భక్తుడు త్రికరణ శుద్ధిగా పరమేశ్వరుని ఫై అకుంఠిత శ్రర్ధతో, నిష్టతో, అనురక్తితో, అంకితభావంతో, నిష్కల్మషంగా స్నేహం చేస్తాడో అప్పుడు భగవంతుడు భక్తుని ఒక మంచి స్నేహితునివలె సదా వెన్నంటి ఉండి కాపాడుతూవుంటాడు.

దేముడితో స్నేహం: 

దేముడితో యెప్పుడైతే మనం స్నేహం చేయటం మొదలు పెడతామో అప్పుడు ఈ ద్వైత ప్రపంచం మొత్తం మిధ్యగా కనిపిస్తుంది. ఎప్పుడు ఈశ్వరుని గూర్చిన ధ్యాసే ఉంటుంది. 

కృష్ణుడితో స్నేహం: మీరా బాయి శ్రీ కృషునితో స్నేహం చేసింది అతనిలోనే ఐక్యం చెందిని. 

రాముడితో స్నేహం: భక్త రామదాసు, తులసీదాసు, త్యాగరాజు, పోతన్న, ఇలా అనేక మంది  శ్రీ రాముడితో స్నేహం ఏర్పరచుకొని వారి జన్మలను సార్ధకత చేసుకోవటం మాత్రమే కాదు మనకు అనేక గ్రంధాలను అందించారు. 

ఈశ్వరునితో స్నేహం: మార్కండేయుడు, కిరాతుడైన కన్నప్ప మొదలైనవారు తాము ఈశ్వరునితో స్నేహం చేసి ముక్తిని పొందారు. 

ఏదేముడితో స్నేహం చేసిన మనం చేసే స్నేహం కేవలం నిరాకారుడైన ఆ పరబ్రహ్మతోటే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనకు నారద మహర్షి నవవిధ  భక్తి మార్గాలు తెలిపారు అవి శ్రవణం, కీర్తనము, స్మరణం, పాదసేవనం, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అను తొమ్మిది భక్తి మార్గాలు.  కాబట్టి భక్తులు భగవంతునితో నిరంతరం స్నేహంచేసి మోక్షాన్ని పొందాలి. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

 మీ 

భార్గవ శర్మ.

పరమశివడను

 శ్లోకం:☝️

  *మన్తవ్యే చాభిమాతవ్యే*

*బొద్ధవ్యే ధృతిసంగమాత్*

  *సుఖే దుఃఖే విమోహే చ*

*స్థితోఽహం పరమః శివః*

   - శివ దృష్టిః


భావం: ఆలోచనలో, అహంకారంలో (నేను నేను అనుకునేది), మెలకువలో, అవగాహనలో, దృఢ సంకల్పంలో (బుద్ధిలో), సంతోషంలో, బాధలో, నిద్రలో మాయలో కూడా ఇలా సర్వావస్థలలో ఉన్నది నేనే పరమశివడను.🙏