20, సెప్టెంబర్ 2022, మంగళవారం

తెలుసుకోవసిన సత్యలు.

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸


_*జీవిత పయనంలో తెలుసుకోవసిన అక్షర సత్యలు.*_ 


1. అజ్ఞానం : - అంటే ఏమిటి ?


నన్ను నేను తెలియక విషయాదులయందు ప్రవర్తించుట, శరీరమును సుఖపెడితే వచ్చే ఆనందము సత్యమని, ఇంద్రియాలు, మనసు వీటివల్ల కలిగే సుఖదుఃఖ అనుభవాలే సత్యమని, ఇవి లేకపోతే నేను లేను అనుకొనుటే అజ్ఞానము.


2. జ్ఞానము :- అంటే ఏమిటి ?


నేను దేహమును తెలుసుకొను వాడను కాని నేను దేహమును కాను. నేను ఆత్మ స్వరూపుడను, నేను మనసును తెలుసుకొనువాడను కాని మనసు యొక్క అనుభవములు నావి కావు. నేను మనసును కాను. నేను ఆత్మస్వరూపుడను. నేను ప్రకాశరూపుడను. ప్రజ్ఞా స్వరూపుడను. ఈ ప్రజ్ఞయే పిపిలికాది బ్రహ్మపర్యంతము 'నేను' గా ప్రకాశింప బడుతున్నదని తెలుసుకొనటయే జ్ఞానము.


3. విజ్ఞానము :- అంటే ఏమిటి ?


ఇట్లు తెలిసిన జ్ఞానమును తనకు అన్వయించుకొని, తన స్వరూపమే జ్ఞానమని, తక్కినదంతయు అన్యముగా నిరశించి, జ్ఞానమే తానైన స్థితి విజ్ఞానము. 


4. సుజ్ఞానము :- అంటే ఏమిటి ?


పైన చెప్పిన అనుభవములకు కారణము ఎఱుక అనియు. (ఎఱుకన్నా, జ్ఞానమన్నా ఒక్కటే). ఈ ఎఱుకే జీవుడి అజ్ఞానమును, ఈశ్వరుడిగా జ్ఞానస్థితినీ, పరబ్రహ్మగా మౌనస్థితిని పొందుతున్నదనియూ, కాలప్రభావమున మరలా ఎఱుక సంకల్పించి, జీవేశ్వర జగత్తుగా మారవచ్చుననియూ, త్రిగుణముల యొక్క సామ్యావస్థే పరబ్రహ్మమనియు, త్రిగుణముల యొక్క వ్యవహారమే సృష్టి అనియూ, ఇది కాలచక్రముగా అనేక బ్రహ్మాండములను పరిపోషించుచున్నదనియూ ఎరిగి, త్రిగుణములను నిరశించి, ఎరిగే ఎఱుకను వీడి, ఎఱుకను నిరశించి బయలగుటే సుజ్ఞానము...

.

.

.

అర్థం పురుషార్థాల్లో ఉత్తమమైందని 

పంచతంత్ర వాక్యం. 


ధర్మమార్గంలో కలిగిన అర్థమే పురుషార్థంగా గ్రహింపదగింది. 


ఒక్కొక్క నీటిబొట్టు పడుతుంటే క్రమంగా కుండ నిండిపోతుంది. అలాగే ధనం కూడా క్షణం క్షణం కణకణం సాధించుకోవాలి. 


ఆత్రంగా నీటితో నింపబోతే కుండవిచ్చిపోవచ్చు. నీరు నేలపాలు కావచ్చు. ధనార్జన విషయంలో ఒక క్రమపద్ధతి అవలంబించాలని విజ్ఞులు చెబుతారు.


డబ్బుంటే చాలు కానిదేదీలేదన్న ఆలోచన నేడు చాలామందిలో ప్రబలంగా ఉంది. సంపాదనకు అధర్మమార్గం తొక్కడమూ సాధారణమైంది. ద్రవ్యం ధర్మార్జితం కావాలన్నారు పెద్దలు. అధర్మ మార్గాల్లో సంపాదించి విశేషంగా దానాలు చేస్తున్న ఎందరినో లోకం కొనియాడుతుంటుంది. వారు ఏ రకంగా ఆర్జించారన్నది పట్టించుకోదు. దానం చేసే ధనం న్యాయమార్గంలో సంపాదించినదై ఉండాలి.


ఒక ఊళ్లో పేద పండితుడు యాచకవృత్తిలో ఉంటూ ఓ ఇంటికి భోజనానికి వెళ్లాడు. ఉత్తమురాలైన ఇల్లాలు భోజనం పెట్టింది, చేతులు కడుక్కోవటానికి వెండి చెంబుతో నీళ్లిచ్చింది. పండితుడు ఇంటికి వచ్చేటప్పుడు గృహిణి ఇచ్చిన వస్తువులతో పాటు వెండిచెంబు కూడా సంచిలో చేరింది. ఆమె గమనించలేదు. ఇంటికి వచ్చాక సంచి తెరిచి చూసి అతడు ఖిన్నుడయ్యాడు. తనవల్ల ఎప్పుడూ ఇలాంటి తప్పు జరగలేదు. ఎంత ఆలోచించినా అలాంటి దుర్బుద్ధి ఎలా కలిగిందో అర్థంకాలేదు. తానెలా వెండిచెంబు సంగ్రహించాడో తెలియలేదు. ఆతిథ్యం ఇచ్చిన ఇంటికి వెళ్ళి, సిగ్గుపడుతూ- తన అపరాధం మన్నించమని వేడుకున్నాడు. వెళ్లిపోతూ 'తల్లీ... నీ భర్త ఏం చేస్తుంటారు' అని అడిగాడు. ఆ గృహిణి దుఃఖిస్తూ. తన భర్త దారి దోపిడులు చేసి సంపాదిస్తున్నాడని ఇదంతా పాపమని చెప్పినా వినడం లేదని, ఆ పాపం పోవడంకోసం తాను దాన ధర్మాలవంటి సత్కార్యాలు చేస్తున్నానని పలికింది. అప్పుడా పండితుడు- అన్యాయార్జితమైన విత్తంతో చేసిన దానధర్మాలుగాని, అన్నప్రసాదనంగాని స్వీకరించరాదని శాస్త్రాలు చెబుతున్నవనే విషయం గుర్తుకు తెచ్చుకున్నాడు. సంపాదించిన ధనం అన్యాయార్జితమైతే సత్ఫలితాలను ఇవ్వదు సరికదా, తప్పుడు ఆలోచనలు కలిగిస్తుంది.


తాను సంపాదించిన సొమ్ము ఉత్తమమైంది. తండ్రినుంచి సంక్రమించిన సొమ్ము మధ్యమం. సోదరుడినుంచి వచ్చినది అధమం. ఇక, స్త్రీవల్ల పొందినది అధమాధమమని శాస్త్రవచనం. విజ్ఞులు పరుల సొమ్ముకు ఆశపడకూడదు.


సంపాదించేటప్పుడు మేరు పర్వతమంత సంపాదించాలి. దానం చేసేటప్పుడు ఆ ధనాన్ని గడ్డిపరకగా చూడాలని పెద్దలు చెబుతారు. ధనానికి దానం, భోగం, నాశనం అనే మూడు గతులు ఉన్నాయి. తాను అనుభవించక, ఒకరికి పెట్టక పోగుపెట్టే ధనానికి నాశనం తప్పదు. ధర్మం, అగ్ని, రాజు, దొంగ- ఈ నలుగురూ ధనానికి దాయాదులు. వీరిలో జ్యేష్ఠుని అంటే ధర్మాన్ని అవమానిస్తే మిగిలిన ముగ్గురూ కోపిస్తారు. అంటే- ధర్మంలేనివాడి ధనం అగ్నిపాలో, రాజుపాలో, దొంగలపాలో అవుతుందని భావం...

.

మనిషి జీవిస్తున్నాడు 

కానీ జీవించడం తెలియదు


మనిషి పని చేస్తున్నాడు కానీ 

ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అని తెలియదు


అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి తన గురువుగా స్వీకరించి తన తక్షణ కర్తవ్యమేమిటో తెలుపమని వేడుకున్నాడు.


కార్పణ్యదోషో పహతస్వభావః

పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః 

యచ్ర్ఛేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే

శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నమ్‌


‘‘నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియడం లేదు. ఆందోళన, పిరికితనం నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుణ్ణి, నీకు శరణాగతుణ్ణి. నాకు నిజంగా ఏది శ్రేయస్కరమో దాన్ని ఉపదేశించు’’ అని ప్రార్థించాడు. 


జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలంటే, ప్రామాణిక పరంపరకు చెందిన ఆచార్యుణ్ణి ప్రతి ఒక్కరూ తమ ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించవలసిన ఆవశ్యకతను పై సందర్భం సూచిస్తుంది. అటువంటి ఆచార్యుడు కచ్చితంగా విశుద్ధ కృష్ణ భక్తుడై ఉండాలి.


భగవద్గీత విన్న అర్జునుడు దృఢ నిశ్చయుడై, మనస్సులో ఉప్పొంగిన ఉత్సాహంతో... ధనుస్సు చేతపట్టి నిలచి, వీరోచితంగా పోరాడాడు. విజయాన్ని సాధించాడు. 


అర్జునుణ్ణి తన కర్తవ్యం వైపు నడిపించేలా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినదేమిటి? 


భగవద్గీతలో శ్రీకృష్ణుడు అస్త్ర శస్త్రాల గురించి గానీ, యుద్ధ నైపుణ్యాల గురించి గానీ ప్రస్తావించలేదు. మన నైపుణ్యాలు, నేర్పరితనం లాంటివేవీ... మన జీవితంలో ఎదురయ్యే ఆత్రుత, ఆవేదనల నుంచి మనల్ని కచ్చితంగా రక్షించగలవని చెప్పలేమనడానికి ఇదే నిదర్శనం. అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించింది... జీవిత సత్యాల గురించి. తద్వారా, ఉన్నత జీవన విధానాల పట్ల అర్జునునికి ఉన్న అపోహలను కృష్ణుడు మార్చేశాడు.


ఈ దేహం మనం కాదు, మనమంతా ఆత్మ స్వరూపులం అంటూ మానవ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో జీవుని నిజమైన స్వరూపాన్ని గురించి వివరించాడు. సమస్త జీవులు ఆధ్యాత్మిక స్వరూపాలని, అయితే ప్రస్తుతం ఈ భౌతిక దేహంలో బంధితులై జీవిస్తున్నారన్న సత్యాన్ని బోధించాడు. 

.

పకృతి జీవజాతితో సమానంగా 

మానవజాతి మనగడ సాగిస్తుంది 


అయితే మానవులు 

కట్టుబాట్లు పెట్టుకున్నారు పేరుకు మాత్రమే 


కానీ 


అన్ని జీవుల మాదిరిగానే మానవుడు బ్రతకాలని కోరుకుంటున్నారు 


మనిషి కట్టుబాట్లలో ఉన్న 

మనసు మాత్రం పకృతి పరంగానే సంచరిస్తుంది


మానవ జాతిలో 

ఎవరిని నమ్మకూడదు 

ఎవరిని ప్రేమించకూడదు 

ఎవరిపై నమ్మకాలు పెట్టుకోకూడదు ఎక్కువ

ఎందుకంటే అందరూ మోసం చేసేవారు అందరూ వదిలి వెళ్ళిపోయేవారు

.

కన్నతల్లి అయినా ఎవరైనా మోసం చేయవచ్చు 

కన్న తండ్రి అయిన ఎవరైనా మోసం చేయవచ్చు 

అన్నదమ్ములైన మోసం చేయవచ్చు

అక్క చెల్లెలు అయినా మోసం చేయవచ్చు

భార్య కూడా మోసం చేయవచ్చు

భర్త కూడా మోసం చేయవచ్చు

బిడ్డలు కూడా మోసం చేయవచ్చు

కొడుకులు కూడా మోసం చేయవచ్చు

.

అందరు మోసం చేస్తారు ఏదో ఒకనాడు తప్పకుండా

అందరు మోసపోతారు ఏదో ఒకనాడు తప్పకుండా


అందుకే ఎవరి మీద ఎక్కువ అంచనాలు వేయకూడదు

ఎక్కువ ప్రేమ పెట్టుకోకూడదు

ఎవరిపై ఎక్కువ నమ్మకాలు పెట్టుకోకూడదు

ఎవరిని కంట్రోల్ లో పెట్టాలని చూడకూడదు


అందరూ ఇలా ఉంటే బాగుండు అని అనుకోకూడదు

ఎవరు మీరు అనుకున్నట్లు ఉండరు ఉండరు ఉండరు ఉండలేరు ఇది రాసి పెట్టుకోండి.


సర్వేజనాసుఖినోభవంతు.


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

కామెంట్‌లు లేవు: