18, ఏప్రిల్ 2024, గురువారం

vote wisely

 *Upma was served in a breakfast every morning in a hostel with a capacity of 100 people. Out of those 100 people, 80 people used to complain every day that different items should be made instead of upma.*

*But, the other 20 people were happy to eat upma. The remaining 80 people wanted to cook something other than upma.*


*The hostel warden voting method was proposed as some decision had to be reached in this chaotic situation. 


 According to this, whichever tiffin gets the most votes, that tiffin will be cooked that day.*


 *20 students who wanted Upma cast their vote accurately. The remaining 80 people cast their vote as follows.*

 18 - Masala Dosa

 16 - Aloo Parotta & Dahi

 14 - Roti & Subg

 12 - Bread & Butter

 10 - Noodles

 10 - Idli Sambar


 So, as per the voting results, Upma gets the highest number of votes, and again the same is served every day.


*Lesson:* As long as 80% of the population is selfish, divided and scattered, 20% will rule us.


*This is a silent message.*

*✨ ⚡✨* vote wisely

కాల చక్రం

 కాల చక్రం


60 సంవత్సరాలు – 1 సంవత్సర చక్రం (షష్టిపూర్తి)


4,32,000 సంవత్సరాలు - కలి యుగం 8,64,000 సంవత్సరాలు - ద్వాపర యుగం


12,96,000 సంవత్సరాలు - త్రేతా యుగం*


17,28,000 సంవత్సరాలు - కృత యుగం


మొత్తము 43,20,000 సంవత్సరాలు - 1 మహా యుగం


71 మహా యుగాలు – 1 మన్వంతరం


14 మన్వంతరాలు – 1 కల్పం


2 కల్పాలు - బ్రహ్మ కి ఒక్క రోజు 2000 కల్పాలు - బ్రహ్మ ఆయుష్షు


విష్ణువుకు 200 కల్పాలు - శివునికి ఒక్క రోజు


శివునికీ 200 కల్పాలు - ఆది పరాశక్తి కి ఒక కనురెప్ప పాటు కాలం.

వివాహం..ఉద్యోగం

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*వివాహం..ఉద్యోగం..*


ఆవిడ పేరు వెంకట రమణమ్మ..శ్రీ స్వామివారు మాలకొండలో తపోసాధన చేసే రోజుల్లో..ఒకటి రెండు సార్లు పార్వతీదేవి మఠం వద్ద శ్రీ స్వామివారిని చూసారు..అప్పుడు శ్రీ స్వామివారు వెంకట రమణమ్మ గారిని పలకరించి..ఆశీర్వదించి పంపారు..శ్రీ స్వామివారు మొగలిచెర్ల కు వచ్చేసి, ఆశ్రమ నిర్మాణం చేయించుకొని..ఇక్కడే సాధన చేసుకొనే రోజుల్లో కూడా రమణమ్మ గారు శ్రీ స్వామివారిని కలిశారు..అలా శ్రీ స్వామివారికోసం ఆశ్రమం వద్దకు వచ్చినప్పుడే మా తల్లిదండ్రులతో పరిచయం ఏర్పడింది..ఆ తరువాత ఒకటి రెండుసార్లు రమణమ్మ గారు ఆశ్రమానికి వచ్చి శ్రీ స్వామివారిని చూసి వెళ్లారు.. శ్రీ స్వామివారిని దర్శించుకునే సమయంలో మా ఇంట్లో గడిపారు..ఈ విషయాలన్నీ ఆవిడే స్వయంగా చెప్పారు..శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తరువాత..రమణమ్మ గారు మొగలిచెర్ల కు వచ్చారు..అప్పుడు శ్రీ స్వామివారి తల్లిగారైన వెంకట సుబ్బమ్మ గారు మందిరం వద్ద వున్నారు..సుబ్బమ్మ గారి వద్దే రెండురోజుల పాటు రమణమ్మ గారు వున్నారు..వాళ్ళిద్దరి మధ్యా కొద్దిగా సాన్నిహిత్యం కూడా ఏర్పడింది..తాను శ్రీ స్వామివారికి దగ్గర మనిషిని అని రమణమ్మ గారు భావించేవారు..


ఈసారి రమణమ్మ గారి రాకకు ఒక కారణం ఉన్నది..ఆవిడ కూతురు బిడ్డ (మనుమరాలు) యుక్త వయసుకు వచ్చింది..ఉద్యోగము చేస్తున్నది..సుమారు పాతిక సంవత్సరాల వయసు వచ్చింది.. కానీ..వివాహం చేసుకోనని ఖరాఖండిగా తేల్చి చెప్పింది..ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు ప్రయత్నం చేసి..విఫలమయ్యారు..ఎవరు చెప్పినా ఆ అమ్మాయి వివాహానికి ఒప్పుకోవడం లేదు..తాను ఇంకా కొన్నాళ్ల పాటు ఒంటరిగా వుంటూ ఉద్యోగం చేయదలచానని..తనను బలవంత పెట్టొద్దనీ గట్టిగా చెప్పింది.. 


మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి అమ్మాయిని తీసుకెళ్లండి..మార్పు వస్తుంది..అని రమణమ్మ గారు తన కూతురికి సలహా ఇచ్చారు.."నువ్వు కూడా మాతో స్వామివారి వద్దకు వచ్చేయి..అందరం కలిసే వెళదాము.." అని ఆ కూతురు చెప్పి..రమణమ్మ గారిని వెంటబెట్టుకొని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చింది..కాకుంటే మనుమరాలికి మాత్రం విషయం చెప్పకుండా..కేవలం దైవదర్శనం కోసం మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరం వద్దకు వెళుతున్నామని చెప్పారు..


రమణమ్మ గారు మందిర ప్రాంగణమంతా తిరిగి చూసారు..తాను మొదట్లో చూసిన మందిరానికి, ఇప్పటికీ చాలా తేడా వున్నదని అన్నారు..చాలా మార్పులు వచ్చాయి అని చెప్పారు..తాను, శ్రీ స్వామివారి తల్లి గారితో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు..

(శ్రీ స్వామివారి తల్లిగారైన వెంకట సుబ్బమ్మ గారు..శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తరువాత మందిరం వద్దకు వచ్చి..ఇక్కడే సుమారు పదిహేను సంవత్సరాల పాటు వున్నారు..ఆనాటి తరం వాళ్లందరికీ వెంకట సుబ్బమ్మ గారు బాగా గుర్తు వున్నారు..ఇప్పటికీ కొందరు మమ్మల్ని ఆవిడ గురించి అడుగుతూ వుంటారు..వెంకట సుబ్బమ్మ గారు సుమారు ఐదు సంవత్సరాల క్రితం, తన 101 వ ఏట మరణించారు..) 


ఆరాత్రికి రమణమ్మ గారు, ఆమెతో వచ్చిన కూతురు, అల్లుడు, మనుమరాలు..అందరూ మందిరం వద్దే నిద్ర చేశారు..తెల్లవారింది..అందరూ తలారా స్నానం చేసి, శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్నారు..మనుమరాలి చేత కూడా శ్రీ స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేయించారు..అందరూ ప్రధాన మందిరం వద్ద నుంచి బైటకు వచ్చి..మంటపం లో కూర్చున్నారు..రమణమ్మ గారు మాత్రం మళ్లీ లేచి ..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి మరొక్కమారు నమస్కారం చేసుకొని ఇవతలకు వచ్చారు..మనమరాలిని తన దగ్గర కూర్చోబెట్టుకుని.."నీకు త్వరగా పెళ్లి కావాలని మొక్కు కోవడానికి మేమందరం నిన్ను వెంటబెట్టుకొని ఇక్కడకు వచ్చాము.." అని అసలు విషయం చెప్పేసారు..అప్పటిదాకా ఉత్సాహంతో ఉన్న ఆ అమ్మాయి, ఈ మాట వినగానే గంభీరంగా మారిపోయింది.."అమ్మమ్మా..పెళ్లి తరువాత కూడా నేను ఉద్యోగం చేయడానికి ఒప్పుకునే పక్షంలో..నేను వివాహం చేసుకుంటాను.." అని చెప్పింది..ఈ మాట వినగానే ఒక్కసారిగా అందరికీ ఆనందం వేసింది..సుమారు సంవత్సరం నుంచీ పెళ్లి ప్రసక్తి తెస్తేనే ససేమిరా అంటున్న అమ్మాయి..ఇప్పుడు వివాహానికి ఒప్పుకున్నది..శ్రీ స్వామివారి సమక్షం లోనే అమ్మాయి నోటి నుంచి సానుకూల వార్త వచ్చింది..ఇంతకంటే ఏమి కావాలి?


మరో మూడు నెలల కల్లా..ఆ అమ్మాయికి వివాహం జరిగిపోయింది..నూతన దంపతులను వెంటబెట్టుకొని రమణమ్మ గారు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..అందరూ మనసారా శ్రీ స్వామివారికి నమస్కారం చేసుకున్నారు..ఇంకొక విషయమేమిటంటే..పెళ్లి తరువాత కూడా ఉద్యోగం చేస్తాను అన్న అమ్మాయి..మరో నెలకల్లా ఉద్యోగం మానేసి..భర్త తో చక్కగా కాపురం చేసుకుంటున్నది..


"స్వామి తలచుకుంటే..అన్నీ చిటికెలో జరిగిపోతాయి..నా మొర వృధాగా పోదు..స్వామివారి పై పూర్తి విశ్వాసం ఉంది.." అంటుంటారు రమణమ్మ గారు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx




(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699)

వ్యక్తిత్వ వికాస పద్యాలు

 వ్యక్తిత్వ వికాస పద్యాలు


ఉచిత కార్టికో ఫింగువస్


-సూర్య గండ్రకోట


..:


పడతి జాడజెప్పి ప్రాణమిచ్చెనొకటి, పింఛమిచ్చె నొకటి ప్రీతితోడ, విహగ వాహనమ్మె వేల్పులందరికిని పరమ భాగ్యశాలి పక్షి గాదె!


..:


గ్రీష్మ తాపమునకు గిజగిజలాడగ దాహమంత తీర్చి ధాన్యమిడుచు పక్షి సేవజేయ పరమాత్మ సేవయే అదియె యిచ్చు కోటి యాగఫలము!


+

ఇడ్లీ వంట (జంట)

 అంతర్జాతీయ ఇడ్లీదినోత్సవ సందర్భముగా 



            ఇడ్లీ వంట (జంట)


ప్రత్యూష మందునే ఫలహారశాలలో 

           ప్రత్యక్ష మగునట్టి ప్రముఖ వంట (జంట)

చట్నీలొ తిన్ననూ సాంబారు జేర్చినన్ 

           రసనకు విందగు రమ్య వంట (జంట )

సాంబారుతోతిన్న సాంబరులోతిన్న 

           చక్కనిరుచియిచ్చు సౌమ్య వంట (జంట )

పొడిలోన నేతిలో పొర్లించి తిన్ననూ  

           కడురుచి నిచ్చెడి ఘనపు వంట (జంట )

ధవళ కాంతితో గుండ్రంగ తనరు చుండి 

పళ్ళెరంబున మెరిసెడు భాసయుక్త 

"ఇడ్లి వంట"కు (జంటకు) మించియు న్నిలను నున్న 

ఖాద్యమే లేదు జూడ నీ కలియుగమున 


✍️గోపాలుని మధుసూదనరావు🙏

కందము

 శు భో ద యం🙏


కందము సాహిత్య సరస రుచుల మాకందం !


    వేసవికి చేరాం .ఈప్రచండ ప్రకృతిలో మనలను సేదదీర్చేది మాకందమే! మాకంద మంటే ,మామిడిపండు. దానిరుచేవేరు. తలనుండి కడవరకూ నోటిని రుచులతోనింపి మనసుకు మధుర మధురమైన యనుభూతిని నింపుతుంది. అటువంటిదే పద్యాలలో కందపద్యం!పరిమాణంలో చిన్నదైనా నడకలో సొగసులో భావప్రకటనలో విస్తారమై చదువరుల హృదయాలను సమాకర్షించుతూ

ఉంటుంది. అందుకేగాబోలు "కందంవ్రాసినవాఁడేకవి. పందినిబొడిచినవాఁడే శూరుఁడు". అనే సామెతలేర్పడినాయి.


                  క: ముందుగఁ జనుదినములలో


                       కందమునకు సోమయాజి ఘనుఁడందురు నేఁ


                      డందరు ననుఘనుఁడందురు


                     కందమునకు కుందవరపుఁ గవిచౌడప్పా! 


                                            అనినాడు చౌడప్ప. కొండంత భావాన్ని గురిగెలాంటి ఆచిన్నపద్యంలో యిమిడించటం సామాన్యంకాదు.

దానికెంతో నైపుణ్యంఉండాలి! 


                                         క: ఆపదఁ గడవం బెట్టఁగ


                                               నోపి , శుభంబైన దాని నొడఁగూర్పను మా

 క్ష్మాపాలుఁడు నిన్నుజూపిఁ జనియె మహాత్మా!


                                           

                            ఇది తిక్కనగారి పద్యం. కృష్ణుని తమరాయబారిగా కౌరవ సభకు పంపుచు ధర్మరాజు అతనితోపలికినమాట.

కృష్ణా! తండ్రి లేని పిల్లలం. నీవు దైవానివి .నిన్ను నమ్ముకున్నాం. దిక్కులేనివారికి దేవుడే దిక్కుగదా! ఇకమా బాగోగులన్నియు నీవే!

పాలముంచినను నీటముంచినను నీదేభారము. అన్నాడు. ధర్మజుడు చాల తెలివిగా భారమంతయు కృష్ణుపై నెట్టినాడు. ఆమాటలకు గట్టుబడియే పూసలలో దారమువలె కురుక్షేత్రయుధ్ధము ముగియువరకు వారివెంటనుండి వారిని కంటికి రెప్పలాఁ గాపాడినాడు.కృష్ణుడు.

ఇంత విపులమైన భావమునొక కందపద్యమున జెప్పిముగించినాడు సోమయాజి.


        క : కల ధనములెల్ల యక్కర


                                                    గల నాఁటికి దాచ కమల గర్భుని వశమే!,


                                                  నెల నడిమి నాఁటి వెన్నెల


                                                  యలవడునే గాది వోయ ' నమవసనిశికిన్ !


                              ఇది పెద్దనగారి పద్యం. ధనంగానీ యవ్వనం గానీ దాచుకుంటే అక్కరదీర్చేవిగావు. ఆక్షణం దాటితే యేమవుతుందో చెప్పలేము. అందుచేత వయసులో ఉన్నావారు అది సార్ధమగురీతిలో భోగాలను అనుభవించాలి. " నెలమధ్యలో వచ్చిన పున్నమనాటి వెన్నెల గాదిలోపోసి అమావాస్య నాటికి నిలువచేద్దామంటే వీలవుతుందా? అలాగే యవ్వనంకూడాను. ఇలాయెన్నో విధాల జారనైతికోపదేశాలను వరూధిని ప్రవరునకు చెప్పింది అయినా ఆధీరుడు చలించలేదు. ఆవిషయం యిక వేరేసంగతి.


                       పాపం " అమవస నిశికిన్"- అనేప్రయోగం మాత్రం పెద్దగారికి గండంగా పరిణమించింది. తెనాలివారూరుకుంటారా?


                                  క: ఏమి తిని సెపితివి కపితము


                                    భ్రమపడి వెరిపుచ్చకాయ వడిఁదిని సెపితో


                                 ఉమెతక్కయ ఁ దిని సెపితో 


                                   యమవస నిశి యన్నమాట యల్లసని పెద్దన!


                                                                           అంటూ సుతిమెత్తగా హేళన గావించాడు. పాపం ఆయన మాత్రం యేంచేయగలడు?

"అమవాస్యా నిశా" యనే సమాసం ఆకందంలోపట్టదు. ఛందోభంగం. అటు వ్యాకరణదోషం. ఇటు ఛందోభంగం. రెంటిలోను వ్యాకరణదోషమైనా ఇదేబాగున్నదనుకొన్నారు. అమవసనశికిన్ ప్రయోగాన్ని అలాగే ఉంచేశారు. నిన్నమొన్న డా:నారాయణరెడ్డిగూడా

ఆప్రయోగాన్ని ఆదరించి " ఆనయనాలూ విరిసినచాలూ ,అమవసనిశిలో చంద్రోదయాలూ"- అంటూ శివరంజని సినీగీతంలో వ్రాయటంతో అది యికనుండి శిష్ఠప్రయోగమై శిరోధార్యమైనది.


                                      కందమంత కమ్మని పద్యమూ లేదు. కందమంత కఠినమైన పద్యమూలేదు.


                                                            అదేమిటో అనుభవంలో తెలియాల్సిందే!


                                                                           స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

వేదాంతంలో వైరాగ్యానికే

 జీవుడు ఓక చిలక


పంజరము వంటి శరీరములో జీవుడను ఓక చిలుక                 నివశిస్తుంది.

ఆథ్యాత్మిక జ్ఞానము వినుట చెప్పుట దీనికిఉంది,


కానినిద్ర పోతున్నది.


తనకు సమీపములోనే ఆత్మకూడా ఉన్నది.


కాని ఈ రెండింటిని మాయాపొర ఆవరించియున్నది.

అందుకే ఓకరినొకరు కలువలేకపోతున్నాయ్.


ఆత్మకు తెలుసు తనదగ్గరలో యున్న జీవుని గురించి,కాని మాయా ప్రభావము వలన జీవునికి ఆత్మ గురించి తెలియదు.


ఈ రెండు కలిగిన స్ధితియే మెాక్షము.  


దీనికే జీవ బ్రహ్మైక్య రాజయెాగమని పేరు.


వీటికలఇకయే యెాగము.


యెాగసాధనఅనిపేరు.


మనస్సు యెక్క సహయముతో జీవుడు గాలిలోఎగిరి,ఎగిరి,గగన మార్గము నసంచరించి గూటికి చేరుచున్నాడు.


జీవుని శరీరము ఓకగూడు,నగరము,కోట.


మనస్సు, బుద్థి,చిత్తము,అహంకారము జీవునకు ప్రథానవస్తువులు . ఆదిత్యయోగీ..


వీటితో తన కర్తవ్యములను,బాథ్యతలను,

శరీరఉపాధిని నిర్వహిస్తుంటుంది.


బంధ మెాక్షములకు,కర్మలకు ఈ జీవుడే కారణము.

సర్వకాల సర్వావస్ధలయందు ప్రతి జన్మలోను కుటుంబ విష  చక్రమందు ప్రీతి కలిగి,అందు తగుల్కోని పరిభ్రమిస్తూ కాలమును గడుపుచుంటాడు.


ఈ జీవాత్మ నాభి,హ్రదయ కమలము,బ్రహ్మరంధ్రముల యందు ప్రవర్తిస్తూంటాడు.


జీవుడు భ్రూమధ్యమున 'స' అను మంత్రమును, 'హ' అను మంత్రమును తనకు తానుగానే  ముక్కురంధ్రముల ద్వారా జపముచేస్తుంటాడు...

.

చిరంజీవత్వమును పొందుటకు సాథనలు 


చిత్తము సంపూర్ణముగా విశ్రాంతిపొందవలెెను.

ప్రాణ వాయువు నిర్మలాత్మమున విశ్రాంతి పొందవలెను. 


ప్రాణ సమాధిస్ధితిలో ఓక క్షణమైనాచలింపరాదు.  ప్రాణా ప్రాణగమనములననుసరించి పరమాత్మనుదర్శించవలెను.


ఆత్మ సమాధి యందే వెలసియుండాలి.


సమాధిస్ధితికి విరుద్ధమైన విషయములును స్మరించరాదు.


ధీర చిత్రమును మహప్రళయ కాలమున ప్రదర్శించవలయును.


గడచిన దానిని లేదా రాబోవు దాని గురించి చింతించ రాదు.

వర్ధమాన దృష్టిని, సాక్షి దృష్టిని అవలంబించిఆత్మ యందు లీనమై పోవాలి.


ఫలేచ్ఛను త్యజించవలెను. సుషుప్తి వ్యక్తివలె నిరభిమాన పూర్వకముగా కేవలీ స్వభావమున జీవించవలెను.


ఇష్టానిష్టాదులతో కూడిన వాటిని త్యజించ వలెను.


ఇదినాది, అదినాది ,నా,ఇదికావలయును,అదివలదు,దానిని నేడు పొందితిని, దానిని రేపుపొందదెను అను సంకల్పబంధాలు ఉండరాదు.


దేనినిఎపుడు,ఎన్నడుస్తుతించరాదు,నిందింపరాదు. స్వవిషయమున పర విషయముల యందు కూడా వాటిని పాటించవలెను.


మనస్సును శుభమును పొంది సంతోషింప చేయవలెను.

అ శుభ సంకల్పములతో దుఃఖము,రాగద్వేషాలు ఉద్భవిస్తాయ్.

చిరంజీవత్వము ప్రాప్తించదు.


త్యాగము అను గుణము వ్యక్తిగత లక్షణముగా ఉండవలెను.

స్వర్గమును పొందవలెనను కోరిక ఉండరాదు. అట్టి ఆసక్తిని ఎల్లప్పుడు త్యజించవలెను.


మరణ భయము ఉండరాదు. దానిని త్యజించవలెను.


చాపల్యము,శోకము,స్వస్ధము ఉండరాదు.


కాష్టము,సుందర,శైలము,తృణము,అగ్ని,హిమములను సర్వత్ర సమానముగా చూడవలెను.


ఈరోజు నేను ఏమి చేసితిని,రేపు ఏమి కానున్నది అను చింతాజ్వరము లేకుండవలెను.


జనమరణాది దుఃఖములు,రాజ్యలాభాది సుఖములు సంభవించినను శోకము దుఃఖము ఉండరాదు.


ఓకరు మిత్రుడు,ఇంకొకరు శత్రువు,వాడు నాకంటే అన్యుడు అను భావన ఉండరాదు.


చైతన్యము నేనే బ్రహ్మను నేనే, అహంబ్రహ్మస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ అను ఇతర వేద మహవాక్యాలను పాటించాలి.


నూతన విషయములను గ్రహించునపుడు మనస్సు గర్వించరాదు.


ఈ జగత్తును ఎల్లపుడు నూతనము వలె ఆత్మ దృష్టితో చూడవలెను...

.

*ఈ జన్మలో అనుభవించిన ప్రారబ్ధకర్మలు పోను, మిగిలిన పూర్వ జన్మల్లోని సంచిత కర్మలని, ఈ జన్మలో చేసిన ఆగామి కర్మలన్నింటినీ ఆఖరిశ్వాసతో ప్రతి జీవి తర్వాతిజన్మకి తీసుకువెళ్తుంది.*


 *వాసనలని గాలి ఎలా తీసుకువెళ్తుందో,  అలా కర్మలన్నింటినీ శ్వాస తీసుకువెళ్తుంది. సూక్ష్మశరీరం ఈ కర్మలతో ఏర్పడుతుంది. అదే జడ శరీరాన్ని ఆవరించుకుని ఉండేది.*


 *”అర్థా గృహే వివర్తంతే స్మశానే మిత్ర బాంధవా సుకృతం*

*దుష్కృతం చైవ గచ్ఛన్తమనుగచ్ఛతి*


 *మరణించిన మనిషి యొక్క సంపద తనఇంట్లోనే ఉంటుంది. బంధుమిత్రులు స్మశానం దాకే వస్తారు. వెంటవచ్చేవి మనిషి చేసుకునే దుష్కర్మలు, సుకర్మలే.* ఆదిత్యయోగీ*


*కర్మ వల్లనే జన్మలు వస్తాయి. ఓ జన్మలో ఓ జీవి చేసిన కొంత కర్మ యొక్క ఫలాన్ని ఆ జీవి ఆ జన్మలో అనుభవించగా కొంత మిగిలితే, ఆ శేష కర్మ ఫలాన్ని అనుభవించడానికి మరో జన్మని తీసుకుంటాడు.*


 *మళ్ళీ ఆ రెండో జన్మలో ఈ ఫలాన్ని అనుభవిస్తూ చేసే కొత్త కర్మని అనుభవించడానికి మళ్ళీ కొన్ని పునర్జన్మలని పొందుతాడు. ఇలా కర్మ, జన్మ, మళ్ళీ కర్మల చక్రంలో జీవులమైన మనమంతా ఎంతో కాలంగా చిక్కుకుని తిరుగుతున్నాం.  ఈ కర్మ చక్రం గురించి శ్రీ ఆది శంకరాచార్య భజగోవిందంలో  ఇలా చెప్పారు."*


 *”పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం"* 


 *”మళ్ళీమళ్ళీ పుడతారు, మళ్లీ మళ్లీ మరణిస్తారు, మళ్లీ మళ్లీ తల్లి గర్భాన పడతారు".*


 *మనిషిలో మరణ సమయంలో ఏ గుణం అధికంగా వుంటే దాన్ని బట్టి తర్వాతి జన్మ లభిస్తుందని (భగవద్గీత 14 -15) శ్రీకృష్ణుడు చెప్పాడు. తమో గుణ ప్రధానులకి జంతు జన్మలు వస్తే, రజో గుణస్థులు మనుషులుగా పుడతారు. సత్వ గుణస్థులు ఆథ్యాత్మిక సంపద అధికంగా గల ఇళ్ళల్లో పుడతారు."*


 *”రజసి ప్రలయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే"*


 *”రజోగుణం వృద్ధి చెందినప్పుడు మరణిస్తే, అతడు కర్మంటే ఆసక్తి గల మనుషుల్లో పుడతాడు. అలాగే తమో గుణం అధికమైనప్పుడు మరణించిన మానవుడు పశు పక్షి కీటకాది నీచ యోనుల్లో పుడతాడు".*


 *సత్వగుణ సంపన్నులు వచ్చే జన్మలో ఎలా పుడతారు?*


 *”యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్* 

*తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే"*

 *(భగవద్గీత 14-14)*


 *”సత్త్వ గుణం ఎక్కువగా ఉన్నప్పుడు మరణిస్తే అతడు ఉత్తమ కర్మలని ఆచరించేవారు చేరే నిర్మలమైన స్వర్గం మొదలైన దివ్య లోకాలని చేరుతాడు."* 


*”యోగ భ్రష్టుడు స్వర్గం మొదలైన దివ్య లోకాలలో అనేక సంవత్సరాలు గడిపాక పవిత్రులు, ధనవంతులు ఐనవారి ఇంట్లో పుడతాడు. (భగవద్గీత 6-41) ఒకోసారి పై లోకాలకి పోకుండానే అతను జ్ఞానులైన వారి కుటుంబంలో పుడతాడు."*


 *”ఐతే ఇది చాలాదుర్లభ జన్మ. (భగవద్గీత 6-42) లేదా ఆథ్యాత్మికంగా వున్నత స్థితిలోని యోగి కుటుంబంలో పుట్టి తిరిగి తన సాధనని కొనసాగిస్తాడు. (భగవద్గీత 6-43)"*


*దీన్ని బట్టి మరణ సమయంలో ఏ గుణం అధికంగా వుంటే తిరిగి అదే గుణంతో, అదే గుణానికి చెందిన జీవిగా పుడతారని తెలుస్తోంది. చేసిన కర్మలు కూడా మనిషి తర్వాతి జన్మని నిర్ణయిస్తాయి.*


 *”సుకర్మలు అధికంగా ఉంటే మనిషి జన్మ, మరీ అధికంగా ఉంటే ఉత్తమ మానవ జన్మ, దుష్కర్మలు అధికంగా ఉంటే జంతువు, పక్షి, లేదా కీటకం, వృక్షాలు లాంటి జన్మలు వస్తాయి అని శాస్త్రం చెప్తోంది. మన కర్మని బట్టే దేవుడు మనల్ని సృష్టిస్తున్నాడు. (గీత 9-8)"*


 *”ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూత గ్రామమిమం కృత్స్నమ్ అవశం ప్రకృతేర్వశాత్"*


 *”తమతమ స్వభావ వశంలో పరతంత్రమైయున్న భూత సముదాయాన్ని నా ప్రకృతి నాశ్రయించి మాటిమాటికీ వాటి కర్మానుసారం సృష్టిస్తున్నాను."*


 *శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో “నిష్కారణంగా భార్యని హింసించిన భర్త బాల వితంతువుగా అనుభవించడానికి ఏడు సార్లు  పుడతాడు." అని చెప్పబడింది.*ఆదిత్యయోగీ*


 *పురుషుడు నలుగురైదుగురు స్త్రీలని వివాహం చేసుకుంటే, తర్వాతి జన్మలో ఆ పురుషుడు స్త్రీగా జన్మిస్తాడు. అతని మీద తమ కామ వాసనలు నశించని స్త్రీలు పురుషులుగా జన్మించి, ఆ స్త్రీని అనుభవిస్తారు. ఒకే జన్మలో ఇది జరిగితే వ్యభిచారదోషం కలుగుతుంది.*


*వేరు వేరు జన్మల్లో వివాహం చేసుకుంటే ఆ దోషం ఉండదు. కర్మ ప్రభావాన్ని బట్టి ఇది జరుగుతుంది.*


 *”భార్యాభర్తలని విడదీసిన పాతకులు స్త్రీ, పురుష జన్మ కాని నపుంసక జన్మని ఎత్తి, సంసార సుఖం అంటే ఏమిటో తెలీక మనస్థాపాన్ని అనుభవిస్తారు."*


*”తీరని తీవ్రమైన కోరిక కూడా తర్వాతి జన్మని నిర్ణయిస్తుంది. మరణించే సమయంలో మామిడి పండు తినాలన్న కోరిక కలిగితే, తర్వాతి జన్మలో మామిడి పండులో పురుగుగా పుట్టొచ్చు.*


 *మరణించేప్పుడు ఆఖరి శ్వాస సమయంలో ఏ ఆలోచన కలిగితే ఆ ఆలోచన ఫలితమైన జన్మ తర్వాతి జన్మగా వస్తుంది. ఇది భగవద్గీతలోని మాట (గీత 8-6)"*

* “మన సంకల్పాలే మన తర్వాతి జన్మని నిర్ణయిస్తాయి. ఆబ్బాయిలంతా తన వెంటపడాలనే కోరికగల అమ్మాయి సంకల్పం ఈ జన్మలో తీరకపోతే, తర్వాతి జన్మలో ఆడకుక్కగా పుడుతుంది. మగకుక్కలన్నీ ఏక కాలంలో ఆ ఆడకుక్క వెంట పడుతూంటాయి.” అని చెప్పారు.*


 *కనుక చిన్నవే కావచ్చు, పెద్దవే కావచ్చు …కోరికలనే ఉంచుకోవడం మంచిదికాదని అర్ధమవుతోంది."*


 *వేదాంతంలో వైరాగ్యానికే పెద్ద పీట వేశారందువల్లనే......*

.

పరుశురాముడు

 కుశిక వంశంలోని గాధిరాజు కుమారుడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని సోదరి సత్యవతి. ఋచీకమహర్షి సత్యవతి భర్త. అంటే విశ్వామిత్రుడు, సత్యవతి సోదర, సోదరీమణులు.


ఋచికుని యజ్ఞ ప్రసాదంవలన భార్య అయిన సత్యవతి , ఆమె యొక్క తల్లి ( అంటే విశ్వామిత్రుని తల్లి కూడా) ఒకేసారి గర్భం దాలుస్తారు. కానీ యజ్ఞపల ప్రసాదము తారుమారవుతుంది.

యజ్ఞ ఫల ప్రసాదము తారుమారవుటము

యజ్ఞ ప్రసాదం తీసుకున్న తర్వాత తెలుస్తుంది. 


ఫలితంగా క్షాత్రంతో పుట్టవలసినటువంటి కుమారుడు, గాధిరాజుకు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఉద్భవిస్తాడని,తపస్వత్వం తొ పుట్టవలసినటువంటి కుమారుడు, సత్యవతికి క్షాత్రంతో ఉద్భవిస్తాడని ఋచీకమహర్షి చెప్తాడు.


అందుకు సత్యవతి వాపోతుండగా ఆమె ఋచీక మహర్షి ఆమెను అనునయం చేస్తూ, చిన్న సవరణ చేస్తాడు. ఆమె కుమారుడికి ఋషత్వం ప్రసాదించి, ఆమె మనవడికి క్షాత్రత్వం ప్రసాదింప చేస్తాడు. 


ఫలితంగా సత్యవతికి జమదగ్నిమహర్షి కుమారుడు గాను, జమదగ్ని మహర్షికి కుమారుడుగా పరుశురాముడు ఉద్భవిస్తారు.

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*18-04-2024 / గురువారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


 దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో వచ్చిన అవకాశములు  సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------

వృషభం


నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరప్రాంత బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక విషయాలలో   అప్రమత్తంగా వ్యవహరించాలి. 

---------------------------------------

మిధునం


కొన్ని వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రయాణాలలో  తొందరపాటు పనిచెయ్యదు. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలతో ముందుకు సాగటం మంచిది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. 

---------------------------------------

కర్కాటకం


సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. బంధు మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

సింహం


అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. ఇంటా బయటా సమస్యలను  ధైర్యంగా ఎదుర్కొంటారు. పాత  రుణాలు తీర్చగలుగుతారు.  బంధువర్గంతో వివాదాలు రాజీ చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల ఫలితాలుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

కన్య


ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రులతో కలిసి కష్టసుఖాలు  పంచుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దూర ప్రాంత సన్నిహితుల  నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభం ఉన్నది.  చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారులు సహాయ సహకారాలు అందుతాయి.

---------------------------------------

తుల


స్థిరాస్తి వ్యవహారంలో బంధువుల నుండి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. క్రయ విక్రయాలలో నూతన  లాభాలు అందుకుంటారు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.

---------------------------------------

వృశ్చికం


సన్నిహితుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమించి లాభాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాలలో కీలక  నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

---------------------------------------

ధనస్సు


కుటుంబ సభ్యులకు మీ ప్రవర్తన నచ్చదు  చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా  వ్యవహరించాలి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో  అవరోధాలను అధిగమిస్తారు.

---------------------------------------

మకరం


దీర్ఘకాలిక రుణాలు తొలగుతాయి. ఆకస్మిక ధన లాభం ఉన్నది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. బంధు  మిత్రులతో దైవదర్శనం చేసుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అధికారులను   మీ పనితీరుతో  ఆకట్టుకుంటారు.

---------------------------------------

కుంభం


దూరపు బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో  మరింత జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి. సంతాన విషయాలపై   దృష్టి సారించడం మంచిది. 

---------------------------------------

మీనం


కొన్ని సమస్యలు నుండి సోదరుల సహాయంతో బయటపడతారు. క్రయ విక్రయాలలో విశేష లాభాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.  మొండి బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

రజోగుణాధిక్యతకు

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

       🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝  

*శౌర్యం తేజోధృతి ర్దాక్ష్యం*

*యుద్ధే చాప్య పలాయనం*

*దానమీశ్వరభావశ్చ* 

*క్షాత్రం కర్మ స్వభావజం* 


తా:-- శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమున పిరికితనంతో పారిపోకుండుట, దానశీలత, ప్రభుభావము ఇవి క్షాత్రమునకు సహజమైన గుణములు, ఇవి రజోగుణాధిక్యతకు ఫలములు....