25, ఏప్రిల్ 2023, మంగళవారం

శాఖ చంద్ర న్యాయం

 శాఖ చంద్ర న్యాయం - వేదాంతం 


పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి బింబముగా కనపడతాడు, వెన్నెల పిండి ఆరబోసినట్లు గా ఉంటుంది కాబట్టి పున్నమి చంద్రుడు ప్రతివారికి ఆకాశం వైపుచూస్తే చాలు కనపడతాడు. ఇంకొక విశేషము ఏమిటంటే పున్నమి చంద్రుడు రాత్రి పూర్తిగా అంటే సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటలవరకు ఆకాశంలో ప్రకాశిస్తూవుంటాడు కాబట్టి ఆ రోజు రాత్రి చంద్రుని ఎవరు చూపించనవసరం లేకుండానే అందరు చూడగలరు. 


కానీ అమావాస్య మరుసటి రోజు చంద్రుడు రేఖామాత్రంగా ఉండి ఆకాశంలో కేవలం 48 నిమిషాలు మాత్రమే ఉంటాడు కాబట్టి ఆ రోజు అంటే అమావాస్య వెళ్లిన పాడ్యమి నాడు చంద్రుని చూడటం చాలా కష్టం. దానికి కారణం చంద్రుడు చిన్నగా ఉంటాడు మరియు కొద్ది సమయం మాత్రమే ఉంటాడు. 


ఒక గురువు గారు ఆకాశంలో వున్న చంద్రుని తన శిష్యునికి చూపించదలచారు. అప్పుడు ఆయన ముందుగా అక్కడ వున్న ఒక చెట్టు కొమ్మను శిష్యునికి చూపించారు అది కంటికి దగ్గరగా వుంది కాబట్టి దాన్ని శిష్యుడు గుర్తించగలిగాడు. ఇక ఇప్పుడు చంద్రుని చూపించాలి దానికోసం గురువుగారు ఆ వృక్ష శాఖ లోని ఒక పత్రాన్ని చూపి దాని సందులో చంద్రుడు ఉన్నాడని చెప్పారు. తెలివైన శిష్యుడు ఆ శాఖ మధ్యనుండి గురువుగారు చెప్పిన విధంగా నిశితంగా పరిశీలించి చూసి సూక్ష్మ మాత్రంగా ఉన్న చంద్రుడిని చూసాడు. ఒక్కసారి చంద్రుని చూస్తే తరువాత శిస్యునికి మరల వృక్షశాఖతో నిమిత్తం లేదు ఆకాశంలో ఎటువంటి ఉపాధి లేకుండా చంద్రుని మరల చూడగలడు. ఎందుకంటె ఇప్పుడు శిష్యునికి చంద్రుడు ఎక్కడ వున్నదో పూర్తిగా జ్ఞానం కలిగి వున్నాడు. ఆ జ్ఞానం కలిగేటంతవరకే శాఖ యొక్క ఉపయోగం. ఒక్కసారి శిష్యునికి చంద్రుని గూర్చిన జ్ఞానం కలిగిన తర్వాత శాఖ పూర్తిగా మరచిపోతారు. కేవలం మనస్సు చంద్రుని మీద లగ్నం చేయగలుగుతాడు.


నిజానికి చంద్రుని చూడడానికి వృక్షశాఖతో పనిలేదు. కానీ గురువుగారు వృక్షశాఖను తన పనికి వాడుకున్నారు. ఎందుకంటె శిష్యుని దృష్టిని కేంద్రీకరించడానికి శాఖ ఒక ఉపయుక్తంగా లేక ఉపకరణంగా పనికి వచ్చింది. అదే వృక్ష శాఖ లేదనుకోండి అప్పుడు గురువు గారు శిష్యునికి చంద్రుని చూపించడం కుదిరే పని కాదు. ఎందుకంటె పాడ్యమినాడు చంద్రుడు చాలా సూక్ష్మంగా ఉండటమే కాకుండా కేవలం ఆకాశంలో 48 నిమిషాలు మాత్రమే ఉంటాడు. కాబట్టి శాఖ చంద్రదర్శనానికి చాలా తోడ్పడ్డదని మనకు తెలుస్తున్నది.


ఇక విషయానికి వస్తే భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు, నామ రహితుడు మరి అటువంటప్పుడు భగవంతుని దర్శించుకోవడం ఎలా ఎందుకంటే మన మనస్సు ఎల్లప్పుడూ ఏదో ఒక భౌతికమైన విషయం మీదనే లగ్నం అవుతుంది అది ప్రస్తుతం వున్నదో లేక గతంలో వున్న దాని భావనో ఏదో ఒకటి కావచ్చు. కాబట్టి మనస్సుకి ఒక చక్కటి శిక్షణ ఇవ్వాలి దానికోసం ముందుగా మనస్సుని ఏదో ఒక విషయం మీద స్థిరపరచాలి తరువాత నెమ్మదిగా శాఖమీది నుంచి దృష్టిని చంద్రుని వైపు మళ్లించినట్లు మనస్సుని భగవంతుని మీదకు మళ్లించవచ్చు.


కాబట్టి మన ఆరాధనా పద్దతులలో విగ్రహారాధన, యజ్ఞ యాగ, జపాది పద్ధతులు కేవలం సాధకుని మనస్సు స్థిరపరచటానికి ఏర్పాటు చేసిన విధానాలుగా మనం తెలుసుకోవాలి. ఒక విగ్రహారాధనను మనం చంద్రుని దర్శించుకోవడానికి ముందుగా శాఖను చూడటం లాగ తెలుసుకోవాలి. ఎలాగైతే చంద్రుని దర్శించుకున్న తర్వాత శాఖ ప్రయోజనం లేదో అలాగని నిరాకారుడైన భగవంతుని చేరుకొన్న సాధకునికి విగ్రహారాధనతో నిమిత్తం లేదు. ఇది తెలుసుకొని సాధనలో పట్టు సాధించాలి.


భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే విగ్రహారాధన నుంచి మనస్సు నిరాకారుని వైపు మళ్లించటం చెప్పినంత తేలిక కాదు నిరంతర అకుంఠిత సాధన చేస్తేనే కానీ అది సాధించగలడు. పట్టుదల, అవిరామ కృషి మాత్రమే సాధకుని దీక్షను ముందుకు సాగించగలవు. సాధనలో ఎన్నో అవాంతరాలు, ఇబ్బందులు, సాధకబాధకాలు వస్తూ వుంటాయి. కానీ నిజమైన సాధకుడు వాటినన్నిటిని అధిగమించి తన సాధనను ముందుకు కొనసాగించాలి. నిజానికి ఆధ్యాత్మిక జీవనం చాలా కష్టతరమైనది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇసుకను పిండి నూనెను పట్టినట్టు. ఎంతో దుర్లభమైన సాధన చేస్తేగాని మోక్షం సిద్దించదు. మనకు అనేకమంది వాచావేదాంతులు తారసపడి మనలను తప్పుడు త్రోవలో పంపడానికి ప్రయత్నిస్తుంటారు వాటిని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో నిజమైన సాధకులు చాలా తక్కువగా వున్నారో లేక లేరో నాకు ఇంకా పూర్తిగా తెలియడం లేదు. ఒక్క మాట మాత్రం చెప్పగలను మన చుట్టూ ఉన్న సమాజంలో మాత్రం నిజమైన సాధకులు లేకపోవచ్చు. ఎక్కడో అరణ్యాలలోనో లేక హిమాలయాలలోనో ఉంటే ఉండవచ్చు. పై పై డాంబికాలు పోయి తామే సద్గురువులమనే కుహనా వేదాంతులు మనకు అడుగడుగునా కనిపిస్తారు. వారితో జాగ్రత్త. నీగమ్యం నిర్ధారించుకొని అడుగు ముందుకు వేయి.


ఓం తత్సత్


ఓం శాంతి శాంతి శాంతిః


ఇట్లు భార్గవ శర్మ


శంకరజయంతి

 🕉️ * శంకరజయంతి* 🕉️


🚩🚩🚩ఈ  రోజు జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల యొక్క ఆవిర్భావ దినం. ఇది సనాతన ధర్మం అంతటికీ పండుగరోజు. 


 ఎంతవరకూ దేహమే నేను అనే భావం ఉంటుందో అంతవరకూ వైదికమైన సత్కర్మలు ఆచరించాలి. 

షణ్మతాలూ ఈ మూడు సిద్ధాంతాలతో ఉంటాయి. 

ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతములు X  షణ్మతములు = హిందూ ధర్మం యొక్క స్వరూపం.


అద్వైతం అనే ఒకానొక జ్ఞానం భూమికగా కలిగి ఉన్నట్లయితే పరస్పర వైరములు లేకుండా ఉంటాయి. అందుకే ఆదిశంకర భగవత్పాదుల వారు అద్వైతం ప్రతిష్ఠాపన చేస్తూ “ఉన్నది ఒక్కటే పరమాత్మ తత్త్వము. జీవుడికి కూడా దేహాత్మ భ్రాంతి ఉన్నంతవరకే భేదం కానీ అది తొలగించి చూస్తే సత్య దృష్టితో అద్వైతమే” అని చెప్పారు. 


వ్యవహారంలో అద్వైతం కుదరదు, ద్వైతమే ఉంటుంది. పరమార్థంలోనే అద్వైతం. పారమార్థిక దృష్టి కలిగి వ్యవహార జీవనంలో ఉన్నప్పుడు అద్వైత స్పృహలోనే ద్వైత జగత్తులో ఉంటాం. దీనివల్ల సమాజంలో ఒక శాంతి ఏర్పడుతుంది. 


సిద్ధాంతాలు అర్థం అయినా అవకపోయినా శంకర సిద్ధాంతంలో ఉన్న వారికి ఎవరి ఇష్టదేవతలు వారికి ఉన్నా ఇతర దేవతలను ద్వేషించరు. అది ఒక్కటి చాలు ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచే పద్ధతి. 


శంకరాచార్య శైవులు కాదు. ఆయన శివాంశ సంభూతులు అని శంకర విజయాలు చెప్పాయే తప్ప ఆయన శైవుడు కాదు. 

వైదిక శైవం గురించి చెప్పాలంటే శ్రీకంఠాచార్యులు, వీరశైవం బసవేశ్వరులు మొదలైన వాళ్ళు ఇచ్చారు.

శైవం వేరు, వైష్ణవం వేరు, శాక్తేయులూ ఉన్నారు. వారందరూ ఆగమ మతాలు. కానీ శంకరాచార్యుల వారికి శివుడు, విష్ణువు, భేదం లేదు. ఉన్నది ఒక్కటే పరమాత్మ. ఆయన నిర్గుణుడు, నిరాకారుడు. కానీ భక్తులు ఉపాసనా సౌలభ్యం కోసం ఆయన అనేక రూపాలు స్వీకరిస్తాడు. విష్ణువు, శివుడు ఒకే పరమాత్మ నామములే.  ఆ పరమాత్మ ప్రతి జీవుడిలో అంతర్యామియే.  తత్త్వతః తెలుసుకోగలిగితే జీవుడికీ పరమాత్మకీ భేదం లేదు. ఇది శంకర సిద్ధాంతం.

శంకరులు ఎప్పుడూ శైవం కాదు, ఇది ముందు తెలుసుకోవాలి. 

 శంకరుల ధర్మంలో శైవం, వైష్ణవం అన్నీ కలిసి ఉంటాయి. షణ్మత ప్రతిష్ఠాపనాచార్య అనే పేరు కూడా ఉన్నది. 


ప్రస్తుతం సనాతనధర్మం కలిసికట్టుగా ఉండాలంటే ఎవరి సంప్రదాయం వారు పాటించాలి. ఇతర సంప్రదాయాలను గౌరవించాలి. ఇది సత్సంప్రదాయం. చాలా అవసరం. 




సనాతన ధర్మం వేదంలోనుంచి వచ్చిన ఆరుమతాలనూ చూపిస్తూ ఎవరి దేవతలను వారు ఆరాధించుకోండి, ఇతరులను గౌరవించండి.


హిందూధర్మం మొత్తానికి ఒక గురువును చెప్పుకోవాలంటే ఆ గురువు ఆదిశంకర భగవత్పాదులు మాత్రమే.  ఆయన వచ్చిన తరువాతనే అవైదిక మతాల ధాటికి చెదిరిపోయినటువంటి శైవవైష్ణవాదులు తిరిగి ఊపిరి పోసుకున్నాయి. అందుకే ఆయనని “షణ్మతప్రతిష్ఠాపనాచార్య’ అన్నారు. 


సనాతన హిందూ ధర్మానికి సమగ్రమైనటువంటి జగద్గురువులుగా ఆదిశంకరులను గౌరవిస్తూ వారి సంప్రదాయ గురువులను గౌరవించుకోవచ్చు. తప్పులేదు. 

 అన్ని రకాల సంప్రదాయాలు ఆ సంప్రదాయంలోని గురువుల వల్లనే పుష్టి పొందాయి. ఈ సంప్రదాయాలన్నింటినీ గౌరవించడం అనే సంప్రదాయం మాత్రం జగద్గురువులు ఆదిశంకర పరంపరలో ఉంది నేటికి కూడా. శంకర పీఠములన్నింటిలోని వారూ ఇటువంటి సామరస్య ధోరణితో ఉన్నటువంటి వారే. పీఠ పరిపాలిత దేవాలయాలలోనూ హైందవ దేవతలందరూ ఆరాధింపబడుతూ ఉన్నారు. నారాయణ స్మరణ, చంద్రమౌళీశ్వరారాధన, శ్రీచక్రార్చన చేస్తారు. సనాతనధర్మం యొక్క స్వరూపం ఇది. 


ప్రతి సంప్రదాయం వాళ్ళూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం వారి సంప్రదాయం వదులుకోకుండా ఇతర సంప్రదాయాలను గౌరవించడం నేర్చుకోవాలి. విష్ణువే గొప్ప శివుడు కాదు అని వాళ్ళ గ్రంథాలను భుజాన మోసుకొని ఎలా తిరుగుతున్నారో, శివుడు తప్ప ఇంకెవరూ గొప్ప కాదు అని చెప్తూ గ్రంథములు మోసుకు తిరగడానికి వాళ్ళూ సిద్ధంగా ఉన్నారు. ఏ నూతిలో మండూకానికి ఆ నూతి లోతు తెలిసినట్లు ఏ సంప్రదాయజ్ఞుడికి ఆ సంప్రదాయపు లోతు తెలుస్తుంది.  తమకు తెలియని సంప్రదాయాల గురించి అవహేళనగా, కించపరచి మాట్లాడరాదు. సందర్భం వస్తే అది మా సబ్జెక్ట్ కాదు అని నమస్కారం చేయడం చాలా మంచిది.  


సనాతనధర్మం పరస్పర ద్వేషాలు, చీలికల జోలికి వెళ్ళకుండా సమన్వయ ధోరణిలో వెళ్ళాలి అని ఒక సంకల్పం తీసుకోవాలి.  సామాన్యులకి  ధర్మము, భక్తి – ఈ రెండూ చాలా ప్రధానం. 


మనది మనం పాటిద్దాం, ఇతరులను గౌరవిద్దాం. ఈ సంప్రదాయాన్నిమనకు బోధించిన జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల పాదపద్మాలకు నమస్కరిద్దాం.🚩🚩🚩🚩

24, ఏప్రిల్ 2023, సోమవారం

వైశాఖ పురాణం - 2 వ అధ్యాయము



వైశాఖ పురాణం - 2 వ అధ్యాయము🚩*_


🕉🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️


*వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు - వాని ఫలితములు*


☘☘☘☘☘☘☘☘☘


నారదమహర్షి అంబరీష మహారాజుతో మరల నిట్లనెను. అంబరీష మహారాజా ! వినుము. విష్ణుప్రీతికరమగుటచే మాధవమాసమని వైశాఖమునందురు. 


వైశాఖ మాసముతో సమానమైన మాసములేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేదసమానమైన శాస్త్రము లేదు. 

గంగాజలమునకు సాటియగు తీర్థ జలము లేదు. 

జలదానముతో సమానమైన దానము లేదు. 

భార్యా సుఖముతో సమానమైన సుఖము లేదు. 

వ్యవసాయము చేయుటవలన వచ్చు ధనమునకు సాటియైన ధనము లేదు. జీవించుటవలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు.


నిరాహారముగ చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుటవలన వచ్చు సుఖమునకు సాటియైన సుఖము లేదు. దయాసమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజనతృప్తితో సమమైన తృప్తి వ్యవసాయముతో సమమైన వ్యాపారము , ధర్మసమమైన మిత్రుడు , సత్యసమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి , శ్రీమహావిష్ణుసముడైన రక్షకుడు , వైశాఖసమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు.


శేషశాయియగు శ్రీమహావిష్ణువునకు వైశాఖమాసము మిక్కిలి ప్రియమైన మాసము ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగ గడపిన వాడు ధర్మహీనుడగుటయే కాదు , పశుపక్ష్యాది జన్మలనందుచున్నాడు. వైశాఖమ్మాసవ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట , యజ్ఞయాగాదులను చేయుట మున్నగువానినెన్ని ధర్మకార్యములను చేసినను వైశాఖమాస వ్రతమును పాటింపనిచో ఇవి అన్నియు వ్యర్థములగుచున్నవి. వైశాఖవ్రతమును పాటించువానికి మాధవార్పితములగావించి భక్షించి ఫలాదులకును శ్రీమహావిష్ణు సాయుజ్యము కలుగును. అధికధనవ్యయముచే చేయు వ్రతములెన్నియో యున్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములును యెన్నియో యున్నవి. ఆ వ్రతములన్నియు తాత్కాలిక ప్రయోజనములను కలిగించును. అంతియే కాదు, పునర్జన్మను కలిగించును. అనగా ముక్తి నీయవు. కనుక నియమ పూర్వకమైన వైశాఖమాస ప్రాతఃకాల స్నానము పునర్జన్మను పోగొట్టును అనగా ముక్తినిచ్చును.


అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము , సర్వతీర్థములయందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖమాసమున జల దానము చేసినంతనే వచ్చును. ఆ దానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి కల మరియొకనిని ప్రబోధించినచో అట్టివానికి సర్వసంపదలు కలుగును. హితములును చేకూరును. దానములన్నిటిని ఒకవైపునను జలదానమును మరొకవైపునను వుంచి తూచినచో జలదానమే గొప్పది యగును.


బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రము నేర్పరచి జలదానము చేసినచో వాని కులములోని వారందరును పుణ్యలోకములనందుదురు. జలదానము చేసినవారు విష్ణులోకము నందుదురు. చలివేంద్రము నేర్పరచుటచే బాటసారుల సర్వ దేవతలు పితృదేవతలు అందరును సంతృప్తులు ప్రీతినంది వరముల నిత్తురు. ఇది నిస్సంశయముగ సత్యము సుమా. దప్పికగలవాడు నీటిని కోరును. ఎండ బాధపడినవాడు నీడను కోరును. చెమటపట్టినవాడు విసురుకొనుటకు విసనకఱ్ఱను కోరును. కావున వైశాఖమాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు , జలమును(నీరుకల చెంబును), గొడుగును , విసనకఱ్ఱను దానమీయవలెను. నీటితో నిండిన  కుంభమును దానమీయవలయును. ఇట్లు దానము చేయనివాడు చాతకపక్షియై(చాతకమను పక్షి భూస్పర్శకల నీటిని త్రాగిన చనిపోవును. కావున మబ్బునుండి పడుచున్న నీటి బొట్టులను క్రింద పడకుండ ఆకాశముననే త్రాగి యుండును. ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు) జన్మించును.


దప్పిక కలవానికి చల్లని నీటినిచ్చి యాదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎండకువచ్చిన వానికి విసనకఱ్ఱతో విసిరి యాదరించినవాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభము నందును అట్లు జలము నీయనివారు బహువిధములైన వాతరోగములనంది పీడితులగుదురు ఎండకువచ్చినవానికి విసురుటకు విసనకఱ్ఱ లేనిచో పైబట్టతో(ఉత్తరీయము) విసిరినవాడు పాపవిముక్తుడై విష్ణుసాయుజ్యము నందును. పరిసుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకఱ్ఱ నిచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకము నందును అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకఱ్ఱనీయనివాడు నరకలోక బాధలనంది భూలోకమున పాపాత్ముడై జన్మించును.


గొడుగును దానము చేసినచో ఆధిభౌతిక , ఆధీఅత్మిక దుఃఖములు నశించును. విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగుదానమీయనివాడు, నిలువ నీడలేనివాడై పిశాచమై బాధపడును. వైశాఖమాసమున పాదుకలను దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును మరియు నిహలోకమున బాధలను పొందడు , సర్వసుఖములనందును. చెప్పులు లేక బాధపడువానికి , చెప్పులులేవని అడిగినవానికి చెప్పులను దానము చేసినవాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు , బాటసారులకు ఉపయోగించునట్లుగా అలసట తీర్చునట్లుగా మండపము మున్నగువానిని నిర్మించినవాని పుణ్యపరిమాణమును బ్రహ్మయును చెప్పజాలడు. మధ్యాహ్నకాలమున అతిధిగ వచ్చినవానిని ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీషమహారాజా ! అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము. కావున అన్నదానముతో సమానమైన దానములేదు. అలసివచ్చిన బాటసారిని వినయమధురముగ కుశలమడిగి యాదరించినవాని పుణ్యము అనంతము. ఆకలిగలవానికి, భార్యసంతానము , గృహము , వస్త్రము , అలంకారము మున్నగునవి యిష్టములు కావు. ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము యిష్టము ఆవశ్యకము. కాని ఆకలి తీరినచో నివియన్నియు నిష్టములు ఆవశ్యకములు నగును. అనగా అన్నము భార్య మున్నగువారికంటె ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము అన్ని దానములకంటె నుత్తమమైనదని భావము. కావున అన్ని అన్నదానముతో సమానమిన దానము యింతకు ముందులేదు , ముందుకాలమున గూడ నుండబోదు. వైశాఖమాసమున అలసిన బాటసారికి జలదానము , చత్రదానము , వ్యజనదానము , పాదుకాదానము , అన్నదానము మున్నగునవానిని చేయని వారు పిశాచమై ఆహారము దొరుకక తన మాంసమునే భక్షించునట్టి దురవస్థను పొందుదురు. కావున అన్నదానము మున్నగువానిని యధాశక్తిగ చేయవలయును. రాజా ! అన్నమును పెట్టినవాడు తల్లినిదండ్రిని తన ఆదరణ మున్నగువానిచే మరపించును. కావున త్రిలోకవాసులందరును , అన్నదానముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మ నిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కాని అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రులకంటె నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతాస్వరూపుడు , సర్వదేవతాస్వరూపుడు , సర్వధర్మ స్వరూపుడు అనగా అన్నదానమున , అన్ని తీర్థములు(వానిలో స్నానము చేసిన పుణ్యము) సర్వదేవతలు(వారిని పూజించిన ఫలము) సర్వధర్మములు(అన్ని ధర్మముల నాచరించిన ఫలము) కలుగునని భావము.


*వైశాఖపురాణం రెండవ అధ్యాయం సంపూర్ణం*



: *🚩వైశాఖ పురాణం - 3 వ అధ్యాయము🚩*_


🕉🌹🕉️🌹🕉️🌹🕉️🌹


*వివిధ దానములు - వాని మహత్మ్యములు*


☘☘☘☘☘☘☘


నారదమహర్షి మాటలను వినిన అంబరీష మాహారాజు నారదమహర్షికి నమస్కరించి మహర్షీ ! వైశాఖమాసమున చేయదగిన దానము లివియేనా ? మరి యింకనూ ఉన్నవా ? అవి యేవి ? వాని ఫలితములను గూడ దయయుంచి వివరింపుమని కోరెను.


అప్పుడు నారదమహర్షి యిట్లనెను. చల్లనిగాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును (మంచమును) సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చినవారు ధర్మసాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండ జీవింతురు. ఎట్టి తాపత్రయములు ఆధివ్యాధులు లేకుండ సుఖముగ జీవింతురు. ఇహలోకసుఖముల ననుభవింతురు. పాపములు లేకుండనుందురు. అంతియేకాదు మహాయోగులు సైతము పొందలేని అఖండమోక్ష సామ్రాజ్యమునందుదురు. వైశాఖమాసపు యెండలకు బాధపడినవారికి బ్రాహ్మణశ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి యుత్తమ పర్యంకమునిచ్చి యిహలోకముననెట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు  సద్బ్రాహ్మణుడు ఆశయనముపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వపాపములును అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును. ఇహలోక సుఖములననుభవించి మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖమాసమున కశిపును (పరుపు లేక వస్త్రము) మంచముపై మంచి ఆచ్చాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై చక్రవర్తి సమానులై తమ వంశము వారితో బాటు శారీరక , మానసిక బాధలు లేకుండ సుఖశాంతులతో అభివృద్ధి నందుదురు. ఆయురారోగ్యములను కీర్తిప్రతిష్ఠలను పొందుదురు. నూరు తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు. తుదకు ముక్తినందును. శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతోబాటు దిండును గూడ దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును , పరుపును , దిండును యిచ్చుటచే ఆ దాత అందరకు అన్నివిధముల ఉపకారము చేయువాడై ప్రతిజన్మయందును , సుఖవంతుడు , భోగవంతుడు , ధర్మపరాయణుడై అన్నిటా విజయమునందుచు యేడు జన్మల వరకు మహావైభవముగ గడిపి తుదకు ముక్తినందును. తనతోబాటు నేడు తరములవారికిని ముక్తిని కలిగించును. గడ్డి తుంగ మున్నగువానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీమహావిష్ణువు సంప్రీతితో తానే దానియందు శయనించును. ఊర్ణ , ఉన్ని , గొఱ్ఱె బొచ్చు నీటియందు పడినను తడవకనుండునో అట్లే పర్యంక శయ్యా దానము చేసినవారు. సంసారసముద్రములోనున్నను ఆ వికారములంటని స్థితిని పొందుదురు. అట్టి పర్యంక శయ్యాదానమును చేయలేనివారు కట(చాప) దానమును చేయవచ్చును. శక్తియుండి పర్యంక శయ్యాదానము చేసిన వచ్చునట్టి పుణ్యమే అశక్తులై కట శయ్యాదానము చేసినవారికిని వచ్చును. పడుకొనిన వారికి నిద్రచే శ్రమ , దుఃఖము నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములనిచ్చును. రాజా ! వైశాఖమాసమున కంబళి దానము చేసినవానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవానిని గావించును.


ఎండచే పీడింపబడినవానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయమునంది తుదకు ముక్తినందును. లోని తాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును. దుఃఖములు నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పముల దానమిచ్చినచో సర్వజనులను వశపరచుకొన్న మహారాజై చిరకాలము సుఖించును. కుమారులు , మనుమలు మున్నగువారితో సర్వసౌఖ్యములనంది ముక్తినందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున కర్పూర , తాంబూల దానమిచ్చినచో చక్రవర్తియై మోక్షమునందును. చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయమునశించి సుఖించును. దుఃఖములు , పాపములు లేకుండ జీవించి ముక్తి నందును. కస్తూరి మున్నగు సుగంధద్రవ్యముల నిచ్చినచో నెట్టి బాధలు లేకుండ జీవించి మోక్షమునందును. పద్మమాలను గాని అడవిమల్లెల మాలనుగాని దానమిచ్చినచో చక్రవర్తియై సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తినందును. వైశాఖమున మొగలి , మల్లెపువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని యనుగ్రహమున సుఖ భోగములనంది ముక్తి నందును. పోక చెక్కలను , సుగంధద్రవ్యమును , కొబ్బరి కాయలను దానమిచ్చినచో నేడు జన్మలవరకు బ్రాహ్మణుడై జన్మించి వేదపండితుడు , ధనవంతుడై యుండి యేడు తరములవారితో గలసి ముక్తినందును.


సద్బ్రాహ్మణుని యింటిలో విశ్రాంతి మండపమును కట్టించి యిచ్చినచో వాని పుణ్యము యింతయని చెప్పుటకు మాటలకందనిది సుమా. నీడనిచ్చు మండపము , నీడలోనున్న యిసుక తిన్నెలు , చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు , జనులకు ఉపకారము చేసినవారు లోకాధిపతులగుదురు.


మార్గమున తోట , చెరువు , నూయి , మండపము, వీనిని నిర్మింపజేసినవానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందువలని భయము లేదు. నూయి , చెరువు , తోట , విశ్రాంతి మండపము , చలివేంద్రము , పరులకుపయోగించు మంచి పనులు చేయుట , పుత్రుడు యివియేడును సప్తసంతానములని పెద్దలు చెప్పుచున్నారు. వీనిలోనే యొకటి చేయకున్నను మానవునకు పుణ్యలోకప్రాప్తి లేదు.


సచ్చాస్త్రశ్రవణము, తీర్థయాత్ర , సజ్జన సాంగత్యము , జలదానము , అన్నదానము , అశ్వర్థరోపణము (రావి చెట్టును నాటుట)  పుత్రుడు అను నేడును సప్తసంతానములని వేదవేత్తలు చెప్పుచున్నారు. వందలకొలది ధర్మకార్యములను చేసినను సంతానము లేనివానికి పుణ్యలోకప్రాప్తి లేకుండుటచే నతడు పైన చెప్పిన యేడు సంతానములలో యధాశక్తిగ వేనినైనను ఏ ఒకదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములనందవచ్చును. పుణ్యపాప వివేకములేని పశువులు , పక్షులు , మృగములు , వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవుటచే పుణ్యలోకప్రాప్తినందవు. కాని పుణ్యపాప వివేచనాశక్తి కలిగిన మానవులి సద్ధర్మముల నాచరింపనిచో వారికి పుణ్యలోకములెట్లు కలుగును.


ఉత్తమములైన పోకచెక్కలు , కర్పూరము మున్నగు సుగంధద్రవ్యములు కల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నియు పోవును. తాంబూల దాత కీర్తిని ధైర్యమును , సంపదను పొందును. నిశ్చయము , రోగియైనవాడు తాంబూల దానము నిచ్చినచో రోగవిముక్తుడగును. ఆరోగ్యము కలవాడు తాంబూల దానమిచ్చినచో ముక్తినందును. వైసాఖమాసమున తాపహారకమైన తక్రమును(మజ్జిగ) దానమిచ్చినవాదు విద్యావంతుడు , ధనవంతుడు నగును. కావున వేసవి కాలమునందు తక్రదానము తప్పక చేయదగినది సుమా. వేసవికాలమున ప్రయాణము చేసి అలసినవానికి మజ్జిగ నిచ్చిన మరింత పుణ్యమును కలిగించును. నిమ్మపండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగయైన దప్పిక కలవానికి హితకరముగ నుండును. వైశాఖమాసమున దప్పిక తీరుటకై బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగు కుండనిచ్చినచో కలుగు పుణ్యమెంతటిదో నేను చెప్పజాలను. అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీవల్లభుడైన మధుసూదనునకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్ఠమైన బియ్యమును దాన మిచ్చినవారు పూర్ణాయుర్దాయమును , అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమునుపొందును. తేజోరూపమైన గోఘ్ర్తమును(ఆవునేయి) సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు అశ్వమేధయాగము పుణ్యమునంది తుదకు విష్ణుపదమును చేరుదురు.


విష్ణుప్రీతికరమైన వైశాఖమాసమున బెల్లమును దోసకాయను దానమిచ్చినవారు సర్వపాపములను పోగొట్టుకొని శ్వేతద్వీపమున వసింతురు. పగటి యెండకు అలసినవానికి సాయంకాలమున చెరకు గడను బ్రాహ్మణునకు దానమిచ్చినచో వానికి గలుగు పుణ్యమనంతము. వైశాఖమాసమున సాయంకాలమున యెండకు అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును. పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందమును పొందుదురు. దాతకు వాని పితృదేవతల ఆశీస్సులు లభించును. వైశాఖమాసమున పానకముతో బాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వపాపములు హరించును. పుణ్యలోకప్రాప్తి కలుగును. చైత్రమాసమునందలి అమావాస్యయందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున నూరుమార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును. ఆ పానకమున కస్తూరి కర్పూరము వట్టివేళ్లు మున్నగువానిని కలిపి చైత్రమాసము నందలి అమావాస్యయందు దానమిచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన శ్రాద్ధముల నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించెను.


*వైశాఖపురాణం మూడవ అధ్యాయం  సంపూర్ణం*


           🌷 *సేకరణ*🌷

      🌹🕉️🌹🌹🕉️🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

 వృద్ధాప్యం:-


*_చమకం యజుర్వేదంలోని శ్రీరుద్రంలో ఒక భాగం. చమకంలో ఒకచోట - ఈ విచిత్రమైన కోరిక ఉంది._*


*''వృద్ధం చమే, వృద్ధిశ్చమే'*' 


*_ఇదేమిటి ? నాకు వృద్ధినియ్యి అన్నంతవరకూ బాగానే వుంది. నాకు వృద్ధాప్యాన్ని యివ్వమని అడుగుతాడేమిటి ? అని ఆశ్చర్యం. కోరికలనుంచీ, ఈ జీవితంలో సుఖాల నుంచీ బయటపడలేని జీవుడు -అలా బయటపడేసే మానసిక స్థితిని, ఆ దశని ప్రసాదించు స్వామీ -అంటూ ఆ కోరికల వెల్లువలోనే ఒక విచిత్రమైన కోరికని జతచేశాడు._*


*_అన్ని కోరికలనుంచీ విముక్తం చేసే -లేదా విరక్తిని కలిగించే వృద్ధాప్యాన్ని ప్రసాదించు -అని వేడుకోవడం బహుశా ఏ మతంలోనూ ఏ భక్తుడూ ఏ దేవుడినీ యింత పరిణతితో, యింత గంభీరమైన కోరిక కోరలేదేమో !_*


*_''ఈ మనస్సు కోతి స్వామీ ! దానికి ఉన్న చాపల్యాలన్నీ తీర్చు. తప్పదు. చేసేదీ లేదు. కాని ఏదో ఒకనాడు ఈ చాపల్యాలన్నింటినీ వదులుకొనే దశనీ, స్థాయినీ, వయస్సునీ -వృద్ధాప్యాన్ని ప్రసాదించు'' అంటున్నాడు జీవుడు._*


*_వృద్ధాప్యం ఒక మజిలీ.._*


*_ప్రతీ వ్యక్తీ కోరుకున్నా కోరుకోక పోయినా తప్పనిసరిగా చేరుకునే మజిలీ. వయస్సులోని కోరికలన్నింటికీ సెలవిచ్చి, అలసిపోయిన అనుభవాలనీ, ఆరిపోయిన అనుభూతులనూ నెమరువేసుకునే చలివేంద్రం. వృద్ధాప్యం ఒక అవకాశం. వెనక్కి తిరిగి చూసుకుని చేసిన తప్పిదాలకు నవ్వుకుని, దాటిన అడ్డంకులను పరామర్శించి, ఇక దాటనక్కరలేని స్థితికి వచ్చినందుకు ప్రశాంతంగా నిట్టూర్చే ఆటవిడుపు. ముసిలితనం కొడుకు కంటె ఒక అడుగు వెనక నడిపిస్తుంది. మనవరాలి భుజాన్ని ఆసరా చేసుకుంటుంది._*


*_జీవితమంతా కొరుకుడుపడని నిజాలతో ఆనందంగా రాజీపడేటట్టు చేస్తుంది. పిల్లలు ''నీకేం తెలీదు నాన్నా !'' అంటే కోపం రాదు. ఒక జీవితకాలాన్ని తెలీనితనానికి తాకట్టు పెట్టిన కొడుకుని చూసి నవ్వుకుంటుంది. తనకి తెలీదని పక్కకి తప్పించే తరాన్ని చూసి గర్వపడుతుంది. అవలీలగా అర్థం చేసుకుంటుంది. ''వాడికి తోచినట్టే చెయ్యనివ్వండి'' అనే భార్య హితవుకి గంభీరంగా తలవొంచుతుంది. ఏ విమర్శా అవమానం అనిపించదు. ఏ నిందకీ కోపం రాదు. వృద్ధాప్యాన్ని అందరూ గౌరవిస్తారు. నీ జీవితకాలంలో సాధనల్ని పక్కనపెట్టి కేవలం వయస్సు కారణంగానే పెద్దరికాన్ని అంగీకరిస్తారు. అదొక అంతస్థు._*


*_అతని హితవుని నలుగురూ వింటారు. నీ ఆలోచనని గౌరవిస్తారు. దాన్ని పాటించరని అర్థమవుతున్నా కోపం రాదు. వయస్సు అర్థం చేసుకునే సంయమనాన్ని నేర్పుతుంది._*


*_''మా రోజుల్లో...'' అని చెప్పుకోవడంలో చిన్న 'సాకు'ని వృద్ధాప్యం మప్పుతుంది. ''ఈ కాలం కుర్రాళ్లు...'' అన్న వెక్కిరింతకి అర్హతని సంపాదించి పెడుతుంది. తన గురించి తన పెద్దలూ అలనాడు -అలాగే అనుకొని ఉంటారని అప్పుడు జ్ఞాపకం వస్తుంది._*


*_వేసిన ప్రతీ అడుగూ తెలిసి వేసే నమ్మకాన్నిస్తుంది. చేసే ప్రతీ పనీ యిబ్బంది లేని, శ్రమ అనిపించని మార్గం వేపే ప్రయాణం చేయిస్తుంది. తన 'రేపు' క్రమక్రమంగా కురుచనయిపోతోందని అర్థమవుతూంటుంది. దక్కిన చిన్న తప్పుల్ని వృద్ధాప్యం భద్రంగా అలంకరించుకుంటుంది. ''మనకి చేతకాదు'' అని చెప్పడం పెద్ద అర్హతగా కనిపిస్తుంది. అసాధ్యానికి 'అనవసరం' అంటూ గడుసుదనం చిన్న ముసుగు వేస్తుంది. దానికి ఊతం వృద్ధాప్యం._*


*_జీవితంలో చాలా ప్రశ్నలకు సమాధానాలు అర్థమవుతూంటాయి. ఇప్పుడా సమాధానాలకూ వేళ మించిపోయిందని అర్థమవుతుంది. ఈ సమాజంలో అవినీతి అనే కుళ్లు ఎప్పుడు తొలగుతుంది ? ప్రతీక్షణం దోపిడీకి గురవుతున్న ఈ పర్యావరణం ఒక్కసారి ఎదురు తిరిగితే ఏమవుతుంది ? ఏమయినా తనకేం బాధలేదు. ఆ సమయంలో తను ఉండడు. ఈ జీవిత నుంచి శలవు తీసుకోవడమే తనకి ఉపశమనం._*


*_దేవుడు ఎక్కడ ఉంటాడు ? ఎలా వుంటాడు ? మృత్యువు తరువాత ఏమవుతుంది ? సమాధానాలు అర్థమయే క్షణాలు దగ్గరవుతున్నాయి. చుట్టూవున్న జీవితాన్ని క్రమంగా ఖాళీ చేసుకుంటుంది వృద్ధాప్యం. చిన్నకేక తుళ్లిపడేటట్టు చేస్తుంది. చిన్న నిశ్శబ్దం ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పటిలాగే తెల్లారి, వృద్ధులతో కలిసి నడిచి, రెండుముద్దల అన్నం తిని, అరగంట సేదతీరి, వేడి టీ తాగి, సాయంకాలం పార్కు బెంచీ దగ్గర ''ఈ దేశం తగలడిపోతోంద'ని తిట్టుకుని, శాంతపడి -కీళ్ల నొప్పులకు మాత్రలు మింగి, రాని నిద్రనీ, నిన్నటి జ్ఞాపకాలనీ నెమరు వేసుకోవడం -వృద్ధాప్యం వ్యసనం._*


*_ఇప్పుడు విచారం దగ్గరకు రాదు. వెళ్లిపోయిన హితులూ, సన్నిహితులూ దిగులుగా జ్ఞాపకం వస్తారు. ముగింపు భయపెట్టదు. ఎందుకంటే భయపడినా రాకతప్పదు కనుక. అన్నిటినుంచీ, అందరినుంచీ తనని కుదించుకుని -మెల్లగా అంతర్ముఖుడు కావడం వృద్ధాప్యం._*


*_ఇప్పుడు అన్ని దురదృష్టాలకూ కారణాలు అర్దమౌతాయి. చేసిన తప్పిదాలు, మాటతప్పిన కప్పదాట్లూ, మనసు నొప్పించిన చిన్న చిన్న జ్ఞాపకాల ముళ్లూ -అవన్నీ ఓ జీవితకాలం ఆలస్యంగా కళ్లముందు కదుల్తాయి. ఈ అనుభవాల్ని హెచ్చరికలు చెయ్యబోతే పిల్లలు వినరు. వినినట్టు నటిస్తారు. నటిస్తున్నారని తనకీ తెలుసు. విన్న తృప్తిని తానూ నటిస్తాడు. వారికీ వృద్ధాప్యం ఒకనాడు పాఠాలు చెప్తుందని తెలుసు. కాని వృద్ధాప్యం ఒక వరమని ఇప్పుడు చెప్పి ఒప్పించలేడు. వారు ఒప్పుకునే వేళకి తను ఉండడు.

జీవితం ఎంత విచిత్రం ! నవ్వుకుంటాడు. ఆ నవ్వు ఖరీదు ఒక జీవితం.'చమకం' ఏ రుషి, ఏ మహానుభావుడు ఎప్పుడు సృష్టించారో -ఎంత ముందుచూపు, ఎంత వినయసంపద, జీవుని నిస్సహాయత, నిర్వేదం -అందులో నిక్షిప్తమయివుందో -ఆనాటి కోరిక సంపూర్ణమయిన స్వరూపంతో కళ్లముందు దర్శనమిచ్చేనాటికి -తాను జీవితమంతా కోరుకున్న 'వృద్ధాప్యం' తనని ఆవరించుకుని ఉంటుంది. ఈ దేశపు వేద సంపద, సాంస్కృతిక వైభవం, జాతి దర్శనం అపూర్వం, అనన్యసామాన్యం._*


*_చమకంలో 'వృద్ధం చమే' అనే ఒక్క కోరికా ఈ జాతినీ, మతాన్నీ, ఆలోచనా స్రోతస్సునీ అత్యద్భుతంగా ఆవిష్కరించే అభిజ్ఞ. వరం. భగవంతుడిని కోరడంలోనే భగవంతుడు ప్రసాదించిన తన ఆలోచనా పరిణతిని అలంకరించే భగవద్దత్తమైన ఆశీర్వాదం. అదీ వృద్ధాప్యం !!_*


*_రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ..._*

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి జీవిత చరిత్ర

 

*గ్రంథం*: శ్రీ అవధూత బోధామృతం, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి జీవిత చరిత్ర 

*రచన* : శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్


*మనసుకి ఆహారం - సద్గురు లీలాచింతన*


ఎప్పుడైతే సద్గురులీలా చింతన 

నిరంతరం మనసుకు ఆహారమవుతుందో ఆ శుభ సమయంలో గురువు ప్రసన్నుడై *నేను నీతోనే ఉన్నాను, నీవు చేసే పనులన్నీ అనుక్షణం గమనిస్తూనే ఉన్నాను* అని తెలిపే దివ్య నిదర్శనాలు ప్రసాదిస్తాడు. అట్టి దివ్య అనుభవాలు కలిగాక కాలక్షేపానికి కబుర్లు, టీవీలు, సినిమాల అవసరమే ఉండదు. పొమ్మన్న మనసటుపోదు. సద్గురు లీలా చింతనలో తన్మయమైన మనసు మన ప్రయత్నం లేకుండానే ఏకాగ్రమై నిలిచి ధ్యానస్తమవుతుంది.


 అట్టి శుభ సమయంలో సద్గురు కృపవలన మనలోని దుర్గుణాలు దూరమవుతాయి. ఒకవేళ ఆ విధంగా దుర్గుణాలను వీడలేనప్పుడు కన్నీటితో సద్గురుని సహాయం అర్ధించాలి. పరమ కారుణ్యమూర్తి అయినా సద్గురువు ప్రసన్నుడై తన యోగశక్తితో మన దుర్గుణాలను హతమారుస్తాడు. ఆ విధంగా దుర్గుణాలనే ముళ్ళు అన్నీ నశించాక ఆనంద పదవికి పూల బాట సిద్ధమైనదన్నమాట.


🙏 *ఓం నారాయణ -  ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీ సాయిమాస్టర్ స్మృతులు*

       *సంకలనకర్త :- లక్ష్మీ నరసమ్మ*

                   *టాపిక్ :- 23*

                 *సర్వసమర్ధుడు*

                               శ్రీ రఘురామ్ రాజ్


ఏదైనా ఒక చెడు అలవాటును మాన్పించడానికి మాస్టారుగారు అనుసరించే విధానము చాలా విచిత్రంగా వుంటుంది. ఉదాహరణకి నేను డిగ్రీలో వుండగా సినిమాలు ఎక్కువగా చూస్తూండేవాణ్ణి, ఆయన ఏ రోజు సినిమాలు చూడకూడదు, మానెయ్యమని చెప్పేవారు కాదు. కానీ దైవం మీద భక్తి స్థిరపడే కొద్దీ వాటంతట అవే పోతాయి అనేవారు. నా విషయంలో అది నిజమయింది. ఈ రోజు నాకు సినిమా చూడలంటేనే వినుగు పుడుతుంది. చెడును బలవంతంగా తీసివెయ్యాలనుకుంటే అది అవకాశము వచ్చినప్పుడు రెండింతల శక్తితో విజృంభిస్తుందని, అలాగాక మంచిని ఆచరిస్తూంటే, చెడు దానంతట అదే తొలగి పోతుందని మాస్టారు గారు చెబుతూండేవారు. ఇంకొక ఉదాహరణ ఒకసారి సాధన కోసమని 'మటన్' ని మానేశాను. అందువల్ల నా బాడీ వీక్ అయ్యింది. అప్పుడు మాస్టార్ గారు "వద్దు అలా మానేయవద్దు సహజంగా ఆ పరిస్థితి నీకు నిజంగా కలిగినప్పుడు ఆ అలవాటుదానంతటదే పోతుంది. నీ బాడీలో ప్రతి నరము వీక్ అయినది. కాబట్టి మటన్ తీసుకో " అన్నారు. ఏదన్నా వివరించి చెప్పవల్సి వస్తే శాస్త్రాల్లోని వాక్యాలను కోట్ చేసి ఉదాహరణలతో మనస్సుకు హత్తుకునేలాగా చెప్పేవారు. ఆయన ప్రసంగంలో మన ప్రశ్నలకు సమాధానం మనం అడగకుండానే ఖచ్చితంగా వచ్చేది. మాస్టారుగారి కెప్పుడూ నేను చెప్పలేదు కానీ ఒకరోజు నేను మాస్టారుగారి దగ్గర కెళ్ళాను. నన్ను చూడగానే "మనిషి కావాలంటే ఎంత గొప్పవాడయినా కావచ్చు సాధన చెయ్యాలే గాని” అని అన్నారు. ఆయన సర్వజ్ఞులు.


                          🙏జై సాయిమాస్టర్🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


🔥సాయి వచనం:-


*'ఇది బ్రాహ్మణ మసీదు. ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాదిమందిని శుభ్రమార్గాన నడిపించి చివరికంటా గమ్యం చేరుస్తాడు.'*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*గ్రంథం:-నేను దర్శించిన మహాత్ములు*

*శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర*

*రచన:-*

*శ్రీఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు*


  ఆ గురువారం నాడు సాయిని ప్రార్థించుకొని అమ్మ సన్నిధి చేరేసరికి రోజు కంటే 10 ని॥లు ఆలస్యమైంది. నేను చేరుకున్న కొద్దిసేపటికే అమ్మ వేదిక పైనుండి లేచి దూరానున్న కుటీరం వైపుకు నడవసాగారు. ఎలాగైనా ఆ రోజు ఆమె దర్శనం పొంది శిరిడీ వెళ్ళిపోవాలని నాకు తొందర గలిగింది. అప్రయత్నంగానే నేను గూడా అమ్మను అనుసరించాను. కానీ రెండవ రోజులాగ ఆ రోజు నన్ను ఎవరూ ఆటంకపరచలేదు. అమ్మ తిన్నగా కుటీరంలోకి వెళ్ళిపోయారు. నేను గూడ ఆమె వెనుకనే కుటీరంలోకి ప్రవేశించాను. అమ్మ అకస్మాత్తుగా వెనక్కు తిరిగి అక్కడవున్న ఒక్క బ్రహ్మచారిణితో వాకిలి తలుపు మూయమని చెప్పారు. గాని నేనక్కడ వున్నట్లు ఆమె గుర్తించినట్లేలేరు. ఆమె తిన్నగా వెళ్ళి అక్కడవున్న ఒక మంచం మీద ఒక ప్రక్కకు తిరిగి కళ్ళు మూసుకొని కూర్చున్నారు. నాకేం చేయాలో తెలియలేదు. ఆమెను పలకరించి నమస్కరిస్తే నన్ను బయటకు పొమ్మంటుందేమోనన్న భయం. అలాని ఊరుకుంటే నేనక్కడ కూర్చోవచ్చోలేదో తెలియలేదు. ఆ విషయమే అడగటానికి అక్కడ ఇంకెవరూ లేరు. 5 ని॥లు అలాగే నిలబడి, తర్వాత అక్కడే నేలపై కూర్చున్నాను.

   

********************************

ఆన్లైన్ లో చదువుటకు ఈ లింక్ ను ఉపయోగించుకోగలరు.


https://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Aanandamai-Amma-Charitra&page=1

సాష్టాంగ_నమస్కారం

 సాష్టాంగ_నమస్కారం


అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు.. సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము...


ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః...


అష్టాంగాలు అంటే...


"ఉరసా" అంటే ఛాతీ,

"శిరసా" అంటే తల,

"దృష్ట్యా" అనగా కళ్ళు,

"మనసా" అనగా హృదయం,

"వచసా" అనగా నోరు,

"పద్భ్యాం" అనగా పాదములు,

"కరాభ్యాం" అనగా చేతులు,

"కర్ణాభ్యాం" అంటే చెవులు.


ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.


మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి..


ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి.


1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.


2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.


3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.


4) మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి.


5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం.. అంటే.. నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి.


అంటే  "ఓం నమః శివాయ" అని అంటూ నమస్కారం చేయాలి.


6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.


7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.


8) జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి...


స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది.


పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి.


నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం.

.

శఠగోపం

                      *శఠగోపం*

                    ➖➖➖✍️


*గుడిలో తలమీద - ‘శఠగోపం’ ఎందుకు - పెడతారో తెలుసా?*


*శఠగోపం గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక అంటారు పండితులు.*


*గుడికి వెళ్లిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు.*


*అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలిచ్చిన తర్వాత శఠారిని తీసుకొచ్చి భక్తుల తలపై పెట్టి ఆశీర్వచనం ఇస్తాడు...*


 *ఆలయ పూజారి శఠారిని తీసుకు వచ్చి భక్తుల తలపై పెట్టడం వలన వారిలో ఉండే చెడు ఆలోచనలు, ద్రోహబుద్ధులు నశిస్తాయని చెబుతారు.*


*అంతే కాదు శఠగోపం అత్యంత గోప్యమైనది కనుక అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరికను తలుచుకోవాలంటారు పండితులు.*

 

*శఠగోపాన్ని కొన్ని ప్రాంతాల వారు శఠగోపం, శడగోప్యం అని అంటారు.*


*శఠగోపం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం.*


*భక్తులు దేవాలయంలో దర్శనం అయ్యాక ప్రదక్షిణలు చేసి, తీర్థం, శఠగోపనం తీసుకుంటారు.*


**శఠగోపం విశేషాలు:*


*శఠగోపాన్ని పంచలోహాలైన వెండి, రాగి, కంచు మొదలైన వాటితో తయారు చేస్తారు... *


*శఠగోపం వలయాకారంలో ఉంటుంది, వాటిపై భగవంతుని పాదాల గుర్తులు ఉంటాయి, శఠగోపం తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి.  అలాకాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి శఠగోపాన్ని వలయాకారంలో తయారుచేసి పైన పాదుకలు ఉంచుతారు.*


*అంటే మనము మన కోరికలను….       శఠగోపం పెట్టినప్పుడు తలుచుకుంటే భగవంతుడి పాదాల వద్ద చెప్పుకున్నట్లే.* 


*శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా ఉంది.*


*భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన.* 


*నేను, నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు.*


**శఠగోపం వలన కలిగే ఫలితం:*


*శఠగోపం తలమీద పెట్టించుకోవడం వలన ఆధ్యాత్మికంగా మాత్రమే కాక సైన్స్ పరంగా కూడా ఎన్నో ఫలితాలు కలుగుతాయి.*


*శఠగోప్యమును తలమీద ఉంచిన ప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్‌, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్‌ బైటికెళుతుంది.*


*తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి.*


*శఠగోప్యమును శఠగోపం శటారి అని కూడా అంటారు. *✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺

*కుడి ఎడమలు వేరు కాదు!*


           *కలిసుందాం…రా…!*

                 ➖➖➖✍️

                 


*మహాభారతంలోని ఆదిపర్వంలో  ఒక కథ ఉంది.*


 *ఒకానొకప్పుడు విభావసుడు, సుప్రదీపుడు అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. చాలా మంచివాళ్ళు. అపార ఐశ్వర్యానికి వారసులు. అకస్మాత్తుగా ఒకరోజు తమ్ముడు వచ్చి ఆస్తిలో తనవాటా పంచివ్వమని అడిగాడు.*


*సర్దిచెప్పి అనునయంగా మాట్లాడి సమస్యను పరిష్కరించగలిగిన అన్న ఆగ్రహోదగ్రుడైనాడు. ‘నన్ను అగౌరవపరిచినందుకు ఏనుగువై అడవులను పట్టుకు తిరుగుపో..’ అంటూ శపించాడు.*


*తమ్ముడు కూడా ఏం తక్కువ తినలేదు. ‘నువ్వొక తాబేలువయి చెరువుల్లో పడి ఉండమ’ని తిరిగి అన్నను శపించాడు.*


*ఇద్దరి జన్మలు వేరువేరు. రెండూవేర్వేరు జంతువులయినా     శత్రుభావనలు ఉండిపోయాయి. తరచూ కలహించు కుంటూండేవి.* 


*ఒకసారి గరుత్మంతుడికి ఆకలేసి తండ్రి కశ్యప ప్రజాపతిని అడిగితే...     ఆ రెండింటినీ తినెయ్యమన్నాడు.* 


*ఇది కథే కావచ్చు... ఇటువంటి కథలను విని పాఠాలు నేర్చుకోకపోతే... మనం నిత్యం మన ఇళ్ళల్లో చూసే అన్నదమ్ముల గొడవలు ఇలానే ముగుస్తుంటాయి.*


 *అందుకే బంధువులతో తగాదాలు శ్రేయస్కరం కాదు. అవి వారిద్దరితో పోవు.   కుటుంబాలకు కుటుంబాలు తరాల తరబడి     కక్షలు పెంచుకుని అన్నివిధాలా నష్టపోతుంటారు. నలుగురిలో చులకనౌతుంటారు.*


*చిన్నతనంలో నువ్వేం అలవాటు చేసుకుంటావో అదే పెద్దయిన తరువాత కూడా నిలబడిపోతుంది. *

*******************


*చిన్నప్పుడు దుర్యోధనుడు పొద్దస్తమానం భీముడితో కలియబడుతుండేవాడు. భీముడిమీద అక్కసు పెంచుకున్నాడు. అదే చిట్టచివరికి కురుక్షేత్ర సంగ్రామం వరకు వెళ్ళింది.    చిన్నప్పటి పగ భీముడు దుర్యోధనుడి తొడ విరగ్గొట్టేదాకా వెళ్ళింది. చిన్నప్పుడు కలిసిమెలిసి ఉంటే పెద్దయిన తరువాత కూడా సఖ్యత గా ఉంటారు.*

*****************

*సచిన్‌ టెండూల్కర్‌ చిన్నతనంలో క్రికెట్‌ ఆటలో కనబరుస్తున్న నైపుణ్యం చూసి అన్న అజిత్‌ టెండూల్కర్‌ క్రికెట్‌ ఆటను నేర్పించే అచ్రేకర్‌ దగ్గరకు తీసుకెళ్ళాడు.*


*ఆయన ఒక పరీక్షపెట్టాడు. అచ్రేకర్‌ పట్ల ఉన్న భయాందోళనలతో ఆ పరీక్ష సచిన్‌ నెగ్గలేకపోయాడు.*


*శిష్యుడిగా తీసుకోవడానికి ఆయన నిరాకరించాడు.*


*కానీ అన్న వదలకుండా... “మిమ్మల్ని చూసి భయపడినట్టున్నాడు. నిజానికి బాగా ఆడతాడు. మరొక్క అవకాశం ఇవ్వమని బతిమిలాడుకున్నాడు. మీరు దూరంగా ఉండి పరిశీలించమన్నాడు.*


*ఈసారి గురువు అక్కడ లేడనే ధైర్యం కొద్దీ సచిన్‌ అద్భుతంగా ఆడాడు. సచిన్‌ను శిష్యుడిగా స్వీకరించడానికి వెంటనే అచ్రేకర్‌ సమ్మతించాడు. ఇదెలా సాధ్యపడింది...అన్నదమ్ముల సఖ్యత వల్ల.*


*అబ్దుల్‌ కలాంగారికి మద్రాస్‌లో ఒక ప్రఖ్యాత ఇంజనీరింగ్‌ కళాశాలలో సీటు వస్తే... ఫీజు కట్టడానికి తండ్రివద్ద అంత డబ్బు లేదు. అప్పటికే పెళ్ళయిపోయిన అతని సోదరి జోహ్రా తన నగలు తాకట్టుపెట్టి డబ్బు సర్దుబాటు చేసింది.*


*ఇదెలా సాధ్యపడింది ... తోడబుట్టినవారి సఖ్యత కారణంగానే కదా ...*


*అందువల్ల పాండవుల్లా, రామలక్ష్మణభరతశత్రుఘ్నుల్లా చిన్నప్పటినుంచి కలిసుండడం అలవాటు కావాలి. పెద్దయ్యాక మారడం అంత తేలిక కాదు.*


*అదే బద్దెనగారు సుమతీ శతకంలో చెప్పేది...    ఆస్తులు, అంతస్తులు, హోదాలు, లేదా మాటామాటా పెరిగి వాదులాడుకోవడాలవంటివి మనసులో ఉంచుకుని, పైకి సఖ్యత నటిస్తూ బంధువులను చిన్నచూపు చూడవద్దు. వారిని దూరం చేసుకోవద్దు. ఎక్కడికెళ్ళినా స్నేహితులు, శ్రేయోభిలాషులు దొరుకుతారు...*


*కానీ జన్మతః నీకు భగవంతుడు అనుగ్రహించిన బంధువులు ఈ జన్మకు మళ్ళీ దొరకరు. కుడి చేయి ఎడమ చేయి వేరు కాదు. దేని బలం దానికున్నా..          ఆ రెండూ కలిస్తే బలం ఎన్నో రెట్లు పెరుగుతుంది.*


*చిన్నప్పటినుంచి ఒకరి గురించి మరొకరికి పూర్తి అవగాహన ఉన్న కారణంగా ఒకరి ఎదుగుదలకు మరొకరు సహకరించుకోవాలి. అప్పుడు మీ ఐకమత్యబలం సమాజంలో మరో నలుగురికి కూడా ఉపయోగపడుతుంది.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



ఆచార్య సద్బోధన:*



            *ఆచార్య సద్బోధన:*

                ➖➖➖✍️



*"భగవంతునితో వ్యాపారము తగదు.*


*భగవంతుడు వ్యాపారస్తుడు కాదు.* 


*ఈనాడు భక్తులు భగవాంతునితో బేరాలాడుతున్నారు.* 


*తమ బాధలను నివృత్తి చేస్తే సుంకం చెల్లిస్తామని, కష్టాలు నివారణ అయితే మ్రొక్కుబడులు చెల్లిస్తామని భగవంతుని ఉపయోగించుకొంటున్నారు.*


*నీవు కొట్టే కొబ్బరికాయలు భగవంతునికి అవసరమా? నీవు ఇచ్చే ముడుపులు భగవంతుని వద్ద లేకనా?* 


*భగవంతునికి ఈయవలసినవి నిశ్చల హృదయం, నిర్మలభావము, నిస్వార్ధ చర్య , పవిత్రమైన ప్రేమ మాత్రమే.*


*ఇవే స్వామి కోరేవి. వీటిని సమర్పించినప్పుడే స్వామికి ప్రీతి. మిగిలినవి ఎన్ని సమర్పించినా అవి నిరర్ధకములే."*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*

డయాబెటిస్‌కు

 *చివరగా డయాబెటిస్‌కు శుభవార్త.*


ఈ సమాచారం అవసరమైన వారికి సహాయపడటానికి మీరు ఈ క్రింది సందేశాన్ని ఫార్వార్డ్ చేయగలరని ఆశిస్తున్నాము ...!


ఒక మహిళ (65) గత 20+ సంవత్సరాలుగా డయాబెటిస్ కలిగి ఉంది మరియు రోజుకు రెండుసార్లు ఇన్సులిన్ తీసుకుంటుంది.  ఆమె పక్షం రోజులపాటు ఇంటిలో తయారు చేసిన  (medicine) ఔషధాన్ని ఉపయోగించింది మరియు ఇప్పుడు ఆమె డయాబెటిస్ నుండి పూర్తిగా ఉచితం మరియు స్వీట్స్‌తో సహా ఆమె ఆహారాన్ని సాధారణమైనదిగా తీసుకుంటుంది.


ఇన్సులిన్ మరియు రక్తంలో చక్కెరను నియంత్రించే మందులను ఆపమని వైద్యులు ఆమెకు సూచించారు.  దయచేసి మీ అందరికీ ఈ క్రింది మెసేజ్ ను మీకు వీలైనంత ఎక్కువ మందికి పంపించి, దాని నుండి అధిక ప్రయోజనం పొందమని నేను కోరుతున్నాను.


_*DR.  టోనీ అల్మైడా*_

 (బొంబాయి కిడ్నీ స్పెషాలిటీ నిపుణుడు) పట్టుదల మరియు సహనంతో విస్తృతమైన ప్రయోగాలు చేసి మధుమేహానికి విజయవంతమైన చికిత్సను కనుగొన్నారు.

ఇప్పుడు డయాబెటిస్ కారణంగా చాలా మంది ప్రజలు, వృద్ధులు మరియు మహిళలు చాలా బాధపడుతున్నారు.


 *కావలసిన పదార్థాలు*

 1 - * గోధుమ 100 గ్రా

 2 - * బార్లీ 100 గ్రా 

 3 - *నల్లజీలకర్ర  (కొలుంజీ) 100 గ్రాములు *

 కొలుంజీ తమిళంలో * కరుంజీరాహం*

_*తయారీ విధానం:*_

 పైన పేర్కొన్న అన్ని పదార్థాలను 5 కప్పుల నీటిలో ఉంచండి.

దీన్ని 10 నిముషాలు మరిగించాలి 

స్వయంగా చల్లారాలి!

ఇది చల్లగా మారినప్పుడు,  వడపోసి ఒక గాజు పాత్ర లేదా సీసాలో ఈ నీటిని నిలువ చేయండి!


 _*దీన్ని ఎలా వాడాలి?*_

ప్రతిరోజూ ఉదయాన్నే మీ కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఈ నీటిని ఒక చిన్న కప్పు తీసుకోండి.

దీన్ని 7 రోజులు కొనసాగించండి.

వచ్చే వారం అదే కానీ ప్రత్యామ్నాయ రోజులలో (రోజుమార్చి రోజు) పునరావృతం చేయండి.  ఈ 2 వారాల చికిత్స తో మీ ఆరోగ్యం మామూలుగా మారిందని మీరు ఆశ్చర్యపోతారు. 

 సమస్య లేకుండా సాధారణ ఆహారం  తీసుకోవచ్చును!


గమనిక:

దీన్ని వీలైనంత ఎక్కువ మందికి విస్తరించాలని ఒక అభ్యర్థన, తద్వారా ఇతరులు కూడా దాని నుండి ప్రయోజనం పొందవచ్చు.


 *ఇవి అన్ని సహజమైనవి, వాటిని తీసుకోవడం హానికరం కాదు. ఈ చికిత్స గురించి నైపుణ్యం ఉన్నవారు ఏ హాని లేకుండా ప్రయత్నించవచ్చు.*


మరోసారి ఈ సందేశం పంపినందుకు ధన్యవాదాలు ...

చాలా మందిని చక్కెర వ్యాధి నుండి కాపాడండి .... (డయాబెటిస్)

*

                               🌻🌻🌻

చాణక్యుడు

 🕉️ఒక నీతి కథ 🕉️


ఒకానొక చక్రవర్తి యుద్ధంలో గెలిచి వచ్చాడు. భట్రాజుల పొగడ్తలతో గర్వం మరింత అతిశ యిల్లింది. తన జీవితాన్ని తీర్చిదిద్దిన మార్గదర్శి, జ్ఞాని, గురువు అయిన మహా మంత్రే ఆయనకా సమయంలో చులకనగా కనిపించాడు. దీన్నే అంటారు కళ్లు నెత్తికెక్కాయని.


అతనిలో గర్వంతో బాటు అహంభావం కూడా పెరిగింది. మంత్రితో ఎలా వ్యవహరించాలో కూడా మరచిపోయాడు.

'మంత్రివర్యా! మీరెంతో తెలివైనవారు, జ్ఞాన నిధి, గొప్ప వ్యూహకర్తలు. ఈ తెలివి తేటలతో బాటు అందం కూడా ఉంటే ఎంత బాగుండును' అన్నాడు.


అసలతను చక్రవర్తి కావడానికి కారణభూతుడు ఆ మంత్రే. కొలువులో అందరూ చక్రవర్తి మాటలకు ఆశ్చర్యపోయారు.


తనను నిండు సభలో అవమానించిన చక్రవర్తిపై ఆ మంత్రికి కోపం రావాలి. ఆ మంత్రి ఏ భావమూ ప్రకటించలేదు. తనను తక్కువ చేసి మాట్లాడిన రాజును తూలనాడలేదు.


దగ్గరలో ఉన్న ఒక పరిచారకుడిని పిలిచి 'ఎండ మండిపోతోంది. ప్రభువులకు దాహంగా ఉంది తక్షణమే స్వర్ణ పాత్రలో ఉన్న శుద్ధమైన జలాన్ని తెచ్చి ప్రభువులకు తాగడానికి ఇవ్వు' అన్నాడు.


పరిచారకుడు స్వర్ణ పాత్రలోని జలాన్ని ఒక బంగారు గ్లాసులో తెచ్చి ఇచ్చాడు.


'ఆ నీళ్లు వెచ్చగా ఉండి ఉంటాయి. దాహం తీరి ఉండ దు. మట్టి కుండలో నీరు తెచ్చి ఇవ్వు' అన్నాడు మంత్రి మళ్ళీ. ..పరిచారకుడు మట్టి కుండలోనుంచి తెచ్చి ఇచ్చిన నీటిని చక్రవర్తి తృప్తిగా తాగాడు.


వెంటనే ఆలోచించాడు...


మంత్రి ఒక్క సారిగా నీటిని గురించి ప్రస్తావించడడం, పరిచారకుడి చేత స్వర్ణ పాత్ర, మట్టి పాత్రల్లోని నీటిని తెప్పించడం, ఇదంతా ఎందుకు చేశాడని ఆలోచించాడు. వివేకవంతుడు కనుక వెంటనే అర్థమయింది. జ్ఞానోదయమయింది.


వెంటనే సింహాసనం దిగి మంత్రి వద్దకు వచ్చి, 'గురు దేవా! మన్నించండి. గర్వాతిశయంతో కాని మాట అన్నాను. బంగారు పాత్ర విలువైనదే కావచ్చు. అందంగా ఉండవచ్చు. కాని దానికి నీటిని చల్ల్లపరిచే గుణం లేదు. మట్టి పాత్ర బంగారు పాత్రతో సరితూగలేదు. అయినా నీటిని చల్ల్లగా ఉంచు తుంది. అందం కాదు గుణం, జ్ఞానం, క్షమ అనే ఆభరణాలే అతి విలువైనవని మీరు బహు చక్కగా బోధించారు. నా అపరాధాన్ని మన్నించండి' అన్నాడు.


ఆ చక్రవర్తి మరెవరో కాదు మౌర్య వంశ వ్యవస్థాపకుడు మౌర్య చంద్రగుప్తుడు. ఆ మహా మంత్రి మరెవరో కాదు. మహారాజనీతి వేత్త, చతురుడు, అర్థశాస్త్ర రచయిత, కౌటిల్యునిగా పేరు గాంచిన చాణక్యుడు.


నరస్యాభరణం రూపం

రూపస్యాభర ణం గుణమ్‌

గుణస్యాభరణం జ్ఞానమ్‌

జ్ఞానస్యాభరణం క్షమా


పై శ్లోకంలో మనిషికి రూపం మంచి ఆభరణమని చెప్పినా గుణం, జ్ఞానం, క్షమ అనేవి రూపం కన్నా అతి ప్రధానమైనవని స్పష్టం చేయబడింది.


వినయం అనేది మనిషిలో ఎల్ల్లవేళలా అన్ని పరిస్థితుల్లోనూ ఉండాలి.


అన్నీ ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నపుడు కూడా హద్దులెరిగి ప్రవర్తించాలన్నది పెద్దల మాట.

🕉️🕉️🕉️🕉️🕉️

ఆదిశంకరాచార్యులు

  ఆదిశంకరాచార్యుల జన్మదినోత్సవం .

కావున  వారి గురించి కొంత తెలుసుకుందాం.


సృష్టిలో ఏ లోపమూ లేదు. ఉన్నదంతా నీ చూపులోనే వుంది. కాబట్టి నీ చూపును సరిచేసుకో' అని అతి సులభమైన రీతిలో వేదాంత భావనను బోధించినవారు ఆదిశంకరాచార్యులు. లోకంలో ధర్మనిరతి తగ్గుతున్న తరుణంలో దాన్ని సుప్రతిష్ఠితం చేయడానికి ఆవిర్భవించిన అవతార పురుషుడు శంకరాచార్యులు. ఆయన జన్మ తిథి వైశాఖ శుద్ధ పంచమి.


శంకరుడు పుట్టిన నాటి నుంచి అసమాన ప్రతిభాశాలి. ఏడాది వయసుకే మాతృభాష, లిపి నేర్చుకుని రెండేళ్లకే చదివేవాడు. మూడో ఏట పురాణాలు అర్థంచేసుకునే జ్ఞానం లభించిందంటారు. ఈ పరంపరలో ఎనిమిదేళ్ల వయసు వచ్చేనాటికి వేదవాంగ్మయం, తర్కం, సాంఖ్యం, యోగం, మీమాంస, నిరుక్తం మొదలైన శాస్త్రాలు ఆకళింపు చేసుకుని సకల విద్యా పారంగతుడయ్యాడని తెలుస్తోంది. తాను నేర్చుకున్న విద్యకు సార్థకత లోకోపకారమేనని, దానికి అనువైనది సన్యాసమేనని భావించాడు. అతికష్టం మీద తల్లిని ఒప్పించాకే సన్యాసం స్వీకరించాడు. ఉత్తరముఖంగా సాగిపోయి గోవింద భగవత్పాదుని అండచేరి.. శిష్యుడిగా చేసుకొమ్మని కోరాడు. 

శంకరుడు సామాన్యుడు కాడని, ఇలాంటి శిష్యుడి వల్లనే తన జీవితానికి ఏర్పడుతుందని భావించారాయన. అందుకే అడగడమే మహా ప్రసాదం అన్నట్టు శిష్యుడిగా చేర్చుకొన్నారు.

ఆయన దగ్గర విద్య పూర్తి చేసుకున్న తరువాత, కాశీ చేరుకున్నారు. అక్కడ దారిలో ఎదురైన మనిషిని తప్పుకొమ్మ న్నారు. 'తప్పుకోమన్నది నన్నా, నాలోని శివుడినా?' అని అతడు అడిగిన ప్రశ్నతో 'ప్రతివారూ భగవత్స్వరూపులే' గ్రహించి 'సత్యవేది' అయ్యారు. ఆ అనుభవంతో ‘మనీషా పంచకం' రచించారు. ఆపై బదరీనాథ్ వెళ్లి తన గురువుకు గురువైన గౌడపాదుని శిష్యరికం చేశారు. ఆయన ఆదేశానుసారం బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించారు. 'ప్రపంచాన్ని జయించిన వాడు విజేత కాడు. తనను తాను జయించినవాడే నిజమైన విజేత' అని చెబుతూ- అటువంటి విజేత కావడానికి మార్గదర్శి అయ్యారు. దానికి గాను కనకధారా స్తవం, సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి, భజగోవిందం లాంటి స్తోత్రాలు, కావ్యాలు రచించారు. ఎన్నో గ్రంథాలకు భాష్యాలను రచించి లోకుల జీవితాల్లో ఆధ్యాత్మిక కాంతిని ప్రసరింపజేశారు.


ఆ నాటికి ప్రబలి ఉన్న అనేక మతాల్లో ఎన్నెన్నో వాదాలు. అవి విశ్వకల్యాణ భావనను మాని తమ ఉనికి, ఉన్నతుల కోసం అకృత్యాలు, అరాచకాలు చేయడానికి సైతం వెనకాడని సమయమది. ఆ భావజాలం ప్రబలిన వారందరినీ ఏకతాటి మీదకు తెచ్చి అద్వైత సిద్ధాంతాన్ని బోధించి ఒప్పించారు. ఆ తత్వాన్ని లోకమంతటా వ్యాప్తి చేయడానికి అనువుగా దేశం నలుదిక్కులలో నాలుగు శక్తి పీఠాలను స్థాపించారు. అవి... తూర్పున గోవర్ధన పీఠం (పూరీ), పడమరన కాళికాపీఠం(ద్వారక), ఉత్తరాన జ్యోతి పీఠం(బదరీనాథ్), దక్షిణాన శారదా పీఠం(శృంగేరి). ఆయా పీఠాల నిర్వహణకు గాను ఆధిపతులను నియమించారు.


ఏమీ తెలియనివాడు లోకానికి లోబడి ఉంటాడు. అన్నీ తెలిసిన వాడు లోకాన్ని లోబరచుకుని ఉంటాడు. కాబట్టి అన్నీ తెలిసిన వాడివి కమ్మని, తద్వారా ఆత్మోన్నతుడివి కమ్మని బోధించిన శంకరులు భౌతికంగా జీవించింది ముప్ఫైరెండు సంవత్సరాలే. 'నీలో ఉన్న దివ్యుడిని నీ అంతట నీవే దర్శించాలి. తద్వారా నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. ఆ అనుభవమే నీకు నిజమైన గురువు అవుతుంది' లాంటి ప్రబోధాత్మక వాక్యాలు, ఆధ్యాత్మిక వ్యాఖ్యల ఆచంద్రతారార్కం జీవించి ఉంటారు ఆయన.


సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం.👏