26, మార్చి 2026, గురువారం

వాల్మీకి రామాయణం - 16 )

  శ్రీరామ ( వాల్మీకి రామాయణం  - 16 )


🙏మీ అందరికి సకుటుంబంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు🙏

ఈరోజు పరమపావనమైన సీతారామ కళ్యాణం చెప్పుకుందాము.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 

సర్వే జనాః సుఖినో భవన్తు 🙏



  (25-3-'26  'సాయంత్రం '  పోష్టు తరువాయి భాగము)


జగత్కళ్యాణ కారకమైన సీతా రామ కళ్యాణం నిశ్చయమైంది అని ఇంతకు ముందు పోష్టులో చెప్పుకున్నాము.


 జరగబోయే తన కుమారుల వివాహ విషయాలు బంధువులతో ముచ్చటించుకొంటూ, దశరథమహారాజు  మహదానందంతో  ఆ రాత్రి గడిపాడు.

తెల్లవారింది.

ప్రాతః:కాలమే కర్మవేత్త అయిన దశరథ మహారాజు దైవ కార్యాలన్నీ నిర్వహించి,జనకుని యజ్ఞశాలలో ప్రవేశించాడు.


శ్లో// యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణ భూషితైః/

భ్రాతృభిః సహితో రామః కృత కౌతుక మంగలః/

వసిష్ఠం పురతః కృత్వా మహర్షీ నపరానపి/

పితుః సమీప మాశ్రిత్య తస్థౌ భ్రాతృభిరావృతః//


(విజయమనే ముహూర్తంలో, పెండ్లికొడుకును చేయడము, తోరణము కట్టుకోవడము మొదలైన మంగళ కార్యములు పూర్తి చేసుకుని, సర్వాభరణ భూషితులై,రామ,లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, వశిష్ఠాదిమహర్షులను ముందు ఉంచుకొని యజ్ఞశాలలో ఉన్న తండ్రి దగ్గరకు వచ్చారు).


శ్లో// తతో రాజా విదేహానాం వసిష్ఠ మిద మబ్రవీత్ /

కారయస్వ ఋషే సర్వమృషిభిః సహ ధార్మిక /

రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం విభో //


(పిమ్మట జనక మహారాజు ,లోకాభిరాముడైన రాముని వివాహం,విశ్వామిత్ర, శతానందాది మునీశ్వరుల సహాయంతో జరిపించమని వశిష్ఠ మహర్షిని,ఎంతో వినయంగా ప్రార్ధించాడు)


" అలాగే "అని వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుని, శతానందుని, ముందిడుకొని,యథా శాస్త్రముగాను, మంత్రపూర్వకముగాను,వేదిని నిర్మించాడు.


ఆ వేదిని చక్కగా అలంకరించి, వేది చుట్టూ దర్భలను ఉంచాడు.


అగ్నిని ప్రజ్వలింపజేసి, ఆ వేదిలో హోమము చేసాడు.


శ్లో// తతః సీతాం సమానీయ సర్వాభరణ భూషితామ్/

సమక్ష మగ్నే:సంస్థాప్య రాఘవాభిముఖే తదా/

అబ్రవీ జ్జనకో రాజా కౌసల్యానంద వర్ధనమ్//


(ఆ శుభముహూర్తాన సీతాదేవిని సర్వాభరణములతో అలంకరించారు. జనకమహారాజు, ఆ భూజాతను అగ్ని సమక్షంలో రామునకు అభిముఖంగా నిల్చోబెట్టి, కౌసల్యాదేవికి ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగించే ఆ రామచంద్రునితో ఇలా అన్నాడు).


శ్లో//ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ/

ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా//


(ఓ రామా!ఇదిగో నా కుమార్తె అయిన సీత. ఇప్పటి నుండి నీకు సహధర్మ చారిణి అవుతున్నది.ఈమెను స్వీకరింపుము.  నీ హస్తముతో ఈమె పాణిని గ్రహించుము ).


శ్లో//పతివ్రతా మహాభాగా ఛాయే వానుగతా సదా/

ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా//


(సౌభాగ్యవతి అయిన ఈమె పతివ్రతయై ఎల్లప్పుడూ నీడ వలే నిన్ను అనుసరిస్తుంది. 

జనకమహారాజు ఈ మాటలు అంటూ మంత్రములతో పవిత్రమైన జలమును వదలెను)


వెంటనే దేవతలు, ఋషులు "బాగు"  "బాగు"అన్నారు.

దేవ దుందుభులు మ్రోగినై.

పుష్ప వర్షం కురిసింది.


(ఈ ఘట్టం  స్కాంద పురాణం లోని ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని తలపిస్తున్నది.

బ్రహ్మదేవుడు మంత్రము చెప్పుచుండగా, హిమవంతుడు,

"ఇమాం కన్యాం తుభ్యమహం దదామి పరమేశ్వర/

భార్యార్థం ప్రతిగృహ్ణీష్వ మంత్రేణానేన దత్తవాన్//

అస్మై రుద్రాయ మహతే దేవదేవాయ శంభవే/

కన్యా దత్తా మహేశాయ గిరీంద్రేణ మహాత్మనా//


( ఓ పరమేశ్వరా! నేను ఈ కన్యను (పార్వతిని) నీకు సమర్పిస్తున్నాను. ఈమెను నీ భార్యగా స్వీకరింపుము,అని మంత్రము పఠించుచూ

మహాత్ముడు, దేవదేవుడు,రుద్రుడు,  శంభువునగు శివునకు,గిరీంద్రుడైన హిమవంతుడు మంత్రపూతమైన జలముతో కన్యాదానమును చేసెను).


మంత్రోదక పురస్సరంగా సీతను ఈ విధంగా రామునకు ఇచ్చి ఎంతో ఆనందపడుతూ జనకుడు లక్ష్మణునితో ఇలా అన్నాడు,


శ్లో// లక్ష్మణాగచ్ఛ భద్రం తే ఊర్మిళా ముద్యతాం మయా/

ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ మాభూత్కాలస్య పర్యయః//

(లక్ష్మణా!రమ్ము. నీకు క్షేమమగుగాక. నేనిచ్చుచున్న ఊర్మిళను స్వీకరింపుము.ఈమె పాణిని గ్రహింపుము.ఆలస్యము చేయవద్దు).


ఈ విధముగా లక్ష్మణునిచే ఊర్మిళ పాణిగ్రహణం చేయించి, జనకుడు,


శ్లో//తమేవ ముక్త్వా జనకో భరతం చాభ్యభాషత/

గృహాణ పాణిం మాండవ్యాః పాణినా రఘునందన//

(లక్ష్మణునితో ఇట్లు పలికి, జనకుడు భరతునితో,ఇట్లనెను. ఓ రఘునందనా,భరతా, నీ హస్తముతో మాండవి పాణిని గ్రహింపుము).


శ్లో// శత్రుఘ్నంచాపి ధర్మాత్మా అబ్రవీజ్జనకేశ్వరః/

శ్రుతకీర్త్యా మహాబాహొ పాణింగృహ్ణీష్వ పాణినా//


(పిమ్మటధర్మాత్ముడైన జనకమహారాజు శత్రృఘ్నునితోఇట్లనెను.ఓ మహాబాహూ!శ్రుతకీర్తి హస్తమును నీహస్తముతో పట్టుకొని పాణిగ్రహణముచేయుము).


జనకుని వాక్యము విని, ఆ నలుగురు రాజకుమారులు, వశిష్ఠుని అనుమతితో ఆ నలుగురు కన్యలయొక్క సుకుమారములైన హస్తములను, తమ హస్తములతో గ్రహించిరి.


శ్లో//అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవచ/

ఋషీంశ్చైవ మహాత్మాన స్సభార్యారఘుసత్తమాః/

యథోక్తేన తదా చక్రుర్వివాహం విధిపూర్వకమ్//


(మహాత్ములైన ఆ రఘుకుమారులు,

భార్యాసమేతులై అగ్నికి ప్రదక్షిణం చేశారు.

వేదికి,జనకమహారాజుకు, ఋషులకు, ప్రదక్షిణం చేసి, యధావిధిగా వివాహం చేసుకున్నారు).


అప్పుడు ఆకాశమునుండి గొప్ప ప్రకాశముతో కూడిన పుష్పవృష్టి కురిసింది.


దేవదుందుభులుమ్రోగినై. 


గీత, మంగళ వాద్య ధ్వనులతో అప్సరసలు నాట్యం చేశారు.

గంధర్వులు మనోహరంగా గానము చేశారు.


ఆ వివాహ సమయములో ఈ అద్భుత దృశ్యాన్ని అక్కడ ఉన్నవారంతా ప్రత్యక్షముగా చూసి ఎంతో ఆశ్చర్యము చెందారు.

పిమ్మట రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తమ భార్యలతో కూడి తమకు ఏర్పాటు చేసిన విడిదికి వెళ్లారు.

భార్యా సమేతులై అలా వెళ్తున్న పుత్రులను ఆనందంగా చూస్తూ, బంధు సహితుడైన,దశరథుడు వారిని అనుసరించాడు. 

ఈ విధంగా వాల్మీకి మహర్షి, శ్రీమద్రామాయణం,బాలకాండలో, సీతా రామ కళ్యాణాన్ని వర్ణించారు.


                                స్వస్తి.


శ్లో//ధర్మ్యం యశస్య మాయుష్యం రాజ్ఞాంచ విజయావహం/

ఆదికావ్యమిదం చార్షం పురా వాల్మీకినా కృతం/

పఠేద్య: శృణుయాల్లోకే నర: పాపాత్ ప్రముచ్యతే//


(పూర్వము వాల్మీకిమహర్షి చేత రచింపబడిన  ఈఆదికావ్యము,ధర్మసమ్మతమైనది.చదివినవారికి కీర్తిని ఇస్తుంది. రాజులకు విజయాన్ని చేకూరుస్తుంది. ఋషికృతమైన ఈ ఆదికావ్యాన్ని చదివేవారు, వినేవారు,సమస్తపాపములనుండి

విముక్తులవుతారు).


రామాయణం చదివే వారికీ, వినేవారికీ, దీర్ఘాయుర్దాయము లభిస్తుంది. 

కొరినకోరికలన్నీ తీరుతాయి.

అందరూ జీవపుత్రులవుతారు. 

ఉత్తమమైన సంతానము లభిస్తుంది. 

ఇంట్లో ఉండి, అశాంతిని కలిగించే భూతములు తొలగిపోతాయి. 

పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారు.


శ్లో//ఆయుష్య మారోగ్యకరం యశస్యం/

సౌభ్రాతృకమ్ బుద్ధికరం శుభంచ/

శ్రోతవ్య మేతన్నియమేన సద్భిః/

ఆఖ్యాన మోజస్కర మృధ్ధికామైః//


(ఆయుర్దాయమును, ఆరోగ్యమును, కీర్తిని,  సోదరప్రేమను, సద్బుద్ధిని, శుభములను, తేజస్సును, వృద్ధి చేసే ఈ రామాయణమును సత్పురుషులు నియమపూర్వకముగా వినవలెను).

                                     

                    శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

                      ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః


        శ్లో// స్వస్తి:ప్రజాభ్య:పరిపాలయంతాం/

               న్యాయ్యేన మార్గేణమహీం మహీశా:/

               గో బ్రాహ్మణేభ్య:శుభమస్తు నిత్యం/

               లోకా: సమస్తాః సుఖినో భవంతు//


(సశేషం)

శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

26-3-'26.

మహాభారతం

 🙏మహాభారతం _ శాంతి పర్వం 🙏

                     తొమ్మిదవ భాగం 

అప్పుడు ధర్మరాజు వ్యాసుడితో " మహాత్మా ! తినకూడనివి ఏవి ? త్రాగ కూడనివి ఏవి ? ఎవరు యోగ్యులు ? ఎవరు అయోగ్యులు ? వివరించండి " అని ఆడిగాడు. వ్యాసుడు బదులుగా " ధర్మనందనా ! గుర్రము, ఒంటె, గాడిద పాలు త్రాగ కూడదు. బ్రాహ్మణుడు ఆడగుర్రము, ఆడఒంటె, ఆడగాడిద దరిదాపులకు వెళ్ళ కూడదు. మనిషిపాలు అసలు త్రాగ కూడదు. ఈనిన పది రోజుల లోపల ఆవు పాలు త్రాగ కూడదు. ప్రేతము వెళ్ళిన ఇంటి భోజనం, పురుటి భోజనం, తలారి ఇచ్చిన భోజనం, కులట ఇచ్చిన భోజనం, స్త్రీ సంపాదన మీద బ్రతికేవాడు పెట్టిన అన్నం, ఆట పాటలతో జీవించేవాడు ఇచ్చే అన్నం, జూదరి ఇచ్చే అన్నం, పూలు అమ్ముకునేవాడు ఇచ్చిన అన్నం, ఊరి నుండి వెలివేసినవాడు ఇచ్చే అన్నం, అన్న కంటే ముందు వివాహంచేసుకునే వాడు ఇచ్చే అన్నం తినరాదు. అవి అభోజ్యములు. ఇతరులను పొగడుతూ జీవించేవాడు ఇచ్చిన అన్నం అత్యంతహేయం. నిలవఉన్న అన్నం పాచిపోయిన అన్నం తినరాదు. సురాపానంతో సంబంధించిన అన్నం తినరాదు. పులగము, పాయసం, అప్పములు, నువ్వులతో చేసిన వంటకములు, దేవుడికి అర్చనచేసి నివేదన చేసిన తరువాత కాని తినకూడదు. ఇవి మామూలుగా వండుకుని తినరాదు.


గృహస్థాశ్రమ ధర్మమును పాటించే వారు దేవతార్చన చేయకుండా దేవతలకు నివేదించక, పితృదేవతలకు పెట్టక, అతిథులకు పెట్టక తినరాదు. గృహస్థు అయిన వాడు భార్యాబిడ్డలు బంధువులతో సంచరిస్తూనే అంటీ అంటక ఉండాలి. వారి ప్రేమాభిమానాలాకు పూర్తిగా లొంగకూడదు. ధర్మనందనా ! ఇంక అయోగ్యుల గురించి చెప్తానువిను. పాటలుపాడుతూ నృత్యములు చేస్తూ జీవించేవారు. విదూషకులు, దుర్జనులు, నపుంసకులు, మోసగాళ్ళు, వేదం చదవనివాళ్ళు, తక్కువ కులమువాళ్ళు, ఇతరులకు హానిచేయడమే వృత్తిగాపెట్టుకున్న వాళ్ళు దానం స్వీకరించడానికి అనర్హులు. పేదవాళ్ళు, ఆపదలో ఉన్నవాళ్ళు, దానానికి అర్హులు. నీకు దానగుణం ఎక్కువగా ఉన్నా చెడ్డవాళ్ళకు దానం చేయకూడదు. దాని వలన ప్రయోజనం శూన్యం. అపాత్రాదానం మంచిది కాదు. అనర్హులకు చేసే దానం నపుంసకుడికి కన్యను ఇచ్చినట్లు, బూడిదలో నెయ్యిపోసినట్లు, ఓటికుండలో నీళ్ళుపోసినట్లు ఔతుంది. అర్హుడైనవాడికి చేసేదానం చేసినవాడికి పుచ్చుకున్న వాడికి ఇహ లోకసౌఖ్యం పరలోక సౌఖ్యం కలుగుతుంది. ధర్మజా ! నీకు నేను మంచీచెడు సంక్షిప్తంగా మంచిచెడు గురించి వివరంగా చెప్పాను. నా పలుకులు మన్నించి ధర్మబద్దంగా ప్రవర్తించు " అన్నాడు.


ధర్మరాజు వ్యాసుడితో " మహాత్మా ! మీరు చెప్పిన మాటలు నా మనసుకు చాలా హర్షం కలిగించాయి. మీరు ఆనతిచ్చిన ప్రకారం నేను ధర్మమార్గం అవలంబించి రాజ్యభారం వహించి అమంగళం కలగకుండా చూస్తాను. నా మీద కృపతో మీరు రాజధర్మములు వర్ణాశ్రమ ధర్మాలు ఆపద్ధర్మాలు నాకు తెలియ చెప్పండి. నాకు రాజధర్మం ధర్మాచరణ పరస్పర విరుద్ధం తోస్తుంది. అందుకని మిమ్ము ఇలా ప్రార్ధిస్తున్నాను " అన్నాడు. అప్పుడు వ్యాసుడు నారదుడిని చూసి " మహర్షీ ఈ మహారాజును భీష్ముడి వద్దకు తీసుకువెళ్ళాలి. భీష్ముడే ధర్మజుడికి సకల ధర్మములు చెప్పగల సమర్ధుడు " అన్నాడు. అప్పుడు నారదుడు " మహర్షీ ! మీరు చెప్పినది చాలా యుక్తంగాఉన్నది " అని అన్నాడు. అప్పుడు వ్యాసుడు ధర్మనందనుడితో " ధర్మనందనా ! భీష్ముడు కురువృద్ధుడు. ఇంద్రాదులకు కూడా పూజనీయుడు. కుటిలత్వం తెలియనివాడు. పరశురాముడి వద్ద విద్యలునేర్చి విలువిద్యా రహస్యాలను తెలుసుకున్న వాడు. పవిత్రగంగా గర్భమున జన్మించిన వాడు. సుగుణాలకు పుట్టిల్లు. ఆయనకు తెలియని ధర్మసూక్ష్మములు లేవు. చ్యవనుడు, మార్కండేయుడు, వశిష్ఠుడు మొదలగు మహర్షుల వద్ద ధర్మసూక్ష్మములు తెలుసుకున్న వాడు. తండ్రినుండి స్వచ్ఛందమరణం వరంగాపొంది తన ప్రాణములు మేనిలో నిలుపుకుని ఉన్నాడు. నీవంటే ఎంతో అభిమానం ఉన్న అంతటి మహానుభావుడి వద్దకు నీవు వెళ్ళి ప్రార్ధించిన అతడు నీకు అత్యంత వాత్సల్యంతో నీకు ధర్మసూక్ష్మములు తెలుపగలడు. దీనివలన నీవు ఎంతో కీర్తిమంతుడవు కాగలవన్నది మా అందరి అభిమతం. పైగా భీష్ముడికి అవసాన కాలం సమీపిస్తుంది. ఇంక ఆలస్యంచేయకు " అన్నాడు.


ధర్మరాజు వ్యాసుడితో " మునివర్యా ! ఎంతో మంది బంధువులను, మిత్రులను వధించిన వాడను ఆయన ఎదుట ఎలా నిలువగలను ? విలువిద్యా విశారదుడైన భీష్ముడిని కృత్రిమసమరంలో కూల్చిన పాతకుడిని తిరిగి ఆయన ఎదుట ఎలా నిలువగలను ఆయన మొహంచూసి ధర్మసూక్ష్మములు చెప్పమని ఎలా అడగను " అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు " ధర్మజా ! అలా అనుకోవడం ఎందుకు. నీవు వ్యాసమహాముని ఆజ్ఞమేరకు భీష్ముడి వద్దకు వెళుతున్నావు. కాని ఇంతశోకంతో భీష్ముని వద్దకు వెళ్ళకు ముందు నీవు రాజ్యానికి వెళ్ళు తరువాత భీష్ముడి వద్దకు వెళ్ళవచ్చు. నీకొరకు నీతమ్ములు, బ్రాహ్మణులు, పురజనులు ఎదురుచూస్తున్నారు. హస్థినాపురప్రవేశం చేసి వారందరికి ఆనందం కలిగించు " అని పలికాడు. ఈ ప్రకారం వ్యాసుడు, నారదుడు, శ్రీకృష్ణుడు, దేవలుడు చెప్పిన మాటలతో తన శోకమును వదిలిపెట్టిన ధర్మరాజుకు రాజ్యపాలన పట్ల ఆసక్తి కలిగింది. ధర్మరాజు ఆ మునులందరికీ ప్రదక్షిణంచేసి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ తరువాత మునులందరూ తమతమ స్థానాలకు వెళ్ళారు.


ధర్మరాజు దేవతలను బ్రాహ్మణులను పూజించాడు. తనదర్శనం కొరకు వేచిఉన్న సామంతులను కలుసుకుని వారిచ్చిన కానుకలను స్వీకరించాడు. మరునాడు వేకువనే లేచి అభ్యంగనం ఆచరించి తెల్లనివస్త్రములు విలువైననగలు అలంకరించుకున్నాడు. పదునారు తెల్లనిగుర్రములను కట్టిన రథమును అధిరోహించాడు. భీముడు సారథిస్థానమున కూర్చున్నాడు. అర్జునుడు వెనుక నిలబడి తెల్లనిగొడుగు పట్టుకున్నాడు. నకులసహదేవులు వింజామరలు వీస్తున్నారు. శ్రీకృష్ణుడు సాత్యకి వెంటవస్తున్నారు. విదురుడు, కుంతీదేవి, ఇతర అంతఃపుర స్త్రీలు వారవారి వాహనములలో పల్లకీల మీద వస్తున్నారు. సామంతరాజులు తమతమ సైన్యములతో పక్కన వస్తున్నారు. ఇలా ధర్మరాజు హస్థినాపురానికి పయనమయ్యాడు.

                     సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

25, మార్చి 2026, బుధవారం

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*

``

               *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                       1️⃣7️⃣5️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *175 వ రోజు*                   

*విరాట పర్వము ద్వితీయాశ్వాసము*


*నర్తనశాల*```


ఇద్దరూ నర్తనశాలను చేరుకున్నారు. నర్తనశాలలో ఒక పక్కగా ఉత్తర పడుకునే పాన్పు మీద భీముడు పడుకున్నాడు. ద్రౌపది ఆ పక్కనే కనపడకుండా దాక్కున్నది. ఇంతలో కీచకుడు మధ్యం సేవించి మత్తుగా అక్కడకు వచ్చాడు. మాలిని అప్పటికే అక్కడికి వచ్చి ఉంటుందని అనుకున్నాడు. మంచంలో పడుకున్న భీముని చూసి పిచ్చివాడై తన చేతిని ఆ శయ్య పై వేసాడు. భీమునికి పట్టరాని కోపం వచ్చింది. కీచకుడు భీమునిపై చేయి వేసి “మాలినీ! నీ కోసం ఎన్నో కానుకలు తెచ్చాను. ఇంత వరకు నా కోసం వచ్చే స్త్రీలు నాకు కానుకలు సమర్పించే వారు. నన్ను చూసిన స్త్రీలు మరొకరిని కన్నెత్తి చూడరు. నా కోసమే తపిస్తారు. అలాంటిది నేను నీకోసం తపిస్తున్నాను” అన్నాడు కీచకుడు. 


భీముడు కూడా స్త్రీ సహజమైన గొంతుతో “మిమ్మల్ని మీరు పొగుడు కుంటున్నారు కాని అసలు నా వంటి స్త్రీ మీకు దొరుకునా. నా శరీరానికి నీశరీరం తగిలినప్పుడు కలిగే అనుభూతి తెలుసుకుంటావులే. నన్ను తాకిన నీకు మరొకరిని తాకే పని ఉండదులే. నన్ను తాకిన ఫలితం అనుభవిస్తావులే” అని తటాలున పైకి లేచాడు. కీచకుని తల పట్టుకుని వంచాడు. కీచకుడు మాలిని భర్త గంధర్వుడు వచ్చాడు అనుకున్నాడు. భీముని పట్టు విడిపించుకుని కింద పడవేసి మోకాళ్ళతో అదిమాడు.

```

*కీచక భీములపోరాటం*```


ఇరువురి మధ్య భయంకర యుద్ధం సాగింది. ఒకరిని మించి ఒకరు పోరాడుతున్నారు. ఇరువురిలో కొంత భయం ఉంది పరువు పోతుందని కీచకుడు, అజ్ఞాతవాస భంగం ఔతుందేమోనని భీముడు మౌనంగా యుద్ధం చేస్తున్నారు. 


క్రమంగా కీచకుని బలంతగ్గి పోయింది భీన్మసేనుని బలం ద్విగుణీకృతం అయింది. ఆ విషయం గ్రహించిన భీముడు కీచకుని ఉదరభాగంలో భయంకరంగా పొడిచాడు. ఆ దెబ్బకు కీచకుడు విలవిలా తన్నుకున్నాడు. కీచకుని దారుణంగా చంపాలనుకున్న భీముడు కీచకుని తలని, కాళ్ళను, చేతులను మొండెంలోకి జొనిపి నేల మీద వేసి పొర్లించి నలిపి మాంసం ముద్దగా చేసాడు. కీచకుడు మరణించాడు. భీముడు ద్రౌపదిని పిలిచి కీచకుని శవాన్ని చూపించాడు. ద్రౌపది ఆనందంగా చూసింది. ఆమె మనసులో “కీచకా! ఇందుకా ఈ సుఖం పొందటానికా ఇంతగా ఆరాట పడ్డావు” అనుకున్నది. 


భీముడు “ద్రౌపదీ! నీ మాట నెరవేర్చాను ఆనందమేగా. నిన్ను ఎవరైనా దుర్బుద్ధితో చూస్తే వారికి 

నా భుజబలంతో ఇలాంటి మరణాన్ని ప్రసాదిస్తానని తెలుసుకున్నావా. నీ మనసు శాంతించింది కదా” అన్నాడు. 


ద్రౌపది ఆనందంతో “నిన్న కొలువులో కీచకుడు నన్ను అవమానించినప్పుడు నీవు చూపిన నిగ్రహం మెచ్చతగినది. ఈ నాడు ఇలా మరొకరి సాయం లేక కీచకుని వధించిన నీ శౌర్యం కొనియాడ నా తరమా భీమసేనా” అన్నది. 


ద్రౌపది మాటలకు భీముడు పొంగి పోయాడు. అతనిలో వివేకం మేలుకొంది. ద్రౌపదీ “ఇక నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు వెళుతున్నాను" అని చెప్పి వడివడిగా వంటశాలవైపు వెళ్ళాడు.

```

  ``

*విరాట పర్వము..* *ద్వితీయాశ్వాసము సమాప్తం*


              *సశేషం*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*


       *శ్రీ మహావిష్ణు పురాణం*

         *36 - 37వ భాగం*


*ధ్రువ చరిత్ర*```


ప్రస్తుత బ్రహ్మ జీవితకాలంలో భూమండలాన్ని పద్నాలుగు మంది మనువుల పరిపాలిస్తారు. వారిలో స్వాయంభువ మనువు మొదటి వాడు. స్వాయంభువ మనువుకి శతరూపకు ప్రియవ్రతుడు, ఉత్తాన పాదుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య సురుచికి ఉత్తముడు, రెండవ భార్య సునీతికి ధ్రువుడు పుత్రులుగా జన్మించారు.


ఉత్తానపాదుడు పెద్దభార్య సురుచికిపై ఎక్కువ ప్రేమ చూపిస్తూ చిన్న భార్య సునీతిని దూరంగా ఉంచేవాడు. పెద్దభార్య కుమారుడు ఉత్తముడికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవాడు. చిన్నభార్య సునీతి గమనించి తన కుమారుడు ధ్రువునికి నారాయణుని పై భక్తి అలవాటు చేసింది. అయినా ధ్రువునికి మనస్సులో తండ్రి ప్రేమాభిమానాలు పొందాలని, తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకోవాలి అని ఉండేది.


ఒకరోజు సింహాసనంపై ఉత్తానపాదుడు తన పెద్ద కుమారుడు ఉత్తముని ఊరువు(తొడ)పై కూర్చుండబెట్టుకుని ప్రేమతో లాలిస్తూ ఆడించసాగాడు. అది చూసిన ధ్రువుడు తనూ తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకోవాలి అని పరిగెత్తుకుంటూ దగ్గరకు వెళ్లాడు. పెద్దరాణి సురుచి చూసి పట్టుకుని ఆపి “ధ్రువా! ఉత్తముడు పట్టపురాణి అయిన నా కుమారుడు కనుక సామ్రాజ్యానికి వారసుడు. చక్రవర్తి అంకపీఠంపై(తొడపై) కూర్చునేందుకు అర్హత ఉంది. నీవు నా సవతి కుమారుడివి. కనుక రాజ్యార్హత, తండ్రి ఒడిలో కూర్చుని ప్రేమాభిమానాలు పొందే అర్హత, అధికారం నీకు లేదు" అని కసిరి వెళ్లిపొమ్మంది. 


తండ్రి ఉత్తానపాదుడు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. 


బాలుడైన ధ్రువుడు దుఖంతో తల్లి వద్దకు వెళ్లి జరిగింది చెప్పి ఏడవసాగాడు. తల్లి సునీతి ధ్రువుని కన్నీరు తుడిచి "లోకంలో అందరికి నారాయణుడు వారి పూర్వజన్మ కర్మ ఫలాల బట్టి సుఖాలు, అదృష్టాలు, అర్హతలు ప్రసాదిస్తాడు. మీ పెద్దమ్మ కుమారుడు ఉత్తముడు పూర్వజన్మ పుణ్య ఫలం వలన పట్టపురాణికి పుట్టి తండ్రి ప్రేమాభిమానాలు, రాజార్హత సంపాదించాడు. నీవు నావంటి దురదృష్టరాలికి పుట్టావు. ఇంతే ప్రాప్తం అని సర్దుకుపోవాలి" అంటూ ఓదార్చింది.


తల్లి మాటల వలన ధ్రువునికి నారాయణుడి అనుగ్రహం సంపాదిస్తే తన తలరాత మారి తండ్రి ప్రేమాభిమానాలు లభిస్తాయి అని అర్థమైంది. 


వెంటనే లేచి తల్లికి నమస్కరించి “అమ్మా! నేను తపస్సు చేసి నారాయణుని అనుగ్రహం పొంది తండ్రి ప్రేమాభిమానాలు సంపాదించుకుంటాను. ఆశీర్వదించి అనుమతి ఇవ్వండి" అని కోరాడు. 


కుమారుని మాటల్లో గల ధృఢ సంకల్పం గ్రహించి సునీతి ఆశీర్వదించి అనుమతిచ్చింది.


ధ్రువుడు అడవికి తపస్సుకి బయలుదేరి వెళ్లాడు. 


పూర్వజన్మ పుణ్య ఫలం వలన ధ్రువునికి మార్గ మధ్యలో నారదుడు, సప్తర్షుల దర్శన భాగ్యం కలిగింది. వారు బాలుడైన ధ్రువుని వివరాలు తెలుసుకుని అతని ధృడ సంకల్పం విని సంతోషం చెందారు. నారాయణుని అష్టాక్షరి మహామంత్రం ‘ఓం నమో నారాయణాయ’ ను నారదుడు విధి పూర్వకంగా ఉపదేశం చేశాడు. 


“నాయనా! ధ్రువా! భక్తి శ్రద్థలతో ఈ నారాయణ మంత్ర జపం చేస్తూ తపస్సు చేయుము. నారాయణుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది" అని ఆశీర్వదించి వెళ్ళారు.  


ధ్రువుడు అడవిలో సరోవరం సమీపంలో మంచి ప్రదేశం చూసుకుని శుచియై తపస్సుకి కూర్చున్నాడు. నారాయణుని చిత్తములో నిలుపుకుని ధ్యానమగ్నుడై తపస్సు చేయసాగాడు.


కాలము, ఆకలిదప్పులను మరచిపోయాడు. ధ్రువుని తపస్సు యొక్క తేజస్సు క్రమ క్రమంగా పెరిగి ముల్లోకాలకు వ్యాపించి దహించసాగింది. దేవలోకము కంపించింది. దేవేంద్రుడు ధ్రువుని తపస్సు ఆపదలు కలిగిస్తుంది అని తలచి దిక్పాలకులను పిలిచి తపస్సు భంగం చేయమని ఆదేశించాడు. 


వరుణుడు కుంభవృష్టి కురిపించాడు.. వాయుదేవుడు సుడిగాలి ప్రభంజనాలు సృష్టించాడు. అగ్నిదేవుడు దావానలం సృష్టించి అడవిని దహనం చేశాడు. 


యముడు భయపెట్టాలని భూత ప్రేతాలు, భయంకర సర్పాలు ప్రయోగించాడు. 


ధృవుని చుట్టూ తపోతేజస్సు వలన ఏర్పడ్డ శక్తి వలయం వేటినీ దగ్గరికి రాకుండా, ధ్రువుని తపస్సుకి భంగం చేయకుండా చూసింది.  


ఆగ్రహం చెందిన ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించాడు. అది కూడా ధ్రువుని చుట్టు ఏర్పడిన తేజోవలయం దాటలేక వెనక్కు తిరిగి వచ్చింది. భయపడిన ఇంద్రుడు వైకుంఠం పరిగెత్తుకుంటూ వెళ్లి నారాయణుని దర్శనం పొంది నమస్కరించి


"నారాయణా! ధ్రువుడి తపస్సు వలన కలిగే అగ్ని ముల్లోకాలను దహిస్తోంది. తపస్సు భంగం చేయాలన్న దిక్పాలకుల ప్రయత్నాలు విఫలం అయ్యాయి. నా వజ్రాయుధం కూడా ఏమి చేయలేక వెనక్కు వచ్చింది. నీవు ధ్రువుని అనుగ్రహించి తపస్సు ఆపకపోతే ముల్లోకాలు ఆ పసివాడి తపశక్తికి కాలి బూడిదై పోతాయి. మమ్మల్ని, లోకాలను రక్షింపుము" అని ప్రార్ధించాడు.


ఇంద్రునికి అభయమిచ్చి పంపి నారాయణుడు ధ్రువుని తపస్సుకి మెచ్చి అతని ఎదుట ప్రత్యక్షమై "కుమారా! ధ్రువా! నీ భక్తికి ప్రసన్నత చెంది వచ్చాను. కన్నులు తెరువుము" అని అప్యాయంగా పిలిచాడు. ధ్రువునికి దివ్యదృష్టి లభించి కన్నులు తెరచి చతుర్భుజుడు, ముగ్ద మనోహరుడు అయిన నారాయణుని చూసి పరవశించి పోయాడు. కన్నుల నుండి ఆనందబాష్పాలు జలజలా జారుతున్నాయి.


"తండ్రీ! నారాయణా! నన్ను అనుగ్రహించి దర్శన భాగ్యం కలిగించావు. నా తల్లి వర్ణించినట్టు నీ దివ్య సుందర రూపం ఉంది. ఓం నమో నారాయణాయ" అని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీహరి ప్రేమతో ధ్రువుని లేపి దగ్గరకు తీసుకుని "ధ్రువా! కోరుకో నాయనా! కోరినవన్నీ అనుగ్రహిస్తాను" అని పలికాడు.


ఆనందబాష్పాలు ఆపుకుంటూ భక్తి తన్మయత్వంతో "నారాయణా! నా సవతి తల్లి సురుచి చేసిన అవమానం భరించలేక నీ అనుగ్రహంతో తండ్రి ప్రేమాభిమానాలు, రాజ్యాధిపత్యం పొందాలని తపస్సు ఆరంభించాను. నీ దివ్య దర్శనంతో నాలోని కోరికలన్ని నశించి పోయాయి. సదా నీ సన్నిధిలో ఉండే దర్శనం పొందే భాగ్యం కలిగించుము" అని కోరుకున్నాడు.


నారాయణుడు మందహాసంతో "ధ్రువ కుమారా! భూమిపై జన్మించినవారు పూర్వజన్మల కర్మఫలం పూర్తిగా అనుభవించిన తరువాతే మోక్షము పొందగలరు. భూమి మీద సకల సంపదలు, సుఖములు, రాజ్యాధికారం అనుభవించుము. పిదప గ్రహనక్షత్ర మండలంలో అత్యున్నతమైన ధృవమండలంలో ధ్రువ నక్షత్రమై నీ తల్లితో కలసి ఉంటావు. ధ్రువ నక్షత్రంగా విశ్వానికి మార్గదర్శనం చేస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతావు. కల్పాంతంలో మోక్షం లభించి నా సన్నిధి చేరుతావు" అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.


ధ్రువుడు యుక్తవయసు రాగానే శంభువు అనే కన్యను వివాహమాడి శ్లిష్ట, భవ్యుడు అనే ఇద్దరు కుమారులను పొందాడు. ధ్రువ వంశం వీరి ద్వారా వృద్ధి చెందింది. అంగుడు, సమనుడు, అంగిరసుడు, శిబి చక్రవర్తి మొదలైన వారు ఈ వంశములో జన్మించారు..


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

26మార్చి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   *🌷గురువారం🌷*

*🌹26మార్చి2026🌹*  

 *దృగ్గణిత పంచాంగం*                                        

   

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - శుక్ల పక్షం* 


*తిథి : అష్టమి* ఉ 11.48 వరకు ఉపరి *నవమి*  

*వారం    : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : ఆరుద్ర* సా 04.19 వరకు ఉపరి *పునర్వసు*

*యోగం : శోభన* రా 12.32 వరకు ఉపరి *అతిగండ*

*కరణం  : బవ* ఉ 11.48 *బాలువ* రా 10.55 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు:* 

*ఉ 09.00-10.00 & 11.00-12.00 సా 04.00-06.00*               

అమృత కాలం  : *ఉ 06.50 - 08.21*

అభిజిత్ కాలం  : *ప 11.49 - 12.38*

*వర్జ్యం    : రా 03.51 - 05.24 తె*

*దుర్ముహూర్తం  : ఉ 10.11 - 11.00 మ 03.04 - 03.53*

*రాహు కాలం   :మ 01.45-03.16*

గుళికకాళం      : *ఉ 09.10 - 10.42*

యమగండం    : *ఉ 06.07 - 07.39*

సూర్యరాశి : *మీనం*                     

చంద్రరాశి : *మిధునం*

సూర్యోదయం :*ఉ 06.16*  

సూర్యాస్తమయం :*సా 06.28*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 06.07- 08.34*

సంగవ కాలం      :*08.34 - 11.00*

మధ్యాహ్న కాలం    :*11.00 - 01.26*

అపరాహ్న కాలం :*మ 01.26-03.53*

*ఆబ్ధికం తిధి    : చైత్ర శుద్ధ నవమి*

సాయంకాలం    :*సా03.53- 06.19*

ప్రదోష కాలం      :*సా 06.19- 08.41*

రాత్రి కాలం        :*రా 08.41 - 11.49*

నిశీధి కాలం        :*రా 11.49- 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.32 - 05.19*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

         *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*!!.ఓం శ్రీ గురు దత్తాయ నమః.!!*


*శత్రునాశకరం స్తోత్రం* 

*జ్ఞానవిజ్ఞానదాయకమ్*

*సర్వపాపం శమం యాతి* 

*దత్తాత్రేయ నమోఽస్తుతే*

           

*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*బుధవారం 25 మార్చి 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*

         *36 - 37వ భాగం*


*ధ్రువ చరిత్ర*```


ప్రస్తుత బ్రహ్మ జీవితకాలంలో భూమండలాన్ని పద్నాలుగు మంది మనువుల పరిపాలిస్తారు. వారిలో స్వాయంభువ మనువు మొదటి వాడు. స్వాయంభువ మనువుకి శతరూపకు ప్రియవ్రతుడు, ఉత్తాన పాదుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య సురుచికి ఉత్తముడు, రెండవ భార్య సునీతికి ధ్రువుడు పుత్రులుగా జన్మించారు.


ఉత్తానపాదుడు పెద్దభార్య సురుచికిపై ఎక్కువ ప్రేమ చూపిస్తూ చిన్న భార్య సునీతిని దూరంగా ఉంచేవాడు. పెద్దభార్య కుమారుడు ఉత్తముడికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవాడు. చిన్నభార్య సునీతి గమనించి తన కుమారుడు ధ్రువునికి నారాయణుని పై భక్తి అలవాటు చేసింది. అయినా ధ్రువునికి మనస్సులో తండ్రి ప్రేమాభిమానాలు పొందాలని, తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకోవాలి అని ఉండేది.


ఒకరోజు సింహాసనంపై ఉత్తానపాదుడు తన పెద్ద కుమారుడు ఉత్తముని ఊరువు(తొడ)పై కూర్చుండబెట్టుకుని ప్రేమతో లాలిస్తూ ఆడించసాగాడు. అది చూసిన ధ్రువుడు తనూ తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకోవాలి అని పరిగెత్తుకుంటూ దగ్గరకు వెళ్లాడు. పెద్దరాణి సురుచి చూసి పట్టుకుని ఆపి “ధ్రువా! ఉత్తముడు పట్టపురాణి అయిన నా కుమారుడు కనుక సామ్రాజ్యానికి వారసుడు. చక్రవర్తి అంకపీఠంపై(తొడపై) కూర్చునేందుకు అర్హత ఉంది. నీవు నా సవతి కుమారుడివి. కనుక రాజ్యార్హత, తండ్రి ఒడిలో కూర్చుని ప్రేమాభిమానాలు పొందే అర్హత, అధికారం నీకు లేదు" అని కసిరి వెళ్లిపొమ్మంది. 


తండ్రి ఉత్తానపాదుడు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. 


బాలుడైన ధ్రువుడు దుఖంతో తల్లి వద్దకు వెళ్లి జరిగింది చెప్పి ఏడవసాగాడు. తల్లి సునీతి ధ్రువుని కన్నీరు తుడిచి "లోకంలో అందరికి నారాయణుడు వారి పూర్వజన్మ కర్మ ఫలాల బట్టి సుఖాలు, అదృష్టాలు, అర్హతలు ప్రసాదిస్తాడు. మీ పెద్దమ్మ కుమారుడు ఉత్తముడు పూర్వజన్మ పుణ్య ఫలం వలన పట్టపురాణికి పుట్టి తండ్రి ప్రేమాభిమానాలు, రాజార్హత సంపాదించాడు. నీవు నావంటి దురదృష్టరాలికి పుట్టావు. ఇంతే ప్రాప్తం అని సర్దుకుపోవాలి" అంటూ ఓదార్చింది.


తల్లి మాటల వలన ధ్రువునికి నారాయణుడి అనుగ్రహం సంపాదిస్తే తన తలరాత మారి తండ్రి ప్రేమాభిమానాలు లభిస్తాయి అని అర్థమైంది. 


వెంటనే లేచి తల్లికి నమస్కరించి “అమ్మా! నేను తపస్సు చేసి నారాయణుని అనుగ్రహం పొంది తండ్రి ప్రేమాభిమానాలు సంపాదించుకుంటాను. ఆశీర్వదించి అనుమతి ఇవ్వండి" అని కోరాడు. 


కుమారుని మాటల్లో గల ధృఢ సంకల్పం గ్రహించి సునీతి ఆశీర్వదించి అనుమతిచ్చింది.


ధ్రువుడు అడవికి తపస్సుకి బయలుదేరి వెళ్లాడు. 


పూర్వజన్మ పుణ్య ఫలం వలన ధ్రువునికి మార్గ మధ్యలో నారదుడు, సప్తర్షుల దర్శన భాగ్యం కలిగింది. వారు బాలుడైన ధ్రువుని వివరాలు తెలుసుకుని అతని ధృడ సంకల్పం విని సంతోషం చెందారు. నారాయణుని అష్టాక్షరి మహామంత్రం ‘ఓం నమో నారాయణాయ’ ను నారదుడు విధి పూర్వకంగా ఉపదేశం చేశాడు. 


“నాయనా! ధ్రువా! భక్తి శ్రద్థలతో ఈ నారాయణ మంత్ర జపం చేస్తూ తపస్సు చేయుము. నారాయణుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది" అని ఆశీర్వదించి వెళ్ళారు.  


ధ్రువుడు అడవిలో సరోవరం సమీపంలో మంచి ప్రదేశం చూసుకుని శుచియై తపస్సుకి కూర్చున్నాడు. నారాయణుని చిత్తములో నిలుపుకుని ధ్యానమగ్నుడై తపస్సు చేయసాగాడు.


కాలము, ఆకలిదప్పులను మరచిపోయాడు. ధ్రువుని తపస్సు యొక్క తేజస్సు క్రమ క్రమంగా పెరిగి ముల్లోకాలకు వ్యాపించి దహించసాగింది. దేవలోకము కంపించింది. దేవేంద్రుడు ధ్రువుని తపస్సు ఆపదలు కలిగిస్తుంది అని తలచి దిక్పాలకులను పిలిచి తపస్సు భంగం చేయమని ఆదేశించాడు. 


వరుణుడు కుంభవృష్టి కురిపించాడు.. వాయుదేవుడు సుడిగాలి ప్రభంజనాలు సృష్టించాడు. అగ్నిదేవుడు దావానలం సృష్టించి అడవిని దహనం చేశాడు. 


యముడు భయపెట్టాలని భూత ప్రేతాలు, భయంకర సర్పాలు ప్రయోగించాడు. 


ధృవుని చుట్టూ తపోతేజస్సు వలన ఏర్పడ్డ శక్తి వలయం వేటినీ దగ్గరికి రాకుండా, ధ్రువుని తపస్సుకి భంగం చేయకుండా చూసింది.  


ఆగ్రహం చెందిన ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించాడు. అది కూడా ధ్రువుని చుట్టు ఏర్పడిన తేజోవలయం దాటలేక వెనక్కు తిరిగి వచ్చింది. భయపడిన ఇంద్రుడు వైకుంఠం పరిగెత్తుకుంటూ వెళ్లి నారాయణుని దర్శనం పొంది నమస్కరించి


"నారాయణా! ధ్రువుడి తపస్సు వలన కలిగే అగ్ని ముల్లోకాలను దహిస్తోంది. తపస్సు భంగం చేయాలన్న దిక్పాలకుల ప్రయత్నాలు విఫలం అయ్యాయి. నా వజ్రాయుధం కూడా ఏమి చేయలేక వెనక్కు వచ్చింది. నీవు ధ్రువుని అనుగ్రహించి తపస్సు ఆపకపోతే ముల్లోకాలు ఆ పసివాడి తపశక్తికి కాలి బూడిదై పోతాయి. మమ్మల్ని, లోకాలను రక్షింపుము" అని ప్రార్ధించాడు.


ఇంద్రునికి అభయమిచ్చి పంపి నారాయణుడు ధ్రువుని తపస్సుకి మెచ్చి అతని ఎదుట ప్రత్యక్షమై "కుమారా! ధ్రువా! నీ భక్తికి ప్రసన్నత చెంది వచ్చాను. కన్నులు తెరువుము" అని అప్యాయంగా పిలిచాడు. ధ్రువునికి దివ్యదృష్టి లభించి కన్నులు తెరచి చతుర్భుజుడు, ముగ్ద మనోహరుడు అయిన నారాయణుని చూసి పరవశించి పోయాడు. కన్నుల నుండి ఆనందబాష్పాలు జలజలా జారుతున్నాయి.


"తండ్రీ! నారాయణా! నన్ను అనుగ్రహించి దర్శన భాగ్యం కలిగించావు. నా తల్లి వర్ణించినట్టు నీ దివ్య సుందర రూపం ఉంది. ఓం నమో నారాయణాయ" అని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీహరి ప్రేమతో ధ్రువుని లేపి దగ్గరకు తీసుకుని "ధ్రువా! కోరుకో నాయనా! కోరినవన్నీ అనుగ్రహిస్తాను" అని పలికాడు.


ఆనందబాష్పాలు ఆపుకుంటూ భక్తి తన్మయత్వంతో "నారాయణా! నా సవతి తల్లి సురుచి చేసిన అవమానం భరించలేక నీ అనుగ్రహంతో తండ్రి ప్రేమాభిమానాలు, రాజ్యాధిపత్యం పొందాలని తపస్సు ఆరంభించాను. నీ దివ్య దర్శనంతో నాలోని కోరికలన్ని నశించి పోయాయి. సదా నీ సన్నిధిలో ఉండే దర్శనం పొందే భాగ్యం కలిగించుము" అని కోరుకున్నాడు.


నారాయణుడు మందహాసంతో "ధ్రువ కుమారా! భూమిపై జన్మించినవారు పూర్వజన్మల కర్మఫలం పూర్తిగా అనుభవించిన తరువాతే మోక్షము పొందగలరు. భూమి మీద సకల సంపదలు, సుఖములు, రాజ్యాధికారం అనుభవించుము. పిదప గ్రహనక్షత్ర మండలంలో అత్యున్నతమైన ధృవమండలంలో ధ్రువ నక్షత్రమై నీ తల్లితో కలసి ఉంటావు. ధ్రువ నక్షత్రంగా విశ్వానికి మార్గదర్శనం చేస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతావు. కల్పాంతంలో మోక్షం లభించి నా సన్నిధి చేరుతావు" అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.


ధ్రువుడు యుక్తవయసు రాగానే శంభువు అనే కన్యను వివాహమాడి శ్లిష్ట, భవ్యుడు అనే ఇద్దరు కుమారులను పొందాడు. ధ్రువ వంశం వీరి ద్వారా వృద్ధి చెందింది. అంగుడు, సమనుడు, అంగిరసుడు, శిబి చక్రవర్తి మొదలైన వారు ఈ వంశములో జన్మించారు..


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.



ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః ।

అహంకారవిమూఢాత్మా కర్తాఽహమితి మన్యతే ।। 27 ।।



ప్రతిపదార్థ:



ప్రకృతేః — భౌతిక ప్రకృతి యొక్క; క్రియమాణాని — చేయబడును; గుణైః — మూడు గుణములచే; కర్మాణి — పనులు; సర్వశః — అన్ని రకాల; అహంకార-విమూఢ-అత్మా — అహంకారంతో భ్రమకు లోనై, తాము ఈ శరీరమే అనుకునే జీవులు; కర్తా — చేసేవాడిని; అహం — నేను; ఇతి — ఈ విధంగా; మన్యతే — భావించును.


 తాత్పర్యము : 


 

అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును. కానీ, అజ్ఞానంలో, జీవాత్మ, తాను ఈ శరీరమే అన్న భ్రమతో, తానే కర్తను (చేసేవాడిని) అని అనుకుంటుంది.

  

 వివరణ:


ప్రపంచంలో సహజసిద్ధంగా జరిగే పరిణామాలు మనం నిర్దేశించినవి కావని, అవి ప్రకృతిచే చేయబడినవి అని మనం గమనించవచ్చు. మన శరీరక్రియలను, మనం రెండు రకాలుగా విభజించవచ్చు 1) సహజంగానే జరిగే జీవ క్రియలు, అంటే, జీర్ణక్రియ, రక్త ప్రసరణ, హృదయస్పందన వంటివి, మనం కావాలని చేయము కానీ అవి సహజంగానే జరిగిపోతాయి. 2) మనమే ప్రయత్నపూర్వకంగా చేసే క్రియలు - మాట్లాడటం, వినటం, నడవటం, నిద్రించటం, పని చేయటం వంటివి.


ఈ రెండు రకాల పనులూ కూడా మనస్సు-శరీరం-ఇంద్రియముల వ్యవస్థ ద్వారా చేయబడుతాయి. ఈ వ్యవస్థ యొక్క అన్ని భాగాలు కూడా, సత్త్వ-రజో-తమస్సులచే కూడి ఉన్న త్రి-గుణాత్మకమైన ప్రకృతి లేదా భౌతిక శక్తితోనే తయారు చేయబడ్డాయి. ఎలాగైతే అలలు సముద్రం కన్నా వేరు కాదో, అవి సముద్రంలో భాగమో, అదే విధంగా ప్రకృతి నుండి తయారయిన ఈ శరీరం, ప్రకృతిలో భాగమే. కావున, ప్రకృతి శక్తియే అన్ని పనులకు కర్త.


మరి ఎందుకు జీవాత్మ తనే అన్ని పనులు చేసేది అనుకుంటుంది? ఎందుకంటే, ప్రబలమైన అహంకార పట్టులో, ఆత్మ తనను తాను ఈ శరీరమే అనుకుంటుంది. అందుకే, కర్తృత్వ భావన మాయలో ఉండిపోతుంది. ఉదాహరణకి రైల్వే ప్లాట్ఫారం పైన రెండు రైళ్ళు పక్కపక్కనే ఉన్నాయనుకుందాం, ఒక రైల్లోని ప్రయాణికుడు తదేకంగా పక్క రైలుని చూస్తున్నాడనుకుందాం. ఆ రెండో రైలు కదిలితే, మొదటి రైలు కదిలినట్టుఉంటుంది. అదే విధంగా కదలని జీవాత్మ కదిలే ప్రకృతియే తను అనుకుంటుంది. అందుకే, చేసే క్రియలకు తానే కర్త అనుకుంటుంది. ఆత్మ ఈ అహంకారాన్ని వదిలి, భగవత్ సంకల్పానికి శరణాగతి చేసిన మరుక్షణం, తాను కర్తను కాను అని తెలుసుకుంటుంది.


కానీ, జీవాత్మ నిజంగా కర్త కానప్పుడు, శరీరం చేసే చర్యలకు, అది కర్మ సిద్ధాంత చట్రం లో ఎందుకు చిక్కుకుంటుంది? అని ఎవరైనా అడగవచ్చు. దీనికి కారణ మేమిటంటే, జీవాత్మ తనే స్వయంగా కర్మలను చేయకపోయినా, అది ఇంద్రియమనోబుద్ధులు చేసే క్రియలను మార్గదర్శకం చేస్తుంది. ఉదాహరణకి, ఒక రథ సారథి, రథాన్ని తనే గుంజడు, కానీ గుర్రాలకు దిశానిర్దేశం చేస్తాడు. ఇప్పుడు, ఒకవేళ ప్రమాదం జరిగితే, గుర్రాలను తప్పు బట్టలేము, సారథియే బాధ్యుడు. అదే విధంగా, మనస్సు-శరీరం వ్యవస్థ చేసే పనులకు జీవాత్మయే బాధ్యత వహించవలసి ఉంటుంది ఎందుకంటే ఇంద్రియములు-మనస్సు-బుద్ధి, ఆత్మ ద్వారా వచ్చే-------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.



ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః ।

అహంకారవిమూఢాత్మా కర్తాఽహమితి మన్యతే ।। 27 ।।



ప్రతిపదార్థ:



ప్రకృతేః — భౌతిక ప్రకృతి యొక్క; క్రియమాణాని — చేయబడును; గుణైః — మూడు గుణములచే; కర్మాణి — పనులు; సర్వశః — అన్ని రకాల; అహంకార-విమూఢ-అత్మా — అహంకారంతో భ్రమకు లోనై, తాము ఈ శరీరమే అనుకునే జీవులు; కర్తా — చేసేవాడిని; అహం — నేను; ఇతి — ఈ విధంగా; మన్యతే — భావించును.


 తాత్పర్యము : 


 

అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును. కానీ, అజ్ఞానంలో, జీవాత్మ, తాను ఈ శరీరమే అన్న భ్రమతో, తానే కర్తను (చేసేవాడిని) అని అనుకుంటుంది.

  

 వివరణ:


ప్రపంచంలో సహజసిద్ధంగా జరిగే పరిణామాలు మనం నిర్దేశించినవి కావని, అవి ప్రకృతిచే చేయబడినవి అని మనం గమనించవచ్చు. మన శరీరక్రియలను, మనం రెండు రకాలుగా విభజించవచ్చు 1) సహజంగానే జరిగే జీవ క్రియలు, అంటే, జీర్ణక్రియ, రక్త ప్రసరణ, హృదయస్పందన వంటివి, మనం కావాలని చేయము కానీ అవి సహజంగానే జరిగిపోతాయి. 2) మనమే ప్రయత్నపూర్వకంగా చేసే క్రియలు - మాట్లాడటం, వినటం, నడవటం, నిద్రించటం, పని చేయటం వంటివి.


ఈ రెండు రకాల పనులూ కూడా మనస్సు-శరీరం-ఇంద్రియముల వ్యవస్థ ద్వారా చేయబడుతాయి. ఈ వ్యవస్థ యొక్క అన్ని భాగాలు కూడా, సత్త్వ-రజో-తమస్సులచే కూడి ఉన్న త్రి-గుణాత్మకమైన ప్రకృతి లేదా భౌతిక శక్తితోనే తయారు చేయబడ్డాయి. ఎలాగైతే అలలు సముద్రం కన్నా వేరు కాదో, అవి సముద్రంలో భాగమో, అదే విధంగా ప్రకృతి నుండి తయారయిన ఈ శరీరం, ప్రకృతిలో భాగమే. కావున, ప్రకృతి శక్తియే అన్ని పనులకు కర్త.


మరి ఎందుకు జీవాత్మ తనే అన్ని పనులు చేసేది అనుకుంటుంది? ఎందుకంటే, ప్రబలమైన అహంకార పట్టులో, ఆత్మ తనను తాను ఈ శరీరమే అనుకుంటుంది. అందుకే, కర్తృత్వ భావన మాయలో ఉండిపోతుంది. ఉదాహరణకి రైల్వే ప్లాట్ఫారం పైన రెండు రైళ్ళు పక్కపక్కనే ఉన్నాయనుకుందాం, ఒక రైల్లోని ప్రయాణికుడు తదేకంగా పక్క రైలుని చూస్తున్నాడనుకుందాం. ఆ రెండో రైలు కదిలితే, మొదటి రైలు కదిలినట్టుఉంటుంది. అదే విధంగా కదలని జీవాత్మ కదిలే ప్రకృతియే తను అనుకుంటుంది. అందుకే, చేసే క్రియలకు తానే కర్త అనుకుంటుంది. ఆత్మ ఈ అహంకారాన్ని వదిలి, భగవత్ సంకల్పానికి శరణాగతి చేసిన మరుక్షణం, తాను కర్తను కాను అని తెలుసుకుంటుంది.


కానీ, జీవాత్మ నిజంగా కర్త కానప్పుడు, శరీరం చేసే చర్యలకు, అది కర్మ సిద్ధాంత చట్రం లో ఎందుకు చిక్కుకుంటుంది? అని ఎవరైనా అడగవచ్చు. దీనికి కారణ మేమిటంటే, జీవాత్మ తనే స్వయంగా కర్మలను చేయకపోయినా, అది ఇంద్రియమనోబుద్ధులు చేసే క్రియలను మార్గదర్శకం చేస్తుంది. ఉదాహరణకి, ఒక రథ సారథి, రథాన్ని తనే గుంజడు, కానీ గుర్రాలకు దిశానిర్దేశం చేస్తాడు. ఇప్పుడు, ఒకవేళ ప్రమాదం జరిగితే, గుర్రాలను తప్పు బట్టలేము, సారథియే బాధ్యుడు. అదే విధంగా, మనస్సు-శరీరం వ్యవస్థ చేసే పనులకు జీవాత్మయే బాధ్యత వహించవలసి ఉంటుంది ఎందుకంటే ఇంద్రియములు-మనస్సు-బుద్ధి, ఆత్మ ద్వారా వచ్చే ప్రేరణతో పని చేస్తాయి. ప్రేరణతో పని చేస్తాయి.

రామాయణం - 15 )

 శ్రీరామ  (22)


               ( వాల్మీకి రామాయణం  - 15 )


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


  (25-3-'26  ' మధ్యాహ్నం '  పోష్టు తరువాయి భాగము)


జనకుని మాటలు విని, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అతనితో ఇలా అన్నారు.


" ఇక్ష్వాకు వంశము, మీ విదేహ వంశము,చాలా గొప్పవి.

మీ వంశములు వియ్యమందటము, అందరికి క్షేమం కలిగిస్తుంది.

నీ తమ్ముని కుమార్తెలయిన మాండవీ, శ్రుతకీర్తులను, దశరథ పుత్రులైన, భరత, శత్రుఘ్నులకు భార్యలుగా మేము వరించుచున్నాము.

ఈ వివాహ సంబంధము వల్ల మీ ఇరువురి వంశములు దృఢమైన బంధముకలవి అగుగాక" అన్నారు.


జనకుడు, కుశధ్వజుడు, మహర్షులు చెప్పినదానికి చాలా సంతోషంతో అంగీకరించారు.


శ్లో//ఏవం భవతు భద్రం వః కుశధ్వజ సుతే ఇమే/

పత్నీ భజేతాం సహితౌ శతృఘ్న భరతావుభౌ/

ఏకాహ్నా రాజపుత్రీణాం చతసౄణాంమహామునే/

పాణీన్ గృహ్ణన్తు చత్వారో రాజపుత్రా మహాబలాః//


(అట్లే అగుగాక.మీకు భద్రమగు గాక.ఈ కుశధ్వజుని కుమార్తెలగు "మాండవీ" "శృతకీర్తులు"  ఎప్పుడూ సన్నిహితంగా మెలిగే ఈ భరత శతృఘ్నులకు(వరుసగా) భార్యలై వారిని సేవించెదరు గాక.

ఓ మహామునీ! మహాబలశాలులగు ఈ రాజపుత్రులు నలుగురు ఒకే దినమున నలుగురు రాజపుత్రికలను వివాహమాడుదురు గాక).


దశరథ మహారాజు అప్పుడు జనకుని వద్ద సెలవు తీసుకుని,వసిష్ఠ,విశ్వామిత్రులతొ

తన విడిదికి వెళ్లి, యథా శాస్త్రముగా చేయవలసిన కార్యములు నిర్వర్తించాడు.


మరుసటి రోజు ప్రాతః:కాలంలో, స్నాతకము, గోదానము మొదలైన విహిత కృత్యములను నిర్వహించాడు.


ఆ రోజు,భరతుని మేనమామ, కేకయమహారాజు కుమారుడు, అయిన యుధాజిత్తు అక్కడకు వచ్చాడు.


మేనల్లుడైన భరతుని చూచుటకు తాను అయోధ్యాపట్టణానికి వెళ్లాననీ, అక్కడ రాముని వివాహవిషయం తెలిసి ఇక్కడకు వచ్చాననీ, చెప్పాడు.

అతని రాకకు అందరూ చాలా సంతోషించారు.

శ్లో// అథ రాజా దశరథః ప్రియాతిథి ముపస్థితమ్ /

దృష్ట్వా పరమ సత్కారైః పూజార్హం సమపూజయత్//

(పిమ్మట దశరథుడు వచ్చిన ఆ ప్రియాతిథిని చూచి పూజార్హుడైన అతనిని అనేక సత్కారములు చేసి గౌరవించాడు)



అందరూ మరుసటిరోజు జరగబోయే వివాహ విషయాలు ముచ్చటించుకుంటూ ఆ రాత్రి సుఖంగా గడిపారు. 

                                  


                    శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

                      ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః.


( సశేషం )

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

25-3-'26


(రేపు స్మార్తులకు శ్రీరామనవమి.

ఆ సందర్భంగా శుభప్రదమైన సీతారామ కళ్యాణం చెప్పుకుందాము)

వాల్మీకి రామాయణం - 14)

 శ్రీరామ (21)


               ( వాల్మీకి రామాయణం - 14)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


  (25-3-'26 ' ఉదయం ' పోష్టు తరువాయి భాగము)


జనకమహారాజు ఆహ్వానాన్ని పురస్కరించుకుని దశరథ మహారాజు , విశ్వామిత్రాది ఋషులతోను, బంధువులతోను జనకుని సభకు వచ్చాడు.

ధర్మాత్ముడు, మా కులగురువు, అయిన వసిష్ఠమహర్షి నా పక్షమున మా వంశక్రమమును చెప్పగలడని జనకునకు తెలియజేశాడు.

వసిష్ఠమహర్షి జనకునితో ఇలా అన్నాడు.

శ్లో// అవ్యక్తప్రభవో బ్రహ్మా శాశ్వతో నిత్య అవ్యయః /

తస్మాన్మరీచిః సంజజ్ఞే మరీచేః కాశ్యపః సుతః //

(అవ్యక్తమునుండి జన్మించిన వాడు, శాశ్వతంగా ఉండేవాడు, నిత్యుడు, వినాశము లేనివాడు, అయిన బ్రహ్మదేవుని నుండి మరీచియు, మరీచినుండి కాశ్యపుడును జన్మించిరి).

కాశ్యపుని కుమారుడు సూర్యుడు.

సూర్యుని కుమారుడు మనువు.

మనువునకు ఇక్ష్వాకువుజన్మించాడు.

ఆయనే అయోధ్యకు మొదటి రాజు.

ఇక్ష్వాకుని పుత్రుడు "కుక్షి".

అతని కుమారుడు "వికుక్షి".

వికుక్షి కుమారుడు "బాణుడు"

"అనరణ్యుడు" బాణుడి కుమారుడు.

అనరణ్యుని పుత్రుడు "పృథు చక్రవర్తి".

పృథువు కుమారుడు "త్రిశంకువు".

అతనికి "దుంధుమారుడు", (అతనికే "యువనాశ్వుడు"అనే పేరు కూడా ఉంది)

యువనాశ్వుని కుమారుడు "మాంధాత".

మాంధాత కుమారుడు. "సుసంధి".

సుసంధికి "ధ్రువసంధి" , "ప్రసేనజిత్" అనే ఇద్దరు కుమారులు.

ధ్రువసంధి కుమారుడు "భరతుడు".

భరతుని కుమారుడు "అసితుడు".

శత్రువులచేత ఓడింపబడి అడవులకు వెళ్లిన అసితుడు "చ్యవన మహర్షి" అనుగ్రహం వల్ల "సగరుడు"అనే పుత్రుని పొందెను.

సగరుని పుత్రుడు "అసమంజుడు".

అసమంజుని కుమారుడు "అంశుమంతుడు"

అంశుమంతుని కుమారుడు "దిలీపుడు".

దిలీపుని కుమారుడు "భగీరథుడు".

భగీరథుని కుమారుడు "కకుత్థ్సుడు".

కకుత్థ్సుని కుమారుడు "రఘుమహారాజు".

రఘువు కుమారుడు " పురుషాదకుడు " కల్మాషపాదుడు,అనే నామములతో పిలువబడే "ప్రవృద్ధుడు" 

అతని కుమారుడు"శంఖణుడు".

శంఖణుని కుమారుడు. "సుదర్శనుడు".

అతని కుమారుడు"అగ్నిపర్ణుడు".

అగ్నిపర్ణుడి కుమారుడు "శీఘ్రగుడు".

అతని కుమారుడు. "మరువు".

మరువు కుమారుడు "ప్రశుశుక్రుడు".

అతని కుమారుడు "అంబరీషుడు".

అంబరీషుని కుమారుడు "నహుష చక్రవర్తి".

నహుషుని కుమారుడు "యయాతి".

అతని కుమారుడు "నాభాగుడు"

నాభాగుని కుమారుడు "అజ మహారాజు".

అజ మహారాజు పుత్రుడు "దశరథ మహారాజు"

దశరథ మహారాజు కుమారులు రామ,లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు.

పరిశుద్ధమైన వంశచరిత్ర కలిగిన వారు, వీరులు,‌

పరమ ధార్మికులు, సత్యవాదులు అయిన ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఈ రామ, లక్ష్మణుల కొరకు నీ కుమార్తెలైన "సీత" "ఊర్మిళ" లను వరించు చున్నాను.

రామ లక్ష్మణులకు, నీ కుమార్తెలయిన సీత, ఊర్మిళ లను ఇచ్చి వివాహము చేయుము, అని వశిష్ఠ మహర్షి చెప్పి, ముగించాడు.

                         

అప్పుడు వసిష్ఠమహర్షికి చేతులు జోడించి జనక మహారాజు ఇలా అన్నాడు.

సత్కుల ప్రసూతులైన వారు,కన్యాదాన సమయంలో తమ కులమును గూర్చి పూర్తిగా చెప్పవలెను.

మా వంశమునకు మూల పురుషుడు "నిమి" చక్రవర్తి.

ఆ నిమి చక్రవర్తి కుమారుడు"మిథి".

ఆయనే ఈ మిథిలానగరాన్ని నిర్మించిన మొదటి జనకుడు.

మిథి కుమారుడు ఉదావసువు.

ఉదావసువు కుమారుడు నందివర్థనుడు.

అతని కుమారుడు సుకేతువు.

సుకేతువునకు,ఈ శివ ధనుస్సును పొందిన వాడు,ప్రఖ్యాతుడు అయిన"దేవరాతుడు"జన్మించాడు.

దేవరాతుని కుమారుడు బృహద్రథుడు.

అతని కుమారుని పేరు"మహావీరుడు".

ఆయన పుత్రుడు సుధృతి.

సుధృతి కుమారుడు దృష్టకేతువు.

ఆయన కుమారుడు హర్యశ్వుడు.

హర్యశ్వునకు మరుడు అను పుత్రుడు జనించెను.

మరుని పుత్రుడు ప్రతింధకుడు.

ప్రతింధకుని కుమారుడు కీర్తిరథ మహారాజు.

కీర్తిరథునకు దేవమీఢుడు జన్మించాడు.

దేవమీఢుని పుత్రుడు విబుధుడు.

విబుధుని కుమారుడు మహీధ్రకుడు.

అతని కుమారుడు కీర్తిరాతుడు.

కీర్తిరాతునకు మహారోముడు జన్మించాడు.

మహారోముని కుమారుడు స్వర్ణరోముడు.

స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు.

ధర్మాత్ముడైన హ్రస్వరోమునకు నేను జ్యేష్ఠ కుమారుడను.

నా తమ్ముడైన కుశధ్వజుడు రెండవ కుమారుడు.

జ్యేష్ఠుడనైన నన్ను రాజ్యాభిషిక్తుని చేసి,కుశధ్వజుని నా పోషణలో ఉంచి, హ్రస్వరోమ మహారాజు తపస్సు ఆచరించేందుకు అరణ్యములకు వెళ్లాడు.

నేను కుశధ్వజుని సాంకాస్య పురమునకు రాజును చేసాను.

ఇదీ మా వంశ వృత్తాంతము.

ఓ మహర్షీ! మీకు మంగళ మగుగాక.

మీరు చెప్పినట్లు నా జ్యేష్ఠ కుమార్తె సీతను రామునకు, రెండవ కుమార్తె ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చి వివాహం చేస్తాను.


శ్లో//వీర్య శుల్కాం మమ సుతాం సీతాం సురసుతోపమామ్/

ద్వితీయా మూర్మిళాం చైవ త్రిర్దదామి నసంశయః//

(వీర్య శుల్కయు,దేవకన్యతో సమానురాలును అగు నా పుత్రిక యైన సీతను రామునకు, రెండవ కుమార్తె అయిన ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చి వివాహము చేసెదనని ముమ్మారు నొక్కి వక్కాణించుచున్నాను.

ఈ విషయమున సందేహము లేదు).

ఇక్కడ "త్రిః దదామి" అను పదమునకు మనో,వాక్కాయములను మూడు కరణముల చేత అనగా త్రికరణశుద్ధిగా ఇచ్చుచున్నాను అని అర్థం చేసుకోవాలని వ్యాఖ్యాతలు చెప్పారు.


జనకుడు దశరథ మహారాజుతో ఇలా అన్నాడు.

ఓ మహారాజా ! ఈరోజు మఖా నక్షత్రము. 

ఎల్లుండి సంతానప్రదుడైన " భగుడు" అధిదేవతగాగల ఉత్తర ఫల్గునీ నక్షత్ర మందు వివాహముజరిపింపుము.

ఈ లోపు గోదానము, మొదలైన శాంతి కార్యములు చేయింపుము"


(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

25-3-'26.

వేదాలకు భాష్యాలు

 వేదాలకు భాష్యాలు మాత్రమే ఎందుకు రచించారు భాష్యకారులు? టీక, అనువాదములు వంటి ప్రక్రియలు వేదములకు ఎందుకు లేవు ?

వేదములకూ, బ్రహ్మసూత్రాలకు తదితర మంత్రాత్మకమైన వాఞ్మయానికి భరతవర్షంలో భాష్యాలు చెప్పబడినాయి. శుష్కమైన తాత్పర్యాలు లేవు.


అసలు భాష్యం అంటే ఏమిటి?


సూత్రార్థా వర్ణితం యత్ర పదై సూత్రాంత సారిభిః |


స్వపదాని చ వర్ణాంతే భాష్యం భాష్యవిదో విదుః ||


ఎక్కడైతే మంత్రములో గల శబ్దాలు స్పష్టంగా వివరింపబడి, ఆ వివరణకు ఉపయోగించిన శబ్దజాలానికి అర్థమూ వివరింపబడునో దానిని భాష్యమని భాష్యవిదులు పేర్కొంటారు.


అనగా భాష్యం - మంత్రములకు చెప్పబడుతుంది.


మంత్రములో గల ప్రతి శబ్దానికి వివరణ ఉంటుంది. దీనిని వృత్తి అంటారు.


వృత్తిని స్పష్టీకరించడమూ ఉంటుంది. దీనిని వార్తికము అంటారు. వార్తికం అంటే వృత్తిని విపులంగా చర్చించేది. (వృత్తిం వేదయతి ఇతి వార్తికం)


అంటే భాష్యం అన్నది ఒక సర్వతోముఖమైన, సమగ్రమైన ప్రక్రియ.


"మంత్రబ్రాహ్మణయోర్వేద నామధేయమ్" అని ఆపస్తంబుని సూత్రీకరణ. వేదములు అంటే మంత్రములు, ఆ మంత్రములతో కూడిన యజనక్రియలు.


వేదాంగములు ఆరు. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పమ్. భాష్యకారుడికి ఈ ఆరు వేదాంగములలో పావీణ్యంతో బాటు, మంత్రము యొక్క అర్థం అనుభవజ్ఞానం ఉండవలె. "సమ్యగనుభవసాధనం ప్రమాణమ్";" అనధిగతార్థగంతృప్రమాణమ్".


చిన్న వివరణ. ఉదాహరణకు "ఆకలి" అన్న శబ్దం ఉందనుకోండి. ఆ శబ్దానికి అర్థం ఆ వచనం లో లేదు. ఆకలి శబ్దానికి కేవలం "ఒక సంవేదన" అన్న శుష్కార్థంలో ఇముడదు.ఆకలి కి నిజమైన అర్థం తెలియాలంటే శబ్దజ్ఞానంతో బాటు, ఆ ఆకలి యొక్క అనుభవజ్ఞానం, అన్నం విలువ, దాని పవిత్రత, ఆహారం పెట్టినవాని దయ, ఆ అన్నాన్ని పండించిన వాడి కృషి, వీటి సమగ్రస్వరూపం తెలియాలి.


భౌతికజీవితంలోని అర్థాలకే సమగ్రత్వం ఈ విధంగా ఉన్నప్పుడు - మంత్రస్వరూపంగా వేలాది ఏళ్ళు సాంప్రదాయంలో, సంస్కృతిలో, ప్రతి క్రతువులో, కర్మలో, వ్రతంలో, అనుష్ఠానంలో మమేకమైన వేద మంత్రాలకు భాష్యార్థం ఎంతో శ్రమపడితే తక్క మహనీయులకు కూడా తెలియదు.


వేదాలకు భాష్యం రచించడానికి సాయణాచార్యుడు (మాధ విద్యారణ్యుల వారి తమ్ముడు) 24 ఏళ్ళు శ్రమపడవలసి వచ్చిందని చెప్పుకున్నాడు.


ఋగ్వేదంలో మంత్రాలకు నిరుక్తంలో భాష్యం ఉంది. నిరుక్తకారుడు యాస్కాచార్యుడు. (మనకు 9 నిరుక్తాలు ఉండేవట. ఇప్పుడు దొరికేది యాస్కాచార్యుని నిరుక్తం ఒకటే). సాయణాచార్యుడు చతుర్వేదాలకు భాష్యం రచించినాడు. ఆసక్తి పెంచుకొని ఎవరైనా చదవగలిగితే ఎంతో మంగళకరమైన, మనోజ్ఞమైన భావనలు అందు కనిపిస్తాయి.


వేదభాష్యానికి ఒక్క ఉదాహరణ. ఈ మంత్రాన్ని హిందువులయొక్క ప్రతిక్రతువులోనూ, వ్రతంలోనూ, పెళ్ళికి ముందు వధువు చేసే గౌరీపూజలోనూ పఠిస్తారు. వేల ఏళ్ళుగా భారతసంస్కృతిలో మమేకమైన అందమైన ఋగ్వేదమంత్రం ఇది.


గౌరీ (నిర్)మిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ |


అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ ||


ఈ ఋక్కుకు సాయణాచార్యుని భాష్యం ఇలా ఉంది.


వాగ్దేవి మొట్టమొదట పరమవ్యోమంలో పరబ్రహ్మలో అంతర్గతంగా వున్న గౌరిగా ఏకపది. అదే ప్రణవరూపం.


పిదప సలిల సదృశములైన వర్ణపదవాక్యములను ఆమె సృష్టించింది. వ్యాహృతి (మంత్ర) రూపంలో సావిత్రిగ ద్విపది.


తర్వాత వేదచతుష్టయ రూపంలో చతుష్పది అయినది.


అటుపై, వేదాంగములు, స్మృతి పురాణ ధర్మశాస్త్రములలో అష్టాపది;


మీమాంసా, న్యాయ సాంఖ్య, యోగ, పాంచరాత్ర, పశుపత, ఆయుర్వేద ధనుర్వేద, గాంధర్వ వేదవిద్యా రూపిణియై నవపది. తదనంతరము అనంతవాక్యరూపమున వాగ్దేవి ప్రపంచమంతా ప్రతిభాసిస్తున్నది.


అయితే యాస్కాచార్యుడు గౌరిని - మేఘాల మధ్య విద్యుత్తు అని పేర్కొన్నాడు. ఆయన భాష్యం ఈ క్రింది బొమ్మల్లో చదుకోవచ్చు.మంత్రార్థము (వృత్తి), భాష్యార్థము (వార్తికము) ఇక్కడ చూడవచ్చు.




సాంప్రదాయికంగా భరతవర్షంలో వేదాలకు భాష్యాలు ఉన్నాయని, అవి ఎంతో మనోహరమైన కృతులని చెప్పుకున్నాం.


ఆధునిక కాలంలో - వేదాలను పనిగట్టుకుని నాశనం చేసిన వారు ఆంగ్లేయులు. మనకు సంస్కృతం ఓ మోస్తరుగా కావ్యాలు చదువుకునేంత మోతాదున నేర్చుకోవడానికే జీవితకాలం పడుతుంది. వేదభాష్యాలకు సాయణాచార్యుడంతటి పండితుడికి 24 ఏళ్ళు పడితే ఆంగ్ల అనువాదకులకు యుక్తవయసుకే వేదాలు అర్థం చేసుకునేంత జ్ఞానం వచ్చిందట! అదీ ఒక్క ముక్క సాంప్రదాయం తెలియకుండానే! నిజానికి వీరికి సంస్కృతభాషలో రామ శబ్దం కూడా తెలియదు. అయితే వీరు పేద బ్రాహ్మలతో అర్థాలు చెప్పించుకుని, పెడర్థాలు తీసి "అనువాదాలు" రచించడానికి అనతికాలమే పట్టింది. వీరు చేసింది అనువాదం. అదీ కూడా అక్కడక్కడా పరమహీనమైన పద్ధతిలో ఉంది. ఈ అనువాదకుల్లో రాల్ఫ్ గ్రిఫిత్, మేక్స్ ముల్లర్ లు ముఖ్యులు.


పైన "గౌరీమిమాయ ..." కు అర్థం చూచాం. అసలా అర్థం తెలియకున్నా గౌరి అంటే భారతదేశంలో అమ్మవారు అని అందరికీ తెలుసు 

ఆంగ్ల యులు దానిని

వేరే విధంగా అనువాదం చేయటం జరిగింది