15, నవంబర్ 2020, ఆదివారం

ఉదయం స్నానం

 *🙏ఉదయం స్నానం ఎందుకు ?🙏*


 *తెల్లవారు జామున 4 గంటల నుండి 6 గంటల వరకు బ్రహ్మముహూర్త | కాల సమయం 2 గంటలు ఉంటుంది . ఈ రెండు గంటల కాల సమయములో | ఓజోన్ అనేటటువంటిది గాలిలో ఎక్కువగా ఉంటుంది . ఇది శరీరానికి తగలడం వలన శరీరానికి చాలా మంచిది . కనుక అందరూ తెల్లవారు జామున అనగా ఉదయం 4 నుంచి 6 గంటల లోపల స్నానం చేయాలి . అంతేకాకుండా మరియొక కారణం కూడా ఉన్నది . ఆ బ్రహ్మముహూర్త కాల సమయంలో దేవతలు భూలోక సంచారం చేస్తుంటారని , అందువలన | ధ్యానముతో భగవంతుడు సులువుగా ప్రసన్నుడౌతాడని ఆధ్యాత్మికుల అభిప్రాయం అందుకే హిందూ సాంప్రదాయకమైన దేవాలయాలన్నియు భగవంతుని మేలుకొల్పు , సుప్రభాతము మొదలగు పూజా కార్యక్రమములతో   ప్రారంభమవుతూ ఆ సమయంలోనే కోవెలలన్నీ తెరువబడతాయి . సుమారు |6 లేక 7 గంటల నిద్రవలన మానవుల తనువు తేలికబడి , మనసు ఉల్లాసంగా నిర్మలముగా ఉండి వారు చేయు పని పట్ల ఏకాగ్రత కుదురుతుంది . అంతేకాక వారిని ఆటంక పరిచే నిత్యమానవ విధులేవి ఆ సమయమునంద ఆరంభము | కావు . అందువలన దీక్ష కాలమున బ్రహ్మ ముహూర్తమున నిద్రలేవి | శిరస్నానమాచరించి స్వామిని సేవించవలెనని నియమము విధించారు .*


*🔥వత్తులు :-🔥*


*1 ) ఒక వత్తి : సామాన్య శుభం* 


*2 ) రెండు వత్తులు : కుటుంబ సౌఖ్యం* 


*3 ) మూడు వత్తులు : పుత్ర సుఖం*


*4 ) ఐదు వత్తులు : ధనం , సౌఖ్యం , ఆరోగ్యం , ఆయుర్ధాయం , అభివృద్ధి దీపారాధనకు పత్తితో చేసిన వత్తి శ్రేష్ఠము .*


*💥దీపారాధన విధానం :-💥*


*1 ) నెయ్యి : నేతితో దీపారాధన చేసిన ఇంటిలో సర్వ సుఖాలు సౌభాగ్యాలు కలుగును .*


 *2 ) నువ్వుల నూనె : నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు , పీడలు తొలగును .*


*3 ) ఆముదం : ఆముదముతో దీపారాధన చేసిన , దేదీప్యమానమగు జీవితం , బంధుమిత్రుల శుభం , దాంపత్య సుఖం వృద్ధియగును .*


*4 ) వేరుశెనగ నూనె : వేరుశెనగనూనెతో దీపారాధన చేసి నిత్య ఋణములు , దుఖం , చోర భయం , పీడలు మొదలగునవి జరుగును .*


*5 ) నెయ్యి , ఆముదం , వేప నూనె , కొబ్బరి నూనె , యిలప నూనె కలిపి 48 రోజులు దీపారాధన చేసిన , వారికి దేవీ అనుగ్రహం కలుగును .* 


*6 ) వేపనూనె , నెయ్యి , యిలపనూనె మూడు కలిపి దీపారాధన చేసిన ఐశ్వర్యం ఇలవేల్పులకు సంతృప్తి కలుగును .*


*7 ) ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి జరుగంటలలోపు చేసిన సర్వరుభములు , శాంతి కలుగును .*


*🏹దీపాల యొక్క దిక్కుల ఫలితములు :-🏹* 


*1 ) తూర్పు : కష్టములు తొలగును , గ్రహదోషములు పోదురు ,*


*2 ) పశ్చిమ : అప్పుల బాధలు , గ్రహదోషములు , శనిదోషములు తొలగును ,*


*3 ) దక్షిణం : ఈ దిక్కున దీపము వెలిగించరాదు కుటుంబమునకు కష్టము కలును ,*


 *4 ) ఉత్తరం : ధనాభివృద్ధి , కుటుంబములో శుభకార్యములు జరుగును .*


*🎪దీప వత్తుల యొక్క ఫలితములు : -🎪*


*1)పత్తి:-పత్తితో దీపము వెలిగించినదో ఆయుషు పెరుగును .* 


 *2 ) అరటినార :-ఆరటి నారతో దీపము వెలిగించినదో చేసిన తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును .*


 *2 ) జిల్లేడినార:- జిల్లేడినారతో దీపము వెలిగించినచో భూత , ప్రేత , పిశాల బాధలు ఉండవు ,*


*4 ) తామర నార :-పూర్వ జన్మలో చేసిన పాపములు తొలగును . ధనవంతు లగుదురు .* 


*6 ) నూతన పసుపు వస్త్రము :- అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులగుదురు*


*6)నూతన ఎరుపు వస్త్రము :- పెళ్ళిళ్ళు అగును , గొడ్రాలికి సంతానము కల్గును*


*7 ) నూతన తెల్ల వస్త్రము :- పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపము వెలిగించిన శుభకార్యములు జరుగును ,*


 *సాయంత్ర సమయములందు శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమం , సౌభాగ్యం కల్గును .*

కామెంట్‌లు లేవు: