21, అక్టోబర్ 2022, శుక్రవారం

🛕గుడి అంటే కాస్మిక్‌ ఎనర్జీ

 🛕గుడి అంటే కాస్మిక్‌ ఎనర్జీ


📕ఆగమ శాస్త్రం

👉విశ్వంలో మనకు కనిపించని శక్తి దాన్ని కాస్మిక్ ఎనర్జీ అంటారు కాస్మిక్ ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ మనలో వున్న చెడు ఆలోచనలను దూరం చేసి మంచి ఆలోచనలకు తోడ్పడుతుంది మనసు ప్రశాంతంగా వుంటుంది!!


ఈ శక్తి భూమి క్రింద, పైన కూడా వుంటుంది!!


విషయంలోకి వెళితే:-


గుడి కట్టే ముందు గర్భగుడి కింద సరిగ్గా విగ్రహం పెట్టే చోట సప్తధాతువులు వేస్తారు 

పాదరసములు, బంగారము, తగరములు, వెండి, రాగి, వీటిని సప్తదాతువులు అంటారు

 

అలాగే నవరత్నాలు, పంచలోహాలు వేస్తారు

ఇవన్నీ భూమిలో వుండే కాస్మిక్ ఎనర్జీకి రిసీవర్ గా పనిచేస్తాయి

ఒక సోలార్ పవర్ని ఎలా ఉత్పత్తి చేస్తుందో అదే విధంగా భూమిలో వుండే కాస్మిక్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తాయి ఇవి సరిగ్గా విగ్రహం పెట్టే పీఠంకింద వుంటాయి తరువాత పీఠం పెట్టే ముందు పీఠం కింద యంత్రం పెడతారు కింద సప్తధాతువులలో వున్న పవర్ అంతా ఈ యంత్రంలోకి వస్తాయి

అంతేకాక అక్కడ పలికే మంత్రాలు కూడా యంత్రం లోకి వెళతాయి 

ఇది విగ్రహం కింద జరిగే ప్రక్రియ

గుడిపైన పూర్ణకలశం పెట్టడం జరుగుతుంది దాన్నే గుడి శిఖరం అంటారు

భూమి కింద వున్న శక్తిని యంత్రం ఎలా గ్రహించిందో 

భూమి పైన వున్న కాస్మిక్ ఎనర్జీకి శిఖరం రిసీవర్ గా పనిచేచేస్తుంది 

అందుకే సరిగ్గా విగ్రహం పాదాల కింద యంత్రం తలపైన శిఖరం వుండేటట్లు పెట్టడం జరుగుతుంది 

గౌరీపట్నం లేదా కృష్ణ శిల ఈ రెండు రకాల రాళ్లతో తయారు చేసిన విగ్రహం పెట్టడం జరుగుతుంది 

ఈరెండు రాళ్లతో తయారు చేసిన విగ్రహమే ఎందుకు పెడతారు అంటే కాస్మిక్ ఎనర్జీని లాగుకునే శక్తి ఈ రెండు రాళ్ళకే వుంటుంది 

ఈ రాళ్లు నల్లగా నీలం రంగులో ఉంటాయి

విగ్రహం కింద నుంచి యంత్రం పై నుంచి శిఖరం ఈ రెండు కాస్మిక్ ఎనర్జీని విగ్రహం పైకి పంపిస్తాయి

విగ్రహం మొత్తం తరంగాల శక్తితో నిండి ఉంటుంది

అందుకే విగ్రహానికి ఎదురుగా గంట పెట్టడం జరుగుతుంది భక్తులు గంట కొట్టగానే ఆ ధ్వని ఆలయం లోపల అన్ని చోట్లకు చేరుతుంది

గంట శబ్ధం వినగానే విగ్రహం పైనున్న శక్తి నేరుగా గంటకు తగిలి ఆ ధ్వని చేరిన అన్ని చోట్లకు కాస్మిక్ ఎనర్జీ చేరుతుంది

అలా గుడి మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది

ఆ ఎనర్జీ భక్తులపై పడుతుంది ఆ క్షణం భక్తులకు మనసు ప్రశాంతంగా వుంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే విగ్రహం దగ్గర పెట్టే తీర్థంలో కాస్మిక్ ఎనర్జీ తో కలసి వుంటుంది ఆ ఎనర్జీ మన లోపలకు వెళితే మంచిదని తీర్థం తప్పని సరిగా తీసుకోవాలి అంటారు.

అందుకే మనసు బాగలేనప్పుడు గుడికి వెళ్ళండి అని మన పెద్దలు చెప్తుంటారు.

కామెంట్‌లు లేవు: