16, జూన్ 2023, శుక్రవారం

విజ్ఞులు చేసే పని.

 *🌹ఇంటికి పెద్ద దిక్కు ఉండాలి🌹*


ఇంటికి పెద్దదిక్కు వుండాలి అంటారు.. ఎందుకంటే *నాలుగు మంచి మాటలు చెప్పడానికి మరియు ఎవరైనా తప్పు చేస్తే ఖండించడానికి* మాకు పెద్ద దిక్కే వద్దు, మంచి చెప్పే వాళ్లు వద్దు అని అంటే ఆ కుటుంబం ఎటు పోతుంది..  కళ్లు గానక ఊభిలోనికి కూరుకుపోతారు..


*ఇదే దుర్యోధనుని విషయంలో జరిగింది.*    దుర్యోధనునికి తల్లిదండ్రులు ప్రేమ వలన చెప్పలేక పోయారు. విదురుడు మంత్రిత్వం వలన చెప్పలేక పోయాడు. భీష్ముడు పాపం తాత గారు, చనువు ఎక్కువ అయినా ఎన్నో సార్లు చెప్పి చూశాడు కానీ ఆయన్నీ లెక్క చేయలేదు.. చివరికి సర్వం నాశనం!    రాజ్యమే కూలిపోయింది..


*🍁పెద్దలు లేని సంసారం, కుటుంబం ఏమవుతుందో తెలుసుకోవాలి🍁..* 


నూరుగురు కౌరవులు ఏమయినారో మనం గుర్తుంచుకోవాలి. 


*ధర్మాన్ని చెప్పేవాడు* *ఓక్కడైనా వుండాలి  అదే* *ధృతరాష్ట్రుని*

*గొప్పతనం*...

*ధృతరాష్ట్రుడు విదురుడ్ని ప్రక్కన బెట్టుకొన్నాడు*, *అందుకనే ఆయనకు శ్రీకృష్ణ విశ్వరూప దర్శనం లభించింది*. 


అదే శకుడ్ని దగ్గర పెట్టుకొన్న దుర్యోధనడు యొక్క స్థితి మనకు తెలుసు..


*దుర్మార్గుడైనా సరే ఓ మహాత్ముడ్ని, మంచి వాడ్ని చెంత పెట్టు కోవాలి.. దీనిని మనం బాగా పట్టుకోవాలి.

అదే ధర్మరాజు విషయంలో చూడండి.. అందరి మాట విన్నాడు, ఆయన మాట ఆయన తమ్ముళ్లు విన్నారు. ధర్మ ప్రవర్తనతో బ్రతికారు.


*దుర్యోధనుడు ఎవ్వరి మాట వినలేదు. తల్లిదండ్రుల మాట వినలేదు. గురువుల మాట వినలేదు. పెద్దల మాట వినలేదు. శ్రేయోభిలాషుల మాట వినలేదు. భగవంతుడి మాట కూడా వినలేదు చివరికి ఏమైయాడు*?


మంచి చెప్పే వాళ్లను బ్రతిమలాడికో నైనా తెచ్చు కోవాలి. *"అయ్యా మీరు మార్గ నిర్ధేశకులుగా ఉండండి, అధ్యక్షులుగా వుండండి, పెద్దలుగా వుండండి మాకు!"*  అని ప్రాధేయపడి వుంచుకోవాలి. *పెద్దవాళ్లను వుంచు కున్నందు వలన కుటుంబాలకు, సంస్థలకు, సభలకు గౌరవం లభిస్తుంది.*


*చెడ్డవాళ్లను డబ్బులు ఇచ్చి అయినా వదిలించు కోవాలి అంటారు*.. రాజు చెడ్డవాడు అయినా మహా మంత్రి మంచివాడుగా, ధర్మం చెప్పేవాడుగా వుండాలి.. అప్పుడే ఆ రాజు, ప్రజలు పది కాలాలు పాటు చల్లగా వుంటారు.. 


*ధర్మం చెప్పే పెద్దలు లేనందువలన లేదా చెప్పినా వినక పోవడం వలన సమాజం దెబ్బతింటుంది*.


ఎవడికి వాడు నేనే పెద్ద అంటే ఎలాగా? అలాంటి జ్ఞానవంతులు వుంటేనే ఓక్కోసారి పొరబాట్లు, తప్పులు జరిగిపోతూ వుంటాయి..


*అయ్యా శ్రీకృష్ణా! నేను ఏమి తప్పుజేసానని? అని భీష్ముడు శ్రీకృష్ణుల వారిని అడుగుతాడు*.


*ఓ తప్పు జరిగేచోట పెద్దలు వుండటమే తప్పు* అని అంటాడు. 


*ఓ తప్పును చూస్తూ ఖండించకుండా, అక్కడ నుంచి వెళ్లిపోకుండా మౌనం వహించి చూస్తూ వుండటమే భీష్ముడు చేసిన తప్పు*.


*ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో భీష్ముడు ఏమీ చేయలేక అక్కడే వుండిపోయాడు*

*అదే విదురుడు చూడకుండా వెళ్లి పోయినాడు*.


కావున పెద్దలు ఓ తప్పు జరిగిన చోట వుంటే ఆ పాపం వారి ఖాతాలో కూడా వేస్తారు. 


*అందువలన చెప్పిన మాట విననప్పుడు పెద్దలు ఆ స్థలం నుంచి వెళ్లిపోతారు*.


*🙏ఇది విజ్ఞులు చేసే పని.🙏*


🌺🍀🌺🍀🌺

కామెంట్‌లు లేవు: