8, జూన్ 2023, గురువారం

భారతదేశ ఆర్థిక వ్యవస్థ

 నరేంద్ర మోదీ అధికారములోకి రాకుంటే ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ యెంత అద్వాన్నంగా ఉండేదో  పూర్తి ఆధారాలతో రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్  రఘురామ్ రాజన్  దైర్యంగా వ్రాసిన సంచలన వ్యాసానికి తెలుగు స్వేచ్ఛానువాదము.ఈ వ్యాసాన్నిభారతపౌరులు,జాతీయభావాలు గలవారు ముఖ్యం గా హిందువులమని చాటుగా అనుకునేవారు విధిగా చదువాలి.

🚩ఏ దేశ ప్రభుత్వమైనా మొదట చేయాల్సింది తమ దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్ఠం గావించడం,రుణ విముక్తి గావించడం,దేశ జి.డి.పిని పెంచుకోవడం, అంతర్జాతీయ స్థాయిలో తన దేశాన్ని నిలదొక్కుకునే విధంగా చేయడం,ఇంటా,బయట శత్రువులను అణచి వేయడం, సైనికపాటవాన్ని ,పటాలాన్ని పెంచుకోవడం మరియు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకో వడం.

🚩ఈ విషయాలలో నరేంద్ర మోదీ రాకపూర్వం భారత్ యెలా ఉండింది?వచ్చాక ప్రస్తుతం ఎలా వుంది?అని  బేరీజు వేసుకున్నప్పుడే అతడి పాలనా దక్షత దేశ ప్రజలకు  అర్థమవుతుంది.వారు 2014 మే 26 వ తేదీన మన్మోహన్ సింగ్ నుండి  14 వ భారతదేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 

🎈మన్మోహన్ సింగ్  నేతృత్వములోనున్న యూ.పి.ఏ ప్రభుత్వ హయాములో అగస్టు,29,2013 నఈ  దేశ మీడియా ఒక సంచలన వార్త ప్రచురించింది.

అది అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశ ప్రతిష్టను  దిగజార్చింది.అదేమంటే అప్పటి కేంద్ర ప్రభుత్వ వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ దేశములోని 5 లక్షల 57 వేల కిలోల బంగారములో 5 లక్షల కిలోల బంగారాన్ని  తీసివేయాలని నిర్ణయిం చింది. అంటే 90%  గోల్డ్ కార్పస్ ను  తనఖా పెట్టాలని నిర్ణయించిందన్న మాట.ఈ వార్త మన దేశ ఆర్థిక పరిస్థితి యెంత క్లిష్ట స్థితిలో ఉందో చెప్పకనే చెబుతుంది.ఆర్థిక నిపుణుడని సర్టిఫికేటు పొందిన  మన్మోహన్ సింగ్ పది సంవత్సరాల పాలనలో  దేశ ఆర్థిక వ్యవస్థను యెంత దిగజార్చారో తెలుస్తుంది.

🎈అప్పుడు మనదేశ గోల్డ్ కార్పస్  నిల్వలు కేవలం 

5 లక్షల 57 వేల కిలోలు మాత్రమే .అప్పుడు పది గ్రాముల బంగారం ధర రూ.27,750లు. అంటే,మొత్తం బంగారం విలువ రూ.1.38 లక్షల కోట్లు.

🎈ఈ వార్త ప్రచురించ బడ్డాక దేశప్రజలు అగ్రహెూద గ్రులై,అభద్రతకు గురై ఒత్తిడికి లోసయ్యారు.అప్పుడు వాణిజ్య శాఖా మాత్యులు ఆనంద్ శర్మ తన ప్రతిపాదనను ఉపసంహరించుకొని తన అభిప్రాయాన్ని మీడియా తప్పుగా ప్రచురించిందని,సవరణ వివరణనిచ్చారు.

ఆ తరువాత రెండు,మూడు సంఘటనలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది.అంతర్జాతీయంగా భారతదేశ పరువు పోతుందని బంగారాన్ని కుదువబెట్టే  చర్యను మానుకొన్నారు.

🎈మరి ఆర్థిక దుస్థితినుండి బయట పడడానికి మన్మోహన్ సింగ్ నేతృత్వములోని యూ.పి.ఏ. ప్రభుత్వము చేసిన పని అప్పు చేయడం.అదే,విదేశీ కరెన్సీ,నాన్ రెసిడెంట్ డిపాసిట్(F.C.N.R[B])ద్వారా 25బిలియన్ల రుణాలు+32.32 బిలియన్ల (రూ2.23లక్షల కోట్లు)రుణం తీసుకొంది.

🎈మోదీ అధికారములోకి వచ్చేనాటికి  5 లక్షల 57 వేల కిలోల బంగారము మరియు 2.23 లక్షల కోట్ల రుణమున్నది.

🎈ఆ రుణాన్ని వడ్డీతో సహా మోదీ ప్రభుత్వం చెల్లించింది.

🎈బంగారం నిల్వలను 5.57  టన్నులనుండి 

 148 టన్నులకు పెంచారు.

🎈30 వ జూన్ 2021 నాటికి దేశంలో బంగారం నిల్వలు 705 టన్నులయ్యాయి.

🎈తమ కాంగ్రేస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాములో జరిగిన దివాలాకోరు ఆర్థిక వ్యవస్థను కప్పిపుచ్చి రాహుల్ గాంధీ  కాంగ్రేస్  మరియు కమ్యూనిస్టు పార్టీలకు వత్తాసు పలికే Lutyens media సైకోఫాంటిక్ జర్నలిస్టులు  ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని నిరంతరం దుఃఖం నటిస్తున్నారు.

 

 🎈1. అప్పటి RBI గవర్నర్ రఘురామ్ రాజన్ యొక్క ఈ *ఒప్పుకోలు* చదవండి.

 https://indianexpress.com/article/business/banking-and-finance/fcnr-bonds-were-least-bad-option-to-raise-dollars-raghuram-rajan-3011772/


 🎈2. మోదీ  ప్రభుత్వం ఆ రుణాన్ని తిరిగి చెల్లించింది. దీన్ని ధృవీకరించడానికి ఈ లింక్‌పై  క్లిక్ చేసి  ని చదవండి.

 https://www.thehindubusinessline.com/money-and-banking/fcnr-deposits-of-2013-set-to-mature-reserve-bank-ready-to-tackle-volatility/article8472235.ece


 🎈కాంగ్రెస్, కమ్యూనిస్టు మున్నగు పార్టీల తప్పుడు ప్రచారాలను తెలుసుకొని అర్థం చేసుకోండి.


 🎈కావున దేశ ప్రయోజనాల దృష్ట్యా మేలుకోండి.


 🚩స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు యెవరూ చేయలేని పనిని నరేంద్ర మోదీ ఈ 7 ఏళ్లలో చేశారు.  తప్పక చదవండి, మధ్యలో ఎక్కడైనా వదిలేస్తే, మీ కళ్ళు మూసుకుపోతాయి, కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా చదవండి.


 🎈తొలి విజయం:మన దేశాన్ని 200 ఏళ్ల పాటు బానిసలుగా మార్చిన బ్రిటన్ దేశము‌లో  జరిగిన 53 కామన్ వెల్త్ దేశాల సమావేశంలో నరేంద్ర మోదీగారు  జనరల్ ప్రెసిడెంట్ అయ్యాడు.దీనికి ప్రతి భారతీయుడు గర్వించాలి.మరియు అతడి వక్షస్థలం విశాలం కావాలి.


 🎈రెండవ విజయం: UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌లో భారత్‌కు భారీ విజయం లభించింది, అందు సభ్యుడగుటకు 97 ఓట్లు అవసరం,కాగా మనకు 188 ఓట్లు వచ్చాయి.ఇది చూశాక ,భారత ప్రజలు నరేంద్ర మోడీ విదేశాలకు ఎందుకు వెళ్ళాడని ఇంకా అడుగుతారా?


 🎈మూడవ విజయం:ప్రపంచంలోని 25 అత్యంత శక్తివంతమైన దేశాల జాబితా విడుదలైంది.అందు భారత్ ఉండడం,పాకిస్తాన్ లేకపోవడం గర్వం కాదంటారా?


 🎈నాల్గవ విజయం:మన GST  నెలవారీ పన్ను వసూళ్లు 1 లక్ష కోట్లకు చేరుకొంది.ఇది రైల్వే ప్లాటుఫామ్ పైన టీ అమ్మిన నరేంద్రమోదీ  ఆర్థశాస్త్ర పరిమళం కాదా?


 🎈ఐదవ విజయం:నూతన  సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో అమెరికా మరియు జపాన్‌లను వెనక్కి నెట్టి భారతదేశం రెండవ స్థానానికి చేరుకుంది.


 🎈ఆరవ విజయం:2017-18లో సౌరశక్తి ఉత్పత్తి రెండింతలయింది.దీన్ని చూసి చైనా, అమెరికాలు కంగుతిన్నాయి.


 🎈ఏడవ విజయం:ఆకాశాన్నంటుతున్న భారతదేశ జి.డి.పిని చూడండి.మన దేశ జి.డి.పి 8.2% కాగా,చైనాది 6.7% మరియు అమెరికాది 4.2%.  నరేంద్రుడు  విదేశాలకు ఎందుకు వెళ్ళాడో  ఇప్పుడు భారతీయులకు అర్థమై యుండాలి.


 🎈ఎనిమిదవ విజయం:భూమి,జలము మరియు ఆకాశం అనే మూడు ప్రాంతాల నుండి సూపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగించిన మొదటి దేశం మన భారతదేశం.ఇది రాజరాజనరేంద్రుని  యుగం.

మీకు గర్వంగా ఉంటే, “జైహింద్ “అని వ్రాయడం మర్చిపోకండి.

🎈తొమ్మిదవ విజయం:70 ఏళ్లలో పాకిస్థాన్ పేదరికాన్ని ఎప్పుడూ చవి చూడలేదు, కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక దొంగనోట్ల రద్దుతో , పాకిస్తాన్ దరిద్రంగా మారింది.

🎈పదో విజయం: 2014లో కాంగ్రెస్ రక్షణ మంత్రి ఎ.కె.ఆంథోనీ   దేశం ఆర్థిక దుస్థితిలో  ఉందని, మనము రాఫెల్, చిన్న జెట్ కూడా కొనలేని స్థితిలో ఉన్నామని అన్నారు.కాని నరేంద్రుడి హయాములో,

 రాఫెల్ డీల్ కుదిరింది.ఎస్-400 కూడా తీసుకుంటోంది.

 మరి కాంగ్రెస్ హయాంలో దేశ సొమ్ము ఎక్కడికి పోయింది?


 🎈పదకొండవ విజయం:సైన్యం బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో యొక్క రక్షణ కవచాన్ని పొందగలిగింది.

 జమ్మూ కాశ్మీర్‌లో సైన్యానికి 2500 బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియోలు అందించబడ్డాయి.


 🎈పండ్రెండవ విజయము:ఈ 4 సంవత్సరాలలో భారతదేశములో  యెంత అభివృద్ధి జరిగిందో  నేను మీకు చెబుతాను.

 🎈ఆర్థిక వ్యవస్థలో ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టి  భారత్ 6 వ స్థానానికి చేరుకుంది.


 🎈పదమూడవ విజయం:ఆటోమోబైల్  రంగములో  జర్మన్ ను వెనక్కి నెట్టి భారత్ 4 వ స్థానంలో నిలిచింది.


 🎈పద్నాలుగో విజయం:విద్యుత్ ఉత్పత్తిలో రష్యా వెనుకబడి పోగా,భారత్ 3వ స్థానంలో నిలిచింది.


 🎈పదిహేనవ విజయం ;వస్త్ర ఉత్పత్తిలో ఇటలీని అధిగమించి,భారత్  రెండవ స్థానానికి చేరుకుంది.


 🎈పదహారవ విజయం:మొబైల్ ఉత్పత్తిలో వియత్నాం వెనుకబడి పోగా,భారత్ రెండవ స్థానంలో నిలిచింది.


 🎈పదిహేడవ విజయం: ఉక్కు ఉత్పత్తిలో జపాన్‌ను అధిగమించి భారత్ రెండవ స్థానానికి చేరుకుంది.


 🎈పద్దెనిమిదవ విజయం:చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్‌ను అధిగమించి భారత్ నెంబర్ వన్ గా నిలిచింది.


 🎈పంతొమ్మిదవ విజయం:శ్రీ రామమందిరం, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, CAA.NRC మరియు యువతులకు  వివాహ  వయస్సు 18 నుండి 21 సంవత్సరాలకు  బిల్లులను ప్రవేశపెట్టి విజయాన్ని సాధించారు.యూనిఫాం సివిల్ కోడ్, జనాభా నియంత్రణ చట్టములు చేయుటకు అడుగులు పడుతున్నాయి.


 🎈ఇరువదవ విజయం:గాఢ నిద్రలోనున్న హిందువులలో, జాతీయవాదాన్ని మేల్కొల్పారు. ప్రపంచం మొత్తం మీద 125 కోట్ల మంది ఉన్న హిందువులకు తమకంటూ ఒక్క దేశం కూడా లేదనే విషయం చెప్పగలిగారు.

 🚩నేను ఈ పనిని అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నాను.


 🚩దీన్నే నరేంద్ర మోదీ యుగం అంటారు.

 🚩మోదీ ప్రభుత్వంలో ఉగ్రవాదులు కాశ్మీర్ లోయల నుంచి తుడిచిపెట్టుకుపోతున్నారు.

 🚩లష్కరే తోయిబా ఉగ్రవాది నవేద్ వట్ హతమయ్యాడు.

 🚩హిజ్బుల్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

 🚩8 నెలల్లో, 72 మందిని హురాన్ సమీపంలో, 230 మంది ఉగ్రవాదులను నరకానికి పంపారు.


 🚩కాంగ్రేసు పార్టీ ఉగ్రవాదులను చూచి భయందోళనలకు గురికాగా,నరేంద్ర సింగమును చూచి  ఉగ్రవాదులు భయాందోళనలకు గురవుతున్నారు.

🚩 కాంగ్రేసు హయాములో భారత సైన్యం ఉగ్రవాదులకు భయపడగా,నరేంద్రుని పాలన‌లో, ఉగ్రవాదుల దాడి కొరకు సైన్యం విజృంభిస్తున్నది.


 🚩తమ అవినీతి వ్యూహాలు ఫలించలేకపో తున్నాయని, కాంగ్రేస్, కమ్యూనిస్టులు.,తృణమూల్, టి.ఆర్.ఎస్.యు,సమాజ్ వాది,బహుజనసమాజ్, యం.ఐ.యం మున్నగునవన్ని, నరేంద్రుడనే  అభిమన్యుడిని  చంపాలని అనగా  2024 సార్వత్రిక ఎన్నికలలో ఓడించేందుకు పద్మవ్యూహం పన్నుతున్నారు.రోజురోజుకు నరేంద్రమోదీజీకి పెరుగుతున్న కీర్తిప్రతిష్టలను చూసి ప్రతిపక్ష పార్టీలన్ని కంగు తింటున్నాయి.కానీ ఆ అవినీతిపర పార్టీలు మోదీని ఏం చేయలేవు.ద్వాపర యుగములో  అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించడం తల్లి గర్భంలో యున్నప్పుడు గ్రహించాడు.ఈ మోడి రూప అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ప్రవేశించి,తిరిగి ఛేదించుకొని రాగల విద్యలను భరతమాత ఒడిలో నేర్చుకొన్నాడు.ఆమె అజేయురాలు, తన పుత్రుడైన నరేంద్రుడిని అజేయుడగుటకు ఆశీర్వదిస్తున్నది.


 🚩2024లో భరతమాత పుత్రుడిని  గతంలోకంటె  భారీ మెజారిటీతో గెలిపించేలా ఈరోజు మనమందరం ఒక తీర్మానం చేద్దాం, ఆ సంఖ్య ఎవరూ చేరుకోలేని  విధంగా గిన్నిస్ బుక్‌లో నమోదవ్వాలి.


  🚩2024లో నరేంద్రుడిని  తిరిగి భారత ప్రధానిని చేయవలయునని భారత ప్రజలందరికి నమస్కరిస్తున్నాను.



కామెంట్‌లు లేవు: