20, నవంబర్ 2023, సోమవారం

కొన్ని ప్రశ్నలు

 నికృష్టుడు:- యజ్ఞాలు చేసి నెయ్యి అంతా నేలపాలు చేస్తున్నారు. దాని బదులు పేదలకు పంచవచ్చు కదా.?


సనాతన భారతీయుడు:- తప్పకుండా అలాగే చేద్దాం. దానికంటే ముందు కొన్ని ప్రశ్నలు.


నికృష్టుడు:- అడగండి.


సనాతన భారతీయుడు:- నువ్వు ఆంగ్ల సంవత్సరానికి బాణసంచా కాల్చేబదులు పేదలకు ఆడబ్బుతో తిండి పెట్టొచ్చు కదా.?


నికృష్టుడు:- ఆడబ్బు నేను కష్టపడి సంపాదించుకున్నాను. నాకు నచ్చినట్లు నేను ఖర్చు చేసే హక్కు నాకుంది😡.


సనాతన భారతీయుడు:- సరే, నువ్ నీ కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలకు , రెస్టారెంట్లకు వెళ్తావ్ కదా.?


నికృష్టుడు:- వెళ్తాను, అయితే ఏమిటి.?


సనాతన భారతీయుడు:- అలా షికార్లు వెళ్లి డబ్బులు తగలేసే బదులు పేదలకు ఇవ్వొచ్చు కదా.?


నికృష్టుడు:- 😡😡😡 నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను.? 

నా డబ్బులు నేను ఎలా ఖర్చుపెట్టుకోవాలో కూడా నువ్వే నిర్ణయిస్తావా.?


సనాతన భారతీయుడు:- 😊😊😊 లేదు లేదు, నేను నిర్ణయించను, అయితే ఇంకొకప్రశ్న.! రోజూ ఆఫీసుకు నువ్ కార్లో వెళ్తావ్ కదా ఆ పెట్రోల్ వల్ల వాయుకాలుష్యం వస్తోంది కదా, అలాగే నువ్ నడిచి వెళ్తే నీకు ఆరోగ్యం, వాయు కాలుష్యం తగ్గుతుంది, ఆ డబ్బుతో పేదవాడి కడుపు నింపొచ్చు కదా.?


నికృష్టుడు:- 😡😡😡 అసలు నీకు బుద్ధి ఉందా.? నేనెందుకు నడిచి వెళ్ళాలి. నా డబ్బుతో కొనుక్కున్న కార్, నా డబ్బుతో పోయించుకునే పెట్రోల్, మధ్యలో నీ అధికారం ఏమిటి.?


సనాతన భారతీయుడు:- 😡😡😡 ఓరి ఎర్ర(ర్రి) పుష్పం. మరి వాళ్ళ సొంత డబ్బుతో యజ్ఞాలు చేస్తే నీకొచ్చిన నొప్పి ఏమిట్రా వెధవ.! వాళ్ళు సంపాదించుకున్న డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ సొమ్ము కాదు కదా, మధ్యలో నీకెందుకు అంత ఏడుపు.?


నికృష్టుడు :- మీ అగ్రకులాలకు అహంకారం ఎక్కువ, మీరు యజ్ఞ యాగాల పేరుతో నిమ్న కులాలను తొక్కేస్తున్నారు.


సనాతన భారతీయుడు:- ఇప్పుడే సొమ్ము వృధా అన్న వాడివి మళ్ళీ కులాల్లోకి దూకావేమిట్రా పిల్లి మొహమా.? 

అసలు ఒక యజ్ఞం మొదలు కావాలి అంటే ఎంతమంది కులాల సహకారం కావాలి అనేది తెలుసా నీకు.

మొట్ట మొదట యాగశాల నిర్మాణం చేసేది మేదరి వారు, తర్వాత కుండాలను నిర్మించేది మెస్త్రీలు(ఇందులో దాదాపు అన్ని రకాల కులాల వారు ఉన్నారు.) వాటికి కావాల్సిన సమిధలు తెచ్చేది గిరిజనులు. (సమిధలు అంటే ఏంటో తెలియక పిచ్చి చూపులు చూస్తావ్ ఏమిట్రా పుల్కా, సమిధలు అంటే కట్టెలు.)

వాటికి కావాల్సిన నెయ్యి ఇచ్చేది గొల్ల వారు.

యజ్ఞ దీక్షా వస్త్రాలు ఇచ్చేది శాలి వారు.

కావాల్సిన మట్టి కలశాలు ఇచ్చేది కుమ్మరి వారు. ఇత్తడి,వెండి, బంగారం మొదలైనవి అమర్చేవారు స్వర్ణకారులు. దీక్షకు కూర్చోవాలి అంటే ముందుగా వపనం చేయించాలి, దానిని చేసేవారు మంగలి వారు.

యజ్ఞమునకు కావాల్సిన ధాన్యమును ఇచ్చువారు రైతులు.( మళ్ళీ ఇందులో అన్ని కులాల వారు ఉన్నారు.)

దీనికి అంతటికీ ధనాన్ని ఇచ్చేవారు వైశ్యులు. రక్షణ బాధ్యత క్షత్రియులది. నిర్వహణ బాధ్యత బ్రాహ్మణులది. ఇన్ని సామానులు ఎక్కడినుండో తీసుకు రావటానికి రవాణా వారు ఎంత కష్టపడతారు. వీళ్ళందరికి ఇందులో ఉపాధి దొరికిందా లేదా.? ఇందులో ఒక్కరు లేకపోయినా యజ్ఞం అవ్వదు రా ఎర్ర కుక్క.! గొర్రెల చదువు వంట బట్టించుకుని సమాజంలో చీలిక తెచ్చి అందరి మధ్యలో వైషమ్యాలు తెస్తావా ఊరపంది.!  పోయి ఉచిత పథకాలను అనుభవించడం మానేసి కష్టపడి బ్రతకరా అక్కుపక్షి.! తర్వాత పేదలకు సహాయం చేయించే పని చేద్దువు కానీ.!


నికృష్టుడు:- మీరంతా ఇలాగే చెప్తారు, మా ఎర్ర పుస్తకంలో ఉన్నదే వాస్తవం. మీరంతా మోసగాళ్ళు,  ఎప్పటికైనా మా నికృష్టులే ఈ దేశాన్ని ఏలుతారు.


సనాతన భారతీయుడు:- సరే మంచిది. పోయి బావిలో దూకు.


జరుగుతున్న యజ్ఞాలను, మహనీయుల విగ్రహ ఆవిష్కరణలు తప్పు పడుతున్న నికృష్టులకు ఈ పోస్టు అంకితం.


 *సేకరణ*

కామెంట్‌లు లేవు: