23, జూన్ 2024, ఆదివారం

మర్చిపోతాము

 *సంధ్యా వందనం వదిలేస్తే గోత్రం ప్రవర వేద శాఖ మర్చిపోతాం. తర్పణము తద్దినము వదిలేస్తే తండ్రి  తల్లి  వర్గ త్రయం మర్చిపోతాము.* 

ఇక అంతే సంగతులు మనం పోతే మనలను పై వాళ్లతో చేర్చలేరు. ఇక వచ్చే పురోహితుడు వారిపేర్లు తెలియనందున *యజ్ఞమ్మ యజ్ఞయ్య* అని కానిచేస్తారు అంతే నువ్వు అనాథవై పిశాచంగా తిరగాల్సిందే. తర్వాత నిన్ను నీ పిల్లలను కృష్ణ యజుశాఖకు మార్చేస్తారు. నేడు ఇందు వల్లే అందరు కృష్ణ యజుశ్శాఖీయులు ఐపోయారు

 *ఇప్పుటి తరం 70% పిల్లలు..*

1)తల్లిదండ్రులు కారు, బండి తుడవమంటే తుడవరు..

2)మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు..

3)లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు..

4)కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు.

5)రాత్రి 10 గంటలలోపు పడుకుని, ఉదయం 6 లేదా 7 గంటలలోపు నిద్ర లేవరు...

6)గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెబుతారు..

7)తిడితే వస్తువులను విసిరి కొడతారు.              8)ఎప్పుడయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ , నూడుల్స్, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు..

9)ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు.

10)ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..

11)అతిథులు వస్తే కనీసం గ్లాసేడు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనలేని అమ్మాయిలు కూడా ఉన్నారు..                              12)20 సంవత్సరాలు దాటినా చాలామంది ఆడపిల్లలకు వంట చేయడం రాదు..

13)బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడలేని కోపం వీరికి.. 

14)కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింత పోకడలు.వారిస్తే వెర్రి పనులు..మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,

కానీ కారణం మనమే.ఎందుకంటే మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి.చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి. రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం.

గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు.వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది

కష్టం గురించి తెలిసేలా పెంచండి

కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే. వారికి జీవితం విలువ తెలియదు. ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే..కొందరు యువత 15 ఏళ్లకే సిగరెట్స్, మందు, బెట్టింగ్, డ్రగ్స్, దొంగతనాలు, రేప్ లు, హత్యలు చేస్తున్నారు.. మరికొంతమంది సోమరిపోతులా తయారవుతున్నారు.

అభినయాలు కనపడడం లేదు, అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..

ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..  మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం.కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం.

కాలేజీ పిల్లలయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫిన్, లంచ్ చిన్న బాక్సు రైస్.. చాలామంది పండ్లు అసలు తినరు.

గర్భవతులైన తరువాత వారి బాధలు వర్ణనా తీతం.టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి.

అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు.3వ తరగతి పిల్లాడికి సోడాబుడ్డి లాంటి కళ్ళద్దాలు.05వ తరగతి వారికి అల్సర్, బీపీలు.10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలొస్తున్నాయి.వీటన్నికి కారణం మనం. మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే.అందుకే తల్లిదండ్రులు మారాలి.

రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి.

*సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?*

కేవలం గుడికి వెళ్లి పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము. అది మాత్రమే కాదు. సాంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు..

పిల్లలకు..

👉  బాధ్యత

👉  మర్యాద

👉  గౌరవం

👉  కష్టం

👉  నష్టం

👉  ఓర్పు

👉  సహనం

👉  దాతృత్వం

👉  ప్రేమ

👉  అనురాగం

👉  సహాయం

👉  సహకారం

👉  నాయకత్వం

👉  మానసిక దృఢత్వం 

👉  కుటుంబ బంధాలు

👉  అనుబంధాలు  

👉  దైవ భక్తి

👉  దేశ భక్తి

కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి.మంది కోసం బ్రతకద్దు మన ఆరోగ్యం,ఆనందం కోసం న్యాయంగా బ్రతుకుదాం.

ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం. భావితరాల పిల్లల కోసం ,పిల్లలను మార్చే బాధ్యత మన అందరిపై కలదు.

కామెంట్‌లు లేవు: