7, ఆగస్టు 2024, బుధవారం

పుణ్యకార్యాలే చేయాలి...

 🎻🌹🙏 జై శ్రీ రామ్ పుణ్యకార్యాలే చేయాలి.....!!




🌿పాప, పుణ్యాల అనుభవం ఎంత కాలం,

మానవజన్మ ఎలా పుడుతుంది అన్నది ప్రశ్న అయితే....


🌸స్త్రీ, పురుషుల సంయోగమే.. మానవ జన్మకు మూలకారణం... అన్నది జవాబు.


🌿అది భౌతిక పరమైన జవాబే కానీ., సరైన జవాబు అది కాదు.

మరి ఏది సరైన జవాబు


🌸చేసుకున్న పాప, పుణ్యాల అనుభవం కోసమే ఈ జన్మ అనునది ఆధ్యాత్మికమైన జవాబు.


🌿అయితే... ఎంతకాలం ఈ అనుభవం అనేదీ ప్రశ్నే. దానికీ జవాబు ఉంది.


🌸చేసిన పాప, పుణ్యాల గురించి ఈ లోకంలో తలచుకున్నంత కాలం... ఆ పాప, పుణ్య ఫలాన్ని అనుభవించ వలసిందే.


🌿ఇదేం తీర్పు... దీనికేదైనా నిదర్శనముందా...అనే సందేహం కలగచ్చు.


🌸ఏ సందేహానికైనా సరైన జవాబు చెప్పే సామర్థ్యం మన రామాయణ, భారత, భాగవతాలకే ఉంది. దీనికి సంబంధించిన కథ ఒకటి మహాభారతంలో ఉంది.


🌹ఆ కథ ఏమిటంటే....🌹


🌿కృతయుగకాలంలో., ఇంద్రద్యుమ్నుడు అనే చక్రవర్తి ఈ భూలోకాన్ని ధర్మబధ్ధంగా, ప్రజారంజకంగా పరిపాలిస్తూండేవాడు. 


🌸ఆయన గొప్ప దాత. దశమహాదానాలే కాక షోడశమహాదానాలు విరివిగా చేసాడు. అంతేకాక ఎన్నో పుణ్యకార్యాలు కూడా చేసాడు. 


🌿ఇంద్రద్యుమ్నుడు చేసిన పుణ్యకార్యాల వల్ల, అతను మరణించాక., దేవదూతలు వచ్చి అతన్ని సరాసరి స్వర్గలోకం తీసుకెళ్లారు.


🌸 ఇంద్రద్యుమ్నుడు స్వర్గంలో సుఖభోగాలు అనుభవిస్తూ... ఆనందిస్తున్నాడు. అలా ఎంతకాలం అయిందో అతనికే తెలియదు.


🌿ఒకరోజు ఇంద్రద్యుమ్నుని దగ్గరకు దేవదూతలు వచ్చి, ‘నీవు చేసుకున్న పుణ్యఫలం అయిపోయింది. నీవు స్వర్గంలో ఉండే అర్హత లేదు. భూలోకానికి వెళ్లిపో’ అన్నారు.


🌸‘అదేమిటి.. నా పుణ్యఫలం అప్పుడే తీరిపోవడమేమిటి... ఇంకా చాలా ఉంది’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు.


🌿‘నిరూపిస్తావా’ అని అడిగారు దేవదూతలు.


🌸‘నిరూపిస్తాను.. నన్ను భూలోకం తీసుకొని వెళ్లండి’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు.


🌿దేవదూతలు అతన్ని భూలోకం తీసుకు వచ్చారు.


🌸ఇంద్రద్యుమ్నునకు భూలోకం చాలా కొత్తగా కనిపించింది. అతనికి తెలిసున్న వారెవరూ కనిపించలేదు. ఆ కాలంలో భూలోకవాసులందరిలోకి అతివృద్ధుడు 🙏మార్కండేయుడు ఒక్కడే అని తెలిసి.....


🌿దేవదూతలతో అతని దగ్గరకు వెళ్లి ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు.

‘మీరెవరో నాకు తెలియదు. 


🌸10 అయితే నాకన్న వృద్ధుడు ‘ప్రావారకర్ణుడు’ అనే గుడ్లగూబ ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు మార్కండేయుడు.


🌿అందరూ కలిసి ఆ గుడ్లగూబ దగ్గరకు వచ్చారు.

‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘నాళీజంఘుడు’ అనే కొంగ ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు ప్రావారకర్ణుడు.


🌸అందరూ కలిసి ఆ ఆ కొంగ దగ్గరకు వచ్చారు

‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు.


🌿‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘ఆకూపారుడు’ అనే తాబేలు ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు నాళీజంఘుడు.


🌸అందరూ కలిసి ఆ తాబేలు దగ్గరకు వచ్చారు. ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు.


‘🌿మీరెవరో నాకు బాగా తెలుసు. మిమ్మల్ని నేనెలా మర్చిపోతాను.., మీరు ఇంద్రద్యుమ్న చక్రవర్తి. మీరు ఎన్నో యఙ్ఞాలు చేసారు. 


🌸నన్ను ఎన్నోసార్లు కాపాడారు. దానాలు చెయ్యడంలోనూ మీరు చక్రవర్తే. 

ఆ కాలంలో మీరు చేసిన గోదానాలు అనంతం. దానగ్రహీతలైన బ్రాహ్మణులు ఆ గోవులను తోలుకుంటూ వెడుతూంటే.. 


🌿ఆ గోవుల కాలి గిట్టల తొక్కుడు చేతనేకదా ఈ కొలను ఏర్పడింది. అందుకే ఈ కొలనుకు ‘ఇంద్రద్యుమ్నము’ అని నీ పేరే పెట్టారు ప్రజలు. 

🌸

నా సంతతి వారంతా ఈ కొలనులోనే ఇప్పటికీ..నివసిస్తున్నారు’ అన్నాడు ఆకూపారుడు.


🌿దేవదూతలు ఆ సమాధానంతో తృప్తిచెంది.. ఇంద్రద్యుమ్నుని తిరిగి స్వర్గానికి తీసుకుని వెళ్లారు. ఇదీ కథ.


🌸కనుక కలకాలం అందరూ చెప్పుకునే విధంగా పుణ్యకార్యాలే చెయ్యాలి... జై శ్రీ రామ్ కంచర్ల వెంకట రమణ

కామెంట్‌లు లేవు: