30, సెప్టెంబర్ 2021, గురువారం

పరమాత్ముడు మళ్ళీ పుట్టాలేమో"

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

        *🌷గుణపాఠం!🌷* 

               🌷🌷🌷

         ఒకసారి సత్య భామ శ్రీకృష్ణునితో ‘స్వామీ.. రామావతారం లో సీత మీ భార్య కదా! ఆమె నాకంటే అందంగా ఉండేదా?’ అని అడిగింది. 


           ఆ సమయం లో అక్కడే ఉన్న గరుడుడు కూడా 

‘ప్రభూ, నాకంటే వేగంగా ఈ ప్రపంచం లో ఎవరైనా ప్రయాణించ గలరా?’ అన్నాడు.


             అదంతా అక్కడే ఉండి వింటున్న సుదర్శనుడు

(సుదర్శన చక్రం) కూడా.. ‘పరంధామా, అనేక యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాన్ని తెచ్చి పెట్టాను.

నాతో సరితూగు వారెవరైనా వున్నారా స్వామి’ అని అడగడం జరిగింది .


             ముగ్గురి మాటలూ విన్న నంద గోపాలుడు వారికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలను కున్నాడు.


దీర్ఘంగా ఆలోచించి.......!


             ‘సత్యా, నువ్వు సీతగా మారిపో. నేను రాముణ్నవు తాను' అన్నాడు.

           'గరుడా నువ్వు ఆంజనేయుని దగ్గరికి వెళ్లి సీతా రాములు నిన్ను తీసుకు రమ్మన్నారని చెప్పి తోడ్కనిరా'.

            చక్రమా, నా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించ కుండా చూడు’ అంటూ ముగ్గురి కీ మూడు బాధ్యతలు అప్పగించాడు. 


          గరుత్మంతుడు వెంటనే హనుమంతుని వద్దకు వెళ్లి.. సీతా రాములు రమ్మన్నారని చెప్పాడు. 


          హనుమ ఆనందంతో పులకించిపోతూ.....

‘నేను నీ వెనుకే వస్తాను...నువ్వు పద’ అని గరుత్మంతు ని సాగనంపుతాడు. 


         ఈ ముసలి వానరం రావడానికి ఎంత కాలమవు తుందో కదా...అనుకొంటూ ఎగతాళిగా నవ్వి గరుడుడు రివ్వున ఆకాశానికి ఎగురుతాడు. 


 కానీ విచిత్రంగా ....... 

       ఆయన కంటే ముందే హనుమ ద్వారక చేరడం తో మారుతీని చూసినా గరుత్మంతునికి మతి పోతుంది. సిగ్గుతో తలదించు కొని మౌనంగా ఉండి పోతాడు.


            ఇంతలో.......‘హనుమా’ అన్నపిలుపు తో పులకించిన ఆంజనేయుడు తన రాముని వైపు చూశాడు. 

         ‘లోనికి రావడానికి నిన్నెవరూ అడ్డగించలేదా?’

అని శ్రీ రాముడు అడగ్గా.....

           ఆ మాట విన్న హనుమ తన నోటి నుండి సుదర్శనుని (సుదర్శన చక్రం) తీస్తూ.....

           ‘ప్రభూ, ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు. ఎన్ని చెప్పినా వినక పోవడం తో ఇక లాభం లేదని భావించి నోట్లో పెట్టుకొని మీ ముందు వచ్చి నిలిచాను’అన్నాడు హనుమంతుడు రామునునితో.

             సుదర్శనుడు కూడా గరుడని వలె అవమానం తో నేల చూపులు చూస్తూ ఉండి పోయాడు. 


           ఇంతలో హనుమంతు ని చూపు తన రాముని పక్కన కూర్చున్న స్ర్తీ పై చూపు పడి....

           

       ‘స్వామీ, మీ పక్కనుండ వలసింది సాక్షత్తు నా తల్లి సీతమ్మ కదా! మరి ఎవరీవిడ ప్రభూ’ అన్న మాటలు విన్నదే తడువు గా సత్య భామకు కూడా గర్వ భంగమై ప్రభువు కాళ్ళ మీద పడింది. 


           అలా కృష్ణ పరమాత్ముడు, ముగ్గురిలో మొగ్గ తొడిగిన గర్వాన్ని తుంచి వేసి వినయానికున్న

విలువేమిటో తెలియ చెప్పడం జరిగింది .🙏🏻🙏🏻


#నీతి :-"ఈ రోజులలో కూడా కొంతమంది బంగారు గరిట(గోల్డెన్ స్పూన్), వెండి గరిట (సిల్వర్ స్పూన్).. నోట్లో పెట్టుకొని పుట్టినట్లు. తామే గొప్పవారము అని, మిగిలినవారు హీనులు,చేతగాని వారని భ్రమలలో బ్రతుకుతున్నారు... వాళ్లకు తత్వం బోధపడాలి అంటే, ఆ పరమాత్ముడు మళ్ళీ పుట్టాలేమో"

          "ఎవరైనా గతాన్ని మరచిపోరాదు,వర్తమానాన్ని విస్మరించరాదు,భవిష్యత్తును అతిగా ఊహించరాదు... 

ఇవి ఏవీ మనచేతి లోనివి కాదు అని మాత్రం గుర్తించాలి".

*💥సర్వేజనాః సుఖినోభవంతు💥*

కామెంట్‌లు లేవు: