25, అక్టోబర్ 2021, సోమవారం

 



ఈ ఫోటోలోని ఒక పెద్దాయనని చూడండి. నిశితంగా గమనించండి. మీకేమనిపిస్తోందీ? ఆయనొక బ్రాహ్మణుడు వేదాలు చదివిన పండితుడు లేదా పూజలు చేయించే బ్రహ్మ గారు లాగ అగుపిస్తున్నారు కదూ! కానీ ఆయన అలాంటి వ్యక్తి కాదుకాదు. 


ఆయన ఒక పేరుమోసిన డాక్టరు. ఆంకాలజిస్టు. కాన్సర్ స్పెషలిస్టు. కేరళలో మొట్టమొదటి ఆంకాలజిస్టు ఆయనే. కొట్టాయం మెడికల్ కాలేజీలో ఆంకాలజీ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ఆంకాలజీ డిపార్ట్ మెంటు గానూ, తరువాత కొట్టాయం మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ గాను పనిచేశారు. ఆయన 60సం: వయసులో రిటైరు అయిన తరువాత ఒక ఫ్లయింగ్ డాక్టరుగా పేరుతెచ్చుకున్నాడు. అంటే 50దేశాలకు ఆయన విజిటింగ్ ప్రొఫెసరుగా వెళ్ళి ఆంకాలజీ మీద లెక్చర్లు, పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసేవారు. 


ఆయన ఎదురుగా కూర్చున్న వ్యక్తిపేరు ‘ బ్రహ్మశ్రీ సూర్యన్ సుబ్రమనియన్ భట్టాత్తిరి’ సిద్ధ వైద్యుడు. 


అంతపెద్దవయసులో మన ఆంకాలజీ స్పెషలిస్టు గారికి తను చదివింది చదువుకాదు, తనవైద్యం ఒకలెక్కలోనిది కాదు అవన్నీ వ్యర్ధం అనిపించింది. మళయాళంలో “అ లాడా వైద్యన్ “ అంటే ఒక గిరిజన వైద్యుడన్నమాట. అలాంటి సిద్ధవైద్యం చేసే వ్యక్తిని తన గురువుగా స్వీకరించాడు. పట్టుదలతో సిద్ధవైద్యం నేర్చుకున్నాడు. ఈగొప్పవైద్యుడు సిద్ధవైద్యంతో అనేకమంది రోగులను కాపాడాడు. అమెరికాలోని ప్రఖ్యాత ‘మాయ క్లినిక్’ తిరస్కరించిన రోగులను కూడ ఈయన తన సిద్ధవైద్యంతో బ్రతికించాడు. 


ఆయన వైద్యంతోబాటుగా , వేదాలు ఉపనిషత్తులను భారతీయ సంస్కృతిని లోతుగా అధ్యయనం చేశాడు. అంత పెద్ద వయసులో ఆయన తాంత్రిక కర్మలకి ప్రఖ్యాతిగాంచిన ‘సూర్యకాలాది మాన’ అనుసరించి “ ఉపనయన సంస్కారం పొంది” మెడలో జంధ్యం, రుద్రాక్ష మాల ధరించారు. ఆయన జీవితమంతా సనాతన ధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మాచార్యుడిగా శేష జీవితాన్ని గడిపిన ధన్యుడు. ఆయన 92 సంవత్సరాల వయసులో పరమపదించారు 

20 అక్టోబరు 2021 తేదీన. ఏ ఒక్కమీడియాసంస్థా ఆయనగురించి రాయలేదు. కమ్యూనిస్టు జిహాదీ కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆయన లోని విద్యా సరస్వతికి చేతులెత్తి నమస్కరించుతున్నాను. 

మీకు ఉత్కంఠగా ఉందికదూ ! ఆయన పేరేమిటో తెలుసుకోవాలనీ, ఆయన నేపధ్యం ఏమిటో తెలుసుకోవాలనీ ఆతృతగా ఉంది కదూ! ఆయన ఒక వెనకబడిన తరగతికి చెందిన ఒక క్రిస్టియన్! అవునండీ ఆయన ఒక క్రిస్టియన్! ఆయన పేరు సి పి మాథ్యూ.. సనాతనధర్మం యొక్క గొప్పతనాన్ని, సనాతన ధర్మమంటే అది మతం కాదు ఒక జీవన విధానమనీ, అది సైన్సు ఆధారితమనీ మూఢత్వం కాదనీ తెలుసుకుని, ఆచరించి, బోధించి స్వర్గస్తుడయ్యారు. అతిముఖ్యమైన విషయం, ఆయన జన్మతః బ్రాహ్మణుడు కాకపోయినా ఆయన జ్ఞానంచేత బ్రాహ్మణుడై, ఉపనయన సంస్కారం పొంది, బ్రాహ్మణుడిగా జీవించిన సి పి మాథ్యూ గారు ధన్యుడు! ఆయన జీవితం సనాతన ధర్మాన్నీ, కులాలను విమర్శించే వారికి కనువిప్పు కలిగించగలదు!!

కామెంట్‌లు లేవు: