16, జులై 2023, ఆదివారం

ఇది కధ కాదు,

 ఇది కధ కాదు, 

49 ఏళ్ళ క్రితం #కేరళలో జరిగింది....

*******************************


అది 1971 డిసెంబర్ ప్రాంతం కేరళలోని #తలస్సేరి..

మత ఘర్షణలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలం..

సమీప ప్రాంతాల్లోని ప్రజలు వీధుల్లోకి రాలేక ఇళ్ళకు తాళాలు వేసుకుని సుదూర బంధువుల ఇళ్ళకు వెళ్ళిపోయి నిర్మానుష్యంగా కనిపిస్తున్న జనావాసాలు..


ఇది ఇలా ఉండగా #విజయన్_కొరాన్ అనే పేరుగల ఓ 26 ఏళ్ళ వయస్సున్న కరడుగట్టిన కమ్యూనిస్టు గూండా రెండు జీపుల్లో ఫుల్లుగా తాగి మదం పట్టిన ఏనుగుల్లా ఉన్న కామ్రేడ్లను ఎక్కించుకుని ఆ ప్రాంతం అంతా తిరుగుతూ మైకులతో ప్రజలను మరింతగా రెచ్చగొడుతున్నాడు..

ఈ క్రమంలో తలస్సేరిలో ఈ గ్యాంగ్ చేతిలో జనవరి 4, 1972 రోజు #కుంజిరామన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు..


అంతకు రెండు రోజుల ముందే తలస్సేరి ప్రాంతానికి 25 ఏళ్ళ వయస్సున్న ఒక యంగ్ IPS ఆఫీసర్ ASP గా ఛార్జ్ తీసుకున్నారు..

హత్య విషయం తెలియగానే ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని హంతకుల వేటలో పడ్డారు..

ఓ ఫార్మ్‌హౌస్‌లో విజయన్‌కొరాన్ ముఠా మందు కొడుతున్నట్లు సమాచారం వచ్చింది..

వెంటనే యంగ్ IPS తన పోలీసు బ్రృందంతో దాడిచేశాడు..

ముఠా నాయకుడైన విజయన్‌కొరాన్ ఒక పోలీసు కానిస్టేబుల్ చేతికి చిక్కాడు, కానీ అతన్ని బెదిరించడంతో వదిలివేశాడు..

ఇదంతా గమనిస్తున్న యంగ్ IPS ఆఫీసర్ స్వయంగా తానే రంగంలోకి దిగాడు..

అతని వెంట పరిగెత్తుతూ దగ్గరకు పోగానే పట్టుకోకుండా కాలితో బలంగా తన్నాడు..

ఆ దెబ్బకు విజయన్‌కొరాన్ వేగంగా బోర్లా పడిపోయి ముఖం గీసుకుపోయింది..

ముఖం చేతులు రక్తసిక్తమైనాయి..

అతని లుంగీ పూర్తిగా ఊడిపోయింది..

అతనిని జీపులో ఎక్కించుకుని తలస్సేరి ప్రజలందరూ చూస్తుండగా పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చాడు..

ఈ క్రమంలో యంగ్ IPS ఆఫీసర్ ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు..

అంతా చేతల్లోనే చూపిస్తున్నారు..


పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చిన తరువాత అతనిని సెల్‌లో వేశారు..

ఒక కానిస్టేబుల్ సెల్‌లోకి వెళ్ళి, సంకెళ్ళు విప్పి "నువ్వు రేపటి సూర్యోదయాన్ని చూస్తావని నాకైతే నమ్మకం లేదు.." అన్నాడు.

ఇంతలోనే యంగ్  IPS ఆఫీసర్ సెల్‌లోకి ఎంటరైనాడు..

మాటల్లేవు..

ఒక చేత్తో ఆ గూండా మెడ పట్టుకుని గోడకు ఆనించి పైకి లేపాడు..

అతని కాళ్ళు నేలకు 1 అడుగు పైకి లేచి మొత్తం శరీరం గాల్లో వేలాడింది..

ఇలా ఒక నిమిషం కాగానే అతని కళ్ళు తేలడం ప్రారంభించాయి..

క్రిందకు దించాడు.. ఆ గూండాకు ముత్తాత కనిపిస్తున్నాడు

ఇంతలో కానిస్టేబుల్‌కు సైగ చేయగా ఓ గ్లాసు నీళ్ళు ఆ గూండాకు అందించాడు..

ఎడారిలో నీళ్ళు లేక వడదెబ్బ తగిలిన వ్యక్తి ఎలా తాగుతాడో అలా ఆ నీళ్లు గ్లాసు అందుకుని బొట బొటా తాగేశాడు.. మరో గ్లాసు నీళ్ళు కావాలని అడిగాడు..

ఆఫీసర్ అనుమతితో కానిస్టేబుల్ మరో గ్లాసు నీళ్ళు తెచ్చిచ్చాడు..

నీళ్ళు తాగి చెమటలతో పూర్తిగా తడిసిపోయిన శరీరంతో రొప్పుతూ, యంగ్ ఆఫీసర్ కాళ్ళ వైపు కమ్యూనిస్టు గూండా దీనంగా చూస్తున్నాడు..


"Vijayan Koran.. Look at me.." అని మొదటిసారిగా యంగ్ IPS నోటి నుండి మాటలు వినపడ్డాయి..

ఆ రౌడీ తన చూపులను మెల్లిగా పైకి తీసుకువచ్చాడు..

ఆఫీసర్ నడుం వద్దకు చూపులు రాగానే, రివాల్వర్ బయటకు తీస్తున్న ద్రృశ్యం కనిపించింది..

అంతే బిగ్గరగా ఏడుస్తూ, వేడుకోవడం ప్రారంభించాడు..

ఆ రౌడీకి మలయాళం తప్ప మరేమీ రాదు..

ఆఫీసర్‌కు ఈ మళయాళం ఇంకా వంటబట్టలేదు..

ఆయన ఏడుపులు వేడుకోవడాలు ఏమీ పట్టించుకోకుండా రివాల్వార్ తీసుకువచ్చి నుదుటిపై పెట్టాడు..

ఇంతలో ఆ రౌడీ #మూత్ర విసర్జన చేయడంతో కొద్దిగా విరామం ఇచ్చాడు..

అయినా ఆ రౌడీ పెద్దగా ఏడవడం, వేడుకోవడం ఆపలేదు..

ఆ పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా ఆఫీసర్ వైపు దీనంగా చూశారు..

"మీరు ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తరువాత ఈ కమ్యూనిస్టు గూండాలు మా కుటుంబాలను చంపేస్తారు.." అన్న ఆ పోలీసుల దీనపు చూపుల్లోని అర్థాన్ని గ్రహించిన ఆఫీసర్‌ రివాల్వార్ కిందకు దించి రెండవ మాట మాట్లాడారు..


"ఈ తలస్సేరి ప్రాంతంలో ఎక్కడా గొడవలూ, హింస, ఘర్షణలూ కనపడకూడదు వినపడకూడదు..

అలా జరిగితే ఈ పిస్టోల్‌లో ఉన్న గుండు నేరుగా నీ తలలోని మెదడులోకి వెళుతుంది. Is that Clear..??"

అన్నాడు..


ఏడుస్తూనే "ఎస్ సార్.." అని చెప్పాడు.

ఆఫీసర్ బయటకు వెళ్ళిపోతూ అతని కాళ్ళకు కారిపోయి ఉన్న మలం మరియు కింద నేలపై తడిచిన మూత్రాన్ని క్లీన్ చేసి వెళ్ళాలని ఆదేశించాడు..

వాడు అలాగే ఏడుస్తూ సెల్ అంతా క్లీన్ చేసి, నీళ్ళతో తన మొల భాగం క్లీన్ చేసుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు..

ఆ తరువాత తలస్సేరిలో మరో ఆరు మాసాలు ఎటువంటి గొడవలూ లేవు..

ఆ ఆఫీసర్ అంతగా సీరియస్ కావడానికి కారణం ఆ ముఠా చేతిలో అప్పటికే ఏప్రిల్ 28, 1969 న #వడైక్కల్_రామక్రృష్ణన్ అనే కుట్టుపని చేసుకుని బ్రతికే వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు తెలుసుకుని ఉన్నాడు..


అక్కడ అంతా ప్రశాంతం అయిపోవడంతో, ఆ యంగ్ IPS ఆఫీసర్‌ను ముఖ్యమంత్రి #అచ్యుతమీనన్ మెచ్చుకుని, మరొక డిస్టర్బ్‌డ్ ఏరియాకు ట్రాన్స్‌ఫర్ చేశారు, అక్కడ కూడా పరిస్థితులు చక్కబెట్టమని..


ఆ యంగ్ IPS ఆఫీసర్ ఎవరో కాదు మన Indian James Bond #అజిత్‌దోవల్..

1945లో #ఉత్తరాఖండ్‌లో పుట్టిన దోవల్ 1968 లో అంటే కేవలం 23 ఏళ్ళకే #IPS కు సెలెక్ట్ అయ్యారు..

ఆయన కేరళ క్యాడర్‌కు ఎంపిక అవడంతో మొదటి పోస్టింగ్ #కొట్టాయం ASP గా బాధ్యతలు తీసుకున్నారు..

ఆ సంఘటన జరిగిన మరో రెండేళ్ళకు ఆయన సెంట్రల్ సర్వీసులకు ఢిల్లీకి వచ్చేశారు..


పోతే ఆ 26 ఏళ్ళ #కమ్యూనిస్టు_గూండా విజయన్‌ కొరాన్ ఎవరో తెలుసా....??

ఆ సంఘటన తరువాత అవమానంతో పోలుసు రికార్డులో ఉన్న పేరు మార్చుకుని, #పినరాయివిజయన్ అని కొత్త పేరు పెట్టుకుని, 2016 లో ముఖ్యమంత్రి అయిన నేటి కేరళ ముఖ్యమంత్రి..

కమ్యూనిస్టు కల్చర్‌లో ఎవరైనా నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారంటే వాళ్ళ చరిత్ర ఎలా ఉంటుందో చూశారు కదా.....!!

కామెంట్‌లు లేవు: