10, ఫిబ్రవరి 2026, మంగళవారం

శఙ్కరాచార్యుల చరిత్రను

  ఆది శఙ్కరాచార్యుల చరిత్రను, వారు స్థాపించిన చతురామ్నాయ పీఠములు మరియు ఇతర మఠముల గురించి అసందర్భముగా వివేచన విచారణ చేయకుండా మతికి తోచినట్లు విదేశాలకు వెళ్ళి సన్యాస దీక్ష పతిత్వ దోషాన్ని పొందిన తెన్కలై శాఖకు చెందిన త్రిదండి సన్యాసి చినజియర్ మాటలు పూర్తిగా అసంబద్ధం, అహేతుకం, అజ్ఞానజ ఊహాజనితం. శఙ్కరవైభవంలో కొట్టుకుపోతామనే భయంతో చేసిన తాలు ధాన్యపు మాటలుగా ఎంచి నిర్దాక్షిణ్యంగా ఖండించదగ్గ మాటలు.


ప్రాచీన శంకరవిజయాలతో పాటు ఆధునిక శంకర విజయం వరకూ అన్నిటా పీఠ స్థాపనల ప్రతిపాదన, శంకరుల ముమ్మారు భారత పర్యటన అన్ని విషయాలూ సుస్పష్ఠంగా గ్రంథస్థం చేయబడ్డాయి.


2500 సం పూర్వం మాహిష్మతి (మధ్యప్రదేశ్)నేలిన పాండవుల వారసుడు మహారాజా సుధన్వ చౌహాన్ గారి కాలంలో ఆదిశఙ్కరుల ఆదేశంతో వారు వేసిన శాసనాలతోనే చతురామ్నాయ మఠాల విషయం తెలుస్తున్నది.


జయజయ శఙ్కర హర హర శఙ్కర

కామెంట్‌లు లేవు: