*భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా - గుర్తించడం ఎలా??**
శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులనే పంచ గుణము లుండడంచేత భూమి చాలా భారంగా ఉన్నది.
జలములో శబ్ద, స్పర్శ, రూప, రసాలున్నాయిగాని, గంధము లేదు,
ఆ ఒక్క గుణము తగ్గిపోవడంతో దీనికి కదలిక వచ్చింది,
మూడవది అగ్ని...
ఇందులో శబ్ద, స్పర్శ, రూపములున్నాయిగాని,
రస గంధాలు లేవు, అందువల్ల ఇది పైకి పోతుంది.
నాలుగవది వాయువు,
ఇందులో శబ్ద, స్పర్శ గుణాలు రెండు మాత్రమే ఉన్నాయి;
రూప, రస, గంధములు లేవు.
మూడు గుణాలు తగ్గేసరికి ఇది ఎంతో తేలికైపోయి సర్వత్రా సంచరిస్తూ ఉంటుంది.
ఐదవది ఆకాశము,
దీనికి శబ్దమొక్కటే ఉన్నది; స్పర్శ, రూప, రస, గంధాదులు లేవు, కనుక, ఆకాశం ఎక్కడ చూసినా వుంటుంది.
ఇది ఒకే గుణంతో ఉన్నది కనుక, అంతటా ఉన్నది.
*భగవంతునికి ఆ ఒక్క గుణం కూడా లేదు కాబట్టి, అతడు సర్వాంతర్యామి*.
*శుభమస్తు*
🙏శ్రీ సద్గురు పీఠం ద్వారా....✍️
సమస్త లోకా సుఖినోభవంతు 🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి