21, మే 2024, మంగళవారం

తస్మాత్ జాగ్రత్త

 మోసపోయిన 11 మంది పాలమూరు న్యాయవాదులు...


పుణ్యం కోసం పోతే... పాపం వచ్చింది , పాపం...


ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 11 మంది న్యాయవాదులు చార్ధామ్ యాత్రకు బయలుదేరారు. అయితే వీరు ముందస్తుగా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేయించుకున్నారు. 


పవన్ హాండ్స్ అనే సంస్థ ద్వారా రూ.5,500 చెల్లించి ఫ్లైట్ టికెట్ బుక్ చేయించుకుని పాట్నాలో దిగారు. తీరా పాట్నాలో టికెట్లు ఫేక్ టికెట్లుగా అధికారులు చెప్పడంతో వీరంతా తమకు జరిగిన అన్యాయాన్ని గళమెత్తి ప్రశ్నించారు.


ఫేక్ ప్రచారాన్ని నమ్మి.. ఫేక్ టికెట్లను అమ్మిన ఫేక్ గాళ్లపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు: