5, మే 2024, ఆదివారం

కలలో ఏం వస్తే

 🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

. *🌹తాళపత్ర గ్రంధం🌹*

( అనేక గ్రంథాల్లో దాగి ఉన్న జీవన ఆచార... ఆరోగ్య సాంప్రదాయ రహస్యాలు... స్థూల అక్షరాలతో...)

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

. *భాగం 10*


*84. కలలో ఏం వస్తే ఏ ఫలితం జరుగుతుంది?*


(అష్టాదశ పురాణాల నుంచి)

• అగ్నిని త్రాగినట్టు వస్తే జఠరాగ్ని వృద్ధి అవుతుంది.


• తెల్లని పూలూ, వస్త్రములు, తెల్లని పక్షులూ

లాభదాయకములు.


• తలలూ, భుజములూ, హస్తములూ వస్తే ధనవృద్ధి.


• అలాగే గుర్రమూ, ఎద్దూ, తామరపువ్వూ, ఏనుగూ

కనిపిస్తే ఊహించని ఐశ్వర్యము.


• సముద్రము లేదా నదిని దాటి అవతల తీరం

దాటినట్టు వస్తే మీ కార్యాల్లో విజయం సాధిస్తారు.


• సుందరమైన స్త్రీ ఒడిలో ఉన్నట్టు కలవస్తే

ధనలాభము.


• తామరాకులు కలలో వస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అట్టి శుభస్వప్నములు కన్నవారు మేల్కొని, ఆపై నిద్రింపక స్నానాదులతో శుచియై అయిన వారితో పంచుకుంటే మరింత త్వరితంగా ఫలితాన్ని పొందగలరు


*85. మనోభీష్టములు సిద్ధుంచుట కొరకు?*


*ఓం కామ - కామప్రద - కాంత - కామపాల-హరి - ఆనంద - మాధవ నమో నమః*

అని 108సార్లు శుచిగా మహావిష్ణువును

జపించవలయును.


*86. ఆయుర్వేదంలో రొంపకు చెప్పిన అమోఘమైన వైద్యం...?*


బాగా మరుగుతున్న నీటిలో ఓ ఇరవై తులసి

ఆకులు వేసి, బాగా ఉడికిన తర్వాత పంచదార, పాలు

పోసి మనం ఉదయం త్రాగే పానీయాలని వదలి తాగితే

రొంపతో పాటు జ్వరము కూడా రాకుండా

అరికడుతుందని చరకసంహిత శెలవిస్తోంది.


*87. స్నేహం ముసుగులో చేసే ద్రోహాలకి పోశిక్ష..........*


చితి మీద కాలుతున్న వాన్ని పీక్కుతినే అలాంటి

వాళ్ళ గురించి చర్చించడం కూడా పాపమే. మంచి

మనుష్యుల గూర్చీ, విషయాల గూర్చీ మాట్లాడుకుంటే

మనసు బావుంటుంది. మీకు అపకారమూ, నష్టమూ

చేసిన వారికి దూరంగా ఉండటమే వారికి

భగవంతుడిచ్చిన పెద్దశిక్ష.


*88. శత్రువుపై విజయము కొరకు?*


*ఓం రామ - పరుశురామ - నృసింహ - విష్ణు విక్రమ నమో నమః* అని 108 సార్లు శ్రీరామ మందిరంలో కూర్చొని జపించవలయును. అటుల ధ్యానించిన వారికి శత్రువులే మిత్రులుగా వచ్చి శరణు వేడుతారు.


*89. దక్షిణ దిశలోనున్న చింతచెట్టు చుట్టూ తిరిగితే వ్యాధులు నమయవుతాయా?*


సూర్యభగవానుడి కిరణాలు దక్షిణ దిశగానున్న

చింతచెట్టు తన దిశగా వచ్చే కిరణాలను ఆపి, తన

ఆమ్లగుణాన్ని కిరణాలతో కలిపి తన పరిధిలోని

ప్రదేశాన్నంతటికీ నీడనిచ్చి చల్లని గాలితో నింపేస్తుంది.

ఆ గాలి శరీరానికి ఎంతో ఆరోగ్యం కనుక మన పెద్దలు

అక్కడ గుడిని నిర్మింపచేసి ప్రదక్షిణలూ, పూజలూ

చెయ్యమన్నారు.


*90. రోజుకి ఎన్నిసార్లు పుక్కిలించాలని ఆయుర్వేదం చెబుతోంది?*


ఉదయాన్నే దంత ధావనము అయ్యాక పుక్కిలించిన నీరును ఎడమదిశగా వదలాలి. మూత్ర

విసర్జన చేస్తే నాలుగు సార్లూ, ఆ తర్వాత కార్యక్రమం

తర్వాత ఎనిమిదిసార్లూ, చక్కగా భోజనం అయ్యాక

పన్నెండు పర్యాయములూ, భార్యతో కలిసిన తర్వాత

పదహారుసార్లు పుక్కిలించాలని ఆయుర్వేదం

శెలవిస్తోంది. ఒక్కసారి పుక్కిలించగానే శరీరంలోని ఎన్నో వేల + గ్రంథులు ఉత్తేజం పొందుతాయి.


*91. ఉసిరిక పొడిని ఒంటికీ, తలకీ రాసుకొని స్నానం చేస్తే?*


జుట్టు వూడిపోదు. బట్టతల బాధలు లేకుండా,

వెంట్రుకలు నెరవకుండా, ఎక్కువ ఆయుష్షుతో

జీవిస్తారని ఆయుర్వేద శాస్త్రం శెలవిస్తోంది.


*92. పుట్టిన దగ్గర్నించి పోయేదాకా ఏడుపేనా?*


• తల్లి గర్భం నుంచి బైటికి రావటంతోనే ఏడుపు.

• బిడ్డకు పాలు చాలక పోతే ఏడుపు.

• పాలు ఎక్కువైతే అజీర్తి ఏడుపు.

• ఆటలాడటానికి పోనీయకపోతే ఏడుపు.

• చదువులో ప్రగతి లేకపోతే ఏడుపు.

• పరీక్షల్లో తుస్ మంటే ఏడుపు.

• నెగ్గితే పక్కవానికెక్కువచ్చాయని ఏడుపు.

• ఉద్యోగం రాలేదని ఏడుపు.

• వస్తే తనకన్నా పక్కవానికి జీతమెక్కువొస్తుందని

ఏడుపు.

• పెళ్ళయితే ఒక ఏడుపు, అవకపోతే మరొక ఏడుపు.

అందంగా భార్య ఉంటే ఒక ఏడుపు, వికారంగా

ఉంటే మరో ఏడుపు, గయ్యాళయితే ఇంకొక

ఏడుపు.

• బిడ్డలు కలగకపోతే ఏడ్పు, కలిగితే సాకలేక ఏడుపు.

• అల్లుడు మంచివాడు కాకపోతే ఏడ్పు, కోడలిపై

మరొకరకమైన ఏడుపు.

• వేరు కాపురం పెడితే ఏడుపు, ఉమ్మడిగా ఉంటే

కోడలు సరిగా చూడటం లేదని ఏడుపు.

• వయసొచ్చి రోగాలొస్తే ఏడుపు. తీరా పోతే చివరి ఏడుపు. ఇదీ మానవజీవిత ఏడుపుల గాథ.


*93. అరటిబోదెలో దీపం వెలిగించి వదిలితే మంచి భర్త లభిస్తాడా?*


పెళ్ళి కాని వారూ, అయిన వారూ, అరటి చెట్టు

బోదెలో దీపం వెలిగించి కోనేరు, నదుల్లో దీపాలు

వదులుతారు. పెళ్ళయిన వారు భర్త క్షేమం కోసమూ,

పెళ్ళికాని వారు మంచి భర్త లభిస్తాడని అరటి బోదెలో

వెలిగించిన దీపాన్ని ఉంచి వదలమంటారు పెద్దలు.

తెల్లవారుజామున లేవటము వల్ల, ఎంతో దూరం వెళ్ళి

+ ప్రశాంతంగా దీపాలు వదలటం ద్వారా పెళ్ళయిన వారికి

ఆ సమయంలో ప్రశాంతమైన గాలి శరీరంలోకి

ప్రవేశించి మరింత మెరుపుని వచ్చి తద్వారా భర్త ప్రేమను

అందుకుంటుంది. పెళ్ళికాని పిల్ల నలుగురు అమ్మలక్కల

దృష్టిలో పడి త్వరగా వివాహం అయ్యే అవకాశం

ఉంటుంది. భక్తితో పాటు మానవ కళ్యాణాలకు

అవసరమైన పద్ధతులే పెట్టారు మన పెద్దలు.


*94. విద్యాభివృద్ధి కొరకు?*


*ఓం పురుషోత్తమ నమో నమః* అని 108సార్లు సరస్వతిదేవి గూర్చి జపించాలి. అలా చేసినవారికి వాక్శు ద్ధితోపాటు జ్ఞాపకశక్తి పెరిగి విద్యాభివృద్ధి

జరుగుతుంది.                   


*రచన_* ✍️ *మైధిలి వెంకటేశ్వరరావు.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃


https://kavulu.blogspot.com/2024/05/blog-post_73.html


కామెంట్‌లు లేవు: