3, ఫిబ్రవరి 2026, మంగళవారం

ఎందరినేదరి జేర్చిన

  *2323*

*కం*

ఎందరినేదరి జేర్చిన

సందరమున నొంటరిగనె సాగు తరి గతిన్

అందరితో కలిసి బతికి

యందరి పరయానమొంటి యాతనె సుజనా.

*భావం*:-- ఎంతమందిని ఏ యే ఒడ్డులకు చేర్చిననూ సముద్రంలో నావ(తరి) ఒంటరిగా నే సాగే విధంగా అందరితో నూ కలిసి బతికే అందరియొక్క మరణయానమూ ఒంటరి వేదనయే.

*సందేశం*:-- అందరితోనూ కలిసే బతికిననూ చివరకు మరణము మాత్రం ప్రతీ ఒక్కరికీ ఒంటరి ప్రయాణమే,అంటే మృత్యువు (మరణం) ఏ ఒక్కరికో బంధువూ కాదు,ఎవరితోనూ మిత్ర శత్రు త్వాలు తనకు ఉండవు,అది కేవలం మన ఆత్మ ను భూలోకం నుండి పరలోకానికి తీసుకుని వెళ్ళే నావ మాత్రమే.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: