25, సెప్టెంబర్ 2023, సోమవారం

ఫలముల గుణధర్మములు

 కొన్నిరకాల ఫలముల గుణధర్మములు -


 * మామిడి  - 


         మంచి పౌష్టిక ఆహారం , కొంచం                అరుగుటకు సమయం తీసుకొనును.


 *  అంజూర -


         చాలా మంచి పౌష్టిక ఆహారం. అరుగుటకు సమయం తీసికొనును. వేసవికాలమున ప్రాతఃకాలం నందు ( సూర్యోదయమునకు పూర్వం ) ఈ ఫలమును తినుట శరీరానికి చాలా మంచిది .


 *  ద్రాక్ష  -


         మంచి జీర్ణకారి. రక్తమును శుద్ధి చేయును . కొవ్వు మరియు వేడిమిని శరీరం నందు వేగముగా పుట్టించును . గుండెకు మంచి మేలు చేకూర్చి గుండె చుట్టు ఉండే రక్తమునకు మంచి చేయును .


 *  ఆపిల్  -


         త్వరితముగా జీర్ణం అగును. శరీరం నందు శక్తి లేనివారికి , చిన్నపిల్లలకు మేలు చేయును .


 *  అరటి  -


         మంచి పౌష్టిక ఆహారం , మలాన్ని శుద్ధిచేయు గుణము అధికం .


 *  కిత్తిలి  -


         మంచి జీర్ణకారి , రక్తాన్ని శుద్ధిచేయును .


 *  సీమ రేగు -


         శ్రేష్టమైన ఆహారం , మంచి ఔషధముగా పనిచేయును . శరీరాన్ని పరిశుభ్రపరుచు శక్తి కలదు. రోగపదార్థమును బయటకి వెడలించును. వాతమును , గుండె సరిగ్గా కొట్టుకొనకుండా ఉండు సమస్యని మాన్పును.


                భోజనమునకు ముందే వీటి రసము లొపలికి తీసుకొనిన పులితేన్పులు రాకుండా చేయును . నివారణ చేయును . వీటి రసమునకి సూక్ష్మజీవులను సంహరించగల శక్తి కలదు. విష జ్వరాలకు కారణం అయిన శిలింద్రాలను ఇది సహరించగలదు.


 *  బేరిపండ్లు  -


        వీటిని చెక్కు తీయకుండా తినినచో విరేచనం కలిగించును. చెక్కు తీసి తినినచో బంక విరేచనాలను నివారించును. పుట్టకొక్కు విషమునకు విరుగుడుగా పనిచేయును .


 *  అనాస - 


         భోజనానంతరం ఇది పుచ్చుకొనిన ఇది మిక్కిలి జీర్ణకారిగా ఉండును. గొంతుచుట్టు గ్రంధులు వలే గొలుసు మాదిరిగా ఏర్పడు రోగమును గండమాల అందురు. అలా ఏర్పడిన గ్రంధుల నుంచి రసికారుటను మాన్పుటకు ఈ ఫలము అద్భుతంగా పనిచేయును . ఈ పండ్ల రసమును మొటిమలకు మరియు పులిపిరులకు పూస్తున్న అవి హరించును .


 *  బాదం -


         ఇది మానవులకు సహజ ఆహారం. వీటిని చిరుతిండిగా మధ్య ఆహారంగా ఉపయోగించవచ్చు . ఇవి అధిక బలకారులు కావున మితముగా ఉపయోగించవలెను. ఇది సమశీతోష్ణము అయినది. కొత్త కాయలలోని పప్పు శ్రేష్టమైనది. వేడిచేసి చలువచేయును. వీర్యవృద్ధి , దేహపుష్టి కలుగచేయును . మేహవాతాన్ని అణుచును . రొమ్మునకు బలమును ఇచ్చును.


               మూత్రపు సంచిలోని పుండ్లు మాన్పును . శరీరంలోని అని అవయవములను బలమును ఇచ్చును. గొంతుకను , రొమ్మును మృదువుగా చేయును . దగ్గు,లివర్ నొప్పి , క్షయ మొదలగు రోగాలని అణుచును. కిడ్నీలకు బలమును కలుగచేయును . వాతమును అణుచును. పళ్లనొప్పి , దేహము బక్కగా అవ్వు సమస్య , శిరస్సుకు సంబందించు సమస్యలను నివారించును. మాటిమాటికి వచ్చు జ్వరమును నివారించును.


          ఈ పప్పులను తినటం మొదలుపెట్టగానే శరీరంలోని వ్యర్థాలు బయటకి వెళ్ళుట ప్రారంభం అగును.


 *  వేరుశెనగ  -


         ఈ పప్పు చాలా బలకరం . వీటిని పచ్చిగానే తినినచో మంచి బలాన్ని కలగచేయును . వీటిని తినినచో శరీరంలోని వ్యర్థాలు బయటకి వెళ్ళును.


 *  టెంకాయ -


         కొబ్బరి మరియు కొబ్బరి నీరు లొపలికి తీసుకోవడం వలన మంచి బలం కలిగించును. శరీరం లోని వేడిని తీసివేయును. తక్షణ శక్తిని ఇవ్వడంలో దీనిని మించినది ఏది లేదు . కేవలం టెంకాయ మాత్రమే తిని జీవించవచ్చు అని కొన్ని ఆయుర్వేద గ్రంథాలలో రాసి ఉన్నది.


      మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                           9885030034  


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


        కాళహస్తి వేంకటేశ్వరరావు 


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


           9885030034

కామెంట్‌లు లేవు: