16, నవంబర్ 2023, గురువారం

సప్త ధాతువులు

 శరీరం నందలి సప్త ధాతువులు మరియు ఉపధాతువులు గురించి వివరణ  - 


  శరీరం నందలి  7 రకాల ధాతువులు కలవు. 


 1 -  రసము .


 2 - రక్తము .


 3 - మాంసము .


 4 - మేధస్సు 


 5 - మజ్జ .


 6  - అస్థి .


 7 - శుక్రము .


                ఇవి శరీరమును పొషించును. 


 *  ఓజస్సు  - 


         శరీరం నందలి రసధాతువు మొదలు శుక్రధాతువు వరకు ఉండు సప్తధాతువుల యొక్క ఉత్క్రుష్టమైన తేజస్సే ఈ ఓజస్సు అని చెప్పబడును. అది స్నిగ్దముగా , నిర్మలంగా కొంచెం రక్తవర్ణము గా ఉండును.  ఇది ముఖ్యముగా హృదయము నందు ఉండినను శరీరం అంతా వ్యాపించి ఉండును. ఇది నశించినచో జీవియు నశించును . దీనివలన ప్రాణి బ్రతికి ఉండును. 


              దీనివల్లనే దేహసంబంధమైన అనేక భావములు కలుగుచున్నవి. ఇది శరీరం యొక్క జీవిత స్థితికి ముఖ్యకారణం అయిఉన్నది. ఇది 10 బిందువుల ప్రమాణంతో 

శరీరం నందు ఉండును.  


              కోపము , ఆకలి, ధ్యానము , దుఃఖము   శ్రమ  మొదలగు వాటివల్ల మనుజుడు యొక్క శరీరం మిక్కిలి దౌర్బల్యత్వం  చెందును .  శరీరం కాంతి నశించును. 


         పైన చెప్పిన కారణాల వలన ఓజస్సు తగ్గినప్పుడు చికిత్సా సమయంలో మధురద్రవ్యములను , పాలు , మాంసరసం , నెయ్యి , దూలగొండి మొదలగు ద్రవ్యములను వాడినచో ఓజస్సు వృద్ధిచెందును. 


  సప్తధాతువులు శరీరం నందు సంచరించు పద్దతి  - 


 *  రసము  - 


        ఇది మిక్కిలి పలచగా ఉండును. చిన్న ప్రేగుకి సంబందించిన రసాయనుల ద్వారా హృదయముకి చేరి అచ్చట వడపోయబడి స్థూలసూక్ష్మ భాగములుగా విభజింపబడును . అందు స్థూలభాగము సర్వశరీరం నందు గల రసాయనుల ద్వారా వ్యాపించుతూ రక్తధాతువుని పోషించుచుండును.


 *  రక్తము  - 


        ఇది శరీరం నందలి సిరల యందును , మాంసము నందు వ్యాపించి ఉండును. ఇది ధమనీ సహాయమున శరీరం అంతటా ప్రవహించుతూ కాలేయం , మూత్రపిండముల యందు శుద్ది అగును . రసధాతువు నుండి రక్తధాతువు ఏర్పడును . 


 

 *  మాంసము  - 


        ఇది నాళములలోని రక్తము ద్వారా పోషించబడుచూ ఉండును. ఇది కూడా స్థూలం , సూక్ష్మం , మలం అను విభాగాలు పొందును. సూక్ష్మంగా ఉండు భాగం మేధస్సుని చేరి పోషించబడుతూ ఉండును. ఇది రక్తధాతువు నుండి ఏర్పడును . 


 *  మేథస్సు  - 


          ఇది నెయ్యి వలే తెల్లగా ఉండును. ఇది కడుపులోను మరియు చిన్నచిన్న ఎముకలకు అంటియుండు కొవ్వుపదార్థం . మాంసము నందలి సూక్ష్మ భాగములచే ఇది పోషించబడును. ఇది కూడా స్థూల, సూక్ష్మ , మల భాగములుగా విభజించబడి ఎముకలను పోషించుచుండెను . ఇది మాంసధాతువు నుండి ఏర్పడును . 


 *  అస్థి  - 


          ఇది మేధోధాతువుచే పోషింపబడుచూ శరీరం యొక్క పటుత్వమునకు ప్రధాన హేతువుగా ఉంటుంది. ఇది 3 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఇది మజ్జా ధాతువుని పోషించుతూ ఉండును. ఇది మేధోధాతువు వలన ఏర్పడును . 


 *  మజ్జ  - 


           

          ఇది బోలు ఎముకలో ఉండు పచ్చని కొవ్వు వంటి పదార్థం . ఇది అస్థిధాతువు చే పెంచబడును. ఇది స్థూలం , సూక్ష్మం , మలం మూడు బాగాలుగా విభజింపబడి ఉంటుంది. అందులో స్థూలభాగం మజ్జభాగంలో చేరుచూ ఉండును. సూక్ష్మ భాగం శుక్రధాతువు ని పొషించుచుండును . ఇది అస్థిధాతువు వలన ఏర్పడును . 


 *  శుక్రము  - 


        

           ఇది శరీరం నందు అంతటా ఉండు మజ్జాధాతువు యొక్క సూక్ష్మభాగం . ఎముకలలో ఉండు అతి సూక్ష్మ రంధ్రముల ద్వారా పైకి వచ్చి రక్తముతో కలిసి సిరల గుండా ప్రవహించుచూ సూక్ష్మ శుక్రద్రవము ను పోషింపుచూ ధమనీ సహాయంతో బీజకోశములలోకి చేర్చబడును . ఇది స్థూల సూక్ష్మ అను రెండు భాగములుగా విభజింపబడును. అందు స్థూలభాగం శుక్రమును , సూక్ష్మ భాగం ఓజస్సు పోషింపబడును. ఇది మజ్జా ధాతువు వలన ఏర్పడును . 


  ధాతువులకు ఉపధాతువులు  - 


     రసధాతువుకు  స్తన్యము , రక్తధాతువు కు స్త్రీల రజస్సు, మాంసధాతువుకు వస అనెడి చమురు , మేధోధాతువుకి చెమట, అస్థిధాతువుకి దంతములు , మజ్జాదాతువుకి వెంట్రుకలు , శుక్రధాతువుకి ఓజస్సు ,  వీటిని ఉపధాతువులు అనబడును.



   మరెన్నో అద్భుత సులభయోగాలు నేను రచించిన గ్రంథాల యందు సంపూర్ణముగా ఇచ్చాను. 


 

   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

        9885030034 


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


            9885030034

కామెంట్‌లు లేవు: