*ఆశీర్వచనములు!*
➖➖➖✍️
```
శ్రీరామపట్టాభిషేకం మహావైభవంగా జరిగిన తరువాత, కొంతకాలానికి అష్టావక్రమహర్షి సీతారాములను చూసేందుకు అయోధ్యకు విచ్చేశాడు.
సీతారాముల హార్దికమైన స్వాగతసత్కారాలను అందుకున్నాడు.
తనకు నమస్కరించిన సీతమ్మను దీవించాడు…
“వీరప్రసవా భూయాః”(వీరులను కనుదానివి కావలసినది)
ఆ దీవెన శ్రీరామునికి ఎంతగానో నచ్చింది…```
*భగవాన్, అనుగృహీతాః స్మః।*``` {మహాత్మా, మేము(అంటే మా వంశస్థులము)అనుగ్రహింపబడ్డాము.}
```
*లౌకికానాం హి సాధూనామ్ అర్థం వాగనువర్తతే।*
*ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోఽనుధావతి॥*```
(లౌకికులు కార్యశూరులైన సత్పురుషులు తాము ఒక ఘనకార్యాన్ని చేసిన తరువాతనే అలా చేశామని అంటారు.
కాని, ఆద్యులైన ఋషులు ఒక మాటను పలికితే, ఆ మాట యథాతథంగా వెనువెంటనే జరిగిపోతుంది) అంటూ శ్రీరాముడు ఎంతగానో సంబరపడిపోయాడు.
ఇది భవభూతిమహాకవి తన ఉత్తర రామచరితంలో దర్శించి చెప్పిన ముచ్చట.
అమోఘమైన ఆ ఋషివాక్కు కాలాంతరంలో ఫలించింది.
ఒకరిని కాదు, ఇద్దరు మహావీరులను కని సీతమ్మవారు వీరమాతగా ప్రఖ్యాతిగాంచింది.
ఈ దీవెన నేడు ప్రతి భారతీయ స్త్రీ పొందాలి.```
*“దీర్ఘసుమంగళీ భవ, సౌభాగ్యవతీ భవ”* ```అనే దీవెనల తరువాత, అష్టావక్రమహర్షి సీతమ్మకు ఇచ్చిన ఈ దీవెనను ఈనాటి పెద్దలు కూడా తమ కుమార్తెలకు, తమ కోడండ్లకు, ఇంకా తమ ఆశీర్వాదం కోరే నవవధువులకు అవశ్యకర్తవ్యంగా ఇవ్వవలసిన తరుణం ఆసన్నమైంది. కారణాలు అందరికీ తెలిసినవే, శ్రీరామ నవమి అందరమూ
చేసుకుని శ్రీరాముని పవిత్రపూజాక్షతలు నేడు భారతదేశమంతటా ఇంటింటికి చేరినట్లుగానే, సీతమ్మకు అందిన దీవెన మన ఇంట వెలసిన, మన ఇంటికి తరలి వచ్చిన.. లక్ష్మీస్వరూపిణులందరికీ తప్పక అందాలి. పెద్దలందరూ పిన్నలకు మంచి దీవెనలు ఇవ్వాలి.✍️
—సరస్వతులనరసింహమూర్తి.
శ్రీరామబంటు.```
🙏🚩 జై శ్రీరామ్🚩🙏
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి