5, ఆగస్టు 2023, శనివారం

కాళికాదేవి జన్మరహస్యం

 నిత్యాన్వేషణ:


కాళికాదేవి జన్మరహస్యం, వర్ణన మొదలైన విషయాలు తెలియజేయండి? 


దీని గురించి దేవి భాగవతం, కాళికా పురాణం లో సవివరంగా వుంటుంది.

రక్త బీజూడనే రాక్షసుడు బ్రహ్మ దేవుని నుండి వరమును పొంది వుంటాడు అదేమిటంటే యుద్ధంలో అతని రక్తం బొట్టు పడిన ప్రతి దగ్గర అతని కన్న వేయిరెట్లు శక్తివంతం అయిన రక్త బీజులు వందలు , వేలల్లో పుట్టాలని వరం అడిగి సాధించుకుంటాడు.

వర గర్వంతో ముల్లోకాలను ముప్పు తిప్పలు పెడుతున్న ఈతనిని ఓడించడం ఏ దేవతల వల్ల అవ్వలేకపోయినది. కారణం ఈతని రక్త బొట్టు పడిన క్షణం లోనే వందలు వేలల్లో మరింత మంది రక్త బిజులు వచి క్షణాల్లో సర్వనాశనము చేసేయడమే.

దీన్ని నివారించుకునేందుకు సాక్షాత్తు జగన్మాత తన అంశతో కాళికా అను దేవత ను సృజిస్తుంది(దేవి పురాణం ప్రకారం). ఇది కాళికా దేవి జన్మ రహస్యం.

కాళికా దేవి వర్ణన :

ఈవిడ ఒళ్ళు మొత్తం నల్లని నలుపు వర్ణం లో వుండి, మహా భయానకం అయిన వదనం, కోర పళ్ళు, ఛాతీ వరుకు వేలాడే రుధిర వర్ణపు నాలుక తో, ఒంటిపై వస్త్రాలకు బదులు పుర్రెల దండ మీద, అస్తి పంజర చేతులు కింద వైపున కట్టుకొని, బిరుసెక్కిన నల్లని పెద్దవైన శిరోజాలతో, 8 చేతులు, వాటిలో ఆయుధాలతో అతి క్రూరంగ గర్జన చేస్తూ, దిక్కులు పిక్కటిల్లేలా అరిచి యుధ్ధంలో దిగుతుంది. ఇలా అన్నమాట 👇


ఇక రాగానే ఈవిడ ఒక రక్త బీజుడిని చంపగనే మళ్ళీ యధావిధిగా పుట్టడం మొదలెడతాడు. అది చూసిన ఈమె పొడుగాటి ఆమె నాలుకను పరిచి ఒక్కో రక్త బీజుడిని చంపడం, కింద రక్తం బొట్టు పడెలోపు నాలుకతో జుర్రకొని మింగేయడం చేసింది. తద్వారా ఒక్కసారి కూడా రక్తం నేల తాకకుండా వుండుట చేత రక్త బీజుడు మరల ఉద్భవించుట జరగలేదు.

చివరగా చంపిన రక్త బీజుని తలను చేత్తో పట్టుకొని రక్తం పీల్చేసి విజయ గర్వంతో నర్తిస్తు అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరికి చంపడం మొదలెట్టింది. కారణం ఆవిడ తాగింది అమృతం కాదు కదా….. రాక్షసుని రక్తం. అది తమోగుణ ప్రధానం అయినది, అందుకు ఆ రాక్షస ప్రవృత్తి తనకూ వచి ఇలా దేవతలు, మానవులు తేడా లేకుండా అందర్నీ నరకడం మొదలు పెట్టింది.ఎవ్వరూ ఆమె ఎదురు వెళ్ళ సాహసించలేదు అప్పటి నుండి. ముల్లోకాలు గజ గజ వణికిపోతూ వుండగా,ఈమె గట్టిగా గర్జిస్తూ, క్రూరంగా హంకరించుతు, అందర్నీ భక్షిస్తు నడుస్తోంది.

దేవతలకు వచ్చిన ఈ కొత్త సమస్య వల్ల అందరూ మహా దేవుణ్ని ప్రార్థించారు. ఈమె పార్వతి దేవి అంశమే కనుక మహా దేవుడే ఆమెను శాంతిప చేయగలడని చెప్పగా మహాదేవుడు ఆమెను అనుసరిస్తూ వెళ్లి, ఆమెకు ఎదురు పడగానే నిలబడకుండా వెంటనే నేల మీద పడుకుండి పోతాడు. ఈమె వెళ్తూ వెళ్తూ మహాదేవుని ఛాతీమీద తన పాదం మోపుతుంది చూస్కొకుండ. తర్వత కిందకు చూసి కింద వున్నది తన భర్త అని గుర్తించి, నాలుక కరుచుకుని, సిగ్గుతో, బాధతో, భయంతో గట్టిగా రోదిస్తూ ,ఏడుస్తూ , వెనక్కి మళ్ళుతుంది.

ఇలా అవడానికి కారణం రాక్షస రక్తం తాగిన ఆమెకు ఆ తామస గుణం పోవాలి అంటే, కేవలం తన భర్త స్పర్శ,అందునా మహాదేవుని పావన స్పర్శ వల్ల మాత్రమే స్పృహ వస్తుందని మహాదేవుడు ఎరుగుదును కనుక ఆయన అల చేశాడు. భర్త మీద కాలు పడగానే పత్ని యొక్క సహజ సిద్ధమైన సిగ్గు, చూస్కోకుండ అడుగు వేసేసాను అనే బాధ, భయం కలిగి వెంటనే ఆమె శాంతి స్వరూపిణి అయినది. ముల్లోకాలను రక్షించింది.

కామెంట్‌లు లేవు: