17, మే 2024, శుక్రవారం

వశిష్ట మహర్షి జయంతి

 * సప్తఋషులలో ఒకరైన వశిష్ట మహర్షి జయంతి 


*వైశాఖ మాసంలో శుక్ల పక్ష నవమి నాడు వశిష్ట మహర్షి జయంతి*

       

*సూర్య వంశ రాజుల కులగురువు. ఇక్ష్వాకుల వంశరాజులైన దశరథుడు, రాముడు తదితరులకు కులగురువుగా ఉన్న్జ వశిష్టుడు బ్రహ్మ మానవ పుత్రుడు. మరికొన్ని చోట్ల సూర్యుని కుమారుడు అని కూడా ఉంది.*


*వశిష్టునికి రెండు జన్మలు అనే కథ ఉంది. ఈ కథకు సంబంధించిన వివరాల ప్రకారం నిమి అనే రాజు యజ్ఞం చేయదలచి, వశిష్టుడిని పురోహితునిగా ఉండమని కోరాడు. వశిష్టుడు ఇంద్రుని పురోహితుడిగా ఉండడానికి అప్పటికే అంగీకరించడంతో, ఇంద్రుని వద్ద పని పూర్తయిన తర్వాత నీచేత యజ్ఞం చేయిస్తానని వశిష్టుడు నిమికి వాగ్దానం చేస్తాడు.*


*వశిష్టుడు వచ్చేవరకూ ఆగకుండా గౌతముడి చేత యజ్ఞం చేయిస్తాడు. ఇంద్రుని వద్ద పౌరోహిత్యం ముగిసిన తర్వాత నిమి వద్దకు వచ్చిన వశిష్టుడు ఆగ్రహించి, నిమికి శాపమిస్తాడు. నిమి కూడా ప్రతి శాపమివ్వడంతో, ఆ శాపాల ప్రభావం వల్ల నిమి, వశిష్టుడు చనిపోతారు.*


*రెండవ జన్మలో వసిష్టుడు అరుంధతిని వివాహమాడతాడు. సప్త ఋషులలో ఒకడుగా కీర్తి పొందుతాడు.*


*విశ్వామిత్రుడు తొలుత వశిష్టుడి తపోబలానికి అసూయచెంది, ఆయన కూడా తపస్సు చేసి చివరకు బ్రహ్మర్షి అవుతాడు. ఇంద్రుని సభలోనూ వశిష్టుడికి స్థానం ఉంది.*


*మహాతపస్సంపన్నుఁడు. సప్త ఋషులలో #వసిష్ఠమహర్షి కూడా ఒకడు. వేదముల ప్రకారం ఇతను మిత్ర మహర్షి, వరుణా దంపతుల కుమారుడు. సూర్యవంశానికి రాజపురోహితుడు. వైవస్వతమన్వంతరమున సప్తర్షులలో ఒకఁడు. ఇంద్రుడు వశిష్ట మహర్షి యొక్క యజ్ఙాలకు మెచ్చి కామధేనువు పుత్రిక అయిన నందిని అనే గోవుని ఇస్తాడు. ఇది కామధేనువులాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు. అందరు మహర్షులలాగా ఈయన ఒంటరి వాడు కాదు. ఈయనకు పరమ పతివ్రత మరియు పతిభక్తి పరాయణురాలైన అరుంధతితో వివాహమైంది. వీరికి 100 మంది కుమారులు కలిగెను. వారిలో శక్తి జేష్టుడు. ఈతని భార్య అద్రుశ్యంతి. శక్తి పుత్రుడే పరాశరుడు. ఇంకను వశిష్ఠుడు కుమారులుగా చిత్రకేతువు, పురోచిషుడు, విరచుడు, మిత్రుడు, ఉల్భకుడు, వసుబృద్ధాకుడు మరియు ద్యుమన్తుడు అని ప్రసిద్ధ గ్రంథముల వలన తెలియు చున్నది.*


*ఈతడు దక్షప్రజాపతి కూతురు అగు ఊర్జను వివాహమయి ఆపెయందు రజుఁడు, గోత్రుఁడు, ఊర్ధ్వబాహువు, సవనుఁడు, అనఘుఁడు, సుతపుఁడు, శుక్రుఁడు అని ఏడుగురు పుత్రులను పొందెను. వారు స్వాయంభువ మన్వంతరమున సప్తర్షులుగ ఉండిరి. ఇతఁడు తొలుత బ్రహ్మమానసపుత్రుఁడు అయి ఉండి నిమి శాపముచేత ఆశరీరమునకు నాశము కలుగఁగా మిత్రావరుణులకు మరల జన్మించెను. ఒకప్పుడు మిత్రావరుణులకు ఊర్వసిని చూచి రేతస్సు స్ఖలితము అయి అది ఒక కుంభమునందు చేర్పఁబడఁగా అందుండి వసిష్ఠుఁడును, అగస్త్యుడును పుట్టిరి. కనుక వీరు ఇరువురును కుంభజులు అనఁబడుదురు.*


*సరస్వతీ నదీ తీరాన వశిష్ట మహర్షి ఆశ్రమం ఉండేది. ఇక్కడ దాదాపు పదివేల మంది శిష్యులకి విద్యాభ్యాసంతో పాటుగా భోజనం కూడా పెట్టేవాడు. అందువల్ల కులపతి అని పేరు వచ్చింది.*

కామెంట్‌లు లేవు: