6, అక్టోబర్ 2024, ఆదివారం

విటమిన్ల ఉపయోగాలు

 వ్యాధుల నివారణలో విటమిన్ల ఉపయోగాలు - 


  ప్రస్తుత సమాజంలో ప్రతి మనిషి ఏదో ఒక అనారోగ్యముతో ఇబ్బందిపడుతున్నారు . ఈ అనారోగ్యాలకు ముఖ్యకారణం సరైన ఆహారం తీసుకోకపోవడమే . మనం తీసుకునే ఆహారం పురుగుమందులతో కలిసి ఎప్పుడో విషంగా మారిపోయింది . ఇలాంటి విషపూరిత ఆహారం మరియు సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం లేదో అప్పుడే శరీరం రోగగ్రస్తం అయిపోతుంది . 


     మన శరీర ఆరోగ్యం అనేది విటమిన్ల పైన ఆధారపడి ఉంటుంది. విటమిన్ల లోపం ఏర్పడినప్పుడు ఆయా రోగాలు సంభవిస్తాయి. రోగగ్రస్తం అయిన శరీరము నందు రోగాన్ని పారదోలుటకు ఒక్క ఔషధం వాడటమే కాదు ఆ రోగం రావడానికి ఏ విటమిన్ తక్కువ అయ్యిందో గమనించి ఆ విటమిన్ కలిగిన ఆహారాన్ని లోపలికి తీసుకోవడం వలన ఆ జబ్బు నుంచి త్వరగా బయటపడవచ్చు . 


 ఈ విషయము గురించి రోగికి చికిత్స చేయు వైద్యుడికి సంపూర్ణ అవగాహన ఏర్పరుచుకోవాలి . 


   ఇప్పుడు ఆ విటమిన్ల లోపం వలన కలుగు సమస్యల గురించి మీకు వివరిస్తాను . వీటి గురించి నా గ్రంధాలలో సంపూర్ణ వివరణ ఇచ్చాను . 


 •  విటమిన్ D - 


  సాధారణంగా మన శరీరం విటమిన్లను తయారుచేసుకోలేదు . వాటిని ఆహార రూపంలో బయట నుంచి లోపలికి తీసుకోవాలి . D విటమిన్ మన శరీరంలో తయారగును . దీన్ని మన శరీరం సూర్యరశ్మి నుంచి తయారుచేసుకుంటుంది . ఎముకలు బలంగా ఉండుటకు ఈ విటమిన్ అత్యంత ముఖ్యమైనది . రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది . రక్తనాళాలు బలంగా ఉండుటకు తోడ్పడును . ఇన్సులిన్ ఉత్పత్తి సవ్యముగా జరిగేలా చూస్తుంది . అలానే ఇన్సులిన్ శరీరం గ్రహించేలా చూస్తుంది . శరీరంలో కణవిభజన నియంత్రిస్తుంది ఫలితముగా క్యాన్సర్ రాకుండా కాపాడును . 


            విటమిన్ D లోపము వలన ప్రేగు క్యాన్సర్ , రొమ్ము క్యాన్సర్ , ప్రోస్టేట్ గ్రంధి క్యాన్సర్ , క్లోమ క్యాన్సర్ సంభవించును . ఉదయం 6 నుంచి 7 సమయములో వచ్చు సూర్యరశ్మిలో విటమిన్ D ఎక్కువుగా ఉండును. ఈ సమయములో సూర్యనమస్కారాలు చేయుట ఉత్తమం . D విటమిన్ లోపిస్తే పిల్లల ఎదుగుదల లోపిస్తుంది . 


    ఈ D విటమిన్ పాలు , గోధుమలు మరియు దేశీవాళీ ఆవునెయ్యిలో ఎక్కువుగా ఉండును . బాదంలో కూడా ఈ విటమిన్ లభ్యం అగును. మెగ్నీషియం కూడా ఉండును . ఈ మెగ్నీషియం లోపించిన తలవెంట్రుకలు ఊడును . 


 • C విటమిన్ - 


    C విటమిన్ మన శరీరానికి యాంటిబయాటిక్ గా పనిచేస్తుంది . జీర్ణశక్తిని పెంచుతుంది . ఈ విటమిన్ లోపిస్తే ఐరన్ ను ప్రేగులు శోషించుకోలేవు . ఐరన్ లోపిస్తే రక్తహీనత ఏర్పడును . C విటమిన్ ఎక్కువుగా నిమ్మకాయ , ఉసిరికాయ , కొత్తిమీర , కలబంద , వెల్లుల్లి , ముల్లంగి , పైనాపిల్ , కొబ్బరిబోండాలలో , మునగ ఆకులలో పుష్కలంగా లభ్యం అగును . 


 • A విటమిన్ - 


    ముఖ్యముగా ఈ విటమిన్ కంటిదృష్టి స్పష్టంగా కనిపించుటకు సహాయపడును . మునగాకు, మునగపువ్వు , మునగకాయ A విటమిన్ సమృద్ధిగా ఉండును . పైనాపిల్ , ముల్లంగి , ఆవునెయ్యి , గోధుమగడ్డి రసంలో , పచ్చిబఠాణీలో , క్యారెట్ లో ఈ A విటమిన్ సమృద్దిగా లభించును . 


 • E విటమిన్ - 


    A ,C విటమిన్ లను , ప్రోటీయాసిడ్స్ ను శరీరం నుండి నశించకుండా రక్షించే గుణం పైనాపిల్ లో ఉన్న విటమిన్ E లో ఉంది . వేరుశెనగ , బాదం , కాయగింజలలో , సోయాచిక్కుడులో , గట్టిగా ఉండు గింజలలో E విటమిన్ లభ్యం అగును . 


 • K విటమిన్ - 


    K విటమిన్ రక్తం త్వరగా గడ్డ కట్టుటకు ఉపయోగపడును . K విటమిన్ లోపించడం వలన రక్తం గడ్డకట్టదు . ఈ విటమిన్ పచ్చి బఠాణి , ఆవునేయ్యిలో అధికముగా ఉండును . 


 • B6 విటమిన్ - 


    ఈ విటమిన్ తెల్ల రక్త కణాల తయారీకి ఉపయోగపడును . అరటిపండులో , పచ్చటి ఆకుకూరలలో , పప్పుదినుసులలో , చిక్కుడు , బంగాళాదుంపలలో ఈ B6 విటమిన్ ఎక్కువుగా ఉండును. 


 • B12 విటమిన్ - 


    విటమిన్ B12 లోపిస్తే పెదవులలో పగుళ్లు వస్తాయి . ఎర్రరక్త కణాలు ఏర్పడుటకు , నాడీమండల వ్యవస్థకు , నీరసం , జ్ఞాపకశక్తి తగ్గడం , నోటిపూత , నరాల కణాలు నశించిపోవడం వంటి సమస్యలు వస్తాయి . విటమిన్ B12 పాలఉత్పత్తులలో , సోయాచిక్కుడు పాలలో ఎక్కువుగా ఉండును .  


  

   మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  

  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కామెంట్‌లు లేవు: