మూత్రములో మంటను నివారించుటకు సులభయోగాలు -
* వేపపండ్లు దొరికే కాలంలో వాటిని విరివిగా వాడుతున్న మూత్రవిసర్జనలో మంట తగ్గును.
* దువ్వెన ఆకుల కషాయం పూటకు పావుకప్పు మోతాదులో ప్రతిపూటా తీసుకొంటుంటే త్వరగా తగ్గును. రోజుకు రెండుసార్లు శుభ్రమైన తుమ్మజిగురు చింతగింజ అంత ఒక కప్పు నీటిలో కలుపుకుని తాగుచున్న త్వరగా తగ్గును.
* ఒక కప్పు పాలలో పచ్చి గరిక ముక్కలు రెండుచెంచాలు వేసి మరిగించి తాగాలి . అలా రోజుకు రెండుసార్లు చేస్తుంటే బాధ తగ్గును.
* ప్రతినిత్యం రెండుపూటలా గుప్పెడు చింతచిగుళ్ళు తింటుంటే మంట త్వరగా తగ్గును. చింతాకు రసం రెండు చెంచాలు రెండుపూటలా తీసుకొనుచున్న మంట అద్భుతంగా తగ్గును.
* కర్బుజా పండు గింజలను నూరి చెంచాడు తినాలి. ఉదయం , సాయంత్రం అలా చేస్తుంటే బాధ సులువుగా తగ్గును.
* మామిడి జీడి చూర్ణాన్ని అర చెంచా అరకప్పు పెరుగుతో కలిపి తినాలి. అలా ప్రతిపూటా తింటుంటే మూత్రవిసర్జనలోని మంట త్వరగా తగ్గును.
* బెండకాయను చిన్న ముక్కలుగా కోసి గ్లాసుడు నీళ్లలో గుప్పెడు ముక్కలు వేసి అరగంట పాటు మరిగించాలి. తీపికోసం కొంచం పంచదార కలిపి పూటకు అరకప్పు ఆ నీరు తాగాలి. అలా ప్రతిరోజూ తయారుచేసుకొని దానిని మూడుపూటలా తాగాలి. అలా రెండురోజులు చేసేసరికి మూత్రవిసర్జనతో ఏ బాధా ఉండదు. చాలా సులువుగా మూత్రం పోతుంది . లింగ , వృషణాలు , యోని , శరీరంలో అన్ని రకాల బాధలు అతి త్వరగా తగ్గును.
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
. కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి