1, ఆగస్టు 2020, శనివారం

మంచి విచారం

మనలోనీ ఆందోళనకు కారణం, బాధలకు,కోపానికి కారణం అంతా మనవల్లే  జరుగుతుందనే అహంకారం. దీనికి కారణం భగవంతుని పట్ల మనకు విశ్వాసం లేకపోవడమే ! ,

భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం మరిచిపోతామో అప్పుడు మనల్ని అన్ని ఆందోళనలు ఆవరిస్తాయి...

భగవంతునిపట్ల విశ్వాసం గలవాడు ధన్యుడు. అలాంటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లోనూ భీతిల్లాడు.

ఏది జరిగిన భగవదేచ్ఛతోనే జరుగుతుందని భావిస్తాడు. అలాంటి వ్యక్తిలో భయానికి, ఆందోళనకు, కోపానికి తావెక్కడిది.....?

మనం దేనికోసం ఆందోళన చెందాలి.. ? భగవంతుణ్ణి దర్శించలేకపోయామన్న ఆందోళన మంచిది. ప్రాపంచిక విషయాల్లో ఆందోళన ఎందుకు వస్తుంది....?

మనకు ఏది మంచిదో దాన్ని భగవంతుడు మనకు అనువ్రహిస్తాడనే విశ్వాసం ఉంటే ఇక ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

మన హృదయం భగవంతునికోసం పరితపించాలి. అప్పుడే నిజమైన ఆధ్యాత్మిక జీవనం ప్రారంభమైనట్లులేక్క !.

ఈ భావన మనలో లేనంతవరకూ భయాందోళనలు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.

నేను భగవంతుణ్ణి సదా స్మరిస్తున్నాను. నన్ను ఈ కామక్రోధములు ఎమ్ చేయగలవు..? అనే దృఢవిశ్వాసం కలిగివుండాలి.


✡సర్వేజనాః సుఖినోభవంతు.🙏

     _🕉 జై యోగేశ్వర్ _🕉
*************************

కామెంట్‌లు లేవు: