29, సెప్టెంబర్ 2023, శుక్రవారం

గురువు వల్లే సాధ్యం!*

 


           *గురువు వల్లే సాధ్యం!*

                  ➖➖➖✍️


కొడుకులు-కూతుర్లు బాకీ సంబంధం తో పుడతారు.


```

ఒక గురువు చెట్టు క్రింద కూర్చొని భక్తి గురించి దేవుని గురించి``` ‘జన్మ రాహిత్యం’ ```గురించి చెబు తున్నాడు. 


అటుగా వెళుతున్న బాటసారి గురువు చెబుతున్నది విని దగ్గరకు వెళ్లి తనకు మంత్రోపదేశం ఇవ్వమని అడిగాడు.


గురువు అప్పుడు అడిగాడు, ‘నీకు భార్య బిడ్డలు ఉన్నారా...’ అని.


తన భార్య గర్భవతి అని చెప్పాడు.


’గురుదక్షిణగా నువ్వు నాకే మిస్తావు?’ అని అడిగాడు గురువు.


‘మీరు ఏది అడిగితే అదే ఇస్తాను.’ అన్నాడు.


’సరే...నీ భార్యను అడిగి రా... తనకు పుట్టిన బిడ్డలను నాకు ఇవ్వ గలదా అలా చేస్తే నీకు మంత్రోపదేశం చేస్తాను. వెళ్లి నీ భార్యను అడిగి రా! పిల్ల పుట్టిన వెంటనే రక్తం మడుగులో ఉండ గానే నాకు ఇచ్చేయాలి.’ అన్నాడు గురువు.


అతను వెంటనే ఇంటికి పరుగెత్తి భార్యకు విషయం చెప్పి మన పిల్లలను గురువుకు ఇవ్వ గలవా?  అని అడిగాడు.


అందుకు ఆమె ‘అలాగే ఇచ్చేద్దాం. మన పిల్లలు గురువు వద్ద ఉంటే మంచిదే కదా,’ అంటూ ఒప్పు కుంది.


ఆ విషయాన్ని గురువుకు చెప్పాడు. 


కొద్ది రోజులకి ఆమె ప్రసవించింది. మగ పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని నెత్తుటి మడుగులో ఉండగానే తీసుకెళ్లి గురువు చేతిలో పెట్టారు. భార్య భర్తలు.


గురువు ఆ పిల్ల వాడిని తీసు కెళ్లి గొయ్యి తీసి అందులో పూడ్చేసాడు.


తల్లి దండ్రులు బిత్తర పోయి చూస్తూ, చేసేది ఏమి లేక వెను తిరిగి వెళ్లి పోయారు.


ఈ విధంగా రెండో పిల్ల వాడిని కూడ గొయ్యిలో పూడ్చి పెట్టేసాడు.


మూడోసారికి ఆవిడ ఒప్పు కోలేదు. ‘ఇదేం గురువయ్యా? నాకు నచ్చలేదు. నా కొడుకును ఇవ్వను కాక ఇవ్వను.’ అని మొండికేసింది.


అతను గురువు వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. గురువు గారే ఆమె దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు...’అమ్మా నీ బిడ్డను ఇవ్వనన్నావు కదా, ఇప్పుడు నీ బిడ్డను నేనేమి చేయను. కాని ఒక్క సారి నీబిడ్డను... నా చేతి కిచ్చి  నా వెంట రండి. మీ బిడ్డను నేనేమి చేయను. మళ్ళీ మీ బిడ్డను మీకు ఇచ్చేస్తాను’ అని అన్నాడు.


సరేనని బిడ్డను తీసుకొని గురువు వెంట బయలు దేరారు వారిరువురూ.


గురువు వీళ్లిద్దరినీ ఇంతకు ముందు గొయ్యి తీసి పెట్టిన చోటికి  తీసుకు కెళ్లాడు.


ఆ రెండు గొయ్యిల మద్యన తెల్లని గుడ్డ పరిచి...ఈ పిల్ల వాడిని వాటి మద్యలో పడుకోబెట్టి చేతిలోకి నీళ్ళు తీసుకొని మంత్రించి... ఆ ముగ్గురు పిల్లల మీద చల్లాడు.


తల్లిదండ్రులను కొంచెం దూరంలో నిలబెట్టి... ఆ గొయ్యిలో నుండి వస్తున్న శబ్దాలను వినమన్నాడు.


గొయ్యిలో నుండి మొదటి పిల్లవాడు రెండవ వాడిని అడుగు తున్నాడు…‘ఒరేయ్ వీళ్ళకు కొడుకుగా పుట్టావుకదా దేని కోసం పుట్టావు? వీళ్ళకి నీకు ఏమిటి సంబంధం?’అని అడిగాడు.


రెండో వాడు ఇలా చెబుతున్నాడు… ‘గత జన్మలో వీడు నాకు బాకీ పడ్డాడు. నాకు డబ్బులు ఇవ్వకుండానే పోయాడు. అందుకనీ వీడికి కొడుకునై పుట్టి అందినంత లాగేసుకుందామని వచ్చాను.  మరి నువ్వేందు కొచ్చావు?’ అని అడిగాడు.


’వీడు నాకు కూడా ఇవ్వాలిరా... నేను కూడా అందుకే వచ్చాను. వీడికి కొడుకునై పుట్టి దొరికినంత దోచుకొని వదిలేసి వెళదామని వచ్చాను. కానీ వీడు మనల్ని గురువు చేతిలో పడ వేసాడు. ఇంకేముంది వాడుమనకు పడిన బాకీలన్నీ గురువు తెగ్గొట్టేసాడు. ఇప్పుడు వాడికి మనకీ రుణబంధం తెగిపోయింది.’ అని వాళ్ళు మాట్లాడు కుంటున్నారు.


ఈ ఇద్దరూ కలిసి బ్రతికి ఉన్న మూడో వాడిని అడిగారు. ‘ఒరేయ్ నువ్వెందు కొచ్చావురా?‘ అని.


అప్పుడు బ్రతికి ఉన్న మూడోవాడు ఇలా చెప్పాడు, ‘గతజన్మలో నాకు కొడుకులు బిడ్డలు ఉండికూడ దిక్కు లేకుండా పడిఉంటే వీడు నన్ను చేరదీసి అన్నం పెట్టి ఆదరించాడు. నేను పోయే వరకు నన్ను పోషించాడు. అందుకే... ఈ జన్మలో వీనికి కొడుకునై పుట్టి తల్లి తండ్రులిద్దరినీ వాళ్ళు బ్రతికినంత కాలం అన్నం పెట్టి వాళ్లను సంతోషంగా ఉంచి ప్రశాంతమైన జీవితాన్ని వాళ్ళకు ఇచ్చి వారి రుణం తీర్చుకుందామని వారికి కొడుకునై పుట్టాను. మీరు ఆయన్ని పీడించాలని వచ్చారు. గనుక గురువు మిమ్మల్ని గొయ్యిలో పాతిపెట్టాడు. నేను అలా కాదు గనుక నేను బ్రతికి ఉన్నాను.’ అని చెప్పాడు.


ఈ ముగ్గురూ మాట్లాడుకున్న మాటలు ఈ తల్లి తండ్రులు విన్నారు.


గురువు పాదాల మీద పడి క్షమించమని వేడు కున్నారు.```


కాబట్టీ ...

గురువు లేని పూజ ఒ’గుడ్డి పూజ’ అని అర్దం.


ఆత్మ జ్ఞానము తెలిసిన గురువును పట్టుకుంటే రుణానుబంధాలే కాదు, ‘జన్మ రాహిత్యమే’ జరుగుతుంది.


ఈ జన్మ లోనే మోక్షం లభిస్తుంది...


మోక్షమంటే చని పోయిన తర్వాత మోక్షం వస్తుందనీ చాలా మంది అను కుంటారు.


కాని అది కాదు…


మోక్షం అంటే బ్రతి కుండగానే ఆత్మ జ్జానాన్ని పొందటం...


దైవం ఏ, ఏ, రూపాలలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు. ఈ సృష్టి ఏమిటి. ఎలా తయారైంది. నేనెవరిని, ఎక్కడ నుండి వచ్చాను. మళ్లి ఎక్కడికి వెళతాను. అసలు మాయ అంటే ఏమిటి? ఇలా ఎన్నో సృష్టి రహస్యలు బ్రతి కుండగానే తెలిసి పోతాయి.



ఇదే మోక్షం! 

మరో జన్మలేకుండా భగవంతుడు తనలో ఐక్యం చేసుకుంటాడు.


ఈ ఆత్మజ్ఞానం కలగడానికి ధ్యానం అనే ఆత్మ విద్యను మనకి బోధిస్తారు. సద్గురువులు.


ఇది కథ అయినా వాస్తవం!గురువుద్వారానే కర్మ పరిష్కారం కలుగుతుంది!✍️

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

* గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

కామెంట్‌లు లేవు: