26, జూన్ 2023, సోమవారం

బడబాగ్ని కథ.

 నిత్యాన్వేషణ: 

సముద్ర గర్భంలో బడబాగ్ని ఉంటుందనిపురాణాలు చెప్తాయి. దీని వెనుక ఉన్న పురాణ కథలేమిటి?




ఒకానొకప్పుడు భృగు వంశస్థులు చాలా తపస్సు చేయడంతో వారికి ఆయుష్షు పెరుగుతుంది కానీ జ్ఞాన వృద్దులవటాన వైరాగ్యం ఎక్కువైంది. ఇక ఈ జన్మ చాలిస్తే బాగుంటుంది కానీ ఆత్మహత్య మహాపాపం కదా అని ఇంకేదో దారి వెదుకుతూ ఉంటే ఆనాటి రాజు హైహయ వంశీకుడైన కృతవీర్యుడనే రాజు భృగు వంశీకులకిచ్చిన బహుమతులను, ధనాన్ని తిరిగి రాజ్యానికి ఇవ్వమన్నారు వారసులు . శరీరత్యాగం కోసం ఎదురు చూస్తున్న బ్రాహ్మణులు ఇదే అదునని రాజుకివ్వకుండా భూమి లో దాచిపెట్టారు. హేహయులకు కోపం వచ్చి అందరినీ ఊచకోత కోశారు. ఆ హేహయులకు అందకుండా ఋచి అనే మునిపత్ని (చ్యవన మహర్షి కోడలు, అప్రవాన మహర్షి భార్య) తన పుత్రుని ఊరువులో దాచి పెంచుతుంది. ఐనా తల్లి ని వేధించవచ్చిన హేహయులకు తన తేజస్సు తో కళ్ళుపోయేలా చేశాడు ఔర్వుడు.

ఊరువులో నుంచి వచ్చాడు కాబట్టి ఔర్వుడని పేరు. మన్నింపమన్న రాజులందరికీ తిరిగి చూపు వచ్చేలా చేసినా., తన పూర్వులందరినీ ఊచకోత కోశారు అని తెలిసి కోపంగా యజ్ఞం మొదలు పెట్టారు. అది తెలిసిన పితృదేవతలు వచ్చి నీవు చేసే పని తప్పు. వైరాగ్యం తో మాకు మేమే రాజు కు కోపం వచ్చేలా చేసి ఈ లోకం వదిలాము. కాబట్టి ఈ యజ్ఞం ఆపు అన్నారు. ఔర్వుడు నాకు చాలా కోపం వచ్చింది దీన్నేం చేయమంటారని అడిగితే కోపం నిప్పు లాంటిది కాబట్టి సముద్రం లో వదలమన్న పితరుల సలహాతో తన కోపాన్ని (హయ)గుర్రం రూపంలో సముద్రం లోకి పంపాడు ఔర్వుడు. దీనినే బడబాగ్ని అంటారు.

అదీ బడబాగ్ని కథ.

ఉత్తమం

 .                       🕉️

                _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*వరం పర్వతదుర్గేషు*  

*భ్రాన్తం వనచరైస్సహ।*

*న మూర్ఖజనసమ్పర్కః* 

*సురేన్ద్రభవనేష్వపి॥*




తా||

సకలభోగాలుగల భవనంలో మూర్ఖులతో సహవాసం చేయడంకంటే ఆటవికులతో కలసి అడవుల్లోనో పర్వతప్రదేశాల్లోనో సంచరించడం ఉత్తమం.

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 102*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 102*


"ఏమి శ్రేష్టి ! ప్రజలలో నీ గురించి చాలా మంచి అభిప్రాయం ఉన్నదని వింటున్నాం. వ్యాపారకంగా, వ్యవహారికంగా నమ్మకాస్తుల్లో నిన్ను మించినవాడు లేడట... కానీ, ఒక్క రాజభక్తిలో మాత్రం... ?" అంటూ నవ్వాడు చాణక్యుడు. 


చందనదాసు తోట్రుపాటు పడుతూ "ఆర్యులకు నా గురించి ఇన్ని మంచి అభిప్రాయాలు చెప్పిన వారెవరో గానీ, నా రాజభక్తిని ఎందుకు శంకించారో నాకు అర్థం కావడం లేదు. నేను రాజభక్తుడినే గానీ, రాజద్రోహిని కాను..." అన్నాడు నిబ్బరంగా. 


"కావా... ? నువ్వు ద్రోహివి కావా... ? రాజాద్రోహియై రాజ్యం విడిచి పారిపోయిన రాక్షసామాత్యుని భార్య పుత్రులకు నీ ఇంట రహస్యంగా ఆశ్రమం ఇవ్వడం రాజద్రోహం కాదా ?" గద్దించాడు చాణక్యుడు.


ఆ రహస్యం చాణక్యునికి తెలిసిపోయిందని గ్రహించి నిర్గాంతపోయాడు చందనదాసు. అంతలో కొందరు భటులు అక్కడికి వచ్చి "ఆర్యా ! చందనదాసు గృహాన్ని అణువణువునా గాలించాము. రాక్షసుల వారి భార్య పుత్రుల జాడ తెలియలేదు. ఈ చందనదాసు ఇక్కడికి వచ్చేముందే ఒక స్త్రీని, బాలుడిని ఎక్కడికో పంపించి వేశాడని చుట్టుప్రక్కల వారు తెలియజేశారు..." అని విన్నవించుకున్నారు. చందనదాసు పెదవులపై చిరుదరహాసం మెరిసి అదృశ్యమైపోయింది.


"శ్రేష్టి ! ఇప్పుడు అంగీకరిస్తావా, నువ్వు రాజద్రోహివని...? రాజద్రోహానికి శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో నీకు తెలుసా ? రాక్షస భార్యా పుత్రులను ఎక్కడికి దాటించావు ? వారిని ఎక్కడ దాచావు ? చెప్పు" గద్దించాడు చాణక్యుడు.  


చందనదాసు తల అడ్డంగా తిప్పి "ఏమో.... నాకు తెలియదు... తెలిసినా చెప్పను" అన్నాడు నిర్మొహమాటంగా. 


చాణక్యుడు పటపట పళ్ళు కొరుకుతూ "రాజద్రోహానికి తోడు అధికార ధిక్కారమా ?" గర్జించాడు. 


"మీరెలా అనుకున్న సరే ... ఏం చేసినా భయపడను కూడా... రాజద్రోహ నేరానికి భయపడి మిత్రద్రోహం చెయ్యను. నా మిత్రునికి మాటిచ్చాను. నా కంఠంలో ప్రాణముండగా వారి ఆచూకీ చెప్పను. వారిని మీకు అప్పగించను. నన్ను ఏం చేసుకుంటారో ..... మీ ఇష్టం ...." అని స్పష్టం చేశాడు చందనదాసు నిర్భయంగా. 


చాణక్యుడు గుడ్లురుముతూ "అలాగా..." అంటూ వెటకరించి, భటులవైపు చూస్తూ "ఈ చందనదాసుని భార్యబిడ్డలతో సహా కారాగారంలో బంధించండి. ఇతడి సర్వసంపదలను జప్తు చేసి కోశాగారమున జమ చెయ్యండి. రాక్షసుని కుటుంబ సభ్యులను అప్పగించిన నాడే యీతనికి విముక్తి... ఖైదు చెయ్యండి" అని ఆదేశించాడు కఠినస్వరంతో. చందనదాసు భార్యాబిడ్డలతో సహా కారాగారంలో బంధించబడ్డాడు. 


ఆ మర్నాటి ఉదయం తలారు శకటదాసుని శులారోహణం చేయించడానికి వధ్యస్థానానికి తీసుకువెళ్లారు. సరిగ్గా శూలారోహణం జరిపే సమయానికి మారువేషంలో ఉన్న సిద్ధార్థకుడు తలారుల మీదికి లంబించి ఖడ్గచాలనంతో వాళ్లని పారద్రోలి శకటదాసుని విడిపించి వెంటబెట్టుకుని నగరం విడిచి పారిపోయాడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

 శు భో ద యం🙏


పోతన పాత్ర చిత్రణ 


                    ఉ: కాటుక కంటినీరు చనుగట్ల పయింబడ నేలయేడ్చెదో?


                          కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల! యోమదంబ! యో


                         హాటకగర్భురాణి! నిను నాకటికైఁ గొనిపోయి యల్ల క


                         ర్ణాట కిరాట కీచకులకమ్మ ;త్రిశుధ్ధిగ నమ్ము; భారతీ!


                                        -- చాటువు ;


                 ఉ: కోపము తోడ నీవు దధి భాండము భిన్నము సేయుచున్నచో


                        గోపిక త్రాటఁగట్టిన వికుంచిత సాంజన భాష్ప తోయ ధా


                        రా పరిపూర్ణ వక్త్రముఁ గరంబులఁ బ్రాముచు వెచ్చనూర్చుచుం


                      బాపఁడవై నటించుట గృపాపర ! నామదిఁ జోద్యమయ్యెడిన్ ;


                                        భాగ-ప్రథ-స్కం: 181 పద్యం: కుంతి కృష్ణుని స్తుతించుట;


                                          ఆంధ్ర సాహిత్య క్షేత్రాన్నలంకరించిన కవితల్లజులలో పాత్ర చిత్రణ విషయమున కవులందరు నొకయెత్తు. బమ్మెరపోతన యొకయెత్తు. అతడుచిత్రించిన పాత్రలన్నియు శబ్దచిత్రములే! కానీ,అందుకొన్ని నిశ్చలనములు, మరికొన్ని చలనములు.

ఆపాత్రలు పోతనగారితో మాటగలిపిమాటాడినవే! మనకుగూడ నట్టి మనః పరిణామము గల్గినచో నవిమనతోగూడ మాటాడగలవు.

"పాత్రకు తగిన యాకారము. ఆకారమునకు దగిన ఆహార్యము. ఆహార్యమునకుదగిన వేషము.దానికితగనమాటలు .మాటలకు దగిన చక్కనిపదములకూర్పు. పోతన చిత్రణలోని విశేషములు.


                                        పైరెండుపద్యములలో మొదటిది పోతన సరస్వతి నోదార్చుట. ధనముపై నాశతో భాగవత గ్రంధమును నరాంకిత మొనరించునేమోనని యనుమానమంది చదువులతల్లి దీనవదనయై కన్నులనీరుగార దేవతార్చనా పీఠమున నున్నపోతనకన్నుల

కగుపించినదట! పోతనయామెరూపమును గాంచి నివ్వెరపోయెను,." అమ్మా! సరస్వతీమాతా! కాటుక తో దిగజారు కన్నీరు వక్షోజములపై బడగా నేలనమ్మా విలపింతువు? ఓహో! ధనాశతో నిన్నముకొందుననియా నీవిచారము. అటులెన్నటికి జరుగదు. త్రికరణ శధ్ధిగా జెప్పునామాటను నమ్ము. మనుట"-. ఇది నిశ్చలన చిత్రమే! ,ఆజగదంబ కన్నులనీరుగార్చుట. కన్నులకున్న కాటుక కరగి కన్నీట గలసి చనుగట్లపై బడుట. ఆహా! ఏమాచిత్రణము! మనోముకురమున గాంచగల్గినవాని జీవితము ధన్యము.


                                   ఇఁక రెండవ చిత్రము చలనము. బాలకృష్ణుని కొంటేపనులను దలచుకొని కుంతి కృష్ణుని ప్రస్తుతించుచు నాడిన మాటలు. ఆమాటలవెనుక నార్తియున్నది. అభిమానమున్నది. భక్తియున్నది. ఆప్యాయతను రంగరించి చిత్రించిన యీచిత్రము అపూర్వము.


                                    "కృష్ణా! యేమి చెప్పనయ్యా నాటి ముచ్చటలు. బాల్యమున నీవొకనాడొకగోపిక యింటికేగి. దధి భాండమును కోపముతో పగులగొడితివి. ఆగోపికయు కోపమున నిన్ను త్రాటితోగట్టివేయుచో, మొగమొక వంకకు వంచి,కన్నుల కాటుక కన్నీరుగార

దానినంతయు నిరుచేతులతో మొగమంతయు పులుముకొనుచు వేడినిట్టూర్పులను విడచుచు బాలునివలె నటించుట నేడుదలచికొనిన నాకు చోద్యమనిపించునయ్యా! కొంటె కృష్ణయ్యా! యెంత దొంగ నటన! భక్తిపాశములచే గట్టుబడు నీవు సామాన్యమగు త్రాట బంధింపఁబడుట నటన గాకమరేమి? "- యనిమేనత్తమాటలు.


                                  త్రాటగట్టబడుట , సాంజన భాష్పతోయ సిక్తమైన మోమును చేతులతో పులిమికొనుట. అప్పటి కృష్ణయ్య ఆ యాకారము. ఇవియన్నియు పోతన పాత్రచిత్రణము లోని మెళకువలు.చివరకు అంతవాడ వింతవాడ వైతివే యని యాశ్చర్యమును ప్రకటించుట. యతని రచన లోని చమత్కారము. 


                                                                  ఇదండీ పోతన గారి పాత్ర చిత్రణలోని గొప్పతనం!


                                                                                                   స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷🙏🌷🌷🌷శు భో ద యం🙏


పోతన పాత్ర చిత్రణ 


                    ఉ:  కాటుక కంటినీరు  చనుగట్ల పయింబడ  నేలయేడ్చెదో?    కైటభ దైత్య మర్దనుని  గాదిలి కోడల!  యోమదంబ  హాటకగర్భురాణి!  నిను  నాకటికైఁ గొనిపోయి   యల్ల   క


                         ర్ణాట  కిరాట  కీచకులకమ్మ ;త్రిశుధ్ధిగ  నమ్ము; భారతీ!


                                        --    చాటువు ;


                 ఉ:  కోపము తోడ నీవు  దధి భాండము  భిన్నము  సేయుచున్నచో


                        గోపిక  త్రాటఁగట్టిన  వికుంచిత  సాంజన భాష్ప  తోయ   ధా


                        రా పరిపూర్ణ  వక్త్రముఁ  గరంబులఁ బ్రాముచు  వెచ్చనూర్చుచుం


                      బాపఁడవై  నటించుట  గృపాపర ! నామదిఁ   జోద్యమయ్యెడిన్ ;


                                        భాగ-ప్రథ-స్కం: 181 పద్యం: కుంతి కృష్ణుని స్తుతించుట;


                                          ఆంధ్ర సాహిత్య క్షేత్రాన్నలంకరించిన  కవితల్లజులలో  పాత్ర చిత్రణ విషయమున  కవులందరు నొకయెత్తు. బమ్మెరపోతన యొకయెత్తు. అతడుచిత్రించిన పాత్రలన్నియు  శబ్దచిత్రములే! కానీ,అందుకొన్ని నిశ్చలనములు, మరికొన్ని చలనములు.

ఆపాత్రలు పోతనగారితో మాటగలిపిమాటాడినవే! మనకుగూడ నట్టి మనః పరిణామము గల్గినచో నవిమనతోగూడ మాటాడగలవు.

"పాత్రకు తగిన యాకారము. ఆకారమునకు దగిన ఆహార్యము. ఆహార్యమునకుదగిన వేషము.దానికితగనమాటలు .మాటలకు దగిన చక్కనిపదములకూర్పు. పోతన చిత్రణలోని విశేషములు.


                                        పైరెండుపద్యములలో  మొదటిది పోతన సరస్వతి నోదార్చుట. ధనముపై నాశతో భాగవత గ్రంధమును  నరాంకిత మొనరించునేమోనని యనుమానమంది చదువులతల్లి  దీనవదనయై  కన్నులనీరుగార దేవతార్చనా పీఠమున నున్నపోతనకన్నుల

కగుపించినదట! పోతనయామెరూపమును గాంచి నివ్వెరపోయెను,."  అమ్మా! సరస్వతీమాతా! కాటుక తో దిగజారు కన్నీరు వక్షోజములపై బడగా  నేలనమ్మా  విలపింతువు? ఓహో!  ధనాశతో నిన్నముకొందుననియా నీవిచారము. అటులెన్నటికి జరుగదు. త్రికరణ శధ్ధిగా జెప్పునామాటను నమ్ము. మనుట"-. ఇది నిశ్చలన చిత్రమే! ,ఆజగదంబ కన్నులనీరుగార్చుట. కన్నులకున్న కాటుక కరగి కన్నీట గలసి చనుగట్లపై బడుట. ఆహా! ఏమాచిత్రణము! మనోముకురమున గాంచగల్గినవాని జీవితము ధన్యము.


                                   ఇఁక  రెండవ చిత్రము  చలనము. బాలకృష్ణుని కొంటేపనులను  దలచుకొని  కుంతి కృష్ణుని ప్రస్తుతించుచు నాడిన మాటలు. ఆమాటలవెనుక నార్తియున్నది. అభిమానమున్నది. భక్తియున్నది. ఆప్యాయతను రంగరించి చిత్రించిన యీచిత్రము అపూర్వము.


                                    "కృష్ణా! యేమి చెప్పనయ్యా నాటి ముచ్చటలు. బాల్యమున నీవొకనాడొకగోపిక యింటికేగి. దధి భాండమును కోపముతో  పగులగొడితివి. ఆగోపికయు కోపమున  నిన్ను త్రాటితోగట్టివేయుచో, మొగమొక వంకకు వంచి,కన్నుల కాటుక కన్నీరుగార

దానినంతయు  నిరుచేతులతో  మొగమంతయు పులుముకొనుచు  వేడినిట్టూర్పులను  విడచుచు బాలునివలె నటించుట     నేడుదలచికొనిన  నాకు చోద్యమనిపించునయ్యా! కొంటె కృష్ణయ్యా! యెంత దొంగ నటన! భక్తిపాశములచే గట్టుబడు నీవు సామాన్యమగు త్రాట బంధింపఁబడుట  నటన గాకమరేమి? "- యనిమేనత్తమాటలు.


                                  త్రాటగట్టబడుట , సాంజన భాష్పతోయ సిక్తమైన  మోమును  చేతులతో  పులిమికొనుట. అప్పటి కృష్ణయ్య ఆ యాకారము. ఇవియన్నియు పోతన పాత్రచిత్రణము లోని మెళకువలు.చివరకు అంతవాడ వింతవాడ వైతివే యని యాశ్చర్యమును ప్రకటించుట. యతని రచన లోని చమత్కారము. 


                                                                  ఇదండీ పోతన గారి పాత్ర చిత్రణలోని  గొప్పతనం!


                                                                                                   స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷🙏🌷🌷🌷

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 102*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 102*


"ఏమి శ్రేష్టి ! ప్రజలలో నీ గురించి చాలా మంచి అభిప్రాయం ఉన్నదని వింటున్నాం. వ్యాపారకంగా, వ్యవహారికంగా నమ్మకాస్తుల్లో నిన్ను మించినవాడు లేడట... కానీ, ఒక్క రాజభక్తిలో మాత్రం... ?" అంటూ నవ్వాడు చాణక్యుడు. 


చందనదాసు తోట్రుపాటు పడుతూ "ఆర్యులకు నా గురించి ఇన్ని మంచి అభిప్రాయాలు చెప్పిన వారెవరో గానీ, నా రాజభక్తిని ఎందుకు శంకించారో నాకు అర్థం కావడం లేదు. నేను రాజభక్తుడినే గానీ, రాజద్రోహిని కాను..." అన్నాడు నిబ్బరంగా. 


"కావా... ? నువ్వు ద్రోహివి కావా... ? రాజాద్రోహియై రాజ్యం విడిచి పారిపోయిన రాక్షసామాత్యుని భార్య పుత్రులకు నీ ఇంట రహస్యంగా ఆశ్రమం ఇవ్వడం రాజద్రోహం కాదా ?" గద్దించాడు చాణక్యుడు.


ఆ రహస్యం చాణక్యునికి తెలిసిపోయిందని గ్రహించి నిర్గాంతపోయాడు చందనదాసు. అంతలో కొందరు భటులు అక్కడికి వచ్చి "ఆర్యా ! చందనదాసు గృహాన్ని అణువణువునా గాలించాము. రాక్షసుల వారి భార్య పుత్రుల జాడ తెలియలేదు. ఈ చందనదాసు ఇక్కడికి వచ్చేముందే ఒక స్త్రీని, బాలుడిని ఎక్కడికో పంపించి వేశాడని చుట్టుప్రక్కల వారు తెలియజేశారు..." అని విన్నవించుకున్నారు. చందనదాసు పెదవులపై చిరుదరహాసం మెరిసి అదృశ్యమైపోయింది.


"శ్రేష్టి ! ఇప్పుడు అంగీకరిస్తావా, నువ్వు రాజద్రోహివని...? రాజద్రోహానికి శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో నీకు తెలుసా ? రాక్షస భార్యా పుత్రులను ఎక్కడికి దాటించావు ? వారిని ఎక్కడ దాచావు ? చెప్పు" గద్దించాడు చాణక్యుడు.  


చందనదాసు తల అడ్డంగా తిప్పి "ఏమో.... నాకు తెలియదు... తెలిసినా చెప్పను" అన్నాడు నిర్మొహమాటంగా. 


చాణక్యుడు పటపట పళ్ళు కొరుకుతూ "రాజద్రోహానికి తోడు అధికార ధిక్కారమా ?" గర్జించాడు. 


"మీరెలా అనుకున్న సరే ... ఏం చేసినా భయపడను కూడా... రాజద్రోహ నేరానికి భయపడి మిత్రద్రోహం చెయ్యను. నా మిత్రునికి మాటిచ్చాను. నా కంఠంలో ప్రాణముండగా వారి ఆచూకీ చెప్పను. వారిని మీకు అప్పగించను. నన్ను ఏం చేసుకుంటారో ..... మీ ఇష్టం ...." అని స్పష్టం చేశాడు చందనదాసు నిర్భయంగా. 


చాణక్యుడు గుడ్లురుముతూ "అలాగా..." అంటూ వెటకరించి, భటులవైపు చూస్తూ "ఈ చందనదాసుని భార్యబిడ్డలతో సహా కారాగారంలో బంధించండి. ఇతడి సర్వసంపదలను జప్తు చేసి కోశాగారమున జమ చెయ్యండి. రాక్షసుని కుటుంబ సభ్యులను అప్పగించిన నాడే యీతనికి విముక్తి... ఖైదు చెయ్యండి" అని ఆదేశించాడు కఠినస్వరంతో. చందనదాసు భార్యాబిడ్డలతో సహా కారాగారంలో బంధించబడ్డాడు. 


ఆ మర్నాటి ఉదయం తలారు శకటదాసుని శులారోహణం చేయించడానికి వధ్యస్థానానికి తీసుకువెళ్లారు. సరిగ్గా శూలారోహణం జరిపే సమయానికి మారువేషంలో ఉన్న సిద్ధార్థకుడు తలారుల మీదికి లంబించి ఖడ్గచాలనంతో వాళ్లని పారద్రోలి శకటదాసుని విడిపించి వెంటబెట్టుకుని నగరం విడిచి పారిపోయాడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

అధికవేడిని హరించుటకు

 శరీరంలో అధికవేడిని హరించుటకు యోగాలు -


      కొన్ని సందర్భాలలో శరీరం అత్యథిక వేడికి గురవుతుంది. దీనికి కారణం సరైన సమయానికి భోజనం చేయకపోవడం , నిద్ర తక్కువపోవడం , సరైన ఆహారపదార్థాలు తీసుకోకపోవడం , మద్యపానం , ధూమపానం వంటి వాటివల్ల శరీరం అత్యధిక వేడికి గురగును. మూత్రం మంటగా రావటం , పసుపుపచ్చని మూత్రం , మూత్రం వాసన రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి . శరీరంలో అధికవేడి పెరిగినప్పుడు మూత్రపిండాలు మరియు కాలేయ సమస్యలు కలుగును.


        ఇప్పుడు నేను చెప్పబోవు యోగాలు పాటించటం వలన శరీరం నందలి అధికవేడి తగ్గును.


  అతివేడి నివారణా యోగాలు  -


 *  ఒక గ్లాసు నీటిలో చెంచాడు రుద్రజడ గింజలు లేక సబ్జాగింజలు పావు గంటసేపు నానబెట్టి అందులో కొంచం బెల్లంగాని , పంచదారగాని కలుపుకుని తాగాలి . అలా రోజూ చేస్తుంటే శరీరంలో అధికవేడి తగ్గును.


 *  కర్బుజా పండ్లుగాని , పుచ్చకాయలు ప్రతిరోజు విరివిగా తినుచున్న శరీరంలోని అధికవేడి నివారణ అగును.


 *  నిమ్మపండ్ల రసాన్ని సేవించుచున్న వేడితగ్గును . ప్రతిరోజు మూడునిమ్మపండ్ల రసం తాగవలెను .


 *  మజ్జిగని ప్రతిపూట తాగుచుండవలెను .


 *  పచ్చి ఉల్లిపాయను ప్రతిరోజు తినవలెను .


 శరీరంలో అతివేడి తగ్గుటకు నేను ప్రయోగించిన సిద్దయోగం  -


         రాత్రి సమయంలో రెండు కప్పుల అన్నాన్ని ఒక గిన్నెలో వేసి అది మునిగేంత వరకు వేడివేడి పాలు పోయాలి . కొంచం గోరువెచ్చగా అయ్యిన తరువాత పెరుగు వేసి తోడుపెట్టవలెను . ఉదయానికి మంచిగా తోడుకొని ఉండును. దానికి కొంచం ఉప్పు కలిపి నీరుల్లిపాయను ముక్కలుగా కోసి కలుపుకుని తినవలెను ఇలా 20 నుంచి 30 రోజులపాటు చేయవలెను .


         పైన చెప్పిన విధముగా చేసినచో అతిత్వరగా శరీరం నందలి వేడి తగ్గును.


 శరీరం నందలి అతివేడి ఉన్నవారు తీసుకొకూడని ఆహారాలు  -


 కోడి మాంసం , పాతపచ్చళ్లు , మినుములు , ఉలవలు , మద్యము , చేప , కాకరకాయ , మసాలా పదార్థాలు  , అల్లం , వెల్లుల్లి , నూనె వేపుళ్లు , టీ , కాఫీ , గోధుమలు , కందులు , బెల్లం , శనగలు , వేరు శనగలు వంటి వాటికి దూరంగా ఉండవలెను .


     మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


 కాళహస్తి వేంకటేశ్వరరావు .


అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

ఘటస్థ - పటస్థ

 ఘటస్థ - పటస్థ


పరమాచార్య స్వామివారు చెక్కబల్లకు ఆనుకుని కాళ్ళు చాపుకుని కూర్చుని ఉండటం అందరూ చూసే అద్భుత దృశ్యం. ముఖ్యంగా స్వామివారు మేనాలో కూర్చుని దర్శనం ఇస్తున్నప్పుడు స్వామివారు కాళ్ళు చాపుకునే ఉంటారు.

“మహాస్వామి వారు కళ్ళు పెట్టుకోవడానికి ఒక మెత్తటి పాదపీఠం తయారుచేస్తే ఎలా ఉంటుంది?”


వెంటనే రబ్బరుతో తయారుచేసిన తేలికగా, మెత్తగా ఉన్న స్పాంజిని తీసుకుని వచ్చి పెద్దగా వలయాకారంగా కత్తిరించాను. దాన్ని వెల్వెట్టు గుడ్డతో కప్పి, ఎనిమిడ్ దళాల కమలం పువ్వు ఆకారంలో కుట్టాను. మధ్యలో వేరొక రంగుతో కుట్టి, చుట్టూతా లేసుతో చెక్కగా అలంకరించాను.


నేను స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారు మేనాలో కూర్చుని ఉన్నారు.


నేను మా అమ్మగారు కలిసి స్పాంజితో చేసిన పాదపీఠాన్ని పరమాచార్య స్వామి వారికి సమర్పించాము (మేనా ముందర ఉన్న నేలపైన పెట్టాము). వెంటనే స్వామివారు “అష్టాదళం” అని అన్నారు. మేనా లోపల నుండి కాళ్ళను బయటకు తీసి, ఆ పాదపీఠంపై ఉంచారు. మాకు అంతో సంతోషం కలిగింది. ఇద్దరమూ పులకించిపోయాము. స్వామివారు “సరే అక్కడ ఉంచి వెళ్ళండి” అని అనకుండా భక్తితో సమర్పించిన ఆ పాదపీఠాన్ని తము స్వీకరిస్తున్నట్టుగా వెంటనే తమ పాదాలతో పావనం చేశారు. ఇంతకంటే భాగ్యం ఏముంటుంది?

పక్కనే ఒక సేవకుడు నిలబడి ఉన్నారు. “లలితా సహస్రనామ ధ్యాన శ్లోకం తెలుసునా?” అని అడిగారు స్వామివారు.


ఒక నిముషం పాటు ఆలోచించి, “అరుణాం కరుణా తరంగితాక్షీం . . .” మొదలుపెట్టాడు ఆ సేవకుడు.


“వేరొకటి”


“సింధూరారుణ విగ్రహాం . . .”


“హా అదే! చూడు, అక్కడ ఒక పండితుడు నిలబడి ఉన్నాడు కదా! తన వద్దకు వెళ్లి ఈ శ్లోకంలో వచ్చే ‘రత్నఘటస్థ-రక్తచరణాం’ అన్నదానికి అర్థం అడుగు” అని ఆదేశించారు.


ఆ సేవకుడు పండితుని వద్దకు వెళ్లి తిరిగొచ్చి స్వామివారితో ఇలా చెప్పాడు. “దాని అర్థాన్ని ఆయన, ‘అమ్మవారు తన ఎర్రని పాదాలను అమూల్యమైన రత్నములచే చెయ్యబడిన నీటి కుండపై ఉంచింది’ అని చెప్పారు పెరియవా”.

మేనా పక్కనే మరొక్క పండితుడు ఉన్నాడు. అతనివైపు చూసి మహాస్వామి వారు, “శాస్త్రిగారూ! చాలాకాలం నుండి నాకు ఒక సందేహం ఉంది. అదేంటంటే, ‘ఎందుకు అమ్మవారు తన పాదాలను ఘటం పైన ఉంచింది? అది ఇక్కడ అంత సరి లేదు అనిపిస్తోంది కదా?’” అని అన్నారు.


అందుకు ఆ పండితుడు అవునన్నట్టు తల పంకించాడు. “మరి దానికి నీవు ఏమని వివరణ ఇస్తావు” అని స్వామివారి నుండి అడిగించదలుచుకోలేదు ఆ పండితుడు.


“అది ఇక్కడ అంత అర్థవంతంగా లేదు కదా?”


“అవును పెరియవా”


“ఇప్పుడు ఈ పాదపీఠాన్ని చూడడంతో నా అనుమానం నివృత్తి అయ్యింది” అని స్వామివారు ఇలా విశ్లేషించారు.


“అమ్మవారు తన ఎర్రని పాదాలను ఇటువంటి పాదపీఠంపై ఉంచారు అన్నది సరిగ్గా ఉంటుంది. ‘ఘటస్థ’ అని ఉన్న చోట ‘పటస్థ’ అని ఉంచితే సరిపోతుంది అని అనిపిస్తుంది. ‘పటం’ అంటే బట్ట, అంటే మెత్తని పాదపీఠం. ఈ పదము ముందు ‘పాటస్థ’ అనే ఉన్నదేమో, అది వాడుకలో ‘ఘటస్థ’ అయి ఉండవచ్చు అని నా ఆలోచన. కాబట్టి మనమ ‘పాటస్థ’ అంటే ‘బట్టపై’ అంటే ‘మెత్తని ఉన్ని బట్టపై’(ఎందుకంటే అది అమ్మవారి లేలేత పాదాలకు ఇబ్బంది పెట్టదు) అనే సమ వాచకాన్ని మనం తీసుకోవాలి.”


ఇది విన మాకు కలిగిన ఆశ్చర్యానందాల నుండి బయటపడడానికి చాలా సమయమే పట్టింది.


ఈ వెల్వెట్ పాదపీఠం!


ఏ అర్హతా లేని, ఏమీ తెలియని నా సమర్పణ వల్ల మహాస్వామివారి అనుమానం నివృత్తి అయినది అని చెప్పటం ఒక్క పరమాచార్య స్వామివారికే సాధ్యం.

పరమాచార్య స్వామివారు కరుణ, ఆనందం వల్ల హృదయం ద్రవమై కళ్ళ నుండి వచ్చే నీరు, రెండూ ఆక్కడితో ఆగలేదు.


--- జానా కణ్ణన్, మైలాపూర్. మహాపెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 5


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

భద్రాచల మహిమ

 భద్రాచల మహిమ  🚩🚩🚩

**************************


భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం గర్భగుడిపై ఉన్న సుదర్శనచక్రం ఎవరూ తయారు చేసినది కాదు..


మరి ఇది ఎలా వచ్చిందంటే..??


భక్తరామదాసు తాను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పైభాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించడానికై గొప్ప గొప్ప లోహ శిల్పులను తెప్పించి వారిచేత సుదర్శన చక్రాన్ని తయార చేయిస్తున్నాడు, కానీ వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవటమో, లేదా సరిగా రాకపోవడమో జరుగుతోంది..


కలత చెందిన రామదాసు కలలో ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై "భక్తా.. సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైనది దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు, అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను, అది గోదావరిలో ఉంది తెచ్చి ప్రతిష్ఠించు.." అని చెప్పాడు.


మరుసటి రోజు గజ ఈత గాళ్ళతో రామదాసు వెతికించాడు, కానీ కనిపించలేదు..


మళ్లీ రాముడు కలలో కనిపించి "అది నామీద అమితమైన భక్తిని పెంచుుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది.." అని చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రుని స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పెట్టగా వచ్చి ఆ సుదర్శన చక్రం చేతిలో ఆగింది..

ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు మనం గర్భగుడిపై చూస్తున్నది..!!


ఇంతటి ప్రాశస్త్యం ఉన్నది కనుకనే భద్రాద్రి మహా పుణ్యక్షేత్రమై విలసిల్లుతుంది....!!

లయ-లయం

 లయ-లయం 

మనం తరచుగా ఈ రెండు పదాలను వింటూవుంటాము. "లయ" అంటే ఒక క్రమ పద్దతిలో నడిచే కదలిక కానీయండి శబ్దం కానీయండి దానిని మనం లయ అంటాము. ఉదాహరణకు మన శ్వాస , నడక, హృదయ స్పందన, కదిలే చక్రము ఏదైనా కానీయండి. ఇంకా ఇప్పటి ఆధునిక సైన్సు ప్రకారం చుస్తే విదుత్ పౌనపుణ్యం, లేక కంప్యూటర్ వేగాన్ని సూచించే పౌనపుణ్యం (హెర్డ్జి) ఇలా చుప్పుకుంటూ పొతే మనకు  అన్నీ కూడా లయబద్దంగానే గోచరిస్తాయి.  

బౌతికంగా ఇవి అయితే ఇక సంగీతము, నృత్యము ఈ శాస్త్రాలు పూర్తిగా లయమీదనే ఆధారపడి  వున్నాయి. ఈ విషయం ప్రతి వారికి తెలిసినదే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచం మొత్తం ఒక క్రమపద్ధతిలో వున్నది అదే లయ ప్రకారంగా వున్నది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే లయ లేనిది ఈ జగత్తు లేనే లేదు. మన భూమిని కాకుండా ఖగోళాన్ని ఒక్కసారి గమనిస్తే మనకు అంతా లయప్రకారమే గోచరిస్తుంది. సూర్య, చంద్ర, నక్షత్ర గతులు కూడా పూర్తిగా లయ ప్రకారమే ఉన్నాయి.  మనకు తెలుసు భూమి తనచుట్టూ తానూ తిరగటానికి ఒక్కరోజు పడుతుంది అది ఒక లయ ఏ సమయంలోకూడా తన వేగాన్ని మార్చుకోదు అంటే ఒక సారి సగం రోజు ఇంకొకసారి రెండురోజులు అలా ఒకవేళ అదే జరిగితే భూప్రపంచం మొత్తం  నాశనం అవుతుంది.  అదే విధంగా చంద్రుడు భూమి చుట్టూ ఒక నెలరోజుల సమయంలో తిరుగుతాడు.  చంద్రగతి కూడా అనాదిగా అదే విధంగా వున్నది.  ఇలాగే సూర్య భగవానుడు కూడా ప్రతి గ్రహం, నక్షత్రం పాలపుంతలో ఒక క్రమ వేగంతో సంచరిస్తూవుంటాయి.  పూర్తి దృశ్యమాన జగత్తు  లయమీదనే ఆధారపడి వున్నది. ఇంకొక విషయంకూడా మనం గమనించాలి ఒక గ్రాహం ఇంకొకగ్రహంకు తాకకుండా పరి బ్రమించటం కూడా లయ మీదనే ఆధారపడి వున్నది. లయ తప్పితే గ్రహగతులు తప్పుతాయి అని వేరే చెప్పక్కరలేదు. 

ఒక వీధిలో వెళ్లే వాహనాలు వేటి లయ (speed) వాటికి ఉంటుంది ఎప్పుడైతే లయ మారుతుందో లేక లయ ఆగుతుందో అప్పుడు ప్రమాదాలు జరగటం మనం చూస్తూవున్నాము. ఒక మనిషి వీధిలో నడుచుకుంటూ వెళుతున్నాడు అనుకోండి అంటే అతను ప్రతి అడుగు కూడా లయ బద్దంగా వేస్తూ వున్నాడని అర్ధం. ఒకవేళ అతను అలా కాకుండా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వేయాలన్న వేయలేడు తన వేగాన్ని మారుస్తే పర్యావసానంగా లయ మారుతుంది.  కానీ లయ మాత్రం ఉంటుంది. వేగంగా ప్రయాణిస్తే వేగవంతమైన లయ ఉంటుంది నిదానంగా ప్రయాణిస్తే తక్కువ వేగవవంతమైన లయ ఉంటుంది.  కానీ లయ మాత్రం ఎప్పుడు ఉంటుంది. మనిషి జీవితం మొత్తం ఒక లయ బద్దంగానే కొనసాగుతుంది. పుట్టినప్పటి నుండి చరమ దశ వరకు 

లయ బద్దంగా ఉండటమే ఒక నటన అదే ఈశ్వరుడు సృష్టించిన నాట్యం. అందుకే ఈశ్వరునికి నటరాజు అనే పేరు కూడా వున్నది.  ఆ పరమేశ్వరుడు రచించిన నాటకంలో ప్రతిదీ ఒక పాత్ర పోషిస్తూవుంటుంది. మనుషుల పాత్ర మనుషులది పశు పశ్యదుల పాత్ర వాటిది.  కొన్ని నిర్జీవులు కొన్ని సజీవులు జీవం ఉండటం ఉండక పోవటం కూడా ఆ పరమేశ్వరుని లీలలో భాగమే.  ఈ విషయం ప్రతి సాధకుడు తెలుసుకోవాలి. 

లయం అంటే ఏమిటో కాదు లయ ఆగటమే లయం. సాధారణంగా మనం నిత్యం ఏదో ఒక పని చేస్తూ ఉంటాము అంటే అది లయ, కొంత సమయం తరువాత ఆ పని  అయిపోతుంది. అంటే లయ  ఆగిపోతుంది. అదే లయం ఎందుకంటె అప్పుడు ఆ పని లేదు.  నీవు హైదరాబాదు నుండి కాశీకి ప్రయాణం చేయాలని రైలు ఎక్కావు రైలు కదిలింది అంటే లయ మొదలైంది. కొంతకాలం తరువాత నీ రైలు కాశీని చేరుకుంది అంటే అప్పటి దాకా రైలుకు వున్న లయ ఆగిపోయింది అంటే లయ లయంగా నిశ్చలంగా మారింది అని అర్ధం. 

ప్రతి మనిషి శ్వాస కూడా ఒక లయ, ఏదో ఒకరోజు ఆ లయ ఆగిపోతుంది అంటే లయం  అవుతుంది. దాని అర్ధమే జీవన చివరి  ఘట్టం. లయను, లయాన్ని రెంటిని శాసించేవాడే పరమేశ్వరుడు.  ఈ విషయం మనం తెలుసుకోవాలి.  ఎప్పుడైతే లయకారుని స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతామో అప్పుడే మనకు మనస్సులో ఒక భావన కలుగుతుంది అదేమిటంటే మనలను కాపాడేవాడు, రక్షించేవాడు కరుణించేవాడు మోక్షసిద్దిని ఇచ్చేవాడు పరమేశ్వరుడు తప్ప వేరొకరు  కాదని. నిత్యం శివాలయంలో మనకు లయ, లయం రెండు దృగ్గోచరితం అవుతుంటాయి. మన మహర్షులు మనకు ప్రతి క్షణం మనం ఎలా మసలుకోవాలి, ఎలాంటి ఆలోచనలు చేస్తే మనం జన్మరాహిత్యాన్ని పొందగలం అనే విషయం అను క్షణం గుర్తుచేస్తున్నారు.  

శివాలయలో పరమశివుని లింగం మీద ఒక్కొక్క చుక్కగా జలం పడటం మనం చూస్తూవుంటాము.  ఆ జల పాత్రలో నీరు ఒక రోజో లేక కొన్ని గంటలో పడి కాళీ అయి  పోతుంది. అదే విధంగా మానవ జీవితంలోని కాలం కూడా ఒక్కొక్క క్షణం కరిగిపోయి చివరికి కాళీ అయి పోతుంది.  అంటే అక్కడ అతని కాలం ఆగిపోతుంది.  కాబట్టి కాలం చాలా విలువైనది అని  గమనించాలి. మరి కాలాన్ని ఎలా వినియోగించాలి అంటే ఎలాగ అయితే పాత్రలోని నీరు చుక్క చుక్కగా పరమేశ్వరుని అభిషేకం చేయటానికి ఉపయోగపడుతున్నదో అదే విధంగా మన మనస్సు ప్రతి క్షణం ఆ దేవదేవుని అంటే ఆ పరమశివుని పాదాలమీదనే ఉండి నిత్యం ఆయనతోటె సంబంధం కలిగి ఆయననే పట్టుకుంటే అప్పుడే మనకు ఆయన కరుణా కటాక్షం కలుగుతాయి. 

శివుడు బాహ్యంలో కాదు మాన హృదయాంతరాళాల్లో నిక్షిప్తమై వున్నాడు ఈ సత్యాన్ని తెలుసుకొని మన హృదయేశ్వరున్ని నిత్యం అను క్షణం తలుస్తూ, కొలుస్తూ ఉంటే తప్పకుండ కైవల్యం లభిస్తుంది. అది ఎలా అంటే 

నేను తీసుకునే శ్వాస అజపా జాపంగా భావించి నిత్యం అజపాజపం చేయాలి. అంటే రోజుమొత్తం నేను జపంలోనే ఉన్నాననే భావనలో ఉండటం.  నేను స్నానం చేస్తున్నాను అంటే శివునికి అభిషేకం చేస్తున్నాననే భావనలో  ఉండాలి. నేను మల మూత్ర విసర్జన చేస్తున్నాను అంటే శివుని వద్ద మాలిన్యాన్ని తొలగిస్తున్నాను అని  నేను  మాట్లాడుతున్నాను అంటే శివుడు మాట్లాడుతున్నాడు అనే భావన ఇలా నా పూర్తి దైనందిక జీవనం శివునిదే కానీ నాది కాదనే భావనలో సాధకుడు ఉంటే నిత్య కైవల్యమే.  ఆ స్థితి మనం చెప్పుకునే అంత  సులభం కాదు కఠోర దీక్షతో, అకుంఠిత పరిశ్రమతో మాత్రమే సాధ్యం.  కానీ అసాధ్యము మాత్రం కాదు. "కృషితో నాస్తి దుర్భిక్షం"

బహిర్గతం

 శ్లోకం:☝️

*అర్థనాశం మనస్తాపం*

 *గృహిణ్యాశ్చరితాని చ ।*

*నీచం వాక్యం చాపమానం*

 *మతిమాన్ న ప్రకాశయేత్ ॥*

   - చాణక్యనీతి


అన్వయం: _ధనస్య నాశః , మనసః క్లేశః , గృహస్య కలహః , అన్యేన వఞ్చనం తథా అన్యేన ప్రాప్తం అపమానం ఇత్యేతాన్ విషయాన్ అన్యేషాం పురతః న వక్తి బుద్ధిమాన్ పురుషః l_


భావం: తనకు జరిగిన ధననష్టం, తన యొక్క మనస్తాపం, స్వంత ఇంటి గొడవలు, తాను ఇతరుల వల్ల మోసపోవడం మరియు అవమానింపబడడం వంటి విషయాలను మతి ఉన్న వ్యక్తి ఎప్పుడు ఇతరులకు బహిర్గతం చేయడు.