1, అక్టోబర్ 2020, గురువారం

నేేేనే కనుక లేకపోతే ఏమి జరిగి ఉండేదో

 భ్రమ... నేేేనే కనుక లేకపోతే ఏమి జరిగి ఉండేదో...నేను కాబట్టి చేయగలిగాను నేనే గొప్ప అనుకుంటూ ఉంటాం ...అదంతా ఒట్టి భ్రమ ....


చేసేవాడు చేయించేవాడు అంతా ఆ పరమాత్ముడే .... మనం నిమిత్తమాత్రులం మాత్రమే 🙏


పట్టాభిషేకం జరిగింది, శ్రీ రాముడు విశ్రాంతి గా కూర్చుని ఉన్నాడు.. హనుమ రాముని వద్దకు వచ్చి ఇలా అంటున్నారు...


ప్రభూ! లంకలో విభీషణుడి ఇంటికి వెళ్ళేంత వరకు , నాకు లంకలో అసలు మహా పురుషులు ఉంటారా నాకు కనబడతారా అనే సందేహం ఉండేది.... ప్రభూ! భక్తులు, సాధువులు, సంతులు కేవలం భరతభూమి లోనే ఉంటారనీ పృథ్విలో ఇంకా ఎక్కడ ఉండరని అభిప్రాయం ఉండేది. 


కానీ లంకలో ఎంత వెతికినా సీతామాత ను కనుగొనలేక పోయిన వేళలో విభీషణుని సలహా మేర తల్లి దర్శనం కలిగిన తరువాత అనిపించింది... స్వామి ఎవరినైతే ఎంత వెతికినా చూడలేకపోయానో ఆ తల్లి జాడ లంకలో ఒక సాధు పురుషుని ద్వారా తెలియజేయబడిందే.... బహుశా నా ప్రభువు నాకు ఈ సత్యాన్ని ఎరుక పరచడానికి పంపాడేమో అని అనుకున్నాను... 


అశోకవనంలో రావణుడు తీవ్రమైన క్రోధంతో సీతామాత ను వధించేందుకు కత్తి దూసిన క్షణంలో ,ఆ ఎత్తిన కత్తితో వాడి శిరస్సులు ఖండించి వాడిని అంతం చేయాలనే బలమైన కోరిక నాలో కలిగింది.... కానీ అంతలోనే మండోదరి ఆ దుష్టుడిని వారించి వాడి నుంచి అమ్మని కాపాడిన ఆ దృశ్యం నన్ను మ్రాన్పడేటట్లు చేసింది...


ప్రభూ! ఎంత చక్కని అనుభవమిచ్చావు, అక్కడ కూడా మంచి వారి రూపంలో మండోదరి తల్లిని చూపించావు... నేనే లేకపోతే సీతమ్మని ఎవరు రక్షించగలిగేవారనే భ్రమ కలిగేది... చాలా మంది కి ఇటుువంటి భ్రమే కలుగుతుంది, నాకూడ కలిగి ఉండేేది...


కానీ స్వామీ నీవు ఆ తల్లిని రక్షించడమేకాదు , ఆ పని స్వయంగా రావణుని పత్ని మండోదరి చేత చేయించావు.... దీంతో నాకు, స్వామీ నువ్వు ఎవరితో నీ పని చేయించాలి అనుకుంటావో వారితో ఆ పని నెరవేర్చుకుంటావు... ఇందులో మా మహత్యమేమీ లేదు. 


దేవా..! త్రిజట తన స్వప్న వృత్తాంతం తోటి రాక్షస స్త్రీలకు చెబుతూ లంక లోకి ఒక కోతి వస్తుందనీ.., ఆ వానరం లంకని దహిస్తుందని చెప్పగా విని నేను చాలా చింతలో మునిగిపోయాను..... ప్రభు శ్రీరాముడు నాకు లంక దహించడం గురించి ఏమీ ఆదేశమివ్వలేదే కానీ ఇక్కడ త్రిజట ఇలా చెబుతుందే మరేం చేయాలి అని.. 


రావణుడి ఆస్థానంలో రావణ సైనికులు ఆతని ఆజ్ఞ మేరకు నన్ను వధించేందుకు మీదకి ఉరికినపుడు విభీషణుడు వారించి దూతలను వధించడం నీతి కాదని అన్నకి నచ్చచెప్పడంతో నాకు నువ్వు నన్ను కాపాడడానికి ఆ రావణుని తమ్ముణ్ణే నియోగించావని అర్ధమైంది. 


ఇంతలో నా ఆశ్చర్యం అవధులు లేేేనంతగా అయింది ...రావణుడు తమ్ముని మాట మన్నించి నన్ను చంపకుండా నా తోకకి నిప్పు పెట్టమని భటులని ఆదేశించినపుడు...


లంకలో ఆ సాధ్వి త్రిజట చెప్పిన మాటలు ఈ విధంగా నిజమవు తున్నందుకు... లేకపోతే లంకని దహించడానికి కావలసిన బట్టలు , నెయ్యి అన్నీ నాకెలాగ సమకూరేవి తండ్రీ....


ఒక భక్తురాలి మాట నెగ్గించడానికి నువ్వు రావణున్నే ఉపయోగించుకొని కార్యం నడిపావు.., అటువంటిది నాచే చేయించు కోవటంలో ఆశ్చర్యం ఏమున్నది ప్రభూ!🙏🙏


దీనిని బట్టి నేను నిమిత్త మాత్రున్ని , మీ కార్యం మీరే నెరవేర్చుకుంటున్నారు, అని అర్థం అయింది..,


నీతి


అందుచేత జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే...


మన జీవితాలలో ఏం జరిగినా మనమేమి సాధించినా అది ఈశ్వర సంకల్పమే కానీ మన గొప్పతనమో, మన సాధకత్వమో కాదు..

*అందుకని నేనే కనక లేకపోతే ఏమీ జరగదు అనే భ్రమ ఎన్నడూ కలగకూడదు...


ఆంజనేయ స్వామి అంతటి మహాను భావులే అలా అనుకున్నప్పుడు... మానవ మాత్రులం.. ఎగిరి పడుతూ ఉంటాము.. నా అంతటి వాడు లేడని.. నేను కాకపోతే ఎవరు చేయగలరని.

కామెంట్‌లు లేవు: