27, నవంబర్ 2021, శనివారం

సనాతన సాంప్రదాయాలు

 తరతరాలుగా మనం వింటున్న , క్రమంగా మరచి పోతున్న కొన్ని సనాతన సాంప్రదాయాలు. . 

1. సోమ వారం తలకు నూనె రాయరాదు.

2. ఒంటి కాలీపై నిలబడ రాదు

3. మంగళ వారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు

4. శుక్రవారం నాడు కొడలిని పుట్టినింటికి పంప రాదు

5. గుమ్మడి కాయ ముక్కలనే ఇంటికి తేవాలీ

6. ఇంటి లోపల గోళ్ళు కత్తిరించరాదు

7. మధ్యాహ్నం తులసి ఆకులు కోయరాదు

8. సూర్యాస్తమయం తరువాత కసవువూడ్చరాదు, తల దువ్వ రాదు

9. పెరుగును ఉప్పును అప్పు ఈయరాదు

10. వేడి వేడి అన్నం లోనికి పెరుగు వేసుకోరాడు

11. భోజనం మధ్యలో లేచి పోరాదు

12. తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు

13. గడపపై పాదం పెట్టి వెళ్లరాదు

14. ఇంటినుండి బయటకు వెళ్ళేటప్పుడు కసవూడ్చరాదు

15. గోడలకు పాదం ఆనించి పడుకో రాదు

16. రాత్రీ వేళలో బట్టలుతక రాదు

17. విరిగిన గాజులు వేసుకోరాడు

18. నిద్ర లేచిన తరువాత పడుకున్న ఛాపను మడిచి పెట్టాలి

19. చేతి గోళ్ళను కొరకరాడు

20. అన్న తమ్ముడు, తండ్రి కొడుకు ఒకే సారి క్షవరం చేయించుకోరాడు

21. ఒంటి (సింగల్) అరిటాకును తేరాదు

22. సూర్యాస్తమయం వేళలో నిద్ర పోరాదు

23. భోజనం తరువాత చతిని ఎండ పెట్టవద్దు

24. కాళ్ళు కడిగేటప్పుడు మడిమలను మరచిపోరాదు

25. ఇంటి గడపపై కూర్చోరాదు

26. తిన్న తక్షణమే పడుకోరాదు

27. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని / కాళ్ళు చాపుకుని కూర్చోరాదు

28. చేతులు కడిన పిమ్మట ఝాడించ రాదు

29. రాత్రి భోజనం తరువాత పళ్ళెం కడుక్కోవాలి

30. ఎంగిలీ చేతితో వడ్డించరాదు

31. అన్నం, కూర చారు వండిన పాత్రలలో తినరాదు

32. సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడగరాదు

33. ఇంటికి వచ్చిన ఆడ పిల్లలకు, ముత్తైదువలకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు

34. చిరిగిన అంగీలు, బనియన్లు తదితర లో దుస్తులను ధరించరాదు

35. ఇంటి లోపలికి చెప్పులు Shoes ధరించి రారాదు

36. దేవాలయాలలో చెప్పులు పోతే మరచిపొండీ. వేరే వాళ్ళది వేసుకొస్తే దారిన పోయే దరీద్రాన్ని ఇంటికి తెచ్చినట్టే.

37. చిన్న జంతువులకు (కుక్కలు, దూడలు లాంటివి) పాచిపోయిన పదార్థాలు పెట్టకండి

38. ఒకరు వేసుకున్న బట్టలు, ఆభరణాలు మరొకరు ధరించ రాదు

39. ప్రయాణాల్లో అపరిచితులనుండి పానీయాలు, తీడి పదార్థాలు తీసుకోవద్దు.

40. శనివారం ఉప్పు, నూనె కొని తేరాదు

41. అనవసరంగా కొత్త చెప్పులను కోనరాదు

42. ఇంటిలో వాడకుండా పడివున్న గోడ గడియారాలు, వాచీలు, సైకిళ్ళ, కుట్టు మెషిన్లు లాంటివి వదిలించుకోవాలి

43. భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని అడుక్కుని భిక్షగాళ్ళు కాకండి. మీకు రావలసివుంటే అవే వస్తాయి.

44. అర్హులకు మాత్రమే గుప్త దానం చేయండి

45. మఠాలు దేవాలయాకు చెందిన వస్తువులు దురుపయోగం చేస్తే మీ తరువాతి తరం వాళ్ళకు శిక్ష పడుతుంది.

46. ఇతరులను అనవసరంగా విమర్శించడం, మిమ్మలిని మీరు పొగడుకోవడం మానండి

   మీరు, మీ అధికారం ఏవీ శాశ్వతం కావు. ఇతరులను ఎదగనివ్వండి. మీరు వారికి గురువులాగా ప్రవర్తించండి.

మన పూర్వీకులు చెప్పిన పై వాటిని ఆలోచించి మార్పు సహజమని గుర్తించి ప్రశాంత జీవన విధానం అలవరచుకోండి.


 కారు మేఘాలు కమ్ముతున్నాయి 

ఏక్షణంలో అయినా... 

వర్షం విపరీతంగా కురుస్తుంది...! 

వేసే ముగ్గు..వర్షంలో కలుస్తుంది !అయినా..ఆమె ముగ్గువేస్తోంది... !

      *అదీ..సంప్రదాయం!* 

 ....................


అంతర్జాతీయ ఖ్యాతినార్జించి

అమెరికాలో ఉంటున్న వైద్యుడు. సొంతూరు వచ్చినప్పుడల్లా 

పాఠాలు చెప్పిన పంతులుకు 

పాదాభివందనం చేస్తాడు…! 

 *అదీ .. సంస్కారం !* 

 .....................


ఖగోళ శాస్త్రాన్ని 

నమిలి మింగిన నిష్ణాతుడు.  

నిష్టగా ఉంటూ

గ్రహణం విడిస్తేగానీ... 

ఆహారం గ్రహించడు…! *అదీ .. నమ్మకం !* 🙏

  ....................


పరమాణు శాస్త్రాన్ని 

పిండి పిప్పిచేసిన పండితుడు. 

మనవడి పుట్టు వెంట్రుకలు 

పుణ్యక్షేత్రంలో తీయాలని 

పరదేశం నుండి పయనమై వస్తాడు…! 

 *అదీ .. ఆచారం !* 🙏

......................


అంతరిక్ష విజ్ఞానాన్ని

అరచేతబట్టిన అతిరధుడు. 

 అకుంఠిత నిష్ఠతో

పితృదేవతలకు 

పిండ ప్రదానం చేస్తాడు…!

 *అదీ .. సనాతన ధర్మం!

 ........................


అత్తింటికి వెళ్లేముందు 

ఇంటి ఆడబడుచు 

పెద్దలందరికీ 

పాదాభివందనం చేసి 

పయనమవుతుంది…! 

 *అదీ .. పద్ధతి !* 🙏

 ........................


పెద్ద చదువులు చదివినా 

పెద్ద కొలువు చేస్తున్నా 

పేరు ప్రఖ్యాతులున్నా 

పెళ్లి పీటలమీద .. వధువు

పొందికగా ఉంటుంది…! *అదీ .. సంస్కృతి!*🙏

శ్రీశైల క్షేత్రం.

 శ్రీశైల క్షేత్రం..

#శ్రీశైలం ఆంద్రదేశ్ కర్నూలు జిల్లాలో వెలసిన స్వయం భూలింగ మూర్తి ఉన్న క్షేత్రము. విశేషించి అష్టాదశశక్తి పీఠములలో శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికా అమ్మవారు ఒక శక్తిపీఠం. శ్రీశైలం అంత గొప్ప క్షేత్రం. ఆ పరమేశ్వరుడు వెలసిన కొండపేరు శ్రీగిరి. మనం ఎవరినయినా గౌరవవాచకంతో పిలవాలని అనుకున్నప్పుడు పక్కన శ్రీకారం చుడతాము. శైలమునకు ముందు శ్రీకారం వ్రాయబడి శ్రీశైలం అయింది. దానిపేరు శ్రీగిరి. శ్రీశైలంలో స్వామి లింగమూర్తియై అరూపరూపిగా ఉన్నాడు. ఉన్నది ఒక్క పరమాత్మే రెండుగా భాసిస్తున్నాడు. శ్రీగిరి అన్న పేరు రావడానికి సంబంధించి స్థల పురాణం ఒకమాట చెప్పింది. ఒక భక్తురాలు తాను ఒక కొండగా మారాలని కోరుకున్నది కాబట్టి ఆమె శైలముగా మారినది అని చెబుతారు. కానీ దాని తాత్త్వికమయిన రహస్యం వేరు. శ్రీ’లో ‘శ’కార, ‘ర’కార, ‘ఈ’కారములు ఉన్నాయి. ఈ మూడక్షరములు బ్రహ్మశక్తి, రుద్రశక్తి, విష్ణుశక్తి – ఈ మూడు శక్తులను తెలియజేస్తాయి. ఈ మూడు శక్తులు ఉన్న కొండ శ్రీశైలం. ఈ మూడు శక్తులు మమైకమయిన శక్తి రూపిణి భ్రమరాంబిక. అందుకని శ్రీశైలం ఒక శక్తి పీఠం. ఆ కొండమీద అడుగుపెట్టిన వాడు సరస్వతీ కటాక్షమును కానీ, లక్ష్మీ కటాక్షమును గానీ, జ్ఞానమును గానీ నోరువిప్పి అడగక్కరలేదు. అతనికి కావలసినది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది. అంత శక్తిమంతమయిన కొండ. శ్రీశైల పర్వతం ఎన్నో ఓషధులకు ఆలవాలము. శ్రీశైలము ఎన్నో ఉపాసనలకు ఆలవాలము. అటువంటి శ్రీశైలంలో పర్వతం మీద పరమశివుడు స్వయంభువుగా వెలిశాడు. ఆయన అక్కడ వెలవడానికి గల కారణం గురించి పెద్దలు ఒక విషయమును చెప్తారు. 


గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు శంకరుడు తన ఇద్దరు కుమారులను పిలిచి, ఎవరు భూమండలమునంతటిని తొందరగా ప్రదక్షిణం చేసి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తాను అని చెప్పగానే సుహ్రహ్మణ్యేశ్వర స్వామి గబగబా బయలుదేరి భూమండలంలో ఉన్న దేవాలయములన్నింటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. గణపతి మాత్రం అలా అన్ని దేవాలయములకు వెళ్ళలేదు. సూక్ష్మలో మోక్షం అన్నట్లుగా ఆయన ‘నాన్నగారూ, తల్లిదండ్రులకు చేసిన ప్రదక్షిణం భూమండలమునకు చేసిన ప్రదక్షిణతో సమానం. కాబట్టి నేను మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను’ అని తన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. ఈవిధంగా గణపతి తన బుద్ధి కుశలతను ప్రదర్శించాడు. అపుడు శంకరుడు గణపతికి గణాధిపత్య పదవిని ఇచ్చారు.


సుబ్రహ్మణ్యుడికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ సుబ్రహ్మణ్యుడిని ఇంటికి రమ్మనమని కోరడానికి వెళ్ళారు. వీరిని చూసి సుబ్రహ్మణ్యుడు 24 క్రోసుల ముందుకు వెళ్ళిపోయాడు. అపుడు శంకరుడు మల్లెతీగల చేత చుట్టుకోబడిన ఒక అర్జున వృక్షం క్రింద కూర్చున్నాడు. అపుడు పార్వతీదేవి కూడా వెళ్ళింది. పిల్లవాడు ఎలా ఉన్నాడో అని శంకరుడు సుబ్రహ్మణ్యుడు ఉన్న చోటుకు వెళ్లి కొడుకును బుజ్జగించాడు. ఆయన అలక తీరిపోయింది. ఆయన మహా జ్ఞానిగా నిలబడ్డాడు. శ్రీశైలమునకు పరమేశ్వరుడు ప్రతి అమావాస్య నాడు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటాడు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటుంది. పిల్లవానికి దగ్గరలో ఉన్నామని అనిపించుకోవడానికి అక్కడే ఉంది 


సుబ్రహ్మణ్యుడిని చూసుకుంటూ ఈ మల్లెచెట్టు క్రిందకి వచ్చాము కదా అని అక్కడ వెలశారు. మనం అలకచేతనో, అజ్ఞానం చేతనో మన శరీరములను చూసుకుని భగవంతునికి దూరం అవుతున్నాము. ఇలాంటి వాళ్ళు ఎవరయినా ఉంటే వాళ్ళ దగ్గరకు తానే వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చి పరమశివుడు శ్రీశైలంలో కూర్చున్నాడు. శ్రీశైల మల్లికార్జునుడిది ధూళి దర్శనం. మీరు మీ ప్రదేశం నుంచి శ్రీశైలం వెళ్ళే లోపల ఎంతో అశౌచమునకు లోనవుతుంది మీ శరీరం. ఆ బట్టలతో కొండమీదకి వెళతారు. మీరు శుభ్రపడి దర్శనానికి వెడితే ఆయన కొద్దిగా చిన్నబుచ్చుకుంటాడట. మీరు ఆ క్షేత్రమునకు వెళ్ళగానే ఆశౌచంతో కూడిన శరీరంతో గుడి దగ్గరకు వెళ్లి ధూళి దర్శనమునకు వచ్చాము అని చెప్పి లోపలి వెళ్లి ఈ మట్టి కాళ్ళతో మోకాళ్ళ మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగమును ముట్టుకుని, శివలింగం మీద తల తాటిస్తే పరమేశ్వరుడు పొంగి పోయి సర్వకామ్య సిద్ధిని ఇస్తాడుట. దీనిని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో. కాబట్టి శ్రీశైలంలో ధూళి దర్శనం చెయ్యాలి.


అసురసంధ్య వేళలో నందివాహనం భూమండలం మీదనుండి వెడుతుంది. అటువంటి సమయంలో పరమాత్మ శ్రీశైలపర్వతం మీద ఒకసారి దిగుతాడు. అంత పరమ పవిత్రమయిన సమయంలో శ్రీశైలంలో దేవాలయంలో కూర్చుని శివాష్టోత్తర శతనామములు చదువుకున్నట్లయితే అక్కడ దిగిన పరమాత్మ అది చూసి ఆయనను అన్ని పేర్లు పెట్టి పిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తాడు. జన్మ చరితార్థం అయిపోతుంది. చెంచులు చెవిటి మల్లన్నా అని అరుస్తూ ఉండేవారు. చెవిటి మల్లన్న అంటే ఆయన పొంగిపోతాడట. శ్రీశైలంలో పరమేశ్వరుడు తన భక్తుల కోర్కెలను తీర్చడానికి ఒక తండ్రిగా వచ్చి కూర్చున్నాడు. శ్రీశైలం స్వామీ వారిని దర్శించడానికి వచ్చిన వారి గోత్రనామమునలు ప్రత్యేకంగా ఒక చిట్టాలో వ్రాయమని అమ్మవారు గణపతికి చెప్పింది. అందుకే శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి. లోపలి వెళ్లి మన గోత్రం, పేరు, చెప్పుకోవాలి. గణపతి మన గోత్ర నామమును చిట్టాలో రాసేసుకుంటారు. 


శ్రీశైలంలో శిఖరేశ్వరం ఉంది. అక్కడికి నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు. పూర్వకాలంలో శివాలయంలో చరనంది ఉండేది. పూర్వం రోజులలో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు. శివాలయం, విష్ణ్వాలయం తప్పకుండా ఉండి తీరేవి. ఎవరయినా గర్భిణీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరుగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరకు వెడితే ఆలయ ప్రధాన ద్వారం తీసేవారు. ఈ బాధ పడుతున్న గర్భిణి ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు చరనందిని తిప్పేవారు. ఈ చరనంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు పోతాయేమో నని అనుకున్న వాళ్లకి కూడా ఎందరికో సుఖప్రసవములు జరిగేవి. 


అందుకే అనేక శివాలయములలో చరనంది ఉండేది. శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పి శిఖరం చూడాలి. కానీ యథార్థమునాకు శిఖరము నంది శృంగములలోంచి కనపడదు. మీరు భావన చేస్తూ కళ్ళు తెరచి అక్కడ చూడాలి. ఈ కన్నులు తెరచి నంది శృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జునుని ఆలయ గోపురం మీద వున్నా త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం మీకు కనపడాలి. అలా కనపడిన వాడికి ఒక పునర్జన్మ ఉండదు. అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు. ఒకసారి అమ్మవారు ‘ఏమండీ శిఖరేశ్వరం దగ్గరకు వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తే ఇక పునర్జన్మ లేకుండా మోక్షమును ఇచ్చేస్తారా? అని. అపుడు శంకరుడు “శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను. ఎవరికి ఇస్తానో నీకు చూపిస్తాను అని ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును స్వీకరించారు. ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది. ఇద్దరూ ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు. మెట్లు ఎక్కుతున్నారు. నంది శృంగముల లోంచి చూస్తున్నారు. క్రిందికి దిగిపోతున్నారు. ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించాడు. అందులో వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు. ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రాహ్మణి ‘మా అయన దిగబడిపోతున్నాడు. అందుకని ఎవరయినా ఒక్కసారి చేయినిచ్చి పైకి లాగండి’ అన్నది. అందరూ గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు. అపుడు ఆమె మీలో పాపం లేనివారు పైకి లాగండి అంది. అపుడు ప్రతివాడూ తాను ఏదో పాపం చేసి ఉండక పోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. 


ఆ సమయంలో అటుగా ఒక వేశ్య కిందికి దిగుతోంది. ఈవిడ వేశ్య అని అందరూ అంటున్నారు. ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతాను అన్నది. అపుడు పార్వతీ దేవి ఏమమ్మా, అందరూ మాకు పాపం ఉంది అని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పాపము కంటే నీ పాపం గట్టిది కదా. అటువంటి అప్పుడు నువ్వు నా భర్తను ఎలా లాగుతావు అని అడిగింది. అపుడు ఆవిడ శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే – అమ్మా నేను ఇప్పడు శిఖర దర్శనం చేశాను. మోక్షం రావాలంటే పాపం లేదు, పుణ్యం లేదు. రెండూ సున్నా అయిపోతేనే కదా మోక్షం. ఇపుడు నా ఖాతాలో పాపం లేదు. పుణ్యం లేదు అందుకని లాగుతున్నాను. నేను అర్హురాలను’ అంది. ఈవిడకు విశ్వాసం నిజంగా ఉన్నది ఈవిడకు మోక్షం ఇస్తున్నాను’ అని శివుడు పార్వతికి చెప్పాడు. నంది శృంగములలోంచి చూడడం కాదు. అక్కడ ఉన్నది తన తల్లిదండ్రులని నమ్మిన వాడు ఎవరో వానికి మాత్రమె మోక్షం ఇవ్వబడుతుంది. కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి తాను తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి. ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలం వెడితే మీకు అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది.


సర్వాం శివమయం జగత్..🙏

 ॐ సర్వం శివమయం జగత్ ॐ

  ॐ ఓం నమఃశివాయ ॐ

 🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏

24, నవంబర్ 2021, బుధవారం

శ్రీరమణీయం* *-(242)*_

 _*శ్రీరమణీయం* *-(242)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"నాకు సంభవించే కష్టసుఖాల్లో భగవంతుని జోక్యం ఉంటుందా ? లేదా !?"*_


_*నీకు జీవితాన్ని, కర్మలను అందించటం మినహా నీ కష్టసుఖాల్లో భగవంతుని జోక్యంలేదు. జీవితాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకుంటే ఏవి అవసరాలో, ఏవి కోరికలో మనకు తెలుస్తాయి. అప్పుడే మన ఆధ్యాత్మిక జీవనం సాఫీగా సాగుతుంది. దైవం విషయంలో కూడా అతి కోరిక పనికిరాదు. అందుకే అప్పుచేసి తీర్థయాత్రలు చేయకూడదని పెద్దలు చెబుతారు. భార్యాపిల్లలను పోషించటం, వారికి సౌకర్యవంతమైన జీవనాన్ని అందివ్వటం మాత్రమే మన బాధ్యత. పక్కవాడ్ని చూసి అనుకరించటం సరికాదు. పాదాలకు పట్టీలు పెట్టుకోవాలనిపించవచ్చు కానీ బంగారు పట్టీలు కోరటం అశాంతికి కారణం. అసమానత లేనిదే సృష్టిలేదు. నీ కన్నా తక్కువ సుఖం, ఎక్కువ సుఖం పొందేవారు ఎప్పుడూ ఉంటారు. అసమానతలో ఉన్న సమానత్వాన్ని గుర్తిస్తే శాంతి వస్తుంది. కానీ మనం సమానత్వంలో కూడా అసమానతను వెతుకుతున్నాం. కరెన్సీ నోట్లు సృష్టించేది మనమే, దొంగనోట్లని సృష్టించేదీ మనమే. కోర్టులు, చట్టాలు, శిక్షలు కూడా మనవే. వీటిలో భగవంతుని ప్రమేయం ఏముంటుంది !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'ఆలోచించేది ఎవరో తెలుసుకోవటమే ధ్యానం !'*- 


🕉🌞🌎🌙🌟🚩

శ్రీ ఉమామహేశ్వరస్తోత్రమ్

 ॐ             श्री उमामहेश्वरस्तोत्रम्   

             శ్రీ ఉమామహేశ్వరస్తోత్రమ్ 

   Sree Uma Maheswara Stotram)   


              (श्रीमच्छंकरभगवतः कृतौ)   

           (శ్రీ శంకరాచార్య విరచితమ్)  

        (BY SREE AADI SANKARA)            


                                    శ్లోకం : 3     

                            SLOKAM : 3


नमः शिवाभ्यां वृषवाहनाभ्यां 

विरिञ्चिविष्ण्विन्द्रसुपूजिताभ्याम्।

विभूतिपाटीरविलेपनाभ्यां 

नमो नमः शंकरपार्वतीभ्याम् ।।3।। 


నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం

విరిఞ్చివిష్ణ్విన్ద్ర సుపూజితాభ్యామ్ I 

విభూతిపాటీర విలేపనాభ్యాం 

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ৷৷3৷৷


మంగళమూర్తులూ, 

ఎద్దు వాహనముగా కలవారూ, 

బ్రహ్మ - విష్ణువు - ఇంద్రుడు మొదలగు వారిచే పూజింపబడువారరూ, 

విభూతి - చందనము పూసుకొన్నవారూ అగు 

పార్వతీపరమేశ్వరులకు నమస్కారములు. 


Salutations to Lord Shiva and Goddess Shiva ! 

  - Who rides on the divine bull,

  - Who is worshipped by Vishnu, Brahma and Indra and 

  - Whose bodies are anointed with Sandal and holy ash,


    Salutations and salutations to Lord Sankara

and to that Goddess Parvathy. 


https://youtu.be/KSTB-amenYA


                    =x=x=x=           


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

23, నవంబర్ 2021, మంగళవారం

భస్మాల ఉపయోగాలు - 1

 ఆయుర్వేద వైద్యము నందు ఉపయోగించు భస్మాల ఉపయోగాలు - 1


   నేను అంతకు మునుపు భస్మాల పైన చాలా సమాచారం ఇవ్వడం జరిగింది. ఎంత గొప్ప సమాచారం మరియు ఉపయోగాల గురించి చెప్పినా కూడా మరెంతో సమాచారం ఇంకా మిగిలే ఉంటుంది. 


      ఆయుర్వేదం నందు మూలికావైద్యం మాత్రమే కాకుండా భస్మాలను ఉపయోగించి వైద్యం చేయడం కూడా ఉంది. దీన్ని "రసౌషధ విద్య " గా పిలుస్తారు. కాని ఇది రహస్యముగా ఉంచబడినది. ఈ విద్యని ఉపయోగించుటకు అవగాహన మరియు నేర్పరితనం తప్పక ఉండాలి. ముఖ్యముగా అనువంశికముగా వైద్యం చేయువారికి ఈ విద్య పైన సంపూర్ణ అవగాహన ఉంటుంది. ఇప్పుడు మీకు మేము ఈ రసౌషద వైద్యములో ఉపయోగించు భస్మాల ఉపయోగాల గురించి వివరిస్తాను . 


 * స్వర్ణ భస్మం - 


    ఈ భస్మం రారాజు వంటిది. దీనిని వెన్నతోగాని , తేనెతో గాని , నెయ్యితో గాని సేవించిన పిత్తము , వాతము , ప్రమేహము , గ్రహణి , కుష్టు , నపుంసకత్వం , పాండు రోగము , క్షయ , మూలరోగము సమూలంగా పోవును . 


 * వెండి భస్మము - 


      దీనికి రౌప్య భస్మం అని కూడా పేరు కలదు . దీనిని సరైన అనుపానముతో సేవించిన పైత్యము , గుల్మము , కఫము , విషము , మేహము , శ్వాస , ప్లీహ ( spleen ) రోగములు , వలిఫలితము ( చిన్న వయసులో జుట్టు తెల్లబడుట ) , పాండురోగము , వాపు , దగ్గు , క్షీణత్వం అనగా శరీరం క్షీణించుట , క్షయ రోగము నశించును . 


 * తామ్ర భస్మం - 


      తామ్రము అనగా రాగి . రాగిని సరైన పద్ధతుల్లో పుటము పెట్టి శుద్ది చేసినది . ఈ భస్మమును వాడుట వలన కుష్టు , ప్లీహము , జ్వరము , కఫము , వాతము , శ్వాస , కాసము , వాపు , శూల , ఉదర రోగములు , క్రిమి రోగములు , పాండు , మొలల రోగము , క్షయ , భ్రమ , మోహము , ఎక్కిళ్ళు వంటివి తగ్గును. 


 * లోహ భస్మము - 


      లోహము అనగా ఇనుము . ఈ ఇనుప భస్మము పుటాలు పెట్టి శుద్ది చేసి వాడవలెను . దీనిని వాడటం వలన ప్లీహ రోగము ( spleen ), మొలల నొప్పి , పిత్తము , వాతము , కుష్టు , శోభి , కాస , జ్వరము , మేహావాతము , కీళ్ల నొప్పి తగ్గించును. దీర్గాయువు ఇచ్చును . 


 * కాంత భస్మము - 


      కాంతము అనగా అయస్కాంతము . దీన్ని శుద్ది చేసి తయారు చేసిన భస్మము వాడటం వలన మేహ పిటికలు , త్రిదోషములు , శూల , మొలలు , గుల్మము , ప్లీహ రోగము , క్షయ , పాండువు , ఆడవారిలో వచ్చు తెల్లబట్ట , ఎర్రబట్ట మరియు ఉదర బలహీనతను తగ్గించును . దీర్గాయువు ఇచ్చును . 


 * మండూర భస్మము - 


    చిట్టెపు రాళ్లు తెచ్చి బాగుగా కాల్చి ఆవు పంచితములో 7 పర్యాయాలు ముంచి నీళ్లతో కడిగి , ఎండించి జిల్లేడు పాలతో నూరి పుటం పెట్టిన భస్మం అగును. దీన్ని త్రిఫల కషాయంతో కలిపి మరికొన్ని పుటాలు వేసిన శుద్ధ మండురం అగును. ఇది అత్యంత శక్తివంతం అయినది. 


    పైన చెప్పిన పద్దతుల్లో మా కుటుంబము వారు తయారు చేసేవారు. ఇది లివర్ మీద అద్భుతముగా పనిచేయును . పాండురోగము మీద , కామెర్ల మీద శరీరం వాపు మీద బ్రహ్మస్తం వలే పనిచేయును . 


       మరికొన్ని భస్మాల గురించి తరువాతి పోస్టు నందు వివరిస్తాను .

వ్యమైన సున్నిపిండి

 శరీర దోషాలు తొలగించి చర్మవ్యాధులు హరించే దివ్యమైన సున్నిపిండి - 


 కావలసిన పదార్దాలు - 


  * పచ్చ పెసలు - 1 కిలొ .


  * బావంచాలు - 100 గ్రాములు .


   * వట్టి వేళ్లు - 100 గ్రాములు . 


   * కచ్చురాలు - 100 గ్రాములు . 


   * మంజిష్ట - 100 గ్రాములు .


   * మంచి పసుపు - 100 గ్రాములు .


   * కస్తూరి పసుపు - 100 గ్రాములు .


   * ఉలవలు - 100 గ్రాములు .


   * బత్తాయి తొక్కలు - 100 గ్రాములు .


   * కరక్కాయ బెరడు - 100 గ్రాములు .


   * ఉసిరికాయ బెరడు - 100 గ్రాములు .


   * తానికాయ బెరడు - 100 గ్రాములు .


   * ఎండు ఖర్జూరాలు - 100 గ్రాములు .


   * కుంకుడు కాయ పెచ్చులు - 100 గ్రాములు 


    * సుగంధపాల వ్రేళ్లు - 100 గ్రాములు .


    * తుంగ గడ్డలు - 100 గ్రాములు .


    * దానిమ్మ పండ్ల బెరడు - 100 గ్రాములు .


    * ఎండు గులాబీ రేకులు - 100 గ్రాములు . 


    * మరువము - 100 గ్రాములు . 


     * ధవనము - 100 గ్రాములు .


     * జాపత్రి - 100 గ్రాములు . 


     * యాలుకలు - 100 గ్రాములు . 


     * కురువేరు - 100 గ్రాములు . 


     * తులసి ఆకులు - 100 గ్రాములు . 


  తయారీ విధానం - 


    పచ్చ పెసలు చిన్న మంట పైన కళాయిలో 

పోసి కొద్దిగా నెయ్యివేసి దోరగా వేయించి దించి విసిరి బరక బరకగా పిండి తయారుచేసుకోవాలి . దానిలో పైన చెప్పిన పదార్దాలను శుద్ది చేసుకుని సరైన మోతాదుల్లో విడివిడిగా చూర్ణాలు మెత్తగా చేసుకుని పెసరపిండిలో కలుపుకోవాలి. 


 

  వాడేవిధానం - 


     స్నానానికి అరగంట ముందు ఈ సున్నిపిండిని తగినంత తీసుకుని పుల్లటి మజ్జిగతో కలిపి మెత్తగా పిసికి శరీరం అంతా రుద్దుకోవాలి . ఆరిన తరువాత ఒక్కో భాగాన్ని రుద్దుతూ స్నానం చేయాలి . ఈ సున్ని పిండి రాసుకోవడానికి అర్ధ గంట ముందు నువ్వులనూనెని శరీరముకి పట్టించి ఈ సున్నిపిండి రుద్దుకొని స్నానం ఆచరించిన అద్బుత ఫలితాలు వస్తాయి. స్నానానికి గోరువెచ్చటి నీటిని వాడిన చాలా మంచిది .


  ఉపయోగాలు - 


 

 * ఈ సున్నిపిండి ఉదయం , సాయంత్రం వాడటం వలన శరీరం నందలి 7 పొరలు శుద్ది చెందును . 


 * శరీరం లోపలి భాగంలోని మలినాలు బహిష్కరించబడతాయి . 


 * చర్మం పైన మచ్చలు , చారలు , పగుళ్లు , పుండ్లు , దురదలు , దద్దుర్లు , వాపులు హరించును . 


 * మృత చర్మ కణాలు నిర్మూలించబడతాయి .


 * చర్మానికి సహజకాంతి వృద్ది చెందును .


 * శరీర నల్లధనం , మొటిమల సమస్యలు నివారించబడును. 


 * శరీరానికి మంచి తేజస్సు కలుగును. 


 * సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు కలవారికి అద్బుతంగా పనిచేయును .


  గమనిక -  


         పైన చెప్పిన విధానం మీరు చేసుకోలేనిచో చేసి ఇవ్వబడును . 


              కాళహస్తి వెంకటేశ్వరరావు 


                అనువంశిక ఆయుర్వేదం 


                      9885030034

సత్యం.

 నగ్న సత్యం. 


*ఆకులు తింటేనే* 

*బ్రహ్మజ్ఞానం వస్తే*

*అందరి కన్నా* 

*ముందు మేకలే* 

  *జ్ఞానులు*

   *కావాలి,*⤵️


*స్నానాలతోనే* 

*పాపాలు పోతే* 

    *ముందు*

*చేపలే పాప* 

*విముక్తులు కావాలి,*


*తలక్రిందులుగా ,*

 *తపస్సు చేస్తేనే*

     *పరమాత్మ* 

   *ప్రత్యక్షమైతే*

    *ముందు*

   *గబ్బిలాలకే* 

 *ఆ వరం దక్కాలి,*


*ఈ విశ్వమంతా,*

 *ఆత్మలో ఉంది*

*నీలో ఉన్న,*

 *ఆత్మను వదిలి,*

 *పరమాత్మ అంటూ*

*పరుగులు పెడితే*

*ప్రయోజనమే లేదు*👇,


👉 *నీలో లేనిది,*

 ❗ *బయటేమీ లేదు* 

 ❗ *బయటఉన్నదంతా* 

 ❗ *నీలోనూ ఉంది*👈


*❕తెలిసి మసులుకో* 👈

  ❕ *కలిసి జీవించు.....*.       


మానస సరోవరం 🙏

తక్కువగా చూడకూడదు

 సోషల్ రూల్స్...

నిజంగా...ఎవరైనా...పాటిస్తున్నారా...


 1. ఏవరికైన  రెండు సార్లకు మించి

     అదేపనిగా కాల్ చేయవద్దు. వారు

     సమాధానం ఇవ్వకపోతే, వారికి వేరే

     చాలా ముఖ్యమైన పని ఉందని

     అర్థం. (కోంతమంది ఫోను ఏత్తేవరకూ   

     మళ్ళీమళ్ళీ, మళ్ళీమళ్ళీ ఫోనులు చేస్తూనే 

     ఉంటారు)


 2. అవతలి వ్యక్తి అడగక ముందే మీరు

     అరువు తీసుకున్న డబ్బును వారికి

     తిరిగి ఇవ్వండి. అది ఎంత చిన్న

     మొత్తమైనాసరే! అది మీ

     వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది! 


 3. ఎవరైనా మీకోసం పార్టీ 

     ఇస్తున్నప్పుడు మెనూ లో ఖరీదైన

     వంటలను ఎప్పుడూ మీరు ఆర్డర్

     చేయవద్దు.  వీలైతే మీ కోసం వారినే

     ఆహారాన్ని ఎంపిక చేయమని వారిని

     అడగండి.


 4.  "మీకు ఇంకా వివాహం కాలేదా?

      మీకు పిల్లలు లేరా? 

      ఎందుకు మీరు ఇల్లు కొనలేదు?"

      వంటి ఇబ్బందికరమైన ప్రశ్నలను

      ఎదుటివారిని అడగవద్దు. 

      అవి వారి సమస్యలు. 

      మీవి కావు!


 5. మీ వెనుక ఉన్న వ్యక్తికి ఎల్లప్పుడూ

      మీరే  తలుపు తెరిచి లోపలికి

      ఆహ్వానించండి. 

      అమ్మాయి,అబ్బాయి, చిన్నా, పెద్దా ఎవరైనా

      సరే. ఒకరిపట్ల మంచిగా

      ప్రవర్తించడం ద్వారా మీరు చిన్నగా

      మారరు.


 6. మీరు ఎవరితోనైనా వేళాకోళంగా/సరదాగా 

     మాట్లాడుతున్నప్పుడు దాన్ని వారు

     సరదాగా తీసుకోకపోతే వెంటనే

     దాన్ని ఆపివేయండి! మరలా

     చేయవద్దు.


 7. బహిరంగంగా ప్రశంసించండి,

      ప్రైవేటుగా విమర్శించండి.


 8. ఒకరి బరువు గురించి మీరు

     ఎప్పుడూ  వ్యాఖ్యానించవద్దు.

     "మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు"

      అని చెప్పండి.  అప్పుడు బరువు

      తగ్గడం గురించి మాట్లాడా

      లనుకుంటే, వారే మాట్లాడుతారు. 


 9. ఎవరైనా వారి ఫోన్‌లో మీకు ఫోటో

     చూపించినప్పుడు, అదొక్కటే

     చూడండి. ఎడమ లేదా కుడి వైపుకు

      స్వైప్ చేయవద్దు. తర్వాత

      ఏముంటాయో మీకు తెలియదు

      కదా!


 10. మీరు ఒక సీ.ఈ.ఓ. తో ఎట్లా

       వ్యవహరిస్తారో అదే గౌరవంతో

       క్లీనర్‌తో కూడా వ్యవహరించండి.

       మీ క్రింది వారిని గౌరవంగా చూస్తే

       ప్రజలు ఖచ్చితంగా దాన్ని

       గమనిస్తారు.


 11. మిమ్మల్ని అడిగే వరకు ఎప్పుడూ

        సలహా ఇవ్వకండి.


 12.  సంబంధంలేని వారికి మీ 

        ప్రణాళికల గురించి చెప్పవద్దు. 


 13. ఒక స్నేహితుడు / సహోద్యోగి

       మీకు ఆహారాన్ని ఆఫర్

       చేసినప్పుడు మర్యాదగా 'నో'

       చెప్పండి. 

       కానీ, రుచి లేదా వాసన

       చూసిన తర్వాత 'నో' చెప్పవద్దు.

       అట్లా చేస్తే మీరు వారిని

       అవమానించినట్లే! 


 14. మరో ముఖ్య విషయం! ఇతరుల

        విషయంలో అనవసరంగా జోక్యం

        చేసుకోకుండా, మీ పనేదో మీరు

        చూసుకోండి!!


చివరిది , అతి ముఖ్యమైనది 


15.  ఇలా ఎవరైనా సలహాలు ఇస్తుంటే , 

        వీడేంటి ఉచిత సలహాలు ఇస్తున్నాడు 

        వీడికి  పనిపాటా లేదా అనుకోవడం కాకుండా,           

        వారికి కాస్త సమయం కేటాయించి వారు చెప్పేది 

        విని , నచ్చితే పాటించడం నచ్చకపోతే        

        వదిలెయ్యడం


అంతేకానీ వారిని తక్కువగా చూడకూడదు 

వారు ఎవరైనా సరే పేద్దవారైనా, చిన్నవారైనా...  .


సేకరించిన పోస్టు.

19, నవంబర్ 2021, శుక్రవారం

పుణ్యం

 🙏🌺పుణ్యం వెల🌺🙏


🌺 కాశీ పట్టణం లో ధనవంతుడు అయిన ఒక బ్రాహ్మణుడు వుండేవాడు.


అతను ప్రతీ రోజు దాన ధర్మాలు చేసేవాడు. దానికి తోడు మిక్కిలి దైవ భక్తి కలవాడు మరియు యజ్ఞ యాగాదులు కూడ చేసేవాడు.🌺


 🌺ఒక యాగంలో అన్నీ దానం చేయటంతో కుటుంబ పోషణకు అతడి వద్ద డబ్బులు లేకుండా పోయాయి.


 పక్క ఊరిలో ఒక పెద్ద సేఠ్ నివసిస్తున్నాడని అతడు ఇతరుల పుణ్యంను కొని ధనం ఇస్తాడని బ్రాహ్మణుడి భార్య అతనికి చెప్పి 

వారి వద్దకు వెళ్లి మీ పుణ్యాలు అమ్మి కొంత డబ్బు తీసుకురండి, తద్వారా వ్యాపారం మళ్లీ ప్రారంభం చేయవచ్చును 

అని సలహా ఇస్తుంది.🌺


🌺 బ్రాహ్మణుడు మాత్రం తను చేసిన పుణ్యం అమ్మడానికి ఇష్టపడలేదు, కానీ భార్య ఒత్తిడి మరియు పిల్లల బాధల కారణంగా అతను పుణ్యం అమ్మడానికి సిద్ధ

పడక తప్పలేదు.


 దారిలో తినడానికి భార్య ఇచ్చిన నాలుగు రొట్టెలు తీసుకొని ప్రయాణం అవుతాడు.


   అతను నడుచుకుంటు అడవిలోనుండి పోయేవేళ

ఆకలి కావటంతో ఊరికి చేరేలోపు భోజనం ముగించాలి అనుకుని రొట్టె తీయగానే ఒక కుక్క వచ్చి తన మూడు కుక్కపిల్లలతో ఎదుట నిలబడుతుంది. పిల్లలు చాలా చిన్నవి కావడంతో వాటిని వదిలి ఊరులోకి వెళ్లలేకపోయింది.🌺

 

🌺బ్రాహ్మణునికి బాధగా అనిపించి అతను కుక్క పై కుక్కపిల్లల కోసం జాలిపడి, తన దగ్గర ఉన్న రొట్టెల నుండి ఒక రొట్టెను కుక్కకు ఇస్తాడు.


 కుక్క చాలా రోజులుగా ఆకలితో ఉండటంతో, కుక్క త్వరగా రొట్టె తినేసింది, కానీ ఇంకా ఆకలితో ఉండటంతో బ్రాహ్మణుడి వైపు చూపసాగింది.


 బ్రాహ్మణుడు జాలిపడి రెండవది, తరువాత మూడవది, చివరి నాల్గవది అలా మొత్తం రొట్టెలు కుక్కకు వేసి తను మాత్రం కేవలం నీరు త్రాగి సేఠ్ వున్న వూరికి చేరుకొంటాడు.


  బ్రాహ్మణుడు సేఠ్‌తో తన పుణ్యాన్ని అమ్ముకోవడానికి వచ్చానని చెప్పుతాడు.🌺

 

🌺 అప్పుడు సేఠ్ నేను చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం రండి, నేను కొంటాను అని అంటాడు.


 మధ్యాహ్నం సేఠ్ ఇంటికి భోజనానికి వెళ్లి తన పుణ్యాన్ని విక్రయించడానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడని భార్యతో చెప్పుతాడు. అతని దగ్గర నేను ఏ పుణ్యం కొనాలి చెప్పు అని సలహా

అడుగుతాడు.


 సేఠ్ భార్య చాలా మంచి పతివ్రత స్త్రీ. ఈరోజు బ్రాహ్మణుడు రొట్టెలన్నీ కుక్కకు ఇచ్చి చాలా పుణ్యం సంపాదించుకున్నాడని కండ్లు మూసుకొని ధ్యానం చేసి తెలుసుకొంటుంది.


కుక్కలకు రొట్టెలు వేసి సంపాదించిన పుణ్యం ను

బ్రాహ్మణుడి నుండి కొనమని తన భర్తకు చెబుతుంది.


 సాయంత్రం బ్రాహ్మణుడు తన పుణ్యాన్ని విక్రయించడానికి వచ్చినపుడు సేఠ్ ఇలా అంటాడు.

 

ఈరోజు నువ్వు చేసిన యజ్ఞం యొక్క పుణ్యాన్ని నేను కొనాలని అనకొంటున్నాను.


 బ్రాహ్మణుడు నవ్వి ఇలా అంటాడు. నా దగ్గర యజ్ఞానికి సరిపడ ధనం ఉంటే నీకు పుణ్యం అమ్మడానికి వచ్చేవాడినా

అని.🌺


🌺 ఈరోజు ఆకలితో ఉన్న కుక్కకూ ఆహారం పెట్టి ఆ కుక్కను, దాని పిల్లలను నువ్వు రక్షించావు అదే యజ్ఞం అని సేఠ్ అంటాడు.  


నువ్వు సంపాదించిన ఆ పుణ్యాలన్నీ నేను కొనాలని

అనుకొంటున్నాను అని అంటాడు.


 బ్రాహ్మణుడు పుణ్యం అమ్మడానికి అంగీకరిస్తాడు.  


దానికి బదులుగా నీకు నాలుగు రొట్టెల బరువుకు సమానంగా వజ్రాలు, ముత్యాలు ఇస్తానని సేఠ్ అనటం దానికి బ్రాహ్మణుడు కూడ అంగీకరించడం 

జరిగిపోతాయి.


 నాలుగు రొట్టెలు తయారు చేసి త్రాసులో కాటాకు ఒక ప్రక్కన ఉంచబడతాయి.🌺

  

🌺రెండవ దానిలో, సేఠ్ ఒక సంచీ నిండా వజ్రాలు, ముత్యాలు మరియు ఆభరణాలు ఉంచుతాడు. 


త్రాసు యొక్క కాటా కొంచెం కూడ కదలదు.  


రెండవ సంచీ ఉంచిన కూడ కాటా కొంచెంకూడ కదలక పోయేసరికి సేఠ్ తన దగ్గర 

వున్న ఆభరణాలు అన్నీ రెండో దిక్కున వుంచినా కూడ కాటా అసలుకే కదలదు. అది చూసిన తర్వాత అక్కడ వున్న వారందరు 

ఆశ్చర్య పోతారు.

 

అప్పుడు బ్రాహ్మణుడు సేఠ్‌తో, "నేను నా మనసు మార్చుకున్నాను." ఇప్పుడు నా పుణ్యాన్ని నీకు అమ్మడం ఇష్టం లేదు అని రిక్త హస్తాలతో తన ఇంటికి ప్రయాణం అవుతాడు. 🌺


🌺 ఇంట్లోకి అడుగు పెట్టగానే భార్య తనతో గొడవ పడుతుందేమోనని భయపడి,

 దారిలో కుక్కకి రొట్టెలు ఇచ్చిన చోటు నుంచి కొన్ని గులకరాళ్లు, రాళ్లను ఏరుకుని దానితో ఒక మూటనూ తయారు చేసి ముడి వేస్తాడు.


 ఇంటికి చేరుకోగానే అతని భార్య పుణ్యాన్ని అమ్మి ఎంత సంపాదించావు అని అడుగటం తో ఆ రాళ్ల మూటను భార్యకు ఇచ్చి

అప్పు దొరుకుతుందేమోనని గ్రామం లోకి వెళ్ళుతాడు.


 ఇక్కడ అతని భార్య ఆ మూటను చూసి ఆగలేక, భర్త వెళ్లగానే ఆ మూట తెరిచి చూస్తుంది. ఆ మూట నిండా వజ్రాలు, నగలు ఉండటం తో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోతాయి.


 బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి రాగానే అతని భార్య మీ పుణ్యానికి ఇంత మంచి ధర ఎవరు చెల్లించారని అడుగుతుంది.🌺


 🌺మీకు ఇన్ని వజ్రాలు మరియు ఆభరణాలు ఎక్కడ నుండి వచ్చాయి 


 వజ్రాలు, నగలా ఎక్కడ ఉన్నాయో చూపించు అని అంటాడు బ్రాహ్మణుడు.

 

భార్య తన ముందు ఉన్న మూటను విప్పగానే

అందులోంచి విలువైన ఆభరణాలు బయట పడటంతో బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యపోతాడు.


 అప్పుడు అతను తన భార్యకు జరిగిన విషయాలు అన్నీ పూస గుచ్చినటుల చెబుతాడు.

 

విపత్తు సమయంలో తన పుణ్యంను విక్రయించమని అతనిని బలవంతం చేసినందుకు అతని భార్య చాలా బాధపడుతుంది.🌺

 

🌺ఇదీ కథ. 

నిజానికి ఇది కథ కాదు. జీవితం. 

ఈ కలిలో, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి. ఆపదలో ఉన్న వారికి సాయం చెయ్యండి. మీకు ఎంత డబ్బున్నా ఇహలోక ప్రయాణానికే. మీ డబ్బును ఎవరైనా దొంగిలించవచ్చు. కానీ, మీ పుణ్యాన్ని ఎవరూ దొంగిలించలేరు. 

అందుకే, మీ దగ్గర ఉన్న డబ్బును పుణ్యంగా మార్చుకోండి. పరలోక ప్రయాణానికి పుణ్యం తోనే టిక్కెట్టు కొనుక్కోండి .


 దేవుడు మనల్ని పరీక్షిస్తాడు

  మనం ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతే, మనల్ని శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు🌺


🌺 అందుకే ఎంతటి సంక్షోభం వచ్చినా భగవంతునిపై విశ్వాసం వమ్ముకాకూడదు


    ప్రపంచానికి భయపడకు


    ఇక్కడ ఎవరో కోరితే ఎవరికీ చెడ్డరాదు


    మన కర్మ ఫలమే మనకు లభిస్తుంది,


ఆ  🌺

రహస్య ఎజెండా

 *స్వాతంత్ర్యం తరువాత* *అధికారాన్ని చేజిక్కించు కున్న మితవాదులు రహస్య ఎజెండా , బ్రాహ్మణ వ్యవస్థను నిర్మూలించడం ద్వారా హిందూ మతాన్ని నిర్వీర్యం చెయ్యడం . హిందూ దేవాలయాలను* *ఎండోమెంట్ పరిధిలోనికి తీసుకుని వాటి వైభవాన్ని మసకబారేటట్లు చెయ్యడం . ఈ రోజుల్లో బిటెక్ చదివిన విద్యార్థికి సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే ప్రారంభంలోనే రూ .25 వేల జీతం ఇస్తున్నారు . మరి దేవాలయాల్లో ధూప , దీప ,* *నైవేద్య కైంకర్యాలకు తమ జీవితాలను అంకితం చేసి , తద్వారా మన* *హిందూమతాన్ని , మన సంస్కృతి , సాంప్రదాయాలను పరిరక్షిస్తున్న బ్రాహ్మణులకు జీతాలు ఎంత ఇస్తున్నారు*

 *స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి బ్రాహ్మణులపై ప్రభుత్వం ఎందుకు ఇంత వివక్ష* *చూపిస్తుంది ? ఈ విషయాన్ని ఈ దేశంలో ఉన్న హిందూ పీఠాలు , మఠాలు , హిందువులు ఎందుకు తీవ్రంగా పరిగణించడం లేదు ? ఇది మన దేశ సమస్య కాదా ? 2012 లో ఒక వ్యక్తి మద్రాస్ హైకోర్టులో బ్రాహ్మణుల జీత భత్యాల గురించి ఒక రిట్* *పిటీషన్ వేశాడు . దక్షిణ భారతదేశంలో 50 ముఖ్యమైన దేవాలయాల్లో అర్చకుల జీతభత్యాలను ఉదహరిస్తూ .. ఒక* *దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న నరశింహ గోపాలన్ జీతం 250 రూపాయలు . ప్రభుత్వం దయార్ధ హృదయంతో అతని జీతాన్ని ఒక్కసారిగా మూడింతలు పెంచితే రిట్ పిటీషన్ వేసే సమయానికి అది 750* *రూపాయలు అయింది . అదే ఆలయంలో నరశింహ గోపాలన్ గారి తండ్రి అర్చకులుగా చేసేవారు . 1980 నాటికి ఆయన జీతం రూ . 55. ఆ ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మరో దేవాలయంలోని పూజారి జీతం రూ .19 . ( 2012 లో హిందూ పేపర్లో వచ్చిన న్యూస్ ఆధారంగా* *మద్రాస్ హైకోర్టులో రిట్ పిటీషన్ వెయ్యడం జరిగింది . ) బ్రాహ్మణ వ్యవస్థపై ఈ విషాన్ని కక్కుతున్నదెవరు ? ఈ దేశంలో నివసిస్తున్న వారు దీన్ని ఎందుకు గ్రహించలేక పోతున్నారు ?*

 *1962 లో చైనాతో యుద్ధం ముగిసిన తరువాత ఢిల్లీలో ఒక సభ జరిగింది . ఆ సభకు నెహ్రూ మరియు స్వామి విధ్యానంద విదేహ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు . నెహ్రూ మాట్లాడుతూ .. ఆర్యులు భారతదేశానికి వచ్చిన శరణార్ధులు అంటూ ఆర్యులను కించపరిచే విధంగా మాట్లాడాడు . ఆ మాటలు విన్న స్వామి విధ్యానంద విదేహ్ లేచి వెళ్లి , నెహ్రూ* *ముందు నిల్చుని , నిప్పులు కక్కుతున్న కళ్లతో నెహ్రూని చూస్తూ చాచి అతని చెంప మీద కొడతాడు . ఆ దెబ్బకు నెహ్రూ తూలి వెనక్కి పడబోతాడు . వెనుక ఉ న్నవాళ్లు నెహ్రూ పడిపోకుండా పట్టుకుంటారు . ఈ దృశ్యాన్ని తిలకించిన ఎంతో మంది సభికులు తమ హర్షాతిరేకాన్ని చప్పట్ల ద్వారా* *తెలియజేస్తారు . ఆ సంఘటనతో నెహ్రూ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతాడు . ఎందుకంటే అతన్ని సపోర్ట్ చెయ్యడానికి , నెహ్రూ అంటే నచ్చని వాళ్ల నోళ్లు నొక్కడానికి అక్కడ గాంధీ లేడు . అప్పటికే ఆయన గాడ్సే చేత చంపబడ్డాడు . వెంటనే స్వామి విధ్యానంద విదేహ్ మైక్ అందుకొని “ ఆర్యులు ఈ దేశానికి శరణార్థులు కారు , ఈ దేశానికి పూర్వీకులు . వాళ్ళే భారతదేశానికి నిజమైన వారసులు . ఈ దేవంలో* *ప్రవహిస్తున్నది ఆర్యుల రక్తమే " . అని నెహ్రూని ఉద్దేశిస్తూ .. నువ్వు , నీ తండ్రి అరేబియా నుంచి వచ్చిన శరణార్థులు . నీ ఒంట్లో ప్రవహిస్తున్నది* *అరబ్బుల రక్తం . ఈ దేశానికి నువ్వు ప్రధానివి కాకుండా సర్దార్ వల్లభాయి పటేల్ అయ్యుంటే ఈ దేశ భవిష్యత్తు మరొక రకంగా ఉండేది అనేటప్పటికి .. ఆ ప్రాంగణం అంతా సభికుల* *హర్షద్వానాలతో దద్దరిల్లిపోతుంది . నెహ్రూ అవమానభారంతో వేదిక దిగి వెళ్ళిపోతాడు . మీడియా అంత ప్రాచుర్యం లేని ఆ రోజుల్లో .. ఉన్న మీడియా గొంతునొక్కి నిజాన్ని నిశీధిలో సమాధిచేశాడు నెహ్రూ . ఆ రోజుల్లో బ్రాహ్మణ వ్యవస్థ నిర్మూలనకి , హిందూమతాన్ని అణగదొక్కడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి* . *ఈ రోజుకు ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉ న్నాయి . అరకొర జీతాలతో తమ కడుపుల్లో ఆకలి మంటలు అగ్నిపర్వతాలు సృష్టించినా .. దైవాన్ని , దేవాలయాలను ఒదలకుండా హిందూ మత సంరక్షణే ధ్యేయంగా నిలబడిన ధీశాలురు మన బ్రాహ్మణులు . వారి ద్వారా మతాన్ని , సంస్కృతి సాంప్రయాలను కాపాడుతున్నారు*

*అసలు హిందూ దేవాలయం లేని దేశం ఈ - భూమ్మీద ఎక్కడైనా ఉందా ? ప్రపంచంలో ఎక్కడ ఎ . ఎటువంటి తవ్వకాలు జరిగినా హిందూ దేవాలయాలకు న సంబంధించిన ఆనవాళ్లు బయటపడుతున్నాయి . ఎక్కడ దేవాలయం ఉంటుందో అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంటుంది . ఈ పవిత్ర భూమిని , హిందూ మతాన్ని పరిరక్షించడానికి భగవత్ ప్రేరణ కలిగిన మహాయోగులు - అదృశ్యంగా కృషిచేస్తూనే ఉంటారు . దానికి నిదర్శనం , శ్రీరామకృష్ణ పరమహంస ప్రేరణతో వివేకానందుడు హిందూ మత విశిష్టతను యూరోపియన్ దేశాల్లో ప్రచారం చేసిన తరువాత , " రాబోయే 15 వందల సంవత్సరాలకు సరిపడా హిందూ విత్తనాలను యూరోపియన్ దేశాల్లో వెదజల్లాను " అంటూ తన జీవితచరిత్ర