16, ఏప్రిల్ 2021, శుక్రవారం

oxygen levels are low.

 👆Camphor, lavang, ajwain , few drops eucalyptus oil. Make a potli and keep smelling it throughout the day and night . Helps increase oxygen levels and congestion.

This potli is also given to tourists in Ladakh when oxygen levels are low. Many ambulances are now keeping these too.

It's a home remedy .. kindly share and help.

కరోనా: కొన్ని ప్రశ్నలు



కరోనా: కొన్ని ప్రశ్నలు - సమాధానాలు 


1. వ్యాక్సిన్ కరోనా వైరస్ ని ఖతం చేస్తుంది అన్నారు, నిజమేనా?


సమాధానం: వ్యాక్సిన్ అనేది కరోనా వెంట్రుక కూడా పీకలేదు, పీకదు. 


2. మరి వ్యాక్సిన్ వలన ఉపయోగం ఏమిటి?


సమాధానం: వ్యాక్సిన్ అనేది మన శరీరం లో ఉన్న మన రక్షక కణాలు (యాంటీ బాడీస్) ని నిద్ర లేపుతుంది.


3. వ్యాక్సిన్ ని ఎలా తయారు చేస్తారు..?


సమాధానం: బతికి ఉన్న కరోనా వైరస్ లని తీసుకొని సుత్తి తో గట్టిగా కొడితే అది చచ్చి ఊరుకుంటుంది. చచ్చి పోయిన కరోనా వైరస్ నే వ్యాక్సిన్ గా ఇస్తారు. కొన్ని సార్లు వైరస్ ని తీసుకొని దానిలోని హానికర జీన్స్ ని తీసివేసి ఆ ప్లేస్ లో బ్యాక్టీరియా జీన్స్ పెట్టి వెక్టార్  వ్యాక్సిన్ గా ఇస్తారు. ఈ విధం గా రకరకాలుగా వ్యాక్సిన్ ని తయారు చేస్తారు.


4. భారత్ బయోటెక్ వాళ్ళ కొవాక్సిన్, ఆస్ట్రాజెనికా వాళ్ళ కోవిషీల్డ్ ఎలా తయారు చేశారు..?


సమాధానం: A. భారత్ బయోటెక్ కొవాక్సిన్: వీళ్ళు కరోనా వైరస్ ని తీసుకొని ఫార్మాల్డిహైడ్ ద్రావణం లో ముంచి చచ్చిపోయిన కరోనా వైరస్ ని వ్యాక్సిన్ గా ఇస్తారు.


B. ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్: వీళ్ళు ఎడినో వైరస్ ని తీసుకొని దానిలోని హానికర జీన్స్ తీసివేసి ఆ ప్లేస్ లో బ్యాక్టీరియా జీన్స్ పెట్టి వెక్టార్ వ్యాక్సిన్ ని తయారు చేశారు.


5. కొవాక్సిన్ ఎలా పనిచేస్తుంది.?


సమాధానం: ముందే చెప్పినట్లు కొవాక్సిన్ వ్యాక్సిన్ అంటే చచ్చిపోయిన కరోనా వైరస్ ని ఎక్కిస్తారు. మనం కొవాక్సిన్ వేసుకుంటే అంటే మన శరీరం లోకి చచ్చిపోయిన కరోనా వైరస్ ని ఎక్కిస్తే మన శరీరం లోని రక్షణ వ్యవస్థ బతికి ఉన్న వైరస్ నే వచ్చింది అనుకొని ఎక్కువ మొత్తం లో రక్షణ కణాలు ఉత్పత్తి అవుతాయి. ఆ తర్వాత ఎప్పుడైనా నిజమైన కరోనా వైరస్ వచ్చినా ముందే ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ కానీ ఇంతక ముందు వచ్చిన చచ్చిపోయిన వైరస్ ని గుర్తుపట్టి ఇంకా ఎక్కువ మొత్తం లో యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యి వైరస్ ని కుక్క ని కొట్టినట్లు కొడతాయి.


6. వ్యాక్సిన్ వేసుకుంటే 100% మనకి రక్షణ ఉంటుందా..?


సమాధానం: ఏ వ్యాక్సిన్ 100% ఎఫెక్టివ్ గా లేదు. ఒక వ్యాక్సిన్ 70%, ఇంకోటి 80% , మరొకటి 90% ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నై.


7. అంటే వ్యాక్సిన్ లో లోపం ఉన్నట్లా..?


సమాధానం: టెక్నికల్ గా వ్యాక్సిన్ తయారీ లోపం అని కూడా కాదు. వ్యాక్సిన్ కరక్ట్ ఉన్నా మన శరీరం లోని రక్షణ వ్యవస్థ బద్దకం గా ఉండొచ్చు. యాంటీ బాడీస్ ఉత్పత్తి కి సరైన వాతావరణం మన లోపల ఉండకపోవచ్చు. ఉదాహరణకి అగ్గిపెట్టె, అగ్గి పుల్ల ఉన్నా అగ్గిపెట్టె తడిచి ఉంటే ఉపయోగం ఉండదు. ఆ విధం గా ప్రతి ఒక్కరి శరీర తత్వం, లోపల ఉన్న పరిస్థితులని బట్టి వ్యాక్సిన్ పనిచేయటం ఉంటుంది. మరికొన్ని సార్లు వ్యాక్సిన్ ని సరైన ఉష్నోగ్రతల మధ్య నిల్వ చేయకపోయినా అది పని చేయదు. ఈ విధం గా చాలా కారణాలు ఉంటై 


8. ఒకసారి వ్యాక్సిన్ వేసుకుంటే ఎప్పటికీ యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయా..?


సమాధానం: ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ 3 నెలలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండోచ్చు, 3 రోజులే ఉండొచ్చు. అది వారి వారి శరీరం, తీసుకునే ఆహారం, హెల్థ్ ప్రొఫైల్, వయస్సు మొదలగు అంశాలపై ఉంటుంది.


9. ఒకసారి కరోనా వస్తే మళ్ళీ 100% ఖచ్చితం గా రాదా..?


సమాధానం:  ఒకసారి కరోనా వచ్చి తగ్గిపోయింది అంటే మన శరీరం లో ఉత్పత్తి అయిన యాంటీబాడీస్ ఆ వైరస్ ని జుట్టుపట్టుకొని కుక్కని కొట్టినట్లు కొట్టి బయటికి పంపించినట్లు. రెండో సారి ఒకేసారి కొన్ని లక్షల్లో వైరస్ లు వస్తే లేదా ఆ టైం లో మనలో యాంటీ బాడీస్ లేకపోతే మళ్ళీ కరోనా వస్తుంది. మంచి ఆహారం తీసుకొని డి విటమిన్, C విటమిన్ లాంటివి కరక్ట్ మోతాదులో ఉంటే యాంటీ బాడీస్ యాక్టివ్ గా ఉండి మరొక సారి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది.


10. ఒకసారి కరోనా వచ్చినవాళ్ళు, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు సమానమేనా..? 


సమాధానం: మంచి ప్రశ్న. ఒక రకం గా ఇద్దరూ సమానమే అని చెప్పొచ్చు. కరోనా వచ్చిన వాళ్ళకి యాంటీ బాడీస్ ఉంటై, వ్యాక్సిన్ వేసుకొని అది పనిచేస్తే యాంటీ బాడీస్ ఉంటై. ఈ విధం గా చూస్తే ఇద్దరూ సమానమే  


11. వ్యాక్సిన్ వేసుకున్నాక అది పనిచేస్తుందో లేదో తెలుసుకోవటం ఎలా..?


సమాధానం: యాంటీ బాడీస్ టెస్ట్ చేపించుకుంటే తెలుస్తుంది. 


12. ఏ యే యాంటీ బాడీస్ టెస్ట్ చేపించుకోవాలి 


సమాధానం: IgG, IgM యాంటీ బాడీస్ టెస్ట్ 


13. నేను వ్యాక్సిన్ తీసుకోను, మంచి ఆహారం తీసుకుంటాను. ఆరోగ్యకరమైన జీవన విధానం పాటిస్తాను. వ్యాక్సిన్ తీసుకోకపోయినా ఓకే నా..?


సమాధానం: ముందే చెప్పినట్లు వ్యాక్సిన్ మనలో ఉన్న రక్షణ కణాలని నిద్ర లేపుతుంది. మీ శరీరం లో ఉన్న రక్షక కణాలు ఆల్ రడీ జాగురుకతతో ఉంటే వ్యాక్సిన్ తీసుకోకపోయినా ఏమీ కాదు 


14. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది..?


సమాధానం: కోవిషీల్డ్ వ్యాక్సిన్ అంటే ఎడినో వైరస్ ని ఎక్కించటం. కరోనా వైరస్ కి ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీస్, ఎడినో వైరస్ కి ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీస్ ఒకటే. కోవిషీల్డ్ ద్వారా ఎడినో వైరస్ వెక్టార్ వ్యాక్సిన్ మన శరీరం లో ఎక్కించినా అవే యాంటీ బాడీస్ నే ఉత్పత్తి అవుతాయి 


15. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేపించుకున్నాను. సెకండ్ డోస్ తర్వాత కొన్ని రోజులకి యాంటీ బాడీస్ టెస్ట్ చేపించుకుంటే ఏమీ లేవు. అంటే వ్యాక్సిన్ పనిచేయలేదా..?


సమాధానం: ఇక్కడ ఒక మతలబు ఉంది. మనం గతం లో ఎడినో వైరస్ కి గురి అయ్యి ఉంటే ఆ సమయం లో యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యి ఆ వైరస్ మన రక్షణ కణాల మెమొరీ లో ఉంటుంది. ఈ సారి ఎడినో వైరస్ ఒకటో రెండో వ్యాక్సిన్ ద్వారా ఎక్కించినా వందలు, వేల సంఖ్యలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అవ్వవు. కానీ నిజం గా కరోనా వైరస్ కి గురి అయితే యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయి. సో గతం లో ఎడినో వైరస్ వలన ఏదో ఒకటి వచ్చిన వాళ్ళకి ప్రస్తుతం కరోనా వచ్చినా త్వరగా తగ్గిపోవటానికి స్కోప్ ఉంటుంది 


16. వ్యాక్సిన్ ఒకొకరికి ఒకోలా ఎందుకు పనిచేస్తుంది..?


సమాధానం: చికెన్ కర్రీ చేసి 100 మందికి పెట్టి ఎలా ఉంది అంటే కొందరు ఉప్పు తక్కువ అయ్యింది అని, ఇంకొందరు ఉప్పు కొంచెం ఎక్కువైంది అలా కొన్ని చెప్తారు. నిజానికి అందరూ కరక్టే. వాళ్ళ శరీరం లోని కెమికల్స్ కాంబినేషన్స్ వలన అలా చెప్తారు. వ్యాక్సిన్ కూడా అంతే, ఎవరి శరీరం లో ఎంత కాల్సియం ఉంది, ఎంత D విటమిన్ ఉంది, ఎంత C విటమిన్ ఉంది ఇలాంటి వాటిని బట్టి వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, చేయట్లేదు అనేది ఉంటుంది.


17. వ్యాక్సిన్ వేపించుకున్నాక సినెమా నటులు, రాజకీయ నాయకుల లాగా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అక్కడ గుంపు లు గుంపులు గా ఇష్టం వచ్చిన రీతిలో ఉండొచ్చా..?


సమాధానం: వ్యాక్సిన్ తీసుకున్నాం అంటే మన పక్కన ఇద్దరు అంగ రక్షకులు ఉన్నట్లు, అంతే. కరోనా దొంగలు ఒకేసారి 10 మంది, 20 మంది వస్తే మనం అవుట్. అందుకే వ్యాక్సిన్ వేసుకున్నా, వేసుకోకపోయినా మాస్క్ ధరించటం, జాగ్రత్తలు పాటించటం అన్నీ కంపల్సరీ.


18. వ్యాక్సిన్ వేసుకుంటే ఆహార అలవాట్లు మార్చుకోవాలా..?


సమాధానం: వ్యాక్సిన్ కి ఆహార అలవాట్లకి సంబంధం ఏమీ లేదు. ఇష్టం వచ్చిన పుడ్ తినొచ్చు. 


19. వ్యాక్సిన్ వేసుకుంటే మందు తాగకూడదా..? స్మోకింగ్ చేయకూడదా..? 


సమాధానం: సాధారణం గానే ఆల్కహాల్, స్మోకింగ్ మంచిది కాదు. మన రక్షణ వ్యవస్థ ని బలహీన పరుస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్న కొన్ని రోజులు కనీసం యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యే కొన్ని రోజులు ఆల్కహాల్ కి, స్మోకింగ్ కి దూరం గా ఉంటే మంచిది.


20. వ్యాక్సిన్ వేసుకున్నాక కొన్ని రోజులకి తాగొచ్చా, స్మోకింగ్ చేయొచ్చా..?


సమాధానం: బంగారం లా తాగొచ్చు, స్మోకింగ్ చేయొచ్చు. ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ కొన్ని అయితే ఖచ్చితం గా తగ్గుతాయి కాని కం సెకం తాగొచ్చు, స్మోకింగ్ చేయొచ్చు 


21. కొవాక్సిన్ బెటర్ ఆ, కోవిషీల్డ్ బెటర్ ఆ..? 


సమాధానం: సాధారణం గా డెడ్ వైరస్ ఉన్న వ్యాక్సిన్ బెటర్ అంటారు కాని ఏది అయినా మీ మీ శరీర తత్వం, శరీరం లోని హెల్త్ ప్రొఫైల్, కెమికల్స్ ని బట్టి ఉంటుంది.అందరికీ ఒకేలా ఏదీ పనిచేయదు.


22. కొవాక్సిన్ సెకండ్ డోస్, కోవిషీల్డ్ ఎప్పుడు తీసుకోవాలి 


సమాధానం: ప్రస్తుత గైడ్ లైన్స్ ని బట్టి కొవాక్సిన్ 4-6 వారాలు, కోవిషీల్డ్ 6-8 వారాలు. 


23. వ్యాక్సిన్ వేసుకున్నాక ఏమైనా అవుతుందా.?


సమాధానం: మనిషి మనిషి ని బట్టి, అది పనిచేస్తుందా లేదా బట్టి, ఎంత మోతాదు లో పనిచేస్తుంది బట్టి, మీ మీ హెల్థ్ ప్రొఫైల్స్ ని బట్టి ఉంటుంది. కాని సాధారణం గా 2-3 రోజులు ఫీవర్, వ్యాక్సిన్ ఇంజెక్షన్ చేసిన దగ్గర నొప్పి ఉంటుంది. 


24. ఫీవర్ వస్తే పనిచేస్తుంది అని అనుకోవచ్చ..?


సమాధానం: అలా ఏమీ ఉండదు. పనిచేస్తున్నా ఫీవర్ రాకపోవచ్చు, పని చేయకపోయినా వేరే కారణాల వలన ఫీవర్ రావొచ్చు. సమాధానం, అవును మరియూ కాదు.


25. ఏ వయస్సు వారు వ్యాక్సిన్ వేసుకోవచ్చు ?


సమాధానం: ప్రస్తుతం 45 మరియూ ఆ పైన ఉన్న వారికి ఇస్తున్నారు . ముందు ముందు 18 ఆ పైన కూడా ఇవ్వొచ్చు 


26. వ్యాక్సిన్ స్టాక్ లేదు అంటున్నారు..?


సమాధానం: అది ప్రభుత్వాలని, కంపనీలని, వ్యాక్సిన్ సెంటర్స్ ని అడగాలి. 


27. బ్లడ్ గ్రూప్స్ ని బట్టి కరోనా తీవ్రత ఉంటుందా..? 


సమాధానం: ఉంటుంది. O బ్లడ్ గ్రూపు వాళ్ళకి కొంచెం ఎక్కువ రక్షణ ఉంటుంది. A బ్లడ్ గ్రూపు వాళ్ళకి కొంచెం తక్కువ రక్షణ ఉంటుంది. అందుకే  A వాళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్త ఉండాలి. అయితే ఇది 1-10% మాత్రమే. ఎవరికైనా వస్తుంది, ఎవరు అయినా జాగ్రత్తగానే ఉండాలి, అందరూ ఈక్వల్ గానే జాగ్రత్తగానే ఉండాలి. 


28. సాధారణ జాగ్రత్తలు ఏమిటి..?


సమాధానం: D విటమిన్ కోసం రోజుకి 30 నిమిషాలు ఎండలో నిలబడటం లేదా డి విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవటం, సి విటమిన్ ట్యాబ్లెట్స్ లేదా ఫ్రూట్స్ తగిన మోతాదులో తీసుకోవటం. మంచి ఫౌష్టిక ఆహారం, తగిన వ్యాయాయం, మార్నింగ్ నైట్ వేడి నీళ్ళు, మధ్యానం స్టీం మొదలగు సాధారణ జాగ్రత్తలతో పాటు బయటికి వెళ్తే మాస్క్ ధరించటం. బయట ఏమి ముట్టుకున్నా శానిటైజర్స్ వాడటం మొదలగునవి పాటించటం    


29. రక రకాల మనుష్యులు, పత్రికలు, TV లు, డాక్టర్లు రకరకాలుగా చెప్తున్నారు. ఏది నమ్మాలి..?


సమాధానం: చాలా మంది డాక్టర్స్ తో పాటు, మనుష్యులు, పత్రికలు, TV ల్లో  చాలా ఫేక్ సమాచారం ఉంది. ఎవరినీ పూర్తిగా నమ్మొద్దు నాతో సహా. మీకు మీరు సాధారణ జాగ్రత్తలు తీసుకోండి. భయపడాల్సిన అవసరం లేదు కానీ అజాగ్రత్త మాత్రం అసలు వద్దు. 


30. చివరగా ప్రజలకి ఏమి చెప్తారు..?


సమాధానం: కారోనా వచ్చి సంవత్సరం దాటినా 138 కోట్ల మందిలో ఒక్కరు అయినా 100% జాగ్రత్తలు పాటించారా..? సెకండ్ వేవ్ మాత్రమే కాదు, ఈ విధం గా నిర్లక్ష్యం గా  ఉంటే థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ , ఫిఫ్త్ వేవ్ కూడా వస్తుంది.


ఎవరికి ఏమి చెప్పినా వినరు, మన దేశం లో ఉన్న 138 కోట్ల మందిలో అందరూ చెప్పే స్థితి లోనే ఉన్నారు, వినే స్థితిలో ఎవరూ లేరు సో ప్రజలకి చెప్పటానికి ఏమీ లేదు.  


ధన్యవాదాలు🙏


A post of 

Dr. Ashok Kumar Raj

న్యాచురల్ వెంటిలేషన్


న్యాచురల్ వెంటిలేషన్ ఎప్పుడూ ఇవ్వబడుచుండేది, కానీ అది ఇప్పుడు చెప్పటం మానేసారు. ఇవాళ పైసా ఖర్చులేకుండా, ఇంట్లోనే ఉండి సహజముగా వెంటిలేషన్ పొందవచ్చో చెప్తాను.  దీనిని సాధారణముగా 'ప్రోన్ వెంటిలేషన్" అంటారు.  ప్రోన్ అన్నది ఒకరకమైన భంగిమకు కూడా పేరు.  మెకానికల్ వెంటిలేటర్ కూడా ప్రోన్ భంగిమలో కూడా ఇవ్వబడుతుంది. ఈ భంగిమలో ఉంటే ఊపిరితిత్తుల గాలిపీల్చుకునే శక్తి పెరుగుతుంది. మరొక ముఖ్య విషయం.  ఈ సహజమైన ప్రోన్ వెంటిలేషన్ మెకానికల్ వెంటిలేషన్ కన్నా 70% అధిక సత్ఫలితాలనిస్తుంది. నిజం.  రోజుకి 10000/- నుండి 50000/- ఖర్చుపెట్టే మెకానికల్ వెంటిలేటర్ కన్నా ఈ ఉచిత వెంటిలేషన్ 70% ఫలకారి అని గుర్తుపెట్టుకోండి.  ఇంతకీ ఈ ప్రోన్ వెంటిలేషన్ ఏమిటి? ప్రోన్ వెంటిలేషన్ లో రోగిని పొట్ట మీద పడుకోపెట్టాలి.  తలక్రింద ఒక దిండు(మెత్త), పొట్టక్రింద రెండు దిండ్లు, అలాగే కాళ్ళక్రింద (మోకాళ్ళు - మడమల మధ్యలో) రెండు దిండ్లు పెట్టండి. దీనినే ప్రోన్ పొజిషన్ అంటారు. ఈ భంగిమలో 30 - 45 నిమిషాలు పడుకుంటే రోగి ఊపిరి తీసుకునే శక్తి పెరుగుతుంది. 

యఙ్ఞసూత్రములు

 సృష్టి చేయుట యఙ్ఞమని బ్రహ్మ తెలిసికొని యఙ్ఞసూత్రములు బాహ్యంగా తెలియక పదార్ధ పృకృతి గాన రాక మానసిక యఙ్ఞం చేయుట వలననే సృష్టి చేయు విధానం తెలిసినది. భాగవతం లో బ్రహ్మ యే నారదు నికి విశధీకరించినట్టు నారదుని చే శుకుడు శుకునిచే పరీక్షిత్తు పరీక్షిత్తు వలన సకల ముని వరులకు తెలిసి తద్వారా మనకు పోతనామాత్యులద్వారా పరంపరగా తెలిసినది. మానసిక యఙ్ఞ విధానమును బ్రహ్మ సూత్రములనబడు వాజపేయి పౌండరీక, ఆపస్తంబ,మౌద్గల్య వాజసనేయ మెుదలగు సూత్రములద్వారా చేయవచ్చునని ఎందరో మహానుభావులు తెలిపితిరి. ఇప్పటికీ అఘోర

సాంప్రదాయం కూడా వున్నట్టు మనకు ప్రత్యక్షంగా తెలియుచున్నది. యిది కొన్ని చోట్ల అఘోర ఋషిః అని అంగన్యాస కరన్యాస

 పధ్దితిలో ఆచరణలో కలదు. మహన్యాసంలో కూడా కలదని తెలియుచున్నది. ఏమి లేనప్పుడు మానసికమే శరణ్యం. ఏ విధంగానైనా తెలిసికొనవలెనని జిజ్ఞాస కావాలి. అనగా జిఙ్ఞాస జీవ ఙ్ఞానం తెలియుట. అనగా ప్ర ఙ్ఞానమే జీవ ఙ్ఞానం. యిదే బ్రహ్మ సూత్రం. దానివలననే సమస్త సృష్టి. అదియే గాయత్రీ మంత్ర స్వరూపము సృష్టి. అణవు వ్యాప్తం గాయత్రీ సూక్మంగా నుండి అండ రూపం తరువాత జలం తో వ్యాప్తం జలం వలన రస, రూప, గంధాదులు సృష్టికి బీజాలు.మనం అంతా ఆ విరాట్ స్వరూపమైన పరమేశ్వరుల  ప్రకృతిలోని వారమే.90 సెకన్ల పాటు కనక ప్రాణాయామంలో స్థిరంగా యిష్ట దైవాన్ని మనసులో ముద్రించి ఆనందించుట యెూగం. తెలుసుకుంటూనే వుందాం ఆచరిస్తూనే వుందాం.

అమ్మమ్మ-ఆవకాయ


అమ్మమ్మ-ఆవకాయ, నిజంగా జరిగిందే....


నేను ఎదో కొద్దిగా రాసి విసుగు పుట్టించను అని నమ్మిన తరువాత రాస్తున్నా...


మా అమ్మమ్మ గారు గంగా బాగీరధి సమానురాలైన కఫ్తూరి అనంతమ్మ గారు తెనాలి నాజరుపేటలోని మహలక్షమ్మ చెట్టు ఎంత ప్రసిద్దో ఆవిడా అంత ప్రసిద్ది..


తెనాల్లో ఏ రైల్వో స్టేషను,బస్ స్టాండు,సినిమా హాలు  దగ్గరో  రిక్షా మాట్లాడుకుని ఆవిడ పేరు చెబుతే చాలు తీరా తీసుకొచ్చి ఇంటి ముదరే దింపుతారు,మారు బేరం లేకుండా..


ఎంటా ప్రసిద్దంటారా..


ఆవడ ఆ పేటకే తల్లో నాలుక..ఆవిడ ఒకటేమిటి ఆవులకి,దూడలకి, పాలిచ్చే గేదలకి దిష్టి తగిలితే ఉప్పుతో మంత్రిచ్చి ఇచ్చేది..నోట్లో సర్పి,వళ్భంతా కురుపులు,గవద బిళ్లలు,మెడ పట్టటం,కాలు బెణకటం ఇలాంటి సమస్త నెప్పులకి చిటికలో మంత్రం వేసీది గరిక,ఆట్లకాడ లాంటి వస్తువులతో...ఆవిడ మంత్రం వేస్తుంటే అక్కడ వున్న వాళ్ళందరికి విపరీతమైన ఆవలింతలొచ్చేవి...ఇవన్ని మంత్రాలు పని చేసాయనటానికి ఉదాహరణ,ఆవిడ ఇల్లు ఎప్పుడు జనాలతో  కోలాహలంగానే వుండేది..


మా దొడ్డి కొనుక్కుని బంగ్లా కట్టుకున్న ప్రసిద్ధ డాక్టరు  శ్రీ కొడాలి వీరయ్య చౌదరి గారి భార్య భారి కాయంతో ఆడవారికి సంబంధించిన బాధలతో ఇబ్బుంది పడుతుంటే మామ్మ గార్ని చిట్కా అడుగు అనేవారట అంత డాక్టరైనా!!


ఇది గొప్పేమి కాదు కాని,  స్వర్గీయ ఆలపాటి వెంకట్రామయ్య గారు ఈవిడతో అరగంట మీటింగు పెడితే ఆ వార్డు మెంబరు బంపరు మెజార్టీతో గెలిచే వాడట..ఇదిట్లా వుంటే ఆయనే ఈవిడకు వార్డు మెంబరు ఇవ్వపోతే,నాకెందుకు నాయన మా తమ్ముడు డా.చంద్రమౌళి సత్యన్నారయణ ఇంటరెస్టు గా వున్నాడంటూ ఏకంగా మున్సిపల్  వైసు చైర్మను చేసిన ఘనత ఈవిడది..


ఇది ఆవిడ పరిచయం నాకు తెల్సి ఆరవై ఏళ్ళ క్రితం మాట..ఇప్పుడు అసలు కధకు వద్దాం..


మా అమ్మమ్మ ఇంటి ఎదురగా సమకాలీకురాలైన గంగా భాగీరథి సమానురాలైన వల్లూరి సుబ్బమ్మగారు మా అమ్మమ్మ గారంత కాదు కాని ఎదో కొంత ప్రసిద్ధే..

వీరా చుట్టు పక్కలవారు అంతా ఏమన్నా.. వీరు మాత్రం ఒకరు ఏ మాటన్నా ఇంకోరు తలాడిస్తూ మరే,మరే అనేవారు సమర్ధిస్తూ...


ఎంత ప్రాణ స్నేహితులంటే భానుమతి గారి సినిమా కొత్తది గాని,పాతది గాని వస్తే మూడోకంటి వాడికి తెలియకుండా రహస్యంగా రిక్షా మాట్లాడుకుని సెకండు షో సినిమాకి వెళ్ళేవారు..రెండింటికి తిరిగొచ్చి నాలుగ్గంటలకే లేచి ఏం తెలియనట్లు పనిలో పడి పోయేవారు ఆ బానుమతి గారికన్నా ఎక్కువ నటించేవారు....వీరి ఖర్మ కొద్ది చించిన టికెట్లో లేక సిగిరెట్టు వాసన కొట్టే విడిచిన చీరె వల్లో గుట్టురట్టైది..


వీరింతటి దోస్తులైనా ఆవకాయ పెట్టే విషయంలో మాత్రం బధ్ధ శత్రువులైపోయేవారు..కొత్త ఆవకాయ పెట్టే రోజుల్ల అస్సలు మాటలుండేవి కాదు..అసలు ఒకరి వంక ఇంకోరు చూసుకునే వారే కాదు..సుబ్బమ్మ గారు గోడ దగ్గర నిలబడి ఎవరితోనో మాట్లాడుతూ ఉందనుకోండి.. మా అమ్మమ్మ బయటకు వస్తుందని తెల్సి గబ,గబా లోపలకి వెళ్ళి తలుపేసుకునేది..మా అమ్మమ్మ అయితే ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాల నిచ్చేది కాదు..విషయాలు మాత్రం ఒకరింటి విషయాలు వేరే వారికి ఈసీగా తెల్సి పోయేవి పాలవాడు,కూరలమ్మి,పనిమనిషి..ఇద్దరికి ఒకరే అయిన బాడుగ రిక్షావాడు చేత గుఢాచారం చేయించి విషయం రాబట్టే వారు..


ఉదారణకి, సుబ్బమ్మ గారు అంగలకుదురు తోట నుంచి తెప్పించిన వంద  మామిడి కాయలు ఆవకాయ,ఎభైకాయలు మాగాయ కోసం  పెడుతుందని తెల్సిందనుకోండి..మా అమ్మమ్మ ఇంకో పది ఎక్కువగా మానాన్నని పురమాయించి మంతెన వెంకట్రాజు గారి కాలవ గట్టు మీద చెట్లనుండి మామిడికాయలు కొట్టించేది...


మా అమ్మమ్మ నాజరు పేట నరసింహ స్వామి ఆలయం పక్కనుప్న గానగ నుంచి పట్టించి మంచి నువ్వుల నూనె వాడితే..సుబ్బమ్మ గారు ఆవిడ పెద్ద కూతురు చేత రాజమండ్రి నుంచి పరమాయించి మరి పప్పు నూనె డబ్బా తెప్పించేది...


మా అమ్మమ్మ తెనాలి మారీసు పేట అద్దంకి సుబ్బారావు కొట్లో ఆవకాయ,మాగాయకి కావల్సిన బళ్ళారి మిరపకాయలు, ఆవాలు, శెనగలు మాగాయ తిరగమోతకి కావాల్సిన సరంజామా కొంటే.

సుబ్బమ్మగారు ఈ సుబ్బారావుకి వ్యాపారంలో బద్ధ శత్రవైన కొత్తమాసు రామకోటయ్య కొట్లో కొనేది..ప్రత్యేకించి బద్రాచలం మిరపకాయలు పురమాయించి మరీ కొనేది..వీరిద్దరు గుఢాచారం చేసి మరీ ఒకరి వివరాలు ఇంకోరు తెలుసుకోవాలనుకున్నా

వాళ్ళు వ్యపార లౌక్యం , ఇంకా తప్పించుకునే గుణం పుష్కలంగా వుండి ఆ వ్యాపారులు నోరు జారే వారు కాదు...కాని వీళ్ళు, గుమాస్తాల దగ్గర నుంచి, పని వాళ్ళ దగ్గరి నుంచి సమాచారం సేకరించేవారు...


అంతా బాగుండి ఈ ఆవకాయ పెట్టే విషయంలో ఎందుకు ఇంత గొడవలంటారా...చెబుతా..


ఆ రోజుల్లో గిన్నెల్లో పెట్టి,  కొత్త ఆవకాయ అందరికి ఉద్దారంగా పంచే వారు..ఎవరి ఆవకాయకి ఎంత రేటింగు వచ్చిందా అని ప్రసంసల రూపంలో తెల్సి పోయేది...ఈ ఇద్దరు మాలోకాలకు తెల్సేది కాదు..ఊరికే అబ్బడంగా తీసుకుని తిని, ఒకళ్ళుకి తెలియకుండా ఇంకోళ్ళని విపరీతంగా పొగుడుతారని తెలియదు...


ఉదాహరణకి మా అమ్మమ్మ దగ్గర ఆ సుబ్బమ్మ గారి ఆవకాయ గురించి బద్రాచలం కాయంటమ్మా.. మీ ఆవకాయ కన్నా రంగు తక్కువమ్మా..,నోటికి కూడ ఒర్రగా లేదు వెల,వెల పోతుందంటారు...సుబ్బమ్మ గారి దగ్గర మా అమ్మమ్మ ఆవకాయ గురించి.. ఏంచెప్పమంటారమ్మా...ముక్కలో పీచు తక్కువమ్మా..

నోట్లో పెట్టుకుంటే మీ ఆవకాయ రుచి అస్సలు లేదమ్మా అని షరా మామూలుగా పొగిడి మరి ఇంకింత తీసుకెళ్ళేవారు...


ఇలా అని ఆ కొత్త ఆవకాయ పాత పడే దాకానే వీరి వైరం...


మా ఇంట్లో మా అమ్మ అర్ధరాత్రి పురిటి నెప్పులు పడుతుందని హడావిడితో కనిపెట్టి పరుగునొచ్చి..నువ్వింట్లోనే పిల్ల గాబరా పడకుండా చూస్తుండు అని మా అమ్మమ్మ కి చెప్పి అర్ధరాత్రి ఒంటరిగా మంత్రసానిని పిలుచుకు రావటానికి పరుగు లాంటి నడకతో వెళ్ళి పిల్చుకురావటం, నేనెట్ల మర్చేపోతాను...


ఆవకాయ కలుపుని నోట్లో పెట్టుకుంటుంటే ఇప్పుడే గుర్తుకొచ్చారు..వాళ్ళకి కంటి నీటితోనే శ్రద్దాంజిలి చెబుతుంటే..మా ఆవిడ ఆవకాయ ఘాటుగా ఉందా అని అడుగుతోంది...

భగవంతుణ్ణి పొందాలంటే

 మనం భగవన్నామాన్ని మనస్ఫూర్తిగా జపించకుండా, ఏదో బాహ్యంగా పైపైన చేస్తూఉంటాము. బయటకు మాత్రం "ఓ భగవాన్! నేను నీ దాసుడను, నాకు నీవుతప్ప వేరే దిక్కులేదు"అంటూ ఉంటాము. కాని మన ప్రవర్తన అందుకు విరుధ్ధముగా ఉంటుంది.


మనస్సు అనేక ఇతర ఆలోచనలతో నిండి ఉంటుంది. నిజంగా మన మనస్సు, మాట ఒకటిగా ఉండదు. ఇలా ఉంటే భగవంతుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోగలుగుతాం ?. 


మనం బయటకు ఏం మాట్లాడుతామో, మన మనస్సులోని ఆలోచనలు కూడా అదేవిధంగా ఉండాలి. 

అంటే భగవన్నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఆ భగవంతుని గురించే చింతించాలి. 

భగవంతుని నామం, ఆయన రూపం వేరుకాదు .


భగవన్నామస్మరణలో ఆనందం అధికమౌతుంది. ఆయన ప్రేమమయుడు. ఆనందమయుడు.ఆయనను ఎంతగా ధ్యానిస్తామో అంతగా ఆనందాన్ని పొందుతాము .

        సాధారణంగా మన మనస్సు నానా విషయాల పట్ల పరుగెడుతూ ఉంటుంది. అలా పరిగెత్తే మనస్సును నియంత్రించి భగవంతుని పై కేంద్రకరించడానికి ప్రయిత్నించాలి....!


సూదిబెజ్జంలోకి దారం ఎక్కించాలంటే దారం యొక్క పోగులన్నీ ఒక్కటిగా చేయాలి. దారపుపోగులు విడివిడిగా ఉంటే సూదిబెజ్జంలోకి దారం ఎక్కించడం అసాధ్యం"


అలాగే భగవంతుని యందు మనస్సును నిమగ్నం చేయాలంటే బాహ్యవిషయాల వైపు పరుగులు తీసే మనస్సును నియంత్రించి ఏకాగ్రం చేయాలి


ఇంద్రియనిగ్రహం లేనిదే ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యం కాదు .

భగవంతుణ్ణి పొందాలంటే  పరితపించడమే పరమోత్తమ సాధన

కందుకూరి వీరేశలింగం పంతులు

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏* 

 *16-04-2021, శుక్రవారం* 

.*


*జాతి గర్వించదగ్గ నవయుగ వైతాళికుడి జన్మదినం..ఈరోజు* 


 *కందుకూరి వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కందుకూరు గ్రామం నుండి రాజమండ్రికి వలస వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు. వీరేశలింగానికి నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయాడు. పెద తండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగాడు. చిన్నప్పటి నుండి, అన్ని తరగతులలోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవాడు.* 


 *స్త్రీ విద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించిన స్త్రీ పక్షపాతి. ఆడపిల్ల కన్నెత్తి మగవాడిని చూడటమే మాహాపాపంగా భావించే ఆ రోజుల్లో మగ పిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది కూడా ఆ మహానుభావుడే..అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టి, వారికి ఉచితంగా చదువు చెప్పడంతో బాటు పుస్తకాలు, పలకా బలపాలు కొనిచ్చేవారు.* 


 *తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి .తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పక్కుండా పాటించిన వ్యక్తి . సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు,తెలుగు సాహితీ వ్యాసంగంలోనూ నిరుపమానమైన కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. యుగకర్త గా,హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి.*


 *ఇంతటి మహనీయుల గురించి నేడు ఎంతమందికి తెలుసు..?? వారి పేరుని వారి సేవలని ప్రభుత్వం నాయకులు ప్రజలు గుర్తించి వారి ఆశయాలని నెరవేర్చనప్పుడే వారికి సరైన నివాళి.*

అష్టావక్రగీత' 11, 12 ప్రకరణల నుండి (269)*_

 *'అష్టావక్రగీత' 11, 12 ప్రకరణల నుండి (269)*_

🕉🌞🌎🌙🌟🚩


_*ప్రాంగు, కృంగులే అహంకార సంకేతాలు !!*_


_*అతి స్పందనలే అశాంతికి గుర్తు. కష్టంలో, సుఖంలోనూ స్పందన తప్ప ప్రతిస్పందనలు ఉండని మహానుభావుల జీవితాలు మనకు ఆ విషయాన్నే బోధిస్తున్నాయి. వారు చూపించే అభిమానం, అనురాగాల వెనుక సహజ ప్రేమ తప్ప ఏదీ ఆశించడం ఉండదు. వారు యుద్ధంచేసినా కర్తవ్యంతో తప్ప కక్షతో చేయరు. రాగద్వేషాలు లేని సామ్యక్  జీవనమే వారి బోధ. అంతపెద్ద కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు ఒక రథసారధిగా సాక్షిగా ఉండిపోయాడు. యుద్ధంలో అలసిపోయిన శత్రువు రావణాసురుడిని రేపు రమ్మని ప్రేమ చూపించాడు శ్రీరాముడు. సంతోష దుఃఖాల్లో వ్యక్తమయ్యే ప్రాంగు, కృంగులు అహంకార సంకేతాలు. ఆ ప్రాంగు, కృంగుల్ని పరిహరించగలిగితే సంతోషదుఖాలు రెంటిలోనూ చెదరని శాంతి నిండి ఉండటం గమనించ గలుగుతాము.*_     


🕉🌞🌎🌙🌟🚩

ఆచార్య సద్బోధన*

 *ఆచార్య సద్బోధన*


అల్పమైన వాటి కోసం పరుగులు పెడుతుంటే ఉన్నతమైన దానిని కోల్పోవలసి వస్తుంది.


అల్ప దృష్టి కలిగినవాని వివేచన అసంబద్ధంగానే ఉంటుంది. సమదృష్టితో అంతా పరికించినప్పుడే హుందాతనంతో కూడిన తీర్పు వెలువడుతుంది. తనని తాను శరీరంగా భావించుకునే వ్యక్తిలో ఆధ్యాత్మికత నిలవదు.


మన ఆలోచనలు ఒక ఉదాత్తమైన ఆశయం కేంద్రంగా నిర్మితమై ఉండాలి. వాటిని మరింతగా విస్తరించే ప్రయత్నం చేస్తూ, వాటిని వదలక అంటిపెట్టుకుని ఉంటే, జీవితంలో నూతన అధ్యాయం ఆరంభం అవుతుంది.


పారే ఏటిలో నీరు ఎప్పుడూ తాజాగానే ఉంటుంది, పాకుడు ఏర్పడదు. అదే విధంగా మనలో ఉన్నతమైన ఆలోచనా స్రవంతిని సదా ప్రవహింప చేయ గలిగినప్పుడు, శాశ్వతమైన పునరుద్ధరణ జరుగుతుంది.


*శుభంభూయాత్*

సందేశం

 💥🌹🙏


✍ *ఒక మంచి కాఫీ లాంటి సందేశం* 


🍥సోక్రటీసుకు మరణశిక్ష విధించారు. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగం. ఆయన్ని జైల్లో పెట్టారు. 


🍥ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం. పేరుకు జైల్లో పెట్టారు కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళుతున్నారు. శిష్య బృందమయితే అక్కడే ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టనట్లు నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ కబుర్లూ చెబుతూ ఉన్నాడు. అందరూ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరణమంటే లక్ష్యపెట్టని ఆ మహానుభావుణ్ణి చూసి విస్తుపోతున్నారు. మరణ శిక్ష అమలు కావడానికి రెండు గంటల సమయముంది. ఆ శిక్ష విషం తాగి మరణించడం. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి.


🍥 సోక్రటీస్‌ ఆ సంగతే పట్టనట్లు అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు. అందరి ముఖాల్లో ఆందోళన దిగులు, ఆయన ముఖంలో ఆనందం వెలుగు. ఆయన కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూచుని లైర్‌ వాద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీటుతూ పాడుతున్న పాట సోక్రటీస్‌ మనసుని తాకింది.


 🍥పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. చల్లటి గాలి ఆ పాటను మోసుకొచ్చి పరిమళంలా సోక్రటిస్‌ హృదయాన్ని తాకింది. ఎప్పుడూ ఆనందంగా ఉండే అతను మరింత ఆనందపడ్డాడు.


🍥సోక్రటీస్‌ మెల్లగా కళ్ళు తెరచి జైలర్‌ని పిలిచాడు. జైలర్‌ ఎంతో గౌరవభావంతో దగ్గరికి వచ్చి ఏమికావాలన్నాడు. సోక్రటీస్‌ కిటికీలోంచి చూపించి ”మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాణ్ణి తీసుకొస్తారా?” అని అడిగాడు.


 🍥జైలర్‌ ”అయ్యో!దాందేముంది?” అని వెళ్ళి ఆ బిచ్చగాణ్ణి తీసుకొచ్చాడు. 


🍥సోక్రటీస్‌ ఆ బిచ్చగాణ్ణి తనకాపాట నేర్పమన్నాడు. అతని దగ్గర నుంచి లైర్‌ వాద్యం తీసుకున్నాడు. ఆ బిచ్చగాడు పాటపాడాడు.


 🍥సోక్రటీస్‌ ఆ పాట పాడుతూ లైర్‌ వాద్యం వాయించాడు. ఇట్లా అరగంట సాధన తరువాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాట పాడాడు. 


🍥సోక్రటీస్‌ కృతజ్ఞతలు చెప్పి బిచ్చగాణ్ణి పంపేశాడు. ఆయన శిష్యులు, జైలర్‌ ఆశ్చర్యపోయారు. మరణశిక్షకు ఇంకా గంట మాత్రమే ఉంది కానీ సోక్రటీస్‌ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది. 


శిష్యులు


 🍥”గురువుగారూ! ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది. అది తాగి మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నారు. 


🍥కానీ ఇప్పుడు మీరు లైర్‌ వాద్యంమీద ప్రాక్టీసు చేసి పాట నేర్చుకున్నారు? ఏమిటిది?” అని కన్నీళ్ళ పర్యంతమయ్యారు. సోక్రటీస్‌ నవ్వి ”జీవితమంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు.


🍥 నేను నువ్వు ఇక్కడున్న అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. కానీ జీవించినన్నినాళ్ళు ప్రతిక్షణం విలువైందే. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందముంది.


 🍥గంటక్రితం నాకా పాట తెలీదు. ఇప్పుడు నేర్చుకున్నాను. 


🍥ఇంకా నాజీవితంలో గంట సమయముంది. 

.

🍥అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశముంది” అన్నాడు.

శిష్యుల నోట మాట రాలేదు.


🍥" జీవితం అంటే  యేడుస్తూ కూర్చోడం కాదు.,  జీవితం  అంటే  - నాకు  ఇంతే రాసి పెట్టి వుంది - అనుకుని  - నా ఖర్మ  ఇంతే - అంటూ నిందించడం కాదు .,  జీవితం  అంటే  -  నేర్చుకోవడం." 


యద్భావం తద్భవతి అంటారు కదా....

ఓం తత్సత్

💥🌹🙏🙏🙏🙏🌹💥