25, జులై 2020, శనివారం

అష్టమ స్కంధము - రెండవ అధ్యాయము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

అష్టమ స్కంధము - రెండవ అధ్యాయము

మొసలి గజేంద్రుని పట్టుకొనుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

ఇచట ముందుగా

బమ్మెర పోతనగారి పద్యరత్నములు

8-47 మత్తేభ విక్రీడితము

ఇభలోకేంద్రుఁడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చం
డభ మార్గంబున కెత్తి నిక్కి వడి నుడ్డాడించి పింజింప నా
రభటిన్ నీరములోనఁ బెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్
నభమం దాడెడు మీన కర్కటముల న్బట్టెన్ సురల్ మ్రాన్పడన్.

తాత్పర్యము

ఆ సమయంలో, గజరాజు తొండంలోకి నీళ్ళు పీల్చు కొన్నాడు. ఆకాశం కేసి తొండాన్ని ఎత్తి, నిక్కించి పుక్కిలించి ఆ నీటిని వేగంగా పైకి చిమ్మాడు. ఆ వడికి ఆ నీటితో పాటు పై కెగసిన పీతలు, మొసళ్ళు, చేపలు ఆకాశంలో తిరిగే మీనరాశిని, కర్కాటకరాశిని పట్టుకొన్నాయి. దేవతలు అది చూసి ఆశ్చర్య చకితులు అయ్యారు.
రహస్యార్థం: ఇలా జీవుడు మానససరస్సులోని సంకల్పాలను పరిపక్వ స్థితిని కలచివేస్తుంటే, ఈశ్వరుడిలోని సూక్ష్మవృత్తులతో ఐక్యం అయ్యేడు.

8-49 సీస పద్యము

కరిణీకరోజ్ఝిత కంకణచ్ఛటఁ దోఁగి;
సెలయేటి నీలాద్రి చెలువుఁ దెగడు
హస్తినీ హస్త విన్యస్త పద్మంబుల;
వేయిగన్నులవాని వెరవు చూపుఁ
గలభసముత్కీర్ణ కల్హార రజమునఁ;
గనకాచలేంద్రంబు ఘనతఁ దాల్చు
గుంజరీ పరిచిత కుముద కాండంబుల;
ఫణిరాజ మండన ప్రభ వహించు

8-49 ఆటవెలది

మదకరేణు ముక్త మౌక్తిక శుక్తుల
మెఱుఁగు మొగిలుతోడ మేలమాడు
నెదురులేని గరిమ నిభరాజ మల్లంబు
వనజగేహకేళి వ్రాలునపుడు.

తాత్పర్యము

అలా గజరాజు ఎదురులేకుండా పద్మాల సరోవరంలో ఈదుతున్నాడు. అప్పుడు, ఆడ ఏనుగులు అతనిమీద నీళ్ళు చల్లాయి. ఆ నీటి లో తడిసిన అతడు సెలయేళ్ళతో ఒప్పిన నీలగిరిలా ఉన్నాడు. ఆడ ఏనుగులు అతని దేహం నిండా కలువపూలు నింపాయి. వాటితో సహస్రాక్షుడైన ఇంద్రునిలా ఉన్నాడు. ఆడ ఏనుగులు అతని పై కమలాల పుప్పొడి చల్లాయి. దానితో అతడు బంగారు కొండలా గొప్పగా ఉన్నాడు. ఆడ ఏనుగులు అతనిపై కలువ తూండ్లు పరిచాయి. వాటితో అతడు సర్పాలు ధరించిన శివునిలా ప్రకాశిస్తున్నాడు. ఆడ మత్తేభాలు అతనిమీద ముత్యాలచిప్పలు వేసాయి. దానితో అతడు మెరుపుతీగలతో కూడిన మేఘాన్ని మించిపోయాడు.
రహస్యార్థం: ఆ జీవుడు, ప్రతిబంధాలు ఏవీ లేకుండా జ్ఞానంలో విహరిస్తూ, ఏనుగు నీలాద్రి మున్నగు రూపాలు పొందినట్లు, మూలాధారాది చక్రాలలో వాయువును బంధించి నపుడు, ఆయా దేవతా వర్ణాలను పొంది తుదకు పరమం అందు ఐక్యం అయ్యాడు.

8-50 వచనము

మఱియు నా సరోవరలక్ష్మి మదగజేంద్ర వివిధ విహారవ్యాకులిత నూత లక్ష్మీవిభవయై యనంగ విద్యానిరూఢ పల్లవ ప్రబంధపరికంపిత శరీరాలంకార యగు కుసుమ కోమలియునుం బోలె వ్యాకీర్ణ చికుర మత్తమధుకర నికరయు; విగతరస వదనకమలయు; నిజస్థాన చలిత కుచరథాంగ యుగళయు; లంపటిత జఘనపులినతలయునై యుండె; అంత.

తాత్పర్యము

అంతేకాక ఆ గజరాజు చేసిన విశేషమైన సంచారాలతో ఆ మడుగు చక్కదనాలు చెదిరి కొత్తందాలు సంతరించుకొంది. గడుసువాడైన విటునితో రతిక్రీడ చేస్తూ అతని కౌగిళ్ళలో చిక్కి వణుకుతున్న కుసుమ సుకుమారిలా చక్కగా ఉంది. మదించిన తుమ్మెదలు చెదిరిన ముంగురులుగా, రసాన్ని కోల్పోయిన పద్మాలు ముఖంగా, చక్రవాకాలు తమ స్థానాలనుండి చెదిరిన స్తనాలుగా, నలిగిన ఇసుక తిన్నెలు అలసిన పిరుదులుగా కనిపిస్తున్నాయి.

2.27 (ఇరువది ఏడవ శ్లోకము)

తం తత్ర కశ్చిన్నృప దైవచోదితో  గ్రాహో బలీయాంశ్చరణే రుషాగ్రహీత్|

యదృచ్ఛయైవం వ్యసనం గతో గజో యథాబలం సోఽతిబలో విచక్రమే॥6385॥

రాజా! ఆ ఏనుగు ఉన్మత్తమైయున్న సమయమున ప్రారబ్ధవశమున ఒక బలిష్ఠమైన మొసలి క్రోధముతో దాని పాదమును పట్టుకొనెను. ఇట్లు అకస్మాత్తుగా ఆపదలో చిక్కుకొనిన ఆ ఏనుగు తన శక్తికొలదీ ఆ మొసలి పట్టునుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెను. కాని, ఆ ఏనుగు ప్రయత్నము సఫలము కాకుండెను.

బమ్మెర పోతనగారి పద్యం

8-51-సీ.సీస పద్యము

భుగభుగాయితభూరి బుద్భుదచ్ఛటలతోఁ;
గదలుచు దివికి భంగంబు లెగయ;
భువన భయంకరఫూత్కార రవమున;
ఘోరనక్రగ్రాహకోటి బెగడ;
వాలవిక్షేప దుర్వార ఝంఝానిల;
వశమున ఘమఘమావర్త మడరఁ;
గల్లోలజాల సంఘట్టనంబులఁ దటీ;
తరులమూలంబులై ధరణిఁ గూల;

8-51 తేటగీతము

సరసిలోనుండి పొడగని సంభ్రమించి
యుదరి కుప్పించి లంఘించి హుంకరించి
భానుఁ గబళించి పట్టు స్వర్భానుపగిది
నొక్క మకరేంద్రుఁ డిభరాజు నొడిసిపట్టె.

తాత్పర్యము

ఒక మొసలి రాజు ఆ మడుగులో ఒక మూల దాక్కొని గజరాజుని చూసాడు. భుగభుగ మని చప్పుళ్ళతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిసిపడేలా పైకి ఎగిరాడు. మొసళ్ళు చేపలు భయపడేలా లోకానికి భీతి కలిగేలా ఫూత్కారం చేసాడు. వడికి లేచిన గాలికి ఘమఘమ అని సుడి గుండాలు లేచేలా తోక జాడించాడు. హుంకారం చేస్తూ కుప్పించి ఎగిరాడు. రాహువు సూర్యుడిని పట్టుకొన్నట్లుగా ఆ మొసలిరాజు ఆ గజరాజుని ఒడిసిపట్టుకొన్నాడు.

2.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

తథాఽఽతురం యూథపతిం కరేణవో వికృష్యమాణం తరసా బలీయసా|

విచుక్రుశుర్దీనధియోఽపరే గజాః   పార్ష్ణిగ్రహాస్తారయితుం న చాశకన్॥6386॥

ఇతర ఏనుగులు, ఆడ ఏనుగులు, వాటి పిల్లలు తమ స్వామిని బలిష్ఠమైన మొసలి పట్టుకొని బలముగా లాగుచున్నట్లు కనుగొని మిక్కిలి భయపడెను. అవి భయముతో గట్టి ఆక్రోశముతో ఘీంకరించసాగెను. పెక్కు ఏనుగులు ఆ గజేంద్రునకు తోడ్పడుటకై జలములనుండి దానిని బయటకు లాగుటకు పూనుకొనెను. ఐనను, అవి ఆ ప్రమాదమునుండి దానిని రక్షింపలేక పోయెను.

2.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

నియుధ్యతోరేవమిభేంద్రనక్రయోర్వికర్షతోరంతరతో బహిర్మిథః|

సమాః సహస్రం వ్యగమన్ మహీపతే సప్రాణయోశ్చిత్రమమంసతామరాః॥6387॥

ఏనుగు, మొసలి తమ తమ శక్తినంతయును కూడ గట్టుకొని పోరాడసాగెను. ఒక్కొక్కసారి ఆ మకరము గజమును నీటిలోనికి లాగుచుండెను. మరొకసారి గజము, మకరిని బయటకు లాగుచుండెను. ఇట్లు అవి పోరాడుచుండగా వేయి సంవత్సరములు గడచిపోయెను. ఈ సంఘటనను చూచి, దేవతలు గూడ సంభ్రమాశ్చర్యములకు లోనైరి.

బమ్మెర పోతనగారి పద్యములు

8-55-వ.వచనము

ఇట్లు కరిమకరంబులు రెండును నొండొండ సముద్దండదండంబులై తలపడి నిఖిల లోకాలోకన భీకరంబులై; యన్యోన్య విజయశ్రీ వశీకరంబులై; సంక్షోభిత కమలాకరంబులై; హరి హరియును; గిరి గిరియునుం దాఁకి పిఱుతివియక పెనంగు తెఱంగున నీరాటం బయిన పోరాటంబునం బట్టుచు వెలికి లోనికిం దిగుచుచుఁ గొలంకు గలంకంబొందఁ గడువడి నిట్టట్టుఁ బడి తడఁబడక బుడబుడానుకారంబులై బుగులు బుగు ల్లను చప్పుళ్ళతో నురువులుఁ గట్టుచు జలంబు లుప్పరం బెగయం జప్పరించుచుఁ దప్పక వదనగహ్వరంబుల నప్పళించుచు నిశితనితాంత దురంతదంత కుంతంబుల నింతింతలు తునియ లయి నెప్పళంబునం బునుక చిప్పలుఁ గుదుళ్ళుఁ దప్పి రక్తంబులుఁ గ్రమ్ముదేర హుమ్మని యొక్కుమ్మడిం జిమ్ముచు నితరేతర సమాకర్షణంబులం గదలక పదంబుల మొదలిపట్టు వదలక కుదురై వర్తించుచు బరిభ్రమణ వేగంబున జలంబులం దిరుగుచు మకర కమఠ కర్కట గండక మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా నొండొంటిం దాఁకు రభసంబున నిక్కలుబడ మ్రక్కం ద్రొక్కుచు మెండుచెడి బెండుపడి నాఁచు గుల్లచిప్ప తండంబులఁ బరస్పర తాడనంబులకు నడ్డంబుగా నొడ్డుచు నోలమాసగొనక గెలుపు దలంపులు బెట్టిదంబులై రెట్టింప నహోరాత్రంబులుం బోలెఁ గ్రమక్రమ విజృంభమాణంబులై బహుకాల కలహ విహారంబులయి నిర్గత నిద్రాహారంబులై యవక్రపరాక్రమ ఘోరంబులై పోరుచున్న సమయంబున.

తాత్పర్యము

ఏనుగు మొసలి రెండు అభిమానంతో ఒకదాన్ని మించి ఒకటి ఢీకొన్నాయి. వాటి పోరు అన్ని లోకాలకి భయంకరంగా సాగింది. అవి రెండు కూడ రెండవ దానిని ఓడించాలనే పట్టుదల తో మడుగునంతా కలచివేసాయి. సింహంతో సింహం, కొండతో కొండ వెనుదీయకుండ ఢీకొని పోరాడుతున్నట్లు అవి రెండు తీవ్రంగా పోరాడాయి. బయటికి లోపలికి లాగుతు, అటునిటు పడుతున్న తొట్రుపడలేదు. ఆ నీళ్ళలో బుడ బుడ బుగలు బుగలు మనే శబ్దాలు చెలరేగాయి. లేచిన నురగలు ఆకాశాన్ని తాకాయి. మొసలి ఏనుగులు రెండు ఎడతెరపి లేకుండ ముట్టెల తో తాకుతు, తలలు బద్ధలయ్యేలా, చిప్పల అమరికలుతప్పేలా, నెత్తుర్లు కారేలా హుమ్మంటు వాడి పండ్లతో పొడుచు కొన్నాయి. ఒకదానిని ఒకటి లాగేటప్పుడు కాళ్ళపట్టుతప్పిపోకుండ బలంగా నిలదొక్కుకున్నాయి. అప్పుడు సరస్సులోని నీళ్ళు వేగంగా సుళ్ళు తిరిగాయి. ఆ నీళ్ళ తాకిడికి మొసళ్ళు తాబేళ్ళు పీతలు చేపలు కప్పలు మొదలైనవి చచ్చిపోయాయి. బింకంతో వేగంగా మొసలి ఏనుగు ఒకదాని నొకటి అణగదొక్కతు చీకాకుపరచు కొంటు బాగా అలసిపోయాయి. ఒకదాని దెబ్బలనుండి ఒకటి నాచును ఆల్చిప్పలను అడ్డంవేసి తప్పించుకొసాగాయి. శరీరాల మీద ఆశలు వదలుకొన్నాయి. ఎలాగైనా గెలవాలనే కోరిక రెట్టింపు చేసుకొన్నాయి. క్రమక్రమంగా చెలరేగుతు రేయింబగళ్ళు తిండి నిద్ర లేకుండ అవి రెండు చాలా కాలం పోరాడాయి


2.30 (ముప్పదియవ శ్లోకము)

తతో గజేంద్రస్య మనోబలౌజసాం కాలేన దీర్ఘేణ మహానభూద్వ్యయః|

వికృష్యమాణస్య జలేఽవసీదతో  విపర్యయోఽభూత్సకలం జలౌకసః॥6388॥

ఇట్లు పెక్కు సంవత్సరములు గడచిపోగా గజేంద్రుని శరీరము శుష్కించి పోసాగెను. దాని శరీర బలము, మానసిక ఉత్సాహము సన్నగిల్లెను, శక్తియు క్షీణించెను. మొసలి జలచరమగుటచే దాని శక్తి క్షీణింపకపోగా ఇంకను వృద్ధియగుచుండెను. అది మిక్కిలి ఉత్సాహముతో బలము కొలది గజేంద్రుని నీళ్ళలోనికి లాగసాగెను.

2.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

ఇత్థం గజేంద్రః స యదాఽఽప సంకటం ప్రాణస్య దేహీ వివశో యదృచ్ఛయా|

అపారయన్నాత్మవిమోక్షణే చిరం దధ్యావిమాం బుద్ధిమథాభ్యపద్యత॥6389॥

దేహాభిమానియై, తన శరీరబలమునే నమ్ముకొని యున్న గజేంద్రుడు హఠాత్తుగా ప్రాణసంకటములోబడి, తనను తాను రక్షించుకొనుటకు అన్నివిధముల అసమర్థుడాయెను. తనను కాపాడుకొనుటకు ఉపాయమును గూర్చి చాలకాలము  ఆలోచించెను. చివరకు అతడు ఒక నిశ్చయమునకు వచ్చెను.

బమ్మెర పోతనగారి పద్యములు

8-71 శార్దూల విక్రీడితము

ఏ రూపంబున దీని గెల్తు? నిటమీఁ దేవేల్పుఁ జింతింతు? నె
వ్వారిం జీరుదు? నెవ్వరడ్డ? మిఁక ని వ్వారిప్రచారోత్తమున్
వారింపం దగువార లెవ్వ? రఖిలవ్యాపార పారాయణుల్
లేరే? మ్రొక్కెద దిక్కుమాలిన మొఱాలింపం బ్రపుణ్యాత్మకుల్.

తాత్పర్యము

“ఈ మొసలిని ఏ విధంగా జయించగలను? ఇకపై నేను ఏదేవుణ్ణి ప్రార్థించను? ఎవరిని పిలవాలి? ఎవరు నన్ను రక్షిస్తారు? ఈ మహామొసలిని ఆపేశక్తి కలవారు ఎవరు? సర్వకార్యాలలో దిట్టలు గొప్పపుణ్యాత్ములు దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారా. అటువంటి వారికి నమస్కారం చేస్తాను.

2.32 (ముప్పది రెండవ శ్లోకము)

న మామిమే జ్ఞాతయ ఆతురం గజాః కుతః కరిణ్యః ప్రభవంతి మోచితుమ్|

గ్రాహేణ పాశేన విధాతురావృతోఽప్యహం చ తం యామి పరం పరాయణమ్॥6390॥

2.33 (ముప్పది మూడవ శ్లోకము)

యః కశ్చనేశో బలినోఽన్తకోరగాత్ప్రచండవేగాదభిధావతో భృశమ్|

భీతం ప్రపన్నం పరిపాతి యద్భయాన్మృత్యుః ప్రధావత్యరణం తమీమహి॥6391॥

"ఈ మొసలి తప్పక నా పాలిట మృత్యు పాశమయ్యెను. దీని చేతికి చిక్కి నేను మిక్కిలి వ్యాకులపాటునకు లోనైతిని. నాతో సమానబలముగల ఏనుగులు కూడ నన్ను ఈ పెను ఆపదనుండి రక్షింప లేక పోవుచున్నవి. ఇంక ఆడ ఏనుగులు ఎట్లు రక్షింపగలవు? కావున, ఇప్పుడు నేను సంపూర్ణ విశ్వమునకు పరమ ఆశ్రయుడైన పరమాత్మను శరణు వేడెదను. మృత్యువు ఎంతయు బలీయమైనది. అది సర్పమువలె ప్రచండ వేగముతో అందరినీ కబళించుటకు పరుగులుదీయుచుండును. దానికి భయపడి భగవంతుని శరణువేడిన వానిని ఆ పరమాత్మ తప్పక రక్షించును. అతనికి భయపడియే మృత్యువు గూడ తన పనిని చక్కగా నెరవేర్చును. అతడు అందరికిని పరమాశ్రయుడు. కావున ఆ దేవదేవుని నేను శరణుజొచ్చెదను" అని గజేంద్రుడు నిశ్చయమునకు వచ్చెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ద్వితీయోఽధ్యాయః (2)

ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు రెండవ అధ్యాయము (2)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

 శ్రీమాత్రేనమః 

620వ నామ మంత్రము 25.7.2020

ఓం ఐం హ్రీం శ్రీం అనేకకోటిబ్రహ్మాండ జనన్యై నమః🙏🙏🙏అనేక బ్రహ్మాండ సముదాయములకు సృష్టికారకురాలై, జనయిత్రియైన జగన్మాతకు నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్ర నామావళి యందలి అనేకకోటిబ్రహ్మాండ జననీ యను పదకొండక్షరముల నామ మంత్రమును ఓం ఐం హ్రీం శ్రీం అనేకకోటిబ్రహ్మాండ జనన్యై నమః అని ఉచ్చరించుచూ ఆ మహాతల్లిని అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకునికి సృష్టి, సృష్టికి కారణభూతురాలైన జగన్మాతను ప్రసన్నం చేసుకోవడానికీ కావలసిన ఏకాగ్రత లభించి నిరంతర సాధనతో  బ్రహ్మతత్త్వాన్ని అర్థంచేసుకుని శాశ్వతమైన పరంధామమునకు మార్గము లభించి తరించును🌻🌻🌻అనేకకోటి బ్రహ్మాండముల  సృష్టికి కారణభూతురాలు పరమేశ్వరియే. ఆ తల్లి పరబ్రహ్మస్వరూపిణి. మనము నివసించు ఈ విశ్వము, సూర్యుడు, చంద్రుడు, త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, ప్రజాపతులు, దిక్పాలకులు, గ్రహములు, తారలు మొదలైన సమస్త జీవవస్తు జాలముతో కనిపించే బ్రహ్మాండము, ఇలాంటి బ్రహ్మాండము లెన్నిటినో ఉద్భవం, విలీనం చేయడం, సృష్టి, ప్రళయాల మధ్య జరుగుతూనే ఉంటుంది. ఈ బ్రహ్మాండములకు బీజప్రాయముగా ఉండునదే శ్రీమాత అనబడును. యతో వా ఇ మాని భూతాని జాయంతే (శ్రుతి). బ్రహ్మాండమునకు, అండాండమునకు వ్యత్యాసము లేనిదైనందున శ్రీమాత జనని అని భావించవలయుసు. అనంతకోటి భూత సముదాయములకును బీజ కారణమైనందున ప్రళయకాలములో తన గర్భములో ధరించి ఉండుటచేతనే అనేక కోటి బ్రహ్మాండజనని అని జగన్మాత  స్తుతింప బడుచున్నది🌺🌺🌺అటువంటి జనయిత్రికి నమస్కరించునపుడు ఓం ఐం హ్రీం శ్రీం అనేకకోటిబ్రహ్మాండ జనన్యై నమః అని అనవలెను🌻🌻🌻🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🔱నేడు శని (స్థిర) వారము🔱🔱🔱ఆ తిరుమలగిరి వాసుడైన శ్రీనివాసుని స్మరించు శుభదినము🌹🌹🌹శ్రీనివాసుని కరుణ అందరిపై ప్రసరించి అందరికీ శుభములు కలగుగాక🌻🌻🌻 ఓం నమో వేంకటేశాయ

43వ నామ మంత్రము 25.7.2020

ఓం ఐం హ్రీం శ్రీం కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై  నమః🙏🙏🙏తాబేలు పృష్ఠ (వీపు) భాగము కంటెను సుందరమైన మీగాళ్ళు (పాదాగ్రములు)  కలిగి యలరారు తల్లికి నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్ర నామావళి యందలి  కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా  యను పండ్రెండక్షరముల (ద్వాదశాక్షరీ) నామ మంత్రమును  ఓం ఐం హ్రీం శ్రీం కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై  నమః అని ఉచ్చరించుచూ ఆ  అఖిలాండేశ్వరిని అత్యంత భక్తి ప్రపత్తులతో ఆరాధించు సాధకులను ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా ఉద్దరించి సమస్త భౌతిక సుఖసంతోషములను లభింపజేసి, జీవితమంతా ఆధ్యాత్మికచింతనతో ప్రవర్తింపజేసి తరింజేయును🌻🌻🌻కూర్మపృష్ఠ (తాబేటి వీపును) జయిష్ణు (జయించు స్వభావముగల) ప్రపద (ముంగాలు అనగా పాదాగ్రము) కూడినది - కలిగియున్నది🌺🌺🌺ఈ పండ్రెండక్షరముల నామ మంత్రమును  ఓం ఐం హ్రీం శ్రీం కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై  నమః అని ఆపకుండా ఉచ్చరించ వలెను. ఏ పరిస్థితిలోనూ కూర్మపృష్ఠా అని ఆపి   చదవకూడదు...ఇంతకన్నా వివరించి చెప్పకూడదు..🌸🌸🌸తాబేటి వీపున కంటె ప్రశస్తముగా, సుందరమై ఒప్పారే పాదోపరిభాగములతో శ్రీమాత అలరారుచున్నది. అమ్మవారి పాదములు మోక్షప్రదములు. నాలుగు వేదాలకు సంబంధమైన నాలుగు వాక్యాలైన అహం బ్రహ్మాస్మి, తత్త్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, ఈ నాలుగు మహావాక్యాలు అమ్మవారి పాదాలను ప్రస్తుతించే వేదాలకు చెందినవి🙏🙏🙏అమృత మథనసమయంలో శ్రీమహావిష్ణువు ఆదికూర్మమై తన పృష్ఠభాగముతో మందరగిరిని క్షీరసాగరములోనికి క్రుంగకుండా ఉద్ధరించెను. అటువంటి బహు సుందరమైన ఆ ఆది కూర్మము యొక్క పృష్ఠభాగముకంటెను శ్రీమాత పాదాగ్రములు సుందరమై, అత్యంత మృదుత్వంతో అలరారు చున్నవని  ఈ నామ మంత్రములోని భావము🌹🌹🌹అంత శ్రేష్ఠమైన జగన్మాత పాదములు ఆశ్రితులకు అమృతపదముసు కలిగిస్తాయి, మోక్షదాయకములై పాపకూపములో పడకుండా ఉద్ధరిస్తాయి🌹🌹🌹అటువంటి శ్రీమాత పాదపద్మములపై దృష్టి నిలిపి నమస్కరించునపుడు ఓం ఐం హ్రీం శ్రీం కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై  నమః అని అనవలెను🌻🌻🌻🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🔱నేడు శని (స్థిర) వారము🔱🔱🔱ఆ తిరుమలగిరి వాసుడైన శ్రీనివాసుని స్మరించు శుభదినము🌹🌹🌹శ్రీనివాసుని కరుణ అందరిపై ప్రసరించి అందరికీ శుభములు కలగుగాక🌻🌻🌻 ఓం నమో వేంకటేశాయ🕉🕉🕉🕉🕉🕉🕉🕉 🕉️🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి  7702090319🕉

ధారిదేవి పవిత్రత.


విశిష్ట దైవంగా.. తల్లి ఉత్తరాఖండ్ యొక్క సంరక్షక దేవతగా పరిగణించబడుతుంది మరియు చార్ ధామ్ యొక్క రక్షకురాలిగా గౌరవించబడుతుంది
    
 ఈ గుడిలో దేవీ రూపం ఉదయం బాలికగా, మధ్యాహ్నం నడి వయస్కురాలిగా,
సాయంత్రం వృద్ధ స్త్రీ రూపంలోకి మారుతూ ఉంటుంది.

ఉత్తరాఖండ్‌లోని గర్వాల్- శ్రీనగర్ ప్రాంతంలో అలకనందా నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి ధారీదేవి ఆలయం ఉంది. అలకనందా నదీ ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తుందని ఈ ప్రాంతవాసుల నమ్మకం. దీనికి కూడా నిదర్శనాలు ఉన్నాయి. ధారీదేవి ఆశీసులతోనే అలకనంద ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుంది.

 ఈ ఆలయం గురించి మహాభారతంలోనూ ప్రస్తావించారు. సిద్ధపీఠం పేరుతో భాగవతంలోనూ పేర్కొన్నారు. 108 శక్తి పీఠాల్లో ధారీదేవి ఆలయం కూడా ఒకటని దేవీ భాగవతంలో తెలిపారు. 

#ఆదిశక్తి ఉగ్ర అంశం మహాకాళి అవతారమే ధారీదేవి.

 భక్తితో కొలిచినవారిని అనుగ్రహించే దేవత. ధిక్కరించిన వారికి అంతే కీడు జరుగుతుంది. క్రీ.శ 1882లో కేదారీనాథ్ ప్రాంతాన్ని ఓ ముస్లిం రాజు పడగొట్టి మసీదు నిర్మించాలని ప్రయత్నించాడు.ఆ రాజు చేసిన అపచారంతో కొండ చరియలు విరిగిపడి కేదారనాథ్ ప్రాంతం నేలమట్టమైపోయింది. ఆ ప్రకృతి విపత్తు వేలాది మందిని బలితీసుకుంది. దేవి మహత్మ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ ఇస్లాం రాజు తన ప్రయత్నాన్ని విరమించుకుని తోకముడిచాడు. అప్పటి నుంచి ఈ ఆలయం జోలికి ఎవరైనా వెళితే ధారీదేవి ఆగ్రహం చవిచూడక తప్పదనే బలమైన విశ్వాసం ఈ ప్రాంతంలో స్థిరపడింది.

 గర్వాల్ ప్రాంతంలో అలకనంద నది ఒడ్డున ఈ ధారీదేవి ఆలయం ఉంది. గర్భగుడిలో అమ్మవారి సగభాగం మాత్రమే ఉంటుంది. మిగతా భాగం కాళీమఠ్‌లో ఉంది. ఈ క్షేత్రంలో దేవీ రూపం మారుతుంది. ఉదయం పూట బాలికగానూ, మధ్యాహ్నం నడి వయస్కురాలిగానూ, సాయంత్రం వృద్ధ స్త్రీ రూపంలోకి మారుతూ ఉంటుంది. #
కాళీమఠ్‌లో నిజానికి అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు. ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు. ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఈ స్త్రీ యంత్రం అమ్మవారి యోనికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈపీఠానికి ఉత్తరదిశలో కేథారనాథ్ జ్యోతిర్లింగం ఉంది.

ధారి దేవి ఆలయం శ్రీనగర్ నుండి రుద్రప్రయాగ్ వెళ్లే మార్గంలో వస్తుంది. కాబట్టి మీరు కేదార్‌నాథ్ లేదా బద్రీనాథ్ వెళ్ళినప్పుడల్లా ఈ ఆలయాన్ని చూడవచ్చు. శ్రీనగర్ నుండి దాని దూరం పదిహేను కిలోమీటర్లు, రుద్రప్రయాగ్ నుండి ఇరవై కిలోమీటర్లు. ఈ స్థలం పేరు కలిసౌర్.ఓం .
*****************************

శ్రీ గరుడ కవచ స్తోత్రం

ఓం తత్పురుషాయ విద్మహే  సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్.

అస్యశ్రీ గరుడ కవచ స్తోత్ర మంత్రస్య నారద ఋషి:
వైనతేయో దేవత అనుష్టుప్ చందః
మమ గరుడ ప్రసాద స్థిత్యర్దే జపే వినియోగః

శిరోమే గరుడః పాతు లలాటం వినతా సుతః |
నేత్రే తు సర్పహో పాతు కర్ణౌ పాతు సురార్చితః ||

నాసికం పాతు సర్పారిహి వదనం విష్ణువాహనః |
సూర్య సూతానుజః కంఠం భుజౌపాతు మహాబలః ||

హస్థౌ ఖగేశ్వరః పాతు కరాగ్రే త్వరుణా కృతీ |
నఖాన్ నఖాయుదః పాతు కుక్షౌ ముక్తి ఫలప్రధః ||

స్థనౌ మేపాతు విహగః హృదయం పాతుసర్వదా |
నాభిం పాతు మహాతేజాః కటిం పాతు సుధాహరః ||

ఊరూపాతు మహావీరో జానునీ చండవిక్రమః |
జంఘే దున్డాయుదః పాతు గల్ఫౌ విష్ణురథః సదా ||

సుపర్ణః పాతు మే పాధౌ తాక్ష్యా పాదాంగులీ తదా |
రోమకూపాని మే వీరః త్వచం పాతు భయపహః ||

ఇత్యేవం దివ్య కవచం పాపఘ్నం సర్వకామదం |
యః పఠేత్ ప్రాతరుద్దాయ విషశేషం ప్రణశ్యతి ||

త్రిసంధ్యం యః పఠేనిత్యం బన్ధనాత్ ముచ్యతే నరః |
ద్వాదశాహం పఠేధ్యస్తు ముచ్యతే శత్రు బన్ధనాత్ ||

ఏకవారం పఠేధ్యస్తు ముచ్యతే సర్వకల్భిషై: |
వజ్ర పంజర నామేధం కవచం బన్ధ మోచనం ||

🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

🌹శ్రీ గరుడదండకం 🌹

నమః పన్నగనద్ధాయ వైకుణ్ఠవశవర్తినే । శ్రుతిసిన్ధు సుధోత్పాదమన్దరాయ గరుత్మతే ॥ 1॥

గరుడమఖిలవేద నీడాధిరూఢమ్ ద్విషత్పీడనోత్కణ్ఠి తాకుణ్ఠవైకుణ్ఠపీఠీకృతస్కన్ధమీడే స్వనీడాగతిప్రీతరుద్రాసుకీర్తిస్తనాభోగగాఢోపగూఢ స్ఫురత్కణ్టకవ్రాతవేధవ్యథావేపమాన ద్విజిహ్వాధిపాకల్పవిష్ఫార్యమాణ స్ఫటావాటికారత్నరోచిశ్ఛటా రాజినీరాజితం కాన్తికల్లోలినీరాజితం ॥ 2॥

జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాధిపాహార హారిన్దివౌకస్పతిక్షిప్తదమ్భోళిధారాకిణాకల్ప కల్పాన్తవాతూల కల్పోదయానల్ప వీరాయితోద్యచ్చ మత్కార దైత్యారి త్రధ్వజారోహనిర్ధారితోత్కర్షసఙ్కర్షణాత్మన్ గరుత్మన్ మరుత్పఞ్చ కాధీశ సత్యాదిమూర్తే న కశ్చిత్సమస్తే నమస్తే పునస్తే నమః ॥ ౩॥

నమః ఇదమజహత్సపర్యాయ పర్యాయ నిర్యాతపక్షాని లాస్ఫాలనోద్వేలపాథోధివీచీచపేటాహతాగాధ పాతాళభాఙ్కారసఙ్క్రుద్ధనాగేన్ద్ర పీడాసృణీ భావభాస్వన్నఖశ్రేణయేచణ్డతుణ్డాయ నృత్యద్భుజఙ్గభ్రువే వజ్రిణే దంష్ట్రయ తుభ్యమధ్యాత్మవిద్యావిధేయా విధేయా భవద్దాస్యమాపాదయేథా దయేథాశ్చ మే ॥ 4॥

మనురనుగత పక్షివక్త్ర స్ఫురత్తారకస్తావకశ్చిత్రభానుప్రియాశేఖరస్త్రాయతాంనస్త్రివర్గాపవర్గప్రసూతిః పరవ్యోమధామన్వలద్వేషి దర్పజ్వలద్వాలఖిల్య ప్రతిజ్ఞావతీర్ణ స్థిరాం తత్త్వబుద్ధిం పరాంభక్తిధేనుం జగన్మూలకన్దే ముకున్దే మ్హానన్దదోగ్ధ్రీం దధీథాముధాకామహీనామహీనామహీనాన్తక ॥ 5॥

షట్త్రింశద్గణచరణో నరపరిపాటీనవీనగుమ్భగణః ।
విష్ణురథదణ్డ కోఽయం విఘటయతు విపక్షవాహినీవ్యూహమ్ ॥ 6॥

విచిత్రసిద్ధిదః సోఽయం వేంకటేశవిపశ్చితా । గరుడధ్వజతోషాయ గీతో గరుడదణ్డకః ॥ 7॥

కవితార్కికసింహాయ కల్యణగుణశాలినే ।శ్రీమతే వేంకటేశాయ వేదాన్తగురవే నమః ॥ శ్రీమతే నిగమాన్తమహాదేశికాయ నమః ॥

🙏ఇతి గరుడదండకః సామాప్తః🙏

⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️

🌹గరుడ గాయత్రి మంత్రం🌹

ఓం తత్ పురుషాయ విద్మహే
సువర్ణ పక్షయ ధీమహే
తన్నో గరుడః ప్రచోదయాత్.
⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️

🌹శ్రీ గరుడ ద్వాదశ నామ స్తోత్రం🌹
సుపర్ణం వైనతేయం చ నాగారిం నాగాభీషణం |
జితాంతకం విషారిం చ అజితం విశ్వరూపిణం ||

గరుత్మంతం ఖగశ్రేష్ఠం తార్క్ష్యం కశ్యపనందనం |
ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః ||

యః పటేత్ ప్రాతరుద్దాయ స్నానే వా శయనేపివా |
విషం నాక్రామతే తస్య న చ హింసంతి హింసకాః ||

సంగ్రామే వ్యవహారే చ విజయ స్తస్య జాయతే |
బంధనాన్ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవచ ||

🙏శ్రీ గరుడ ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం🙏

⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️

🌹శ్రీ గరుడ ప్రయోగ మంత్రం🌹

ఓం ఈం ఓం నమో భగవతే శ్రీ మహా గరుడాయ పక్షీంద్రాయ విష్ణు వల్లభాయ త్రైలోక్య పరిపూజితాయ ఉగ్రభయంకర కాలానల రూపాయ వజ్ర నఖాయ వజ్ర తుండాయ వజ్ర దంతాయ వజ్ర దంష్ట్రాయ  వజ్ర పుచ్చాయ వజ్ర పక్షోలక్షిత శరీరాయ ఓమికేయెహి శ్రీ మహా గరుడా ప్రతిమా శాసనాస్మిన్న విషా విష దుష్టానాం విషం దూషయ దూషయ స్ప్రుష్టానాం నాశయ నాశయ దంత శూకానాం విషం ధారయ ధారయ ప్రలీనం విషం ప్రణాశయ ప్రణాశయ సర్వ విషం  నాశయ నాశయ హన హన ధహ ధహ పచ పచ భస్మీ కురు భస్మీ కురు  హుం ఫట్ స్వాహా ||

చంద్ర మండల సంఖాష సూర్య మండల ముష్టిక పృథ్వీ మండల ముధ్రాంగ  శ్రీ మహా గరుడాయ విషం హర హర హుం    ఫట్ స్వాహా | ఓం క్షిప స్వాహా ఓం ఈం సచ్చరథి  సచ్చరథి తత్కారి మత్కారి విషానాంచ విషరూపిణి విషదూషిని విష షోషిని విషనాశిని విషహారిణీ హతం విషంనష్టం విషం అంత ప్రలీనం విషం ప్రణస్తం విషం హతం త బ్రహ్మణా విషం హతం |

🙏హతమింద్రస్చ్య  వజ్రేన స్వాహా🙏

కాశ్యాంతు మరణాన్ముక్తిః"

 

శ్రీ రామకృష్ణ పరమహంస గారి అద్భుత దివ్య దర్శనాలలో ఇది ఓకటి....
కాశీ క్షేత్రములో మరణము,  ముక్తి అనే నానుడికి బలము చేకూర్చే సంఘటన ఇది.
ఒక సమయములో రాణిరాసమణి తన పరివారము, అల్లుడు మథుర్, కొంతమంది పండితులు, రామకృష్ణుల వారితో కలసి కాశీ నగర సందర్శనకు నౌకల్లొ బయలుదేరారు.అలా కాశీలో వున్న రోజులలొ ఓకనాడు మధుర్,ఇంకొంతమంది పండాలతో కలసి గంగానదిపై విహారము చేస్తున్నారు.ఆ పడవ మణికర్ణికా ఘాట్ సమిపించగా,అక్కడి స్మశానములో జరుగుచున్న శవదహనాన్ని చూసి,అకస్మాత్తుగా ఆనందపరవశులై వడిగా పడవ అంచుకు వెళ్ళి సమాధిమగ్నులై నిలబడిపొయారు. (ఆ పరిస్థితులలొ సాధారణముగా దేహస్మృతి వుండదు అందువలన ఆయిన ఎక్కడ నదిలో పడిపొతారోఅని కొందరు రివ్వున ముందుకు వెళ్ళారు. కాని ఆయిన దివ్యదరహాసాలతో నిశ్చలముగా అక్కడ నిలబడి ఉండగా ఎవ్వరు కాపాడవలసిన అవసరము లేకుండా పొయింది). కొంత సేపటికి వారే ఈ అనుభూతిగూర్చి వివరించారు."పొడవరి పింగళవర్ణ జటాధారీ,శ్వేతవర్ణ పురుషుడు ఐన ఓక పురుషుడు మెల్లగా ఆడుగులు వేస్తూ ప్రతి చితి వద్దకు వెళ్ళి, నెమ్మదిగా అందలి జీవుని పైకెత్తి,చెవిలో తారకబ్రహ్మమంత్రము ఉపదేశించడము చూశాను! సర్వశక్తిమయి అయిన జగదాంబ - కాష్ఠానికి ఆవలి వైపు కూర్చుని,ఆ జీవుడి స్థూలసూక్ష్మ కారాణాది బంధాల నన్నిటిని విడదిసి,స్వయముగా మోక్ష ద్వారము తెరచి,కైవల్య ధామానికి పంపుతున్నది. ఎన్నో యుగాల తపొనిష్ఠలచే మాత్రమే పొందగ్గ అద్వైతానుభవాన్ని భూమానందాని శ్రీ విశ్వనాధుడు క్షణములో ఆ జీవులకు యీ రీతిన ప్రపాదించి వారిని కృతార్థులను చేస్తున్నాడు.

****************************

24, జులై 2020, శుక్రవారం

ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలి


1.అశ్విని
ఓం శ్వేతవర్ణై విద్మహే
సుధాకరాయై ధిమహి
తన్నో అశ్వినేన ప్రచోదయాత్

2.భరణి
ఓం కృష్ణవర్ణై విద్మహే
దండధరాయై ధిమహి
తన్నో భరణి:ప్రచోదయాత్

3.కృత్తికా
ఓం వణ్ణిదేహాయై విద్మహే
మహాతపాయై ధీమహి
తన్నో కృత్తికా ప్రచోదయాత్
4.రోహిణి
ప్రజా ప్రజవృధ్యై చ విద్మహే
విశ్వరూపాయై ధీమహి
తన్నో రోహిణి ప్రచోదయాత్

5.మృగశిరా
ఓం శశిశేఖరాయ విద్మహే
మహారాజాయ ధిమహి
తన్నో మృగశిర:ప్రచోదయాత్

6.ఆర్ద్రా
ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే
పశుం తనాయ ధిమహి
తన్నో ఆర్ద్రా:ప్రచోదయాత్

7.పునర్వసు
ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే
అదితి పుత్రాయ ధిమహి
తన్నో పునర్వసు ప్రచోదయాత్

8.పుష్య
ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే
మహాదిశాయాయ ధిమహి
తన్నో పుష్య:ప్రచోదయాత్

9.ఆశ్లేష
ఓం సర్పరాజాయ విద్మహే
మహారోచకాయ ధిమహి
తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్

10.మఖ
ఓం మహా అనగాయ విద్మహే
పిత్రియాదేవాయ ధిమహి
తన్నో మఖ: ప్రచోదయాత్

11.పుబ్బ
ఓం అరియంనాయ విద్మహే
పశుదేహాయ ధిమహి
తన్నో పూర్వఫల్గుణి ప్రచోదయాత్

12.ఉత్తరా
మహాబకాయై విద్మహే
మహాశ్రేష్ఠాయై ధీమహి
తన్నో ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్

13.హస్త
ఓం ప్రయచ్చతాయై విద్మహే
ప్రకృప్రణీతాయై ధీమహి
తన్నో హస్తా ప్రచోదయాత్

14.చిత్తా
ఓం మహాదృష్టాయై విద్మహే
ప్రజారపాయై ధీమహి
తన్నో చైత్రా:ప్రచోదయాత్

15.స్వాతి
ఓం కామసారాయై విద్మహే
మహాని ష్ఠాయై ధీమహి
తన్నో స్వాతి ప్రచోదయాత్

16.విశాఖ
ఓం ఇంద్రాగ్నేస్యై విద్మహే
మహాశ్రేష్ఠాయై చ ధీమహీ
తన్నో విశాఖ ప్రచోదయాత్

17 అనూరాధ
ఓం మిత్రదేయాయై విద్మహే
మహామిత్రాయ ధీమహి
తన్నో అనూరాధా ప్రచోదయాత్

18.జ్యేష్ఠా
ఓం జ్యేష్ఠాయై విద్మహే
మహాజ్యేష్ఠాయై ధీమహి
తన్నో జ్యేష్ఠా ప్రచోదయాత్

19.మూల
ఓం ప్రజాధిపాయై విద్మహే
మహాప్రజాధిపాయై ధీమహి
తన్నో మూలా ప్రచోదయాత్

20.పూర్వాషాఢ
ఓం సముద్ర కామాయై వి
ఓం ప్రజాధిపాయై విద్మహే
మహాప్రజాధిపాయై ధీమహి
తన్నో మూలా ప్రచోదయాత్

20.పూర్వాషాఢ
ఓం సముద్ర కామాయై విద్మహే
మహాబీజితాయై ధిమహి
తన్నో పూర్వాషాఢా ప్రచోదయాత్

21.ఉత్తరాషాఢ
ఓం విశ్వేదేవాయ విద్మహే
మహాషాఢాయ ధిమహి
తన్నో ఉత్తరాషాఢా ప్రచోదయాత్

22. శ్రవణ
ఓం మహాశ్రేష్ఠాయై విద్మహే
పుణ్యశ్లోకాయ ధీమహి
తన్నో శ్రవణ ప్రచోదయాత్

23.ధనిష్ఠా
ఓం అగ్రనాథాయ విద్మహే
వసూప్రితాయ ధీమహి
తన్నో శర్విష్ఠా ప్రచోదయాత్

24.శతభిషం
ఓం భేషజాయ విద్మహే
వరుణదేహాయ ధీమహి
తన్నో శతభిషా ప్రచోదయాత్

25.పూర్వాభాద్ర
ఓం తేజస్కరాయ విద్మహే
అజరక పాదాయ ధీమహి
తన్నో పూర్వప్రోష్టపత ప్రచోదయాత్

26.ఉత్తరాభాద్ర
ఓం అహిరబుధ్నాయ విద్మహే
ప్రతిష్ఠాపనాయ ధీమహి
తన్నో ఉత్తరప్రోష్టపత ప్రచోదయాత్

27.రేవతి
ఓం విశ్వరూపాయ విద్మహే
పూష్ణ దేహాయ ధీమహి
తన్నో రేవతి ప్రచోదయాత్ .....
ఇప్పుడున్న విష(మ)జ్వరాల ప్రభావం బారిన పడకుండా సకలజనుల శ్రేయస్సు కోరి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు తెలియజేసిన మంత్రతుల్య మార్గాలు. దీనిని ఉపదేశంగా గ్రహించి మనందరం మననం చేసుకుందాం. మనతో పాటుగా విశ్వమంతా బాగుండాలని ప్రార్థిద్దాం.

శ్రీరామరక్ష.

💥తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ అంతటా వ్యాపించింది. కమ్యూనిటీ స్ప్రెడ్ అయింది.. సామాజిక వ్యాప్తి బలంగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండగలరు.. తెలంగాణ వైద్య శాఖ అధికారులు..💥

💥రాబోయే నాలుగు నుండి ఐదు వారాలు చాలా సంక్లిష్టమైనది. అత్యంత జాగ్రత్తగా ప్రజలంతా ఉండాలని తెలంగాణ వైద్య అధికారులు తెలియజేశారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి క్షేమంగా ఉండండి అని తెలియజేశారు.

💥మిత్రులారా ఆ జిల్లా ఈ జిల్లా ఏమీ లేదు తెలంగాణలో అన్ని జిల్లాలలో.. ముఖ్యంగా పట్టణాలలో కమ్యూనిటీ స్ప్రెడ్ సామాజిక SPREAD కరోనా వైరస్ చైనా కమ్యూనిస్టు వైరస్ల వ్యాపించింది.. అత్యంత భయంకరమైన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి..

💥తప్రభుత్వం ఎటువంటి వైద్య సదుపాయం చేయడం లేదు, కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్ లో రక్త పిశాచి, రాక్షసుల మాదిరిగా రక్తం తాగుతూ దొంగతనంగా లక్షల రూపాయల బిల్లులు వేస్తూ బ్రతికుండగానే మనుషులను చంపేస్తున్నారు.

💥సకాలంలో ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ విధించినప్పుడు దేశము, మనము ఎంతో సురక్షితంగా ఉన్నారు..

💥చక్కటి కొనసాగిన అద్భుతంగా లాక్డౌన్ ని అనవసరంగా వలస కార్మికుల దొంగ ఏడుపు ఏడ్చే పనికిరాని చెత్త  నాయకుల వల్ల, దొంగ  మీడియా వల్ల లాక్డౌన్ బలవంతంగా ఎత్తి వేయవలసి వచ్చింది. ఈరోజు  దేశంలో, రాష్ట్రంలో మరియు జిల్లాలు ఈ పరిస్థితికి ప్రధాన కారణం.

ఇంతటి భయంకర పరిస్థితుల్లో కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకునీరెత్తినట్లు ప్రభుత్వాలు

💥మిత్రులారా బయట భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎవరు ఎవరిని కాపాడే పరిస్థితి లేదు. మీ కుటుంబం లోపల ఏ ఒక్కరూ కరోనా వైరస్ చైనా కమ్యూనిస్టు వైరస్ బారిన పడ్డ కుటుంబం మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది.

💥కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండగలరు, ఇంట్లోనే క్షేమంగా ఉండగలరు. లాక్ డౌన్ లో పాటించిన పూర్తిస్థాయి క్రమశిక్షణతో ఉండడమే మనందరికీ శ్రీరామరక్ష.

Tapadia Diagnostic cente, RTC cross road,

Tapadia Diagnostic cente, RTC cross road, Ln Dr Radheshyam Tapadia  have started portable oxygen concentrator facilities for needy pts.They can use this for 2 or 3 days, in an emergency,esp those needing oxygen support when at home quarantine/ or till there is bed availability.
This facility is totally free of cost.
U can suggest to any needy pt.
contact Ln Vijaylaxmi
9666654647
Ln Umesh Agarwal
9246195444
Ln Vibha Bharti
9393079342
Ln Nilesh Chheda
9392248002
LIONS CLUB OF HYDERABAD EAST.
********************

తెలుగు అనువాదం

తపాడియా డయాగ్నోస్టిక్ సెంటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్,

తపాడియా డయాగ్నోస్టిక్ సెంటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, ఎల్ఎన్ డాక్టర్ రాధేశ్యం తపాడియా అవసరమైన పిటిల కోసం పోర్టబుల్ ఆక్సిజన్ సాంద్రత సౌకర్యాలను ప్రారంభించారు. వారు దీనిని 2 లేదా 3 రోజులు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించవచ్చు, ఇంటి దిగ్బంధంలో ఉన్నప్పుడు / లేదా ఉన్నంత వరకు ఆక్సిజన్ మద్దతు అవసరం ఉన్నవారు మంచం లభ్యత.
ఈ సౌకర్యం పూర్తిగా ఉచితం.
మీరు ఎవరైనా వ్యాధి గ్రేసులకు  సూచించవచ్చు.
Ln విజయలక్ష్మిని సంప్రదించండి
9666654647
ఎల్ఎన్ ఉమేష్ అగర్వాల్
9246195444
ఎల్ఎన్ విభ భారతి
9393079342
ఎల్ఎన్ నీలేష్ ఛేడా
9392248002
హైదరాబాద్ ఈస్ట్ యొక్క లయన్స్ క్లబ్.
*********************

లంఘనం

श्लोकम् :
अतीव बलहीनं हि लङ्घनं नैव कारयेत् ।
ये गुणा लङ्घने प्रोक्तास्ते गुणा लघुभोजने ।।

శ్లోకం:
అతీవ బలహీనం హి లఙ్ఘనం నైవ కారయేత్ ।
యే గుణా లఙ్ఘనే ప్రోక్తాః తే గుణా లఘుభోజనే ॥
        
ప్రతిపదార్థం:
అతీవ = మిక్కిలి, బలహీనం హి = బలహీనముగా ఉన్న వానికి నే,  (హి = indeed), లఙ్ఘనం = లంఖణం, న ఏవ కారయేత్ = చేయించకూడదు, యే = ఏవైతే, గుణా = గుణములు, లఙ్ఘనే = లంఘనములో, ప్రోక్తాః = చెప్పబడినవో, తే = అవే, గుణా = గుణములు, లఘుభోజనే = మిత ఆహారమందునూ ఉన్నవి.

Meaning:
Skipping a meal should not be got implemented for a person who is very weak. Whatever good qualities were advocated in skipping a meal are also available in the limited and controlled meal. 

తాత్పర్యం:
చాలా నీరసించి ఉన్న వానిని లంఘనం (లంఖణం) చేయించకూడదు. లంఘనములో ఏవైతే మంచి గుణములు ఉన్నవి అని చెప్పబడినవో ఆ మంచి గుణములన్నీ లఘు భోజనము అంటే మితాహారములో కూడా ఉన్నవి.

లంఘనంలో చెప్పిన గుణాలన్నీ లఘు భోజనంలో కూడా ఉన్నవి కావున తేలికగా భోజనం చేయించాలి.

లంఘనం అంటే గెంతుట. అంటే ఆంగ్లంలో skipping అంటారు. Skipping a meal occasionally is always good for health అంటారు. లంఘనం ప్రకృతి భాషా ప్రయోగం. లంఖణం వికృతి భాషా ప్రయోగం.

అప్పుడప్పుడు మన జీర్ణకోశానికి జీర్ణ వ్యవస్థకి కొంత విరామం ఇవ్వడం అనేది శ్రేయస్కరం అని మన పెద్దలు చెపుతూ ఉంటారు. ఆయుర్వేద శాస్త్ర రీత్యా కూడ ఇది ఆచరణ యోగ్యం. అందుచే మన పూర్వీకులు మనని అప్పుడప్పుడు లంఘనం చేయమంటూ ఉంటారు లేదా ఉపవాసం చేయమంటారు. ఉపవాసం అంటే నిత్యమూ తినేట్టుగా పూర్తి భోజనం కాకుండా, మితాహారం తినడం. పర్వదినాలని ఉపయోగించుకుని మనం ఆ విధంగా చేస్తూ ఉంటాము. పూర్తి లంఖణంలోనూ, మితాహారములోనూ అంటే ఉపవాసములోనూ అవే మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏ విధముగా అవకాశం ఉంటే ఆ విధముగా చేసుకో వచ్చును.

లంఘనం పరమౌషధం అనేది తరచుగా వాడ బడుతూ ఉండే నానుడి. అంటే ఒకపూట భోజనం మానివేయడం అనేది అన్నిటికంటే మంచి ఔషధం అని అర్థం.

నేను – నా కరోనా

అది జూన్‌ 28వ తేదీ. సాయంత్రం నాలుగు గంటలు. ఆఫీసుకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్నాను. ఇంతలో మబ్బులు    కమ్ముకొచ్చాయి. చినుకు చినుకుతో మొదలైన వాన భారీ వర్షంగా మారింది. ఆఫీసు సమయం దాటిపోతోంది. సాయంత్రం ఆరు అయ్యింది. బాస్‌కు ఫోన్‌ చేసి ఆఫీసుకు రాలేనని చెప్పాను. ఇంటి దగ్గర నుంచే న్యూస్‌ ఫాలోఅప్‌ చేస్తానని చెప్పాను. ఇంతకీ చెప్పలేదు కదూ! నేను జర్నలిస్టుని. ఒక ప్రముఖ దినపత్రికలో రిపోర్టర్ల నెట్‌వర్కుకు ఇన్‌చార్జిని. ఎప్పుడూ వార్తలు రాసేందుకు మాత్రమే ఉపయోగించే వర్కు ఫ్రం హోమ్‌ అనే పదం కరోనా పుణ్యమా అని మా పత్రికల్లోని అన్ని విభాగాల్లోకి జొర బడింది. మాకు ఈ పదం, మా కోసం ఉపయోగించడం కాసింత గర్వంగా,  ఫ్యాషన్‌గా ఉందనుకోండి. 
రాత్రి 9 దాటింది. ఆఫీసు పని దాదాపు పూర్తయింది. కొంచెం ఒళ్పు నొప్పులుగా అనిపించింది. ఒక్కసారి ఒళ్ళు ఝల్లుమనిపించింది. ఆరు పదులు దాటిన వయస్సు నాది. బీపీ, షుగర్‌ ఇతర దీర్ఘకాలిక వ్యాధులేమీ లేవు. తలనొప్పి, జ్వరం, ఇతర ఆరోగ్య కారణాలతో గత నాలుగైదేళ్ళలో ఆఫీసుకు సెలవు పెట్టిన సందర్భం కూడా లేదు. మంచి ఆరోగ్యవంతుణ్ణి అని చెప్పలేను కానీ, నా వయస్సుకు నా ఆరోగ్యంపట్ల కొంచెం గర్వంగానే ఉంటా. కానీ కరోనా కథలు, అది పెట్టే వెతలు బాగా తెలిసి ఉండడంతో ఆ కాస్త ఒళ్ళు నొప్పులకే చిన్న జడుపు ప్రవేశించింది. రేపు ఆదివారమే కదా! విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందిలే అనుకున్నా. కానీ ఏదో అనుమానంగానే  ఉంది. 
తెల్లవారింది. అనుమానం అణువణువుకీ ప్రవేశించడం ప్రారంభించింది. నాలుగు సార్లు విరోచనాలయ్యాయి. ఒళ్ళు నొప్పులు తెలుస్తున్న స్థాయికి వచ్చాయి. లో జ్వరం ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఆ రోజంతా ఇంట్లో వాళ్ళకు దూరంగా, మా మనవడికి అంటీ ముట్టనట్లుగా వ్వవహరించా. ఇంట్లో నా శ్రీమతితోపాటు, మా పెద్దమ్మాయి, అల్లుడు, మనవడు ... మొత్తం అయిదుగురుం ఉంటాం. చిన్న కూతురు అమెరికాలో. ఎంఎస్‌ పూర్తి చేసి ఫ్లోరిడాలో ఉద్యోగం చేస్తోంది. 
 నా పరిస్థితి అప్పటికి ఎవరికీ తెలియదు. సాయంత్రానికి మరో రెండు సార్లు లూజ్‌ మోషన్స్‌ అయ్యాయి. రాత్రి 8.30కి తొలిసారిగా భయం ప్రవేశించింది. ఇక దాచుకోవడం కరెక్ట్‌ కాదనిపించింది. ఇలాంటి సందర్భంలో మొదట గుర్తుకు వచ్చేది మంచి మిత్రులే కదా! ఇద్దరు మిత్రులు ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటారు. వారిలో ఒకరు సహచరుడు, సహ పాత్రికేయుడు (మాజీ). రెండవ మిత్రుడు యూనివర్సిటీలో బ్యాచ్‌మేట్‌. ‘‘ముందు అజిత్రోమైసిన్‌ వేసుకో, రేపు డాక్టర్‌తో మాట్లాడదాం’’ అని చెప్పారు. మేమున్నాం అన్న భరోసా ఇచ్చారు. ఆ భరోసా గొప్పదా? కరోనా భయం గొప్పదా? అంటే నేను సమాధానం చెప్పలేను కానీ, ఆ భరోసానే ఆ రాత్రికి ఊపిరిగా పని చేసింది.
మా అల్లుడు వెళ్ళి టాబ్లెట్స్‌ తీసుకు వచ్చాడు. డోలో 650, అజిత్రోమైసిన్‌ 500 ఎంజీ. రాత్రికి నేను బెడ్‌ రూమ్‌లో పడుకోలేదు. హాల్‌లో ఒంటరిగా పడుకున్నా. నిద్ర సరిగా పట్టలేదు. వేకువ జామయ్యింది. పరిస్థితిలో మార్పు లేదు. ఒళ్ళు నొప్పులు, లోజ్వరం కొనసాగుతున్నాయి. ఇంట్లో ఇంకా ఎవరూ నిద్ర లేవలేదు. ఒక నిర్ణయానికి వచ్చాను. నేను వాడిన బెడ్‌షీట్లు, దిండు గలీబు తీసి సర్ఫు నీళ్ళలో వేశాను. హాల్‌లో డెట్టాల్‌ వాటర్‌ స్ర్పే చేశాను. నాలుగు జతల బట్టలు, కొన్ని పుస్తకాలు, రైటింగ్‌ పేడ్లు, మందులు అప్పటికే వాడుతున్న పొడులు (దాల్చిన చెక్క, మిరియాలు, మెంతులు  వాము, సోంపు, జీలకర్ర గ్రయిండ్ చేసిన పొడులు) సర్దుకున్నాను. ఈ పొడులు అంత రెగ్యులర్‌ కాకపోయినా గత ఆరు నెలలుగా అడపాదడపా కషాయాలుగానో, ఇతరత్రానో వాడుతూనే ఉన్నాం. డి విటమిన్‌ – టాయో 60కె గత సంవత్సరంగా వాడుతున్నాం. జింకోవిట్‌ 50 ఎంజి, విటమిన్‌ సి 1000 ఎంజి, బికాంప్లెక్సు టాబ్లెట్లు కూడా నాలుగు నెలలుగా రోజూ ఒకటి (మధ్యలో డుమ్మాలున్నా) వాడుతున్నాం.   
మేముండేది ఇండిపెండెంట్‌ ఓన్‌ హౌస్‌. ఫస్ట్‌ ఫ్లోర్‌, సెకండ్‌ ఫ్లోర్‌ డూప్లెక్సు. మా అయిదుగురి నివాసం.. గ్రౌండ్‌ ఫ్లోర్‌ డబుల్‌ బెడ్‌ రూం ఇటీవలే ఖాళీ అయ్యింది. మా టెనెంట్‌ది మధ్యప్రదేశ్‌లోని ఒక గ్రామం. నాగపూర్‌కు మూడు గంటల ప్రయాణం. కరోనా ఆంక్షలు ఇంకా 48 గంటల్లో ప్రారంభమవుతాయనగా కుటుంబంతో సహా సొంతూరు వెళ్ళాడు. వర్కు ఫ్రం హోం చేస్తుండగానే ఆయన పనిచేసే కంపెనీ హైదరాబాద్‌ విభాగం మూతపడింది. ఆ వార్త తెలియజేసి, త్వరలో వచ్చి ఇల్లు ఖాళీ చేస్తానన్నాడు. నెల రోజుల్లోనే గుర్‌గావ్‌లో ఉద్యోగం వచ్చిందతనికి. తాను అక్కడ నుంచి వచ్చి ఇల్లు ఖాళీ చేయడం (ఇన్ని ఆంక్షల మధ్య రాష్ట్రాలు దాటుకుని ....) ఇబ్బందంటూ ఒక రోజు కాల్‌ చేశాడు. ఒక వెహికల్‌ మాట్లాడి తన సామాను నన్నే పంపమని కోరాడు. ఒక్క క్షణం నాకు అర్ధం కాలేదు. మరు క్షణం ఆలోచిస్తే అతను చెప్పింది నిజమేననిపించింది. ఒక ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ కంపెనీతో మాట్లాడి, ఇంటి తాళం పగులగొట్టి సామాను పంపాను. ప్యాకింగ్‌ చేసే దృశ్యాలు, వెహికల్‌కి లోడ్‌ చేసే దృశ్యాలు ఆయన అడగకుండానే వీడియో తీసి పంపించాను. చాలా సంతోషపడ్డాడు. నా శ్రీమతి వెంటనే ఇల్లు అద్దంలా శుభ్రం చేయించింది. టులెట్‌ బోర్డు తగిలించాం. పది రోజుల్లో నలుగురు వచ్చారుగాని, ఇద్దరు మాకు నచ్చలేదు. మరో ఇద్దరు అద్దె మెచ్చ లేదు. అలా ఖాళీగా ఉన్న ఇల్లు నాకు హోమ్‌ క్వారంటైన్‌ అవడానికి ఉపయోగపడింది. నా కుటుంబ సభ్యులను ప్రమాదం బారిన పడకుండా తక్షణ చర్య తీసుకోవడానికి దోహదపడింది. 
గ్రౌండఫ్లోర్‌లోకి వచ్చి తెచ్చుకున్న సామాను సర్దుకున్నాను. సెల్లార్‌లో అద్దెకున్న వారి ఇండక్షన్‌ స్టౌ, ఇంట్లో అదనంగా ఉన్న నవారు మంచం, పక్క బట్టలు, దిండ్లు కూడా వచ్చి నాతో  చేరాయి. ఇల్లు శుభ్రంగానే ఉంది. తక్షణం చేయాల్సిన పనులు రెండు ఉన్నాయి. ఒకటి ఒక్కడ్నే నవారును టైట్‌ చేసుకుంటూ మంచాన్ని సిద్ధం చేసుకున్నా. (దీనిలో కష్టం, టెక్నిక్‌ అనుభవం ఉన్న వారికే అర్ధమవుతుంది. రెండవ మనిషి తోడుంటేనే ఈ పనికి ఆపసోపాలు పడతారు. అలాంటిది ఒక్కడినే ... పని పూర్తయింది. నవారులో బిర్రుతనం వచ్చింది.) అదే ఊపులో ఒంటరిగా ఉండేందుకు మనస్సును కూడా సిద్ధం చేసుకున్నా. 
నా మిత్ర ద్వయం సహకారంతో సోమవారం, జూన్‌28 ఉదయాన్నే ఒక డాక్టర్‌ను సంప్రతించాను. పెద్దగా లక్షణాలు లేవు కదా! రెండు రోజులు ఆగండి, ఎక్సరే తీద్దాం అన్నారు. మిత్రులిద్దరూ సూచనలు, జాగ్ర త్తలు చెబుతూనే ఒక ప్రైవేటు ల్యాబ్‌లో ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌కి బుక్‌ చేశారు. పరీక్ష చేయించుకోవడం పెద్ద ప్రహసనంగా ఉంది. అంత తేలిక కాదు. వాళ్ళు ఇంటికి వచ్చి స్వాబ్‌ టెస్ట్‌ తీసుకునేట్లు మాట్లాడారు. బుధవారం, (జూలై ఫస్ట్‌) వస్తారని చెప్పారు. స్వయంగా వెళ్ళి క్యూలో నిలబడి టెస్ట్‌ చేయించుకోవల్సిన పరిస్థితి తప్పినందుకు ఊపిరి పీల్చుకున్నాను.  అయితే నాలో ఉన్న భయానికి, ఆందోళనకు మళ్లీ రెక్కలు వచ్చాయి. వారు ఎలా వస్తారో తెలియదు. ఎలా టెస్ట్‌ తీసుకుంటారో తెలియదు. డ్రెస్‌లో ఉంటారా? టువీలర్‌లో వస్తారా? ఫోర్‌ వీలర్‌లో వస్తారా? ఇంటి చుట్టు పక్కల వాళ్ళకు తెలుస్తుందేమో? పని అమ్మాయిని రానివ్వరేమో! ఇంట్లో వాళ్ళను బయట తిరగనివ్వరేమో? ఇంటి సెల్లార్‌లో ఒక కుటంబం ఉంది. టెర్రస్‌ మీద ఉన్న సింగిల్‌ రూమ్‌లో ఒక బ్యాచిలర్‌ అద్దెకుంటున్నాడు. వీరందరికీ ఇబ్బందే. ఇవి ఆ ఆందోళనకు కొన్ని కారణాలు.
మధ్యాహ్నం 12.30 అయ్యింది. ల్యాబ్‌ రెప్రజెంటేటివ్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఒక గంటలో వస్తానన్నాడు. టు వీలర్‌లో        వస్తున్నాడని, డ్రెస్‌లో ఉండడని, మన ఇంటికి వచ్చిన తర్వాతనే పీపీ కిట్‌ ధరిస్తాడని తెలుసుకున్నాను. కాస్త కుదుటపడ్డాను. రెండు గంటల సమయంలో ఇంటికి దగ్గరలో మెయిన్‌ రోడ్‌కి వచ్చి ఫోన్‌ చేశాడు. అక్కడే ఉండమని మా అల్లుడ్ని పంపించాను. (అతను అడ్రస్‌ వెతుక్కుంటూ వచ్చి ఇంటి చుట్టు పక్కల వాళ్ళను విచారించడం నాకు ఇష్టం లేదు .... ఎందుకో మీకు తెలుసు.) వచ్చి వాకిలి బయటే వరండాలో నిలబడి తన కిట్స్‌ సిద్ధం చేసుకోవడానికి ఉపక్రమించాడు. లోపలకు రమ్మన్నాను. మేము రాకూడదన్నాడు. రాకూడనిది నాకోసమా? తన కోసమా? ఇద్దరి భద్రత దానిలో ఉందిలే అనుకున్నాను. బయట నుంచి ఎవరైనా చూస్తున్నారేమోనని గమనించాను. మధ్యాహ్నం రెండు దాటడంతో ఎవరి గుహల్లోకి వాళ్ళు వెళ్శినట్లున్నారు. ఎవరూ కనిపించలేదు.
కిట్‌  రెడీ  చేసుకుని పీపీఈ కిట్‌ నుంచి (వ్యక్తిగత రక్షణ వస్తు సముదాయ కిట్‌) తీసిన డ్రె స్‌ వేసుకున్నాడు. నన్ను ఒక చైర్‌ తెచ్చుకుని కూర్చోమన్నాడు. గొంతు, ముక్కు ద్వారా స్వాబ్‌ తీసుకుని ఒకే కంటైనర్‌లో రెండూ వేసుకుని క్లోజ్‌ చేశాడు. (కొంచెం ఇబ్బంది ఉంటుంది. స్వాబ్‌ స్టిక్‌ మీద ఉన్న గుర్తు ముక్కు లోపలకు వెళ్ళేవరకు పంపిస్తారు. అర నిమిషం ఓర్చుకోవాలి). తను వేసుకున్న డ్రెస్‌ తీసి ఒక వేస్ట్‌ కవర్‌లో వేసి క్లోజ్‌ చేసి దానిని ప్రత్యేకంగా పెట్టుకున్నాడు. పేరు, ఇతర  వివరాలు అడిగి నోట్‌ చేసుకున్నాడు. అతనికి 3,100 రూపాయలు పే చేయమని మిత్రులు ముందే చెప్పారు. అతని ఫోన్‌పే అకౌంట్‌కి 3,300 బదిలీ చేశాను. థాంక్యూ అని వెళ్ళాడు. వాళ్ళ సర్వీస్‌ మీద నాకున్న గౌరవం ఎందుకో పెరిగింది. మొత్తంపై ఒక ఘట్టం ముగిసింది. 
ఇక మళ్ళీ నా భయం అనే గుహలోకి వచ్చాను. ఇక్కడ మీకు భయం గురించి ఒక విషయం చెప్పాలి. నాకు సంబంధించినంత వరకు భయానికి నాలుగు కారణాలున్నాయి. 
మొదటిది : నాకే ఈ కష్టం ఎందుకు రావాలి అనుకోవడం. జీవితమంటే కష్ట సుఖాల మేలు కలయిక అనే గ్రహింపు లేకపోవడం. ఈ రెండు కారణాలతో ఈ భయం ప్రవేశిస్తుంది. కష్టాలు ఎక్కువగా ఉండి సంతోషాలు తక్కువగా ఉంటే జీవితం కష్టమయంగా ఉందని అర్ధం. సంతోషాలు ఎక్కువగా ఉండి, కష్టాలు తక్కువగా ఉంటే జీవితం సుఖమయంగా ఉందని. అయితే ప్రతి విషయాన్ని కష్టంగానే భావించే వారిని మనం ఏమీ చేయలేం. ‘’ఏడీ సూర్యుడు లేడని ఏడుస్తూ కూర్చుంటే మిణుగురుని సైతం కనలేవు’’ అన్న డాక్టర్‌ సినారేని గుర్తు తెచ్చుకుని వారి ఖర్మకు వారిని వదిలేయాలి. నాకు ఈ రకం భయం లేదు.
రెండవది: మన ఆరోగ్యం..... ఆహార, విహార, వ్యవహారాలు సక్రమంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. వ్యవహారం కాసేపు పక్కన బెడదాం. ఆహార, విహారాల సంగతి చూద్దాం. ‘‘అక్షరమ్ములిన్ని కుక్షిలోనిడినంత / చదువటంచు దాని చాటరాదు; జ్ఞానమొకటే ధాత్రి చదువన చెల్లురా .......’’ అని ఒక పండితుడి ప్రవచనం. మనం వినడం, తెలుసుకోవడం ఎక్కువ, ఆచరించడం తక్కువ. 45, 50 ఏళ్ళు లోపు వయస్సులో ఓకే. అంగీకరించవచ్చు. రుచులకు, అభిరుచులకు పెద్దపీట వేయవచ్చు. 50 దాటిన తర్వాతైనా జాగ్రత్త ఉండాలిగా. వందల విషయాలు తెలుసుకుని, వాటిని మధించి, చర్చించి, పలువురికి బోధించి చివరకు ఒకటి రెండు ఆచరించడం ఎక్కువగా జరుగుతోంది. ఇదే ప్రమాదం. నాలుగు విషయాలు తెలుసుకున్నా నాలుగు నెలలు క్రమంతప్పకుండా పాటిస్తే అదే ఆరోగ్యానికి ఆలంబన అవుతుంది. నడక, నడతలు కూడా దీనికి తోడు అయితే ఈ ఆలంబనకు ఆడంబరత వస్తుంది. కాస్త శారీరక వ్యాయామం, శ్వాసపై ధ్యాస చాలా సమస్యలకు పరిష్కారం.  (అనుబంధం ఒకటిలో ఆహార, ఔషధాల వివరాలు పొందుపరిచాను. చూడవచ్చు.....) ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ప్రాణం ... అన్నిటికంటే విలువైన ఆ ప్రాణాన్ని మనం దక్కించుకోవాలంటే ఆహార, విహార, వ్యవహారాల్లో మనం ఎన్ని విలువలు పాటించాలి? నా వరకు ఈ రెండవ రకం భయం కూడా లేదు. 
ఇక మూడవది : అండదండలు ............ మిత్రులు, బంధాలు, బంధుత్వాలు, డబ్బు ఈ కోవలోకి వస్తాయి. ఇవి లేకపోయునా, చాలకపోయినా భయం మనల్ని కమ్మేస్తుంది. కరోనాపై నాలో అనుమానం అలా మొగ్గ తొడగగానే ఇలా గుర్తుకు వచ్చింది ఒక మిత్ర ద్వయం. స్వాంతన వచనాలతో వారు నన్ను సమాధానపరచలేదు. ఆచరణాత్మక సలహాలు, అవసరమైతే రంగంలోకి దిగుతామన్న భరోసా ఇచ్చారు. అదే నాకు ధీమాను, నమ్మకాన్ని కలగజేసింది. మరో వైపు కుటుంబం. బెంబేలెత్తకుండా బలంగా నిలబడదాం అన్న క్రియాశీలతే అందరిదీ. మా అల్లుడు పైకి కనిపించకపోయినా కాస్త కంగారుపడతాడు కానీ పెద్దమ్మాయి, శ్రీమతి మాత్రం ... ‘ఏముంది ఎదుర్కుందాం’ అన్న ధోరణిలోనే ఉంటారు. ఫ్లోరిడా నుంచి మా చిన్నమ్మాయిది పెద్ద పాత్ర. ప్రణాళికలో, ఆచరణలో అడుగడుగునా పక్కనే ఉంది. రోజూ రెండు పూటల బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు తను చేస్తూ, నాచేత చేయించేది. 15 నిమిషాలతో ప్రారంభించి అరగ ంటకు తీసుకెళ్లింది.  ఒక్క మాటలో చెప్పాలంటే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్లోరిడాలోని తనుండే ఫోర్ట్‌లాడర్‌ డేల్‌ను నా క్వారంటైన్‌ ఇంట్లో కూర్చోబెట్టింది. ఇక మా ఎండీ, ఎడిటర్‌ ఇతర కొలీగ్స్‌ పలకరింపులు, ఏమీ కాదన్న భరోసాలు సరేసరి. మొత్తంపై రెండు, మూడు రోజులు మాత్రమే సెలవులో ఉన్నా. ఎడిటర్‌ సున్నితమైన హెచ్చరికతో (నిజానికది ఉన్నతమైన సూచన) వర్క్‌ ఫ్రం హోం చేయడం ఈ సమయంలో నా భయాందోళనల నుంచి ఎక్కువ సమయం బయటపడడానికి దోహదపడింది.
ఇక బంధువుల అనుబంధ రాగ మాలికలు నన్ను ఒక్కసారి కమ్మేశాయి. అందిన సమాచారం మేరకు నగరంలోనే ఉన్న మా అక్కయ్య మ్రాన్పడిపోయింది. రోజంతా ఎవరితో మాట్లాడలేదు. కరోడాల్లా ఉండే మా ఇద్దరి మేనల్లుళ్ళ కళ్ళు వర్షించాయి. కూతుళ్ళు, కొడుకులు తల్లడిల్లారు. వదినలు నిజంగానే వగచారు. చిన్న మరదలు భోరు భోరున ఏడ్చేసింది. (మంచి నటి. మనిషి కూడా సావిత్రి పోలికే...). అల్లుళ్ళు, తోడళ్ళళ్ళు, కజిన్స్‌ ఏ అవసరం తీర్చేందుకైనా సిద్ధమయ్యారు. పెద్ద మరదలు దాదపు ఫెయింట్‌ అయ్యింది. తేరుకున్న తర్వాత వెంటనే  ఫోన్‌ చేసింది. ‘‘బావగారూ, ఖర్చు ఎంతైనా ఫరవాలేదు. ఎంత అవసరమైతే అంత సిద్ధం చేస్తాను. దాని గురించి మీరు ఆలోచించకండి.  మిగిలిన విషయాలు చూసుకోండి’’ అంది. డబ్బు ముఖ్యం కాదని మాటల్లో చెబుతాం కానీ, ఆచరణలో అది అవసరమే. రూపాయి గుప్పెట్లోకి మనం వెళితే పతనం అవుతాం. కానీ మన గుప్పెట్లో ఆ రూపాయి లేకపోతే ఎలా!? లండన్‌ నుంచి మా కోడలు (నాలుగో అన్నయ్య కోడలు) పంపిన కన్సోల్‌ మెసేజ్‌ కూడా ఈ సందర్భంగా మీతో పంచుకోవాలి. ఆ మెసేజ్‌ కాస్త సుదీర్ఘమైనదే. ఆ మెసేజ్‌లో ముందుగా తన బాధ వ్యక్తమవుతుంది. తర్వాత హాస్యం తొంగి చూస్తూంది. ఆపై ఆప్యాయిత పొంగుతుంది ..... ‘‘ఇలా జరిగినందుకు బాధగా ఉంది. అయునా ఆసుపత్రిలో కాక హోం క్వారైంటైన్‌లో ఉండడం కాస్త సంతోషకరమైన విషయం. ఈ క్వారంటైన్‌ సమయాన్ని కుటుంబ సభ్యులకు పరీక్ష అనుకోండి. ఎవరెంత అండగా ఉన్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీ  మనవరాలు (మూడు నెలల వయస్సు) మీకు గాఽఢాలింగనం ఇస్తోంది. ఆ స్పర్శతో వచ్చే తరంగాలతో (వైబ్రేషన్లు) తాతకు స్వస్థత చేకూరుతుందట .... ’’ ఇదీ ఆ మెసేజ్‌ సారాంశం. (మీరు కోలుకున్న తర్వాత మీ అనుభవాన్ని రాయాలన్న సూచన కూడా ఆ కోడలిదే ....) ఇవి అన్నీ నా గుండెల్లో తడిని కనుగూటిలోకి తెచ్చాయి. ‘నా గుహలో, కుటిలో ...’ ఉన్నానేగానీఇంకా చీకటి ఎక్కడిది? ఇలా ఈ భయం కూడా కొండెక్కింది.
నాల్గవ భయం: సామాజికపర మైనది, పాలనాపరమైనది. సామాజికపరమైన ఇబ్బందులు ముందే ప్రస్తావించాను. ఇక ప్రభుత్వపరమైన, పాలనాపరమైన విషయానికి వస్తే భయం స్వరూపం ఎంత భీకరంగా వుంటుందో కోవిడ్‌ చూపిస్తోంది. మనకు మిత్రులున్నారు. ఆఫీసు అండ వుంది. ఆదుకునే బంధుగణం ఉన్నది. అంతో  ఇంతో ఆరోగ్యంగానే ఉన్నాం. కానీ జరగరానిది జరిగితే? కరోనా ఏదో ఒక అవయవాన్ని కమ్మేస్తే? అర్ధరాత్రి ఆపద చుట్టేస్తే? ఆదుకునేది ఎవరు? పలికే డాక్టర్‌ ఎవరు? మనకు గేటు తె రిచే ఆసుపత్రి ఏది? ఇంటికి అరగంటలో వచ్చే అంబులెన్స్‌ ఉందా? పోనీ 108 వస్తుందా? సర్కార్‌ దవాఖానాకు వెళితే సశేషంగా ఉంటామా? ఏ కుటుంబ సభ్యుడి, ఏ ఆప్తుడి ఆరోగ్యాన్ని  ఫణంగా పెట్టి ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతాం? సమస్య తీవ్రమైతే, మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు బెడ్‌    ఇస్తామని హామీ ఇచ్చిన ఆసుపత్రుల పీఆర్‌ఓలు ఆ సమయానికి చేతులెత్తేస్తే? 
ఈ భయాన్ని గౌరవించాలా? వద్దా? ఈ భయాన్ని భయం, భయంగా అంగీకరించాలా? వద్దా? నేను ఈకథనం రాస్తున్న రోజుకు ఏక్టివ్‌ కోవిడ్‌ కేసులు రాష్ట్రంలో కేవలం 10,891. ప్రభుత్వాలకు ప్రాణాల విలువ తెలిస్తే ...... 33జిల్లాలు, ఒక అంతర్జాతీయ మహానగరం ఉన్న రాష్ట్రంలో పదకొండు వేలమందిని అక్కున చేర్చుకుని ఆదరించడం చేతకాదా? ఆసుపత్రుల తలుపులు తడుతూ అంబులెన్సు ‌లు, ప్రైవేటు వాహనాల్లో తిరుగుతూ, తిరుగుతూనే ప్రాణాలు వదలాలా? ప్రభుత్వాసుపత్రులంటే యమకూపాలన్న భావాన్ని ఈ ఆపద వేళకూడా తొలగించలేరా? విలువల గురించి మనకు అవసరమైనప్పుడు మాట్లాడడం సరికాక పోవచ్చు. కానీ ఇప్పుడు కూడా మౌనంగా ఉండడం నేరం కావచ్చు. భయ కారణాల్లో చివరిదైనా ఈ ఒక్క భయంతోనే నా క్వారంటైన్‌ మొదటి వారం పూర్తి భయం, భయంగా ... రెండవ వారం భారంగా గడిచింది. 
జూలై ఒకటిన టెస్ట్‌కు ఇచ్చాను. మూడవ తేదీ రాత్రి పది గంటలకు ఫలితం పాజిటివ్‌ అని వచ్చింది. రెండవ తేదీ సాయింత్రం నాలుగు  గంటలకు చివరిసారిగా నాకు జ్వరం, ఒళ్ళు నొప్పులు వచ్చాయి. డోలో 650 ఒకటి వేసుకున్నాను. రెండూ తగ్గాయి. జూన్‌ 29 నుంచి జూలై రెండు వరకు లో జ్వరం ఉన్నప్పటికీ మొత్తంపై నేను నాలుగైదుకు మించి డోలో 650 వాడలేదు. 28 నుంచి వరుసగా  ఆరు రోజులు ఆరు అజిత్రోమైసిన్‌  వాడాను. పాజిటివ్‌ వచ్చిన మరుసటి రోజు నాల్గవ తేదీ మొత్తం నలుగురు డాక్టర్లను సంప్రతించాను. పరిస్థితి ఇదీ అని చెప్పాను. ‘‘మీకు సింప్టమ్స్‌ వచ్చి ఏడు రోజులు, వైరస్‌ ప్రవేశించి అంత కు ముందు నాలుగు రోజులు లెక్కలోకి తీసుకుంటే పదకొండు రోజులు .... ఆల్‌ మోస్ట్‌ మీ వైరస్‌ పీరియడ్‌ అయిపోయినట్లే’’ అని ఒక  డాక్టర్‌ చెప్పారు. ఆయన మాటతో చాలా ధైర్యం వచ్చింది. అనుభవం ఉన్న వాళ్ళు మాత్రం ‘‘ఇక దగ్గు, జలుబు స్టార్ట్‌ అవుతాయి. ఆక్సిజన్‌ అందకపోయే అవకాశాలు ఉంటాయి, అప్రమత్తంగా వుండాలి’’ అని చెప్పారు. పరిస్థితి మళ్ళీ మొదటి కొచ్చింది. మరో డాక్టర్‌ను సంప్రతిస్తే డి డెన్వర్‌, ఐరన్‌ సంబంధిత, ఇతర కొన్ని బ్లడ్‌ టెస్ట్‌లు చేయించుకోమని సూచించారు. పాజిటివ్‌ వచ్చి ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా ఉన్న నాకు ఈ టెస్ట్‌లు ఎలా చేయించుకోవాలన్నది ఆందోళన. ల్యాబ్‌ వాళ్ళు ఇంటికి రాకపోతే ఎలా వెళ్ళాలన్నది పెద్ద సమస్య. (ఈ సమస్య రాగానే రెండు పీపీఈ కిట్స్‌ తెప్పించుకుని ఇంట్లో ఉంచుకున్నాను. ఒకవేళ తప్పనిసరైతే అవి ధరిస్తే, మా అల్లుడో, కాబోయే అల్లుడో డ్రైవ్‌ చేసుకుంటూ తీసుకెళతారన్నది నా ఆలోచన....)
అప్పుడు గుర్తుకు వచ్చాడు డాక్టర్‌ రాము. మా మిసెస్‌ వాళ్ళ ఊరు. బంధువు కూడా. పదవ తరగతి సర్టిఫికెట్‌లో పేరు తప్పు పడిందని తొలిసారిగా వాళ్ళ నాన్నతో మా ఇంటికి వచ్చాడు. మరలా అమెరికాలో ఎంఎస్‌ (ఆర్థో)చేసి మలిసారి మా ఇంటికి  వచ్చాడు. నిరాడంబరుడు. కూల్‌గా ఉంటాడు. ఎంఎస్‌ చేసేటప్పుడు ఎమర్జన్సీ విభాగంలో పని చేయడం వల్ల అన్ని విషయాలపైనా పట్టు ఉంది. మంచి డాక్టర్‌. వెంటనే ఆయనను సంప్రతించాను. (వెంటనే అంటే తక్షణమే అనుకునేరు. ఒక మంచి డాక్టర్‌తో మాట్లాడాలి అంటే కనీసం ఆరునుంచి 12గంటలు వ్యవధి అవసరమవుతుంది.) మీరు ఉన్న పరిస్థితికి ఆ పరీక్షలు అవసరం లేదులే అని తను చెప్పాడు. ఊరట చెందాను. కానీ, పక్క రాష్ట్రంలో ఉంటాడు. ఏదైనా సమస్య తీవ్రమైతే ఫాలోఅప్‌ ఎలా? అందుకే మంచి ఆసుపత్రికూడా ఉన్న తొలి రోజు ఫోన్‌లోకన్సల్ట్‌ చేసిన డాక్టర్‌ కుమార్‌ను మరలా సలహా అడిగాను. తమ ఆసుపత్రిలోని ఒక కోవిడ్‌ స్పెషలిస్ట్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. ఆయన ఫాబ్‌ఫ్లూ 200 ఎంజీ టాబ్లెట్స్‌ వాడాలి అని చెప్పారు. వాటి తీవ్రత కూడా తెలియజేశారు. ‘‘మా ఆసుపత్రిలో ఎనిమిదిమంది కోవిడ్‌ రోగులకు వాడుతున్నాను. సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమీ లేవు. మీరు కూడా వాడడం అవసరం’’అని చె ప్పారు. ఆ టాబ్లెట్స్‌ షెడ్యూల్‌ తెలిస్తే గుండె ఆగుతుంది. మొదటి రోజు మధ్యాహ్నం 9, రాత్రికి 9 మొత్తం 18 టాబ్లెట్లు (3600 ఎంజీ), రెండవ రోజునుంచి మధ్యాహ్నం 4, రాత్రికి నాలుగు చొప్పున 8 టాబ్లెట్లు .... 21 రోజులు లేదా కనీసం 14 రోజులు వరుసగా వాడాలి అని చెప్పారు. అలాగే అని మరలా మా డాక్టర్‌ రామును ఆశ్రయించాను. అవసరం లేదు, సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఖచ్చితంగా వుంటాయి అని చెప్పాడు. క్వారంటైన్‌ అంటే ఒంటరిగా వుండడమే కాదు. ఒంటరిగానే భయాలను ఎదుర్కోవాలి. పంచుకోవడానికి, ఫాలోఅప్‌ చేయడానికి భౌతికంగా పక్కన ఎవరూ వుండ రు. ఇదే పెద్ద సమస్య. 
దూరం చేద్దామనుకుంటున్న భయం ఏదో ఒక రూపంలో ప్రతి రోజూ వెంటాడుతూనే వుంది. మరుసటి రోజు డాక్టర్‌ కుమార్‌ తనే స్వయంగా ఫోన్‌ చేశారు. తమ డాక్టర్‌ ఏమి చె ప్పారని అడిగారు. ఫాబ్‌ ఫ్లూ వాడమన్నారు. దొరకలేదని అన్నాను. మా ఆసుపత్రిలో ఉన్న మెడికల్‌ షాపులో ఉన్నాయి. ఎవరినైనా పంపి తెప్పించుకోండి అన్నారు. చిన్నగా నసుగుతూ .... కాదు సార్‌, ప్రస్తుతం నా పరిస్థితి ఇదీ అని వివరించాను. గత మూడు రోజులుగా ఎలాంటి లక్షణాలు కూడా లేవు, ఆ టాబ్లెట్స్‌ తప్పనిసరిగా వాడాలా ? అన్నాను. ఆయన ఒక్క క్షణం మాట్లాడలేదు. మరు క్షణం .... ‘‘ వద్దు లెండి. అవసరం లేదు. అంతా స్టిగ్మా మయం అయ్యింది. ప్రభుత్వానిది ఒక రకమైన స్టిగ్మా. మా డాక్టర్‌ది ఒక రకమైన స్టిగ్మా .... అమ్మో, మన కృష్ణ ప్రసాద్‌ ... మన, మన .... ఇలా ప్రతి ఒక్కరికీ ఏదో రకమైన స్టిగ్మాతో నడుస్తోంది ...’’ అన్నారు. ఆయనతో నా గత పరిచయం అంత ఎక్కువేమీ కాదు. అయినా ఆయన అలా మాట్లాడడం నన్ను చలింపజేసింది. ఆయన గొప్పతనానికి, నిజాయితీకి మనస్సులోనే అభినందనలు తెలియజేసుకున్నాను. ఇక కొంత నిశ్చింతగా వున్నాను. నాగపూర్‌లో మా మేనకోడలు కూతురు డాక్టర్‌ స్నేహ (ఎండి, అనస్తీయషన్‌) కూడా విలువైన సలహాలు ఇస్తుండేది. విజయవాడలో ఉన్న మా వియ్యపురాలు డాక్టర్‌ అరుణ (యానిమల్‌ హజ్‌బెండరీ డిపార్ట్‌మెంట్‌లో రిటైర్డ్‌ డీఈ) రోజూ ఉదయాన్నే నా క్వారంటైన్‌ వార్డుకు రౌండ్స్‌కు వచ్చిన చందంగా పలకరింపు, పరామర్శ వుండే వి. ఏది ఏమైనా రాత్రి అయితే ఏదో తెలియని భారం గుండెలపై కూర్చునేది. నిద్ర నిండుగా వుండేది కాదు. నాలుగు గంటల నిద్ర పడితే, ఖచ్చితంగా గంట కొట్టినట్లు మెలకువ వచ్చేది. (రోజూ నిద్రమాత్ర జోలాఫర్‌ 5 ఎంజీ కూడా వాడేవాడ్ని.) మెలకువ వచ్చిన సమయంలో అమెరికాలో ఉన్న మా చిన్నమ్మాయితో కాసేపు చాట్‌ చేసి, ఆన్‌లైన్‌లో రెండు పేపర్లు చదివి మరలా పడుకుంటే మరో గంటన్నర లేదా రెండు గంటలు నిద్ర పట్టేది. ఈ ఒక్క ఇబ్బంది మినహా నా క్వారంటైన్‌ సవ్యంగానే గడిచినట్లు. 
ఒకటవ తేదీ టెస్ట్‌ చేయించుకున్నాను. పాజిటివ్‌ వచ్చింది. మరలా 19వ తేదీ రిపీట్‌ స్వాబ్‌ టెస్ట్‌ చేయించాను. 21వ తేదీ సాయంత్రం అయిదు గంటలకు ఫలితం వచ్చింది. ల్యాబ్‌ రెప్రజెంటేటివ్‌ అభినవ్‌ రిపోర్ట్‌ పంపడంతోపాటు నెగటివ్‌ అని మెసేజ్‌ కూడా పెట్టాడు. నాకు ఈ 25 రోజుల్లో అత్యంత ఆమోదయోగ్యమైన, ఆనందదాయకమైన మెసేజ్‌ అదే. మొదటిగా నా మిత్ర ద్వయానికి తెలియజేశాను. అడుగడుగునా అండగా వుండటమే కాదు. పూటకు రెండుసార్లు అయినా రిజల్ట్‌ గురించి వాకబు చేస్తూనే ఉన్నారు. ప్రాణాలు నిలబెట్టిన డాక్టర్లకు, ప్రాణప్రదమైన మిత్రులు, కొలీగ్ లు, బంధువులకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. క్వారంటైన్‌ ఇంటిని శుభ్రం చేసి బట్టలు, కొన్ని వస్తువులు అక్కడే వదిలేసి తాళంవేసి ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఉన్న ఇంటికి వచ్చేశాను. దూరం 20 మెట్లే అటు అయినా, ఇటు అయినా! కానీ 25 రోజులు వాకిలి దాటకుండా నాలుగు గోడల మధ్య ఉండే ఈ అనుభవం నాకెప్పటికీ వద్దనే కోరుకుంటున్నాను. నేనే కాదు ఎవరూ కూడా కోరుకోరు. ఎత్తుపల్లాలతో ఉండేదే జీవితం. ఒక్కోసారి పల్లం అనుకున్నది చిన్న లోయ కావచ్చు, పెద్ద  లోయ కావచ్చు. బయటపడే ప్రయత్నం అందరం చేస్తాం. కానీ ఆ సమయంలో భయం, ఆందోళనలు ఎంత తక్కువగా ఉంటే ఆ లోయను జయించే సామర్థ్యం అంత ఎక్కువగా వుంటుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఆచరించగలిగే వారు, సంజీవ్‌దేవ్‌ వంటి తాత్వికులు కొందరే ఉంటారు .... అలాంటి వారి నుంచి స్ఫూర్తిని పొందగలిగితే అగాథాల నుంచైనా అంచుకు చేరుకోగలుగుతాం ..... థాంక్యూ.
అనుబంధం : 
1. మా ఇంటిపైన మిద్దె తోట వుంది. చిన్నదే కానీ ఆకు కూరలు బాగా వస్తాయి. పాలకూర, తోటకూర, గోంగూర, బెంగుళూరు బచ్చలి,    మునగాకు, కరివేపాకు, వామాకు, తులసి, కొత్తిమీర, పుదీనా ..... వీటిలో ఎవరికి నచ్చిన కాంబినేషన్‌తో వారు .... ఒక్కొక్కటి నాలుగేసి ఆకులు, అర అరటిపండు, రెండు ఖర్జూరాలు, చిన్న అల్లం ముక్క బ్లెండర్‌లో వేసి మెత్తగా గ్రయిండు చేసి మజ్జిగ (పాలు అయినా ఓకే) కలుపుకుని స్మూతీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తీసుకోవడం. 
2. నిద్ర లేవగానే గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళు. అరగంట తర్వాత మరో గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో పసుపు, దాల్చిన చెక్క, మిరియాల పొడి, నిమ్మ రసం కలుపుకుని తాగడం. ఽ
3. ధనియాలు, జీలకర్ర, సోంపు, వాము, లవంగాలు, ఏలుకల పొడులు, ఇంగువ ఎలా వీలైతే అలా ... ఏదో ఒక పద్దతిలో (కూరల్లోగాని, కషాయాలుగా గాని) వాడుకోవడం. 
3. రెండు స్పూన్లు మొలకలు కట్టిన పెసర, శనగ గింజలు.
4. ఇడ్లీ, దోశెలకు వాడే బియ్యం స్థానంలో 20 శాతం లోపు బియ్యాన్ని వాడి, 80 శాతం సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, ఇతర మిల్లెట్లు వాడడం.
5. క్యారెట్‌, బీట్‌రూట్‌, కీరా పచ్చి ముక్కలుగాని, జ్యూస్‌ రూపంలోగాని, ఉడకబెట్టిగాని (వారానికి రెండు, మూడు రోజులైనా) తీసుకోవడం. 
6. లంచ్‌ని కప్పు అన్నం (బియ్యం, గోధుమలకు దాదాపు స్వస్తి. కొర్రలు ఇతర మిల్లెట్స్‌ ఎక్కువగా), కప్పు కూర, కప్పు ఆకుకూర పప్పు, కప్పు పెరుగుతో ముగించడం. పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు ఒకటి, రెండు ముద్దలతో సరిపెట్టడం. నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఆనియన్‌ పచ్చివి తీసుకోవడం కూడా అవసరం. వంటకాల్లో కొబ్బరినూనె, ఆలివ్‌ ఆయిల్‌, కుసుమ, నెయ్యి ఎక్కువగానే నువ్వులు, వేరుశెనగ, ఇతర గానుగ నూనెలు మాత్రమే వాడడం.
7. సాయంత్రం పండ్లు, డ్రై ఫ్రూట్లు ..... అరటి, జామ, బొప్పాయి, దానిమ్మ, ఆపిల్‌, ఫైనాపిల్‌, ద్రాక్ష ఏదో ఒకటి లేదా రెండు రకాలు. జీడిపప్పు, బాదం, పిస్తా, అక్రూట్‌, వాల్‌నట్‌ వంటివి. లేదా వేరుశెనగ గుళ్ళు నానబెట్టి (మూడు టేబుల్‌ స్పూన్లు మాత్రమే) ఉల్లిపాయలు కలుపుకుని తినడం.
8. డిన్నర్‌ లంచ్‌లో సగం లేదా బ్రేక్‌ఫాస్ట్‌లాగా తీసుకోవడం. 
9. రోజుకు మూడు సార్లు ... ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ల తర్వాత కషాయాలు తీసుకోవడం. (కషాయం – పేరు పెద్దదేగాని, విషయం చిన్నదే. ఆకులైనా, పొడులైనా గంటలు గంటలు కాచాల్సిన అవసరం లేదు. మూడు నుంచి అయిదు నిమిషాలు కాచి వడగట్టుకుని తాగితే సరిపోతుంది. అల్లం అరంగుళం ముక్క, పావు స్పూను మిరియాలపొడి, దాల్చిన చెక్కపొడి బేస్‌ మెటీరియల్‌గా, కామన్‌గా వాడుతూ ఏదో ఒక ఆకులు నాలుగు తుంచి వేసుకుని అయిదు నిమిషాలు మరగపెడితే సరిపోతుంది. తులసి, మునగాకు, మునగ పూత, వామాకు, గోంగూర, పారిజాతం, జామాకు, లెమన్‌గ్రాస్‌ ఏది అందుబాటులో ఉంటే అది .... కొంచెం ఆరనిచ్చి అర చెక్క నిమ్మరసం కలుపుకుంటే బెటర్‌.
10. రోజుకు రెండుసార్లు గార్గిలింగ్‌ .... వేడి నీటిలో చిటికెడు పసుపు, ఉప్పు కలపుకుని పుక్కిలిస్తే సరిపోతుంది. లేదా బె టాడైన్‌ మౌత్‌ వాష్‌ అయినా సరే.
11. రెండుసార్లు ముఖానికి ఆవిరి (కొబ్బరి నూనె ముఖానికి రాసుకుని, తర్వాత ....) పట్టడం.
12. 30 నిమిషాలు నడక, 20 నిమిషాలు బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు, పది నిమిషాలు ఏదో ఒక వ్యాయామం.
ఆవేశకావేషాలు అదుపులో ఉంచుకోవడం .... మన చుట్టూ అందరూ సంతోషంగా ఉంటేనే మన సంతోషం నిండుగా ఉంటుంది కాబట్టి ఇంటా, బయటా అలాంటి వాతావరణాన్ని సృష్టించుకోవడం.  ఆచరిస్తే ఇవి చాలు ......