14, అక్టోబర్ 2023, శనివారం

Kanti masakalu


 

Gas⛽ regulator change


 

Water fountain


 

మహాలయము

 మహాలయము (బ్రహ్మలోక ప్రాప్తి)


భాద్రపద కృష్ణ (పాడ్యమి) ప్రతిపద మొదలుకొని (అమావాస్య) దర్శ పర్యంతము 15 దినములు. (తిథి అధికమైనచో 16, క్షయమయినచో 14 దినములు) మహాలయములు. దీనినే మహాలయపక్షమని వ్యవహారము.


 అశక్తుడైనచో పంచమిగాని, షష్టిగాని, అష్టమిగాని, ద్వాదశిగాని, ఏకాదశి గాని మొదలుకొని అమావాస్య వరకు చేయవలయును. ఇంకనూ అశక్తుడైనచో నిషిద్ధము గాని మరియొక దినమందు (ఒక్కమారే చేయుట) సకృన్మహాలయము చేయవలయును.


పాడ్యమి మొదలుకొని పక్ష మహాలయములు చేయువారు చతుర్దశిని విడువకూడదు. తక్కిన పంచమ్యాది (పంచమి, షష్టి, అష్టమి, దశమి, ఏకాదశి) దర్శాంత పక్షము లైదింటను చతుర్దశి విడచి మిగిలిన దినము లందు మహాలయములు చేయవలయును.


 సకృన్మహాలయమందును చతుర్దశి కూడదు. మరియు పాడ్యమి, షష్ఠి, ఏకాదశి, శుక్రవారము, జన్మనక్షత్రము, దానికి దశమము 19వ నక్షత్రము, రోహిణి, మఖ, రేవతియు సకృన్మహాలయములకు నిషిద్ధములు.


 కొన్ని గ్రంథములలో సప్తమి, త్రయోదశి ఆదివారము, మంగళవారములు నిషేధమని యున్నది. పితృ మృత తిథియందు సకృన్మహాలయము చేయుచో దానికి నిషిద్ధము లేదు.


శ్లో॥ అశక్తః పితృ పక్షేషు కరో త్యేకదినే యతః నిషిద్ధేపి దినే కుర్యా త్పిండదానం యథావిథి ॥


తాత్పర్యము : అశక్తుడు పక్షమంతటికి ఒక్కరోజునే చేయును. కనుక నిషిద్ధ దినమందైననూ యథావిధి శ్రాద్ధము చేయవచ్చును. ఇది మృతతిథి విషయము. అట్టి సందర్భము రానిచో నిషేధము లేని దినమందు చేయవలయును. అపుడును ద్వాదశి, అమావాస్య, అష్టమి, భరణి, వ్యతీపాత వీనిలో ఒకటి సంభవించినచో మృతతిథి యైనను నిషేధము లేదు.


సన్యాసులకు మహాలయము అపరాహ్ణ వ్యాప్తి గల ద్వాదశియందు పిండదానముతో చేయవలెను. మరియొక తిథియందు చేయకూడదు. చతుర్దశి మృతతిథి అయిననూ ఆ దినమందు మహాలయము కూడదు. "శ్రాద్ధం శస్త్ర హతస్యైవ చతుర్దశ్యాం ప్రకీర్తిత" అను వచనము ప్రకారము చతుర్ధశి యందు శస్త్ర హతునకే శ్రాద్ధము చేయవలయును. ఇతర శ్రాధ్ధమేమియు చేయరాదు. పూర్ణిమయందు మృతి అయిన వానికి పూర్ణిమయందు మహాలయము చేయరాదు. కృష్ణపక్షమందు మహాలయము కావున, అందు పూర్ణిమ లేదు కావున, చతుర్దశి గాని, పూర్ణిమ యందుగాని మృతుడైన వానికి ద్వాదశి, అమావాస్య మొదలగు తిధులందు చేయవలెను.


శ్లో॥ ఆదౌ మధ్యేవసానే వా యత్ర కన్యాం వ్రజేద్రవి: 

సపక్ష స్సకల శ్రేష్ఠ స్సశ్శ్రాద్ధ ష్షోడశకం ప్రతి ॥


తాత్పర్యము : ఈ మహాలయ పక్షమందు మధ్యయందు గాని, అంతమున గాని సూర్యుడు కన్యారాశియందు ప్రవేశించినచో శ్రేష్ఠము. కాని నిమిత్తము కాదు.


అమావాస్యలోగా మంచిదినము లభించని ఎడల ఆశ్వయుజ శుక్ల పంచమిలోగా జరిపించ వచ్చును. అప్పుడును సంభవించనిచో వృశ్చిక సంక్రాంతి పర్యంతములో వ్యతీపాతాది పర్వదినమందు మహాలయము చేయవచ్చును.


మృతాహమనగ ఆబ్దిక శ్రాద్ధమును, మహాలయ శ్రాద్ధమును పక్వాన్నము

చేతనే చేయవలయును గాని అపక్వ (బియ్యము) తండులాదులచే చేయ కూడదు ఎందువలన అనగా


శ్లో॥ మహాలయే గయాశ్రాద్దే మాతా పిత్రో ర్మృతేహని కృతో ద్వాహో . పికుర్వీత పిండదానం యథావిథి ॥


తాత్పర్యము : మహాలయ శ్రాద్ధమును, గయా శ్రాద్ధమును, తల్లి, తండ్రుల ఆబ్దికమును వివాహితుడైననూ యథావిధిగా పిండదానము చేయవలయును.


ఈ మహాలయ శ్రాద్ధమందు పార్వణత్రయ ముద్దేశించి చేయ వలయును. పార్వణ త్రయమనగా


1. పితృ పితామహ, ప్రపితామహులు


2. మాతృ మాతామహ, మాతృ ప్రపితామహులు


3. సపత్నీక మాతా, మాతామహ, ప్రపితామహులు


ఈ పార్వణ త్రయమును భార్య మొదలగు నేకోద్దిష్ట పితృ గణ సహిత సర్వ పితృ దేవతల నుద్దేశించి చేయుట ఒక పక్షము. 


సపత్నిక పిత్రాది త్రయమనియు, సపత్నిక మాతామహాది త్రయ మనియు పార్వణ ద్వయముగ షడ్దైవతల మాత్రము ఉద్దేశించి చేయుట రెండవ పక్షము.


 షడ్దైవతలను ఏకోద్దిష్ట గణము నుద్దేశించి చేయుట మూడవ పక్షము, ఇందొక పక్షమున ప్రతిదినమును మహాలయము చేయునది. పంచమ్యా పక్షము లందుమా చేయునది. సకృన్మహాలయము చేయుచో సర్వ పితృదేవతల నుద్దేశించి చేయవలయును.


ఎట్లు అనగా:


"పితృ పితామహ ప్రపితామహానాం, మాతృ తత్సపత్నీ పితామహి తత్స పత్నీ ప్రపితామహీ తత్సపత్నీ నామస్మత్సాపత్న్య మాతు దితివా మాతా మహ మాతుః పితామహ మాతుః ప్రపితామహానాం, సపత్నికానాం యధా నామ గోత్రాణాం వసు రుద్రాదిత్య రూపాణాం పార్వణ విధినా పత్న్యాః పుత్రస్య కన్యాయా: పితృవ్యస్య మాతులస్య భ్రాతుః పితృష్వసు: మాతృష్వ సురాత్మ భగిన్యా: పితృవ్య పుత్రస్య జామాతు ర్భాగి నేయస్య శ్వశురస్య శ్వశ్ర్వా ఆచార్యస్య ఉపాధ్యాయస్య గురోః సఖ్యుశ్శిష్యస్యై తేషాం యధానామ గోత్రాణాం పురుష విషయే సపత్నికానాం, స్త్రీ విషయే సభర్తృక పాపత్యా నామేకోద్దిష్ట విధినా మహాలయా పరపక్ష శ్రాద్ధం. సకృన్మహాలయ పరపక్ష శ్రాద్ధం వా సదైవం సద్యః కరిష్యే" అని మహాలయము చేయవలయును.


పైన యుద్దేశించిన వారిలో ఎవ్వరైన జీవించియున్న ఎడల వారిని విడిచి అన్యుల నుద్దేశింపవలయును. మాతామహాదుల స్త్రీలు జీవించి యున్నచో 'సపత్నీకానాం' అను శబ్దమును విడువవలెను. భర్త జీవించి యున్నచో స్త్రీకి 'సభర్తృక' శబ్ద ఉచ్చారణమక్కరలేదు.                            శ్లో॥ మహాలయే గయా శ్రాద్ధే వృద్దౌ చా న్వష్ట కాసు చ నవదైవ తమ త్రేష్టం శేషం షాట్పౌరుషం విదుః అన్వష్టకాసువృద్ధౌచ ప్రతి సంవత్సరే తథా మహాలయే గంగాయాం చ సపిండీ కరణాత్పురా మాతు శ్శ్రాద్ధం పృథక్కార్య మన్యత్ర పతినా సహ ॥


తాత్పర్యము : మహాలయము, గయా శ్రాద్ధము, నాందీ శ్రాద్ధము, అన్వష్టకా శ్రాద్ధములు. వీటియందు మీద చెప్పినటుల తొమ్మండుగురు పితృదేవతలు, తక్కిన శ్రాద్ధములందు నలుగురు ఉండవలయును. మరియు ప్రత్యాబ్దిక మందును, సపిండీకరణమునకు ముందు చేయు శ్రాద్ధమందును మాతృశ్రాద్ధము వేరుగా చేయవలయును. తక్కిన శ్రాద్ధములు తండ్రితో కలిపి చేయవచ్చును.


కొందరు మాతా మాహాదులతో వారి భార్యలను కలుపక వేరుగ నుద్దేశించి పారణ చతుష్టయమని అనుచున్నారు. అప్పుడు 12 పితృ దేవతలని సిద్దించును. ఇట్లు మహాలయమందు ఉద్దేశించిన దేవతలనే గంగాతీర్ణ శ్రాద్ధమందు నిత్య తర్పణమందును ఉద్దేశింపవలయును.


మహాలయమందు విశ్వేదేవులు 'ధురీ విలోచనులు' అనబడుదురు. ఇచ్చట విభవము కలిగినచో విశ్వదేవతలకు ఇద్దరు విప్రులను, మూడు పార్వణములకు ఒక్కొక్కదానికి ముగ్గురు చొప్పున తొమ్మిదిమందిని, భార్యా మొదలగు ఏకోదిష్ట గణములలో ప్రతిదేవత కొక్కొక్క బ్రాహ్మణుని నిమంత్రణ చేయవలయును. అశక్తుడైనచో విశ్వదేవుల కొకరిని, పార్వణ త్రయమునకు ముగ్గురను, ఏకోదిష్ణ గణమంతటికిని ఒక బ్రాహ్మణుని, ఇట్లు అయిదుగురను నిమంత్రించునది.


విశ్వదేవులకిద్దరు విప్రులను నియమించుకొని నప్పుడు పితృ పార్వణము లకు తొమ్మిదిమంది కావలయును. కాని ముగ్గురు కాకూడదు. ఇట్లు తొమ్మిది మందిని పార్వణములకు నియమించునప్పుడు, విశ్వదేవులకు ఒక్కరిని నిమంత్రించరాదు. ఇంకనూ అశక్తుడైనచో పారణ ద్వయమునకు ఒక బ్రాహ్మణుని నియమించవచ్చును. మహాలయ అంతమున విష్ణువు నిమిత్తము ఒక బ్రాహ్మణుని నియమించవలెను.


కౌస్తుభమందు జీవన్మాతృకుడైనచో సపత్నీమాతకు ఏకోద్దిష్టమే గాని పార్వణ మక్కరలేదని యున్నది. సవతి తల్లు అనేకమంది అయినచో సర్వ మాతల నుద్దేశించి ఒక్క బ్రాహ్మణుని నియమించవలయును. పిండము ఒక్కటియే అర్ఘ్యపాత్రము వేరువేరుగ ఈయవలయును. తన తల్లిని కూడ కలిపినచో తనతల్లితో పాటు సవతి తల్లులందరికినీ ఒక బ్రాహ్మణుని నిమంత్రించి అర్ఘ్యము, పిండము చేసిన పార్వణము అగును కాని ప్రత్యేకముగ ఉద్దేశింప అవసరము లేదు. లేదా సపత్నీమాత లందరకును ఏకోద్దిష్టమైననూ చేయవచ్చును. లేక ఒక సపత్నీ మాతకైననూ ప్రత్యేకముగ ఏకోద్దిష్టమైననూ చేయవచ్చును.


మహాలయమందు పార్వణ త్రయము నిమిత్తమే. యగ్నౌకరణము గాని ఏకోద్దిష్టము గాని అక్కరలేదు కాని చేసిననూ తప్పు లేదు. కాని చేయు నప్పుడు ఏకోద్దిష్ట గణార్ధమై యగ్నౌకరణాంతము (మట్టిపాత్ర) పృధక్పాత్ర యందు గ్రహింప వలయును. మహాలయమందు సర్వ పార్వణములకును ఏకోద్దిష్టమునకును, పిండదాన ముత్తరణమగు సకృదాచ్చిన్న బర్హిసు ఏకముగానే గ్రహించవలయును. (అమావాస్యలలో)దర్శాదులలో ప్రతి పార్వణమునకు భిన్నముగానే అది యుండును. తక్కిన శ్రాద్ధప్రయోగమును అనేక మాతలగుచో అభ్యంజనాది మంత్రము శ్రాద్ధ సాగరమందు గాని తమతమ గృహ్య సూత్రమున గాని తెలుసుకొనవలయును,


సకృన్మహాలయము చేయునప్పుడు శ్రాద్ధాంగమయిన తిల తర్పణము పరదినమందే, సర్వ పితౄద్దేశము చేసి ప్రాతస్సంధ్యకు పూర్వమే గాని, అనంతరము గాని బ్రహ్మ యజ్ఞాంగ తర్పణము గాక వేరుగా చేయవలెను. ప్రతిపదాది, పంచమ్యాది పక్షముల యందు విప్రుల విసర్జించిన పిమ్మట శ్రాద్దపూజితులైన పితల నుద్దేశించి అప్పుడే తర్పణము చేయవలెను.


భార్య రజస్వలయైనచో మహాలయ శ్రాద్ధము కూడదు. కాలాంతర మందు చేయవచ్చును. అమావాస్య యందు రజో దోషమైననూ ఆశ్వియుజ శుక్లపంచమి లోగా జరుపవచ్చును. ప్రతిపదాది పక్షములలో ప్రారంభ దినమందు పాకము కాకముందు పత్ని రజస్వల అయినచో ఉత్తరోత్తర పక్షము స్వీకరింపవలయును. ప్రారంభమైన పిదప రజస్వల యైనచో


ఆమెను గృహాంతరమందు నిరోధించి మహాలయము జరిపింప వలెను. ఇట్లు విధవస్త్రీ భర్తకు చేయునప్పుడును ఇదే విధముగా చేయవలెను.


"మమ భర్తృ పితృ పితామహ ప్రపితామహానాం, మమ భర్తృ మాతృ పితామహీ ప్రపితా మహీనాం, మమ పితృ పితామహ ప్రపితామహానాం, మమ మాతృ పితామహి ప్రపితామహీనాం, మమ మాతామహి మాతృ పితామహ మాతృ ప్రితామహానాం, మమ మాతామహి మాతృ పితామహి మాతృ ప్రపితామహీనాం తృప్త్యర్ధం సకృన్మహాలయా పరపక్ష శ్రాద్ధం కరిష్యే" అని స్వయముగ సంకల్పించి యవి కృతముగ తక్కిన ప్రయోగ మంతయు బ్రాహ్మణునిచే చేయించవలయును.


బ్రాహ్మణుడు "---- నామ్న్యా యజమానాయా భర్తృ పితృ పితామహ, ప్రపితామహ" అని ఉచ్చరించుచు క్రియను చేయించవలెను. ఆశక్తి అయినచో "భర్త్రాదిత్రయము, స్వపిత్రాదిత్రయము, స్వ మాత్రాదిత్రయము, స్వమాతామహాది త్రయము సపత్నిక అని పార్వణ చతుష్టయమునకే యుద్దేశించి చేయవలెను.  ఇంకనూ ఆశక్తి అయినచో "స్వ భర్త్రాది స్వయం పిత్రాదిత్రయం" అని పార్వణద్వయమునే ఉద్దేశించవలెను.


మహాలయము జీవత్పితృకుడు సహితము తండ్రి సన్యసించినను పాతిత్యాది దోష యుక్తుడైననూ తండ్రియొక్క పిత్రాదుల నందరినీ ఉద్దేశించి పిండ దానములు లేకుండగ సంకల్ప విధిచే శ్రాద్ధము చేయవలెను.


 శ్లో॥ వృద్ధౌ తీర్ధే చ సన్యస్తే తా తేచ పతితే సతి   యేభ్య ఏవ సితా దద్యాత్తే భ్యో దద్యా త్స్వయం సుతాః ॥ 


తాత్పర్యము : నాందీ శ్రాద్ధాదులందును, తీర్ధ శ్రాద్దమందును, తండ్రి సన్యసించినను, పతితుడైనను, తండ్రియొక్క పిత్రాదుల నుద్దేశించి కొడుకు శ్రాద్ధము చేయునది.


శ్లో ll ముండనం పిండదానం చ ప్రేతకర్మచ సర్వశః న జీవ త్పితృకః కుర్యాద్గుర్విణీ పతిరేవచ ॥


తాత్పర్యము : క్షౌరము, పిండదానము సర్వ విధములైన ప్రేత కర్మలు జీవత్పితృకుడును, గర్భిణీపతియు చేయకూడదు.


పిండ దానాది విస్తారము చేయుట కశక్తుడైనచో సంకల్ప విధి చేయ వచ్చును. కాని సంకల్పవిధి యందు అర్ఘ్య దానము, సమంత్రకావాహనము, అగ్నౌకరణము, పిండదానము, స్వధావాచన సంకల్పము, ఓం స్వధేత్యాధికమైన స్వధావాచన ప్రయోగము చేయకూడదు.


అనేక బ్రాహ్మణులు లభించనిచో దేవస్థానమందు సాలగ్రామాది దేవతామూర్తిని స్థాపించి శ్రాద్ధము చేయవలెను. బొత్తిగ బ్రాహ్మణుడు లభించనిచో దర్భల చేత వటువును చేసి శ్రాద్ధము. తల్లితండ్రుల మృతి యందు ప్రథమాబ్దమున మహాలయము (చేయవచ్చును లేక మానవచ్చును) వైకల్పికము. మలమాసమందు మహాలయము చేయకూడదు. ఈ మహాలయ పక్షమందు (తల్లితండ్రుల ఆబ్దికము) ప్రత్యాబ్దికము ప్రాప్తించినచో మృతవిధి యందు వార్షిక శ్రాద్ధము చేసి మరియొక దినమందు మహాలయము జరిపింపవలయును. (అమావాస్య) దర్శయందు ప్రత్యాబ్దిక మైనచో పూర్వము వార్షికమున అనంతరమున సకృన్మహాలయమును. తదనంతరమున దర్శ శ్రాద్ధమును భిన్నభిన్న పాకములచే చేయవలెను. సకృన్మహాలయము మాత్రము వచ్చిననూ పూర్వము మహాలయము తదనంతరమున దర్శ శ్రాద్ధము చేయునది. మృతతిథి యందు సకృన్మహాలయమను పక్షమున దర్శకువలె ఆ తిథి అపరాహ్ణ వ్యాప్తి కావలయును.


- ధర్మసింధు

⚜ శ్రీ మంగళ మహాదేవ బిర్లా కానన్ ఆలయం

 🕉 మన గుడి : నెం 208






⚜ ఢిల్లీ : శివాజీ మార్గ్, రంగపురి


⚜ శ్రీ మంగళ మహాదేవ బిర్లా కానన్ ఆలయం



💠 మంగళ్ మహాదేవ్ బిర్లా కానన్ ఆలయం ఢిల్లీలో  ఒక ప్రసిద్ధ శివాలయం మరియూ పర్యాటక స్థలంగా ప్రసిద్ధి చెందింది.


 💠అది న్యూఢిల్లీలోని రంగపురి శివాజీ మార్గ్‌ పరిస్థితి.  మంగళ్ మహాదేవ్ బిర్లా కానన్ ఆలయం శివుడు మరియు ఇతర దేవతల భారీ విగ్రహాలకు ప్రసిద్ధి చెందింది.  

ఇది సుమారు 200 ఎకరాల స్థలంలో నిర్మించబడింది, ఇక్కడ అపారమైన శాంతి భావన కలుగుతుంది.


💠 మంగళ్ మహాదేవ్ బిర్లా కానన్ ఆలయంలో శివుని యొక్క భారీ విగ్రహం, ఇది సుమారు 100 అడుగుల ఎత్తు ఉంటుంది.  ఈ ఆలయంలో శివుడు కాకుండా పార్వతి, కార్తికేయ, నంది, సీతా రాముడు, రాధా కృష్ణ మరియు గణేష్ విగ్రహం కూడా ఉన్నాయి.  

ఈ విగ్రహాలన్నీ విశాలమైనవి మరియు కాంస్య విగ్రహం.  

దీని కారణంగా ఆలయం చాలా అందంగా మరియు అద్భుతంగా కనిపిస్తుంది.  

ఆలయ ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులకు మానసిక ప్రశాంతత, హృదయానికి ప్రశాంతత చేకూరుతుంది.


💠 ఈ స్థలం యొక్క పరిశుభ్రత మరియు నిర్వహణ అత్యున్నతమైనది. 

ఎవరైనా మాట్లాడటం మీరు చాలా అరుదుగా వింటారు కాబట్టి ఈ ప్రదేశం నుండి శాంతిని అనుభవించవచ్చు. ఎడమ వైపున ఉన్న తోటలో గేటు దగ్గర ఒక చిన్న శివలింగం ఉంది.


💠 ఇక్కడ ప్రజలు ప్రార్థనలు చేస్తూ, పూజలు చేస్తూ ఉంటారు, కానీ మీరు దగ్గరికి వెళ్లేకొద్దీ, సందడి చేసే శబ్దం మరియు శివలింగంపై పదుల సంఖ్యలో తేనెటీగలు గుంపులుగా తిరుగుతున్న దృశ్యం మిమ్మల్ని వెంటనే భయపెడుతుంది! అయినప్పటికీ, ఇప్పటివరకు ఈ ప్రదేశంలో భక్తులను కందిరీగలు గాయపరచిన దాఖలాలు లేవు. నిజంగ విచిత్రమైన విషయం కదా


💠 1960లో పారిశ్రామికవేత్త దివంగత జి.డి బిర్లా నిర్మించిన పార్క్. ఇది దక్షిణ ఢిల్లీలోని పంచశీల్ పార్క్ సమీపంలో ఉంది మరియు నగరంలో అతను నిర్మించిన రెండు పార్కుల్లో ఇది ఒకటి.  

ఈ ఉద్యానవనం 1980 నుండి ఢిల్లీ ప్రభుత్వ ఉద్యానవన శాఖచే అభివృద్ధి చేయబడింది మరియు నిర్వహించబడుతుంది. 

ఈ ఉద్యానవనానికి  మంగళ్ మహాదేవ్ (శివుడు') అని పేరు పెట్టారు.

 

💠 మంగళ్ మహాదేవ్ బిర్లా కానన్ ఢిల్లీలోని నైరుతి ప్రాంతంలో ఉన్న ఒక తోట.  ఇది ప్రసిద్ధ తుగ్లకాబాద్ కోటకు సమీపంలో ఉంది మరియు నగరంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి.  

ఈ గార్డెన్ 2011 సంవత్సరంలో ప్రజల కోసం తెరవబడింది మరియు దీనిని ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) నిర్వహిస్తుంది.  ఇది మొత్తం 6.5 హెక్టార్ల (16.2 ఎకరాలు) విస్తీర్ణంలో ఉంది.  


💠 ఉద్యానవనం రెండు భాగాలుగా విభజించబడింది, అవి 'బిర్లా కానన్' ప్రధాన ఉద్యానవనం మరియు 'మంగల్ మహాదేవ్' బిర్లా కానన్ లోపల ఒక చిన్న తోట.  

మంగళ్ మహాదేవ్ బిర్లా కానన్ మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి గొప్ప ప్రదేశం. 

 

💠 ఢిల్లీలోని మంగళ్ మహాదేవ్ బిర్లా కానన్ భారతదేశంలోని ఇతర దేవాలయాల్లోనూ ఆచరించే శివుని ఆరాధననే అనుసరిస్తారు.  కొన్ని ఆచారాలు క్రింది విధంగా ఉన్నాయి: -


💠 శివునికి 'పంచామృతం' సమర్పించడంతో ప్రారంభమవుతుంది.  -‘పంచామృతం’ సమర్పించిన తర్వాత, శివుని అభిషేకం నిర్వహిస్తారు.  

ఇందులో నీరు, పాలు, నెయ్యి, తేనె మరియు ఇతర ద్రవ పదార్ధాల సమర్పణ ఉంటుంది. 


💠 ఢిల్లీలోని మంగళ్ మహాదేవ్ బిర్లా కానన్ వారానికి ఏడు రోజులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు తెరిచి ఉంటుంది.  


💠 ఈ గమ్యస్థానానికి సమీప మెట్రో స్టేషన్ రాజీవ్ చౌక్ (నెహ్రూ ప్లేస్ మెట్రో స్టేషన్). 

 ఇక్కడ నుండి, ఇది సుమారుగా 4.4 కిమీ దూరంలో ఉంది.

గొప్ప లు సాధించలేనప్పుడు

 *1959*(గొప్ప పద్యం🙂)

*కం*

గొప్పలు సాధించనపుడు

గొప్పగ తమసంతునెల్ల గుర్తించుగతిన్

గొప్పగ యత్నించగ మన

గొప్పదనము సార్థకమగు గొప్పగ సుజనా.

*భావం*:-- ఓ సుజనా! గొప్ప లు సాధించలేనప్పుడు తమ సంతానము గొప్పగా గుర్తింపు పొందే విధంగా గట్టి ప్రయత్నం చేయగా మన గొప్పదనం సార్థకమవుతుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

సిద్దాంతి గారి సలహా..*

 *సిద్దాంతి గారి సలహా..*


"నమస్కారమండీ..నా పేరు మంగళగౌరీ..మేము రాబోయే శని ఆదివారాల్లో మొగిలిచెర్ల వచ్చి..అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామివారి సమాధిని దర్శించుకోవాలని అనుకుంటున్నాము..శనివారం ఉదయానికి అక్కడికి వస్తామండీ..మంగళవారం ఉదయం తిరిగి వెళ్లిపోతాము..ఆ క్షేత్రం లో మొత్తం మూడు రోజులు నిద్ర చేయాలని అనుకున్నాము..మాతోపాటు ఇద్దరు పెద్దవాళ్ళు వస్తున్నారు..వాళ్ళకొఱకు ఏదైనా బస ఏర్పాటు చేయగలరా?..నేనూ మావారూ మా పిల్లలిద్దరూ అందరమూ స్వామివారి సన్నిధిలో పడుకుంటాము.." అని ఆవిడ నన్ను అడిగారు..మా సిబ్బందిని విచారిస్తే..ఒక గది ఖాళీ ఉందని చెప్పారు..ఆ మాటే ఆవిడతో చెప్పి..గదిని వారి కొఱకు అట్టి పెట్టాము..


ఆ ప్రక్క శనివారం ఉదయం తొమ్మిది గంటల వేళ..ఒక కారు లో మంగళగౌరి గారి తన సంసారం తో సహా మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..తనను తాను పరిచయం చేసుకొని..తమ కొఱకు కేటాయించిన గది వద్దకు వెళ్లిపోయారు..మరో గంట తరువాత..మంగళగౌరి గారు తన భర్త, పిల్లలు తో కలిసి మందిరం లోపల నేను కూర్చున్న చోటుకి వచ్చి.."ప్రసాద్ గారూ..స్వామివారి పల్లకీసేవ సాయంత్రం అని చెప్పారు..ఈలోపల మేము మాలకొండకు వెళ్లి..శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొని వస్తాము..మధ్యాహ్నం మీతో మాట్లాడాలి..మీకు వీలవుతుందా?.." అని అడిగారు.."మీరు ముందు మాలకొండకు వెళ్ళిరండి..ఇక్కడికి వచ్చిన భక్తుల తో మాట్లాడటానికి కూడా తీరిక లేనంతగా నేను లేను..నేను ఇక్కడ ఉన్నదే మీలాంటి వారి సందేహాలు తీర్చడానికి.." అన్నాను..మంగళగౌరి గారు మాలకొండకు వెళ్లి, మధ్యాహ్నం మూడు, నాలుగు గంటలకు తిరిగి వచ్చారు..


ఆరోజు సాయంత్రం జరిగే పల్లకీసేవ కు తమ పేర్లు నమోదు చేయించుకొని..తన భర్త, పిల్లలతో కలిసి నావద్దకు వచ్చారు.."ప్రసాద్ గారూ..ఒక సమస్యతో ఇక్కడికి వచ్చామండీ..మా వారు పెద్ద కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నారండీ..ఉద్యోగరీత్యా తరచూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి..నెలలో కనీసం ఇరవై రోజులు అలా తిరుగుతూనే వుంటారు..ఇంటిని, పిల్లలనూ నేనే చూసుకోవాలి..పిల్లలిద్దరూ ఇంజినీరింగ్ చదువుతున్నారు..ఇప్పుడు సమస్య ఏమిటంటే..మా అబ్బాయి తరచూ అనారోగ్యం పాలవుతున్నాడు..నెలలో పది పదిహేను రోజులు నీరసంగా ఉంటున్నాడు..డాక్టర్ల కు చూపించాము..ఏవేవో పరీక్షలు చేశారు..లోపల జబ్బేమీ లేదు..బలానికి మందులు వాడండి..అని చెప్పారు..వీడేమో మనిషి తగ్గిపోతున్నాడు..నాకు బెంగ పట్టుకున్నది..మా వారితో చర్చించాను..మా సిద్దాంతి గారిని సలహా ఆడిగాము..ఆయన వీడి జాతక చక్రం చూసి..గ్రహదోషం ఉన్నది..నివారణ కొఱకు ఇక్కడికి వెళ్ళమని చెప్పారు..ఆయనే మమ్మల్ని ఈ క్షేత్రం లో  మూడు రాత్రులు నిద్రలు చేయమని చెప్పారు..వారు మాతో చెప్పేదాకా ఇక్కడ ఇలాంటి అవధూత మందిరం వున్నదని మాకు తెలీదు..ఆ తరువాత మీతో ఫోన్ లో మాట్లాడాము.." అన్నారు.."సరేనమ్మా..మీ సిద్దాంతి గారు చెప్పిన విధంగా నే ఇక్కడ వుండండి.." అన్నాను..


ఆరోజు పల్లకీసేవ లో ఆ కుటుంబం పాల్గొన్నారు..ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం స్వామివారి సమాధి దర్శించుకున్నారు..శనివారం రాత్రి, ఆదివారం రాత్రి కూడా ఆ దంపతులు తమ పిల్లలతో సహా స్వామివారి మంటపం లోనే నిద్ర చేశారు..సోమవారం ఉదయం స్వామివారికి ప్రభాత సేవ అనంతరం అర్చకస్వాములు భక్తులకు తీర్ధం ఇవ్వసాగారు..ఈ కుటుంబం కూడా స్వామివారి తీర్ధాన్ని స్వీకరించారు..ఆ తరువాత పది పదిహేను నిమిషాల కు ఆ పిల్లవాడు స్వామివారి మంటపం లోనే ఒక ప్రక్కగా పడుకున్నాడు..కొద్దిసేపటి తరువాత..ఉన్నట్టుండిఆ అబ్బాయి మెలికలు తిరిగిపోతూ..ఆ మంటపం అంతా పొర్లాసాగాడు..ఇదంతా చూస్తున్న మంగళ గౌరి గారు బాగా భయపడి పోయారు..ఆ అబ్బాయి తండ్రి మాత్రం ..పిల్లవాడిని పట్టుకొని వున్నారు..దాదాపుగా రెండు గంటల సేపు అలా జరిగిన తరువాత..ఆ పిల్లవాడు సొమ్మసిల్లి పడుకొని నిద్ర పోయాడు..


"అమ్మా ఇక మీరు భయపడకండి..అబ్బాయి తెప్పరిల్లుతాడు..కోలుకుంటాడు.."అని మా అర్చకస్వామి ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి..స్వామివారి తీర్ధాన్ని అబ్బాయి నోట్లో పోశారు..మరో అరగంట తరువాత..ఆ అబ్బాయి కళ్ళు తెరచి చూసాడు..ఆరోజు మధ్యాహ్నం నాటికి ఆ పిల్లవాడి ముఖం లో నైరాశ్యం పోయింది..ఉషారుగా వున్నాడు..మంగళగౌరి గారి భర్తగారు తమ సిద్దాంతి గారితో ఫోన్ లో ఇక్కడ జరిగిన విషయాన్ని పూర్తిగా చెప్పారు..మరో రెండు రోజుల పాటు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయుడి సన్నిధిలోనే వుండమని ఆయన సలహా ఇచ్చారు..బుధవారం వరకూ మంగళగౌరి గారి కుటుంబం స్వామివారి మందిరం వద్దే వున్నారు..రోజూ రెండుపూటలా స్వామివారి సమాధి దర్శించుకున్నారు..గురువారం ఉదయం స్వామివారి సమాధి దర్శించుకొని తిరిగి వాళ్ళ ఊరు వెళ్లారు..


మరో నెలరోజుల తరువాత మంగళగౌరి గారు నాకు ఫోన్ చేసి.."ప్రసాద్ గారూ..మా వాడు పూర్తిగా కోలుకున్నాదండీ..కాలేజీకి వెళుతున్నాడు..చక్కగా చదువుకుంటూ వున్నాడు..త్వరలో మళ్లీ వచ్చి స్వామివారి సమాధి దర్శించుకొని వెళతాము..మా సిద్దాంతి గారు కూడా మాతో వస్తామంటున్నారు..వారినీ తీసుకొని వస్తాము.." అన్నారు..


గత నెలలో మంగళగౌరి గారి కుమారుడు ఒక్కడే మొగిలిచెర్ల కు శ్రీ స్వామివారి దర్శనం కోసం వచ్చాడు.."నాకు జీవితాన్ని ఈ స్వామివారే ప్రసాదించారు అంకుల్..ఇప్పుడు నేను ఉద్యోగం చేసుకుంటూ..నా కాళ్ళమీద నేను నిలబడటానికి ఈ స్వామివారే కారణం..వీలున్నప్పుడల్లా ఇక్కడకు వచ్చి ఒకరోజు నిద్ర చేసి వెళుతుంటాను..మా సిద్దాంతి గారి సలహా..స్వామివారి తీర్ధం..ఈరెండూ నేను మర్చిపోలేను.." అని భక్తి గా చెప్పాడు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

సనాతనధర్మానికి శత్రువు హిందువే.

 సనాతనధర్మానికి శత్రువు హిందువే.


దైవం మాట ఎత్తితే చాలు టైం లేదు అంటాడు. 

అన్యమతస్థులకు ఎక్కడి నుండి వస్తుంది టైం?

నీకంటే కూడా గొడ్డు చాకిరి చేస్తారు. కానీ పిల్లలకి చిన్ననాటి నుండే మతబోధ చేస్తారు. మనం చేయం. 


పోనీ చేసేవారిని సపోర్ట్ చేస్తారా అంటే అదీ ఉండదు. నీకెందుకు అంటారు. పిల్లలు ఈ విషయం మీద ఏదన్నా మాట్లాడితే ఈ వయస్సులో దేనికి నీకు అంటారు. టైం ఉండదు. చిన్నప్పుడు నేర్పక, వయస్సు లో చేయక ఎప్పుడు చేస్తారు?


అందుకే హిందువులలో ఉన్నవారు కన్వర్ట్ అవుతారు కానీ అన్యమతస్థులలో కన్వర్షన్ చాలా తక్కువ. మనవాళ్ళు 1000 మంది వెళితే అవతలివారిలో మహా అయితే ఓ 10మంది ఉంటారు..


ధర్మాన్ని ఎవరో వచ్చి నిలబెడతారు. ఎవరో వచ్చి కాపాడతారు అని యువతని సనాతనాధర్మానికి దూరం చేసేశారు. దేవుడంటే కోరికలు తీర్చేవాడుగా చేశారు. దేవాలయాలు ఈ బలహీనతలని కేవలం పూజలు, 2నిముషాలు దండ పెట్టి దర్శనాలు అంటూ పరిమతి  చేసినంము.పిల్లలకి గాని, యువతకి కానీ ధర్మం చెప్పేవారు లేరు. బోధించేవారు అసలే లేరు. ఒకరిద్దరు ఏదన్నా బోధిద్దామని ప్రయత్నిస్తే భాషాజ్ఞానం లేకపోవడం వల్ల తప్పులు పట్టి వారిని అవమానిస్తున్నారు. 


మనం మాత్రం సంపాదించాలి. మేడలు కట్టాలి. ధర్మం మాత్రం బోధించకూడదు. అదేమంటే వీటికే సమయం లేదు.

అన్యమతస్థులు కూడా వాళ్ళ ధర్మాన్ని పిల్లలకి నేర్పుతున్నారు. మనకి ఎందుకు సమయం ఉండదో మరి..ధన్యవాదములు.🙏👍

పద్యం చదవండి..

 *"ఈ క్రింది పద్యం చదవండి..!"*


  *"మనమే మనమని మనమన మనుమని మనుమని మనుమనిమన నమ్మేనా?"*

*"మన మేనమామ మామను మునునేమిన మౌనిమౌని మనమున మౌనమే!"*


భావం


*"మనమే = మనం అందరమూ....,"*


 *"మనమని = శాశ్వతం కాదని"*

,

 *"మనమన = బుద్ధీ హెచ్చరిస్తూన్నా"*


*"మనుమని మనుమని మనుమని"* = 

*"పౌత్రునకు పౌత్రునకుృ పౌత్రుని (తన తర్వాత తరాల 7 తరాలు గురించి)"*


*"మననమ్మేనా? = తాపత్రయ పడడమేనా? (కాదు),"*


*"మన మేనమామ =మన మేన మామ అయిన చంద్రుడికి,"*


*"మామను = మామగారైన దక్షప్రజాప్రతిని,"*


*"మును+నేమిన = పూర్వం శిక్షించిన,"*


*"మౌనిమౌని = మునీశ్వరులకి మునీశ్వరుడైన, మునులలో అగ్రగణ్యుడైన శివుని"*


*"మౌనమే = మౌనంగా"*


 *"మనమున = మనస్సు నందు ధ్యానించుట మేలు!!"*


*"అనగా జన్మ పరంపరను కోరడం కంటే జన్మ రాహిత్యమును పొందడానికి మోక్షప్రదాత అయిన శివుని ఆశ్రయించడం మేలు!!"*


*"ఎంతో లోతైన  జన్మ రాహిత్యాన్ని భావం చెడకుండా  మోక్ష పదమైన మకారంతో  మలిచారు."*


 *" తెలుగు భాష గొప్పదనం ఎంత అని చెప్పగలం, మాధుర్యాన్ని ఆస్వాదించడం  మినహా..!!"*


*శివాయ గురవే నమః!!*

🙏

ఆలోచనాలోచనాలు

 %%% ఆలోచనాలోచనాలు %%%                                    ----౦0 శ్రమ -- సోమరితనం  0౦----                                 ***** శరీరయాత్రాపిచతే, నప్రసిద్ధ్యేన కర్మణా!--- భగవద్గీత. ( ఏ పని చెయ్యకుండా కూర్చుంటే దేహయాత్ర కూడా సాగదు, ఓ అర్జునా!)                        ***** సర్వమాత్యయికం కార్యం, శృణుయాన్నాతి పాతయేత్! కృచ్ఛ్రసాధ్యమతికాస్త మసాధ్యం వా విజాయతే!!  (చెయ్యాల్సిన పనిని వాయిదా వెయ్యకుండా వెంటనే పూర్తి చెయ్యాలి, తప్ప తాత్సారం చెయ్యకూడదు. జాగుసేత వలన ఆ కార్యం అసాధ్యం అయ్యే ప్రమాదం ఉంది.)         ***** సోమరిపోతుకు చదువు రాదు. విద్యలేనివానికి ధనమెక్కడిది? ధనహీనునకు మిత్రులెక్కడ? మిత్రులు లేనివానికి సుఖం ఎక్కడిది? ( అలసస్య కుతో విద్యా? --- తెలుగు అనువాదం.                          ***** సోమరిపోతు తన కుటుంబానికే కాదు; ఈ లోకానికి కూడా బరువు చేటు;                                   ***** మంచి పనులను చెయ్యడానికి బద్ధకించకండి. ఆలస్యం అనర్థాలకు మూలం. ఆనకట్టలు లేని నదుల నీళ్ళు ఉప్పుసముద్రం పాలేకదా?                                      ***** జీవితంలో ఎన్నడూ తప్పులు, పొరబాట్లు చెయ్యనివారు మరణించిన వారే కదా! గత నాలుగు వేల సంవత్సరాలుగా ఒక్క తప్పుకూడా చెయ్యని ఒక వ్యక్తిని నేను ఇటీవలే చూచాను. అతడెవరోకాదు. ఈజిప్ట్ పిరమిడ్లలో విశ్రాంతి తీసుకొంటున్న మమ్మీ!( శవం.)                                    ***** కృషి చెయ్యకుండా ఎవరూ, దేనినీ సాధించలేరు. చివరకు వరాలిచ్చే దేవతలు కూడా (రాక్షసుల సహాయంతో) పాలసముద్రాన్ని అనంతకాలం మథించిన అనంతరమే అమృతాన్ని పొందారు.                             ***** సోమరితనం వచ్చి వ్యక్తి భుజాలపై కూర్చుంటే, చిప్ప పట్టుకొని అడుక్కుతినేదాకా అది క్రిందికి దిగదు.                       ***** జీవిస్తున్న మనిషి తనకుతాను కట్టుకొంటున్న సమాథినే లోకం "" సోమరితనం"" అనే అందమైన పేరుతో పిలుస్తూఉంటుంది.                ***** సోమరితనం ద్వారా సులువుగా జరిగే పనులు జటిలమవుతాయి. శ్రమించడం ద్వారా జటిలమైన పనులు సులువుగా నెరవేరుతాయి.    ***** తేనెతుట్టెలో పనిచేసే తేనెటీగలు శ్రమను వినోదంగా పరిగణిస్తాయి. తినికూర్చొని, సంతానోత్పత్తి మాత్రమే చెయ్యగలిగిన " మగ ఈగలు" కరువు కాలంలో చంపివేయబడతాయి.           ***** శ్రమించడం ద్వారా , శరీరం ఆరోగ్యాన్ని, మనస్సు నిర్మలత్వాన్ని, హృదయం సంతృప్తిని, జేబులు నోట్లకట్టలను పొందుతాయి.                           ***** మీలోని ప్రతిభ బంగారం అయితే, మీరు ఇష్టపడే శ్రమ దానిని మీరు ధరించే అందమైన ఆభరణంగా మారుస్తుంది.     ***** సోమరితనం కాపురానికి రాగానే అప్పటి వరకు మీకు తోడుగా ఉన్నటువంటి " ఆనందం" విడాకులు తీసుకొంటుంది. ఇది ప్రకృతి ఏర్పరచిన నియమం.                                ***** పనిచేసే వ్యక్తిని ఒక దయ్యమే బాధిస్తుంది. అది "పని దయ్యం." శ్రమించని వ్యక్తిని పదివేల దయ్యాలు బాధిస్తూవుంటాయి.                ***** మిమ్మల్ని సోమరితనం మోసగించడానికి అవకాశం ఇవ్వకండి. మీరు దానికి " నేడు" ను మాత్రమే ఇచ్చారనుకోండి. అది "రేపు" ను కూడా వాడుకొనేంత నేర్పరి.             ***** సోమరితనం, దరిద్రం అక్కాచెల్లెళ్ళు. వాటిమధ్య పరుగుపందెం ఏర్పాటుచేస్తే, దరిద్రం ముందు వెళ్ళి, చెల్లెలు సోమరితనానికి " ఆహ్వానం" పలుకుతుంది.          ***** లోకంలో అన్ని జాతుల వారు, మతాలవారు, భాషలవారు, ప్రాంతాలవారు తమతమ సంఘాలను ఏర్పరచుకొని బలంగా, దృఢంగా ఉంటారు, ఒక్క సోమరిపోతులు తప్ప. ఎందుకంటే వారు సంఘంగా ఏర్పడాలంటే ఉన్నచోటునుండి , ఎంతోకొంత కదలాలి కదా! అది వారితో అయ్యేపని కాదు.                                     ***** శ్రమలోనే ఆరోగ్యం ఇమిడివుంటుంది. " రన్నింగ్ లో ఉన్న వాహనపు బాటరీ" దానంతట అదే ఛార్జ్ అవుతూవుంటుంది. షెడ్ లో ఉన్న కొత్త కారైనా తిరగకపోతే బాటరీ దానంతట అదే "డౌన్" అవుతుంది. మనిషి లో దాగివున్న "" శక్తియుక్తులు'" కూడా ఇటువంటివే! కాబట్టి " సోమరితనానికి" వీడ్కోలు పలికి, "శ్రమశక్తి" ని ఆహ్వానిద్దాం.                    తేది 14--10--2023, శనివారం, శుభోదయం.