17, జులై 2020, శుక్రవారం

*క‌రోనా.... ఒక పెద్ద కుట్ర‌*

(ప్ర‌పంచాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసిన దుర్మార్గుల గురించి ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి)

అన్నిటికంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, ఈ ప్రపంచంలో అన్ని సమస్యలకూ మూల కారణం పెట్టుబడిదారీ వ్యవస్థ. ఇది అర్థం అయితే తప్ప మనకు ఏదీ సరిగా అర్థం కాదు. 

ఇప్పుడు ప్రపంచం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయింది. ఇంతటి విశాల ప్రపంచంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, వాతావరణపరంగా, జీవనశైలిలో,  ఆచారవ్యవహారాల్లో, ఆహారపుఅలవాట్లలో ఇంకా అనేక విషయాల్లో ఒకదేశంతో మరొక దేశానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అన్ని దేశాలలో ఒకేరకమైన పరిస్థితి అనేది మానవుడు సృష్టిస్తే తప్ప సహజసిద్ధంగా వచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు ఈదేశం ఆదేశం అనే తేడా లేకుండా ప్రపంచం మొత్తం విషవలయంలో చిక్కుకుపోయింది. చిక్కుకుంది అనే కంటే ఛేదించలేని వలయాన్ని సృష్టించారు అనడమే కరెక్ట్. 

మానవ సమాజం అనేకసార్లు ఈ కరోనాకంటే వందరెట్లు భయంకరమైన సూక్ష్మజీవులనూ, రోగాలనూ ఎదుర్కొని పోరాడి నిలిచింది. కానీ సాంకేతికంగా, వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధి, పురోగతి సాధించిన ఈ రోజుల్లో ఇంత బలహీనమైన వైరస్ కి (మరణాల రేటు 3% మించిలేని వైరస్ భయంకరమైనది అనడం అవివేకం. ఆ మరణాలలో కూడా 50% పైగా కేవలం వీరు సృష్టించిన భయంతో చనిపోయినవారే!) మానవజాతి సమస్తం ఛిన్నాభిన్నం అయ్యిందంటే దీని వెనక కచ్చితంగా కుట్ర దాగివుందనుకోవడంలో ఏ సందేహం ఉండాల్సిన అవసరం లేదు. 

*ఇమ్యూనిటీ పెంచే ఊసే లేదు*

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మార్క్స్ ఏనాడో చెప్పాడు. ముఖ్యంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు లాభాలు తప్ప మరో ఆలోచన ఉండదు. డబ్బుకోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. కోవిడ్ మాత్రమే కాదు, సూక్ష్మజీవుల వల్ల వచ్చే ఏ రోగానైనా మన శరీరం ఇమ్యూనిటీతోనే ఎదుర్కుంటుంది. మరి ప్రజల్లో ఇమ్యూనిటీని పెంచే దిశగా ఏ దేశం అయినా చర్యలు చేపడుతోందా? అబ్బే అసలు ఆ ఊసే లేదే ! ఎవరి నోట విన్నా.... వ్యాక్సీన్, వ్యాక్సీన్, వ్యాక్సీన్. తొందరగా వ్యాక్సీన్ రావాలి. ప్రతీ ఒక్కరూ తీసుకోవాలి. అప్పుడు కానీ ఈ కరోనాని తరిమికొట్టలేము అనే భయంకరమైన వాతావరణం క్రియేట్ అయ్యింది. 

మొన్న ఆ మధ్య WHO చేసిన ప్రకటన చూస్తే నాకు నవ్వొచ్చింది. చాలా మందిలో కరోనా ఉన్నప్పటికీ అసలు ఏ లక్షణాలూ కనిపించట్లేదట. ఇలాంటి వారి ద్వారా వైరస్ ఎక్కువగా వ్యాపించే ప్రమాదం ఉందని పాపం WHO బెంగపడిపోతోంది. అసలు లక్షణాలు కూడా బయటపడకుండా తగ్గిపోయే జబ్బు ప్రమాదకరం ఎలా అవుతుందో! ఇలాంటి జబ్బుకి వణికిపోతూ ప్రపంచం అంతా లాక్డౌన్ ఎందుకు విధించిందో WHO చెప్పగలదా?  చెప్పలేదు. ఎందుకంటే ఈ కుట్రలో WHO కూడా భాగం పంచుకుంది కాబట్టి.

*కుట్రలో ఎవరెవరు ?  దీని వల్ల వారికి లాభం?*

.

ఇది తెలుసుకునే ముందు మనం డాక్టర్ శివ అయ్యాదొరై గురించి కొంచం తెలుసుకోవాలి. డాక్టర్ శివ ఇండియన్ అమెరికన్ సైంటిస్ట్. అమెరికాలోని MIT University లో Biological engineering లో PhD చేశారు. immunology మీద మంచి పట్టు ఉన్న ఈ మేధావి కాలిఫోర్నియాకి చెందిన డాక్టర్ Anna Lorraine అనే మరో సైంటిస్ట్ తో కలిసి అమెరికాలో fake Scienceకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వీళ్ళు Anti vaccine Activists. ముఖ్యంగా కరోనా విషయంలో లాభాల కోసం ప్రపంచాన్ని సర్వనాశనం చేసిన స్వార్థపరుల గుట్టుని రట్టుచేసి, ప్రజలను చైతన్యపరిచేందుకు ఆయన ఆమెరికాలో ఉద్యమాన్నే నడుపుతున్నారు. 

డాక్టర్ శివ ప్రకారం ఈ వినాశనానికి కారణం. 

1. Bill gates (micro soft CEO), 

2.Dr. Fauci (USA Chief medical advisor) 

3. WHO

 ఇంకా... Dr.Fauci allies - Big Pharma, Clinton global Initiative, Chan-Zuckerberg, CDC. 

బిల్ గేట్స్ మెడికల్ రంగానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి. కానీ ఏ దేశంలో కొత్తగా ఏ రోగాలు పుట్టుకొచ్చినా, సేవ ముసుగులో అక్కడ ప్రత్యక్షమై వాటికి టీకాలు సిద్ధం చేసి బిలియన్ల డాలర్లు మూటగట్టుకునే వ్యక్తి. గేట్స్ ఫౌండేషన్ 2010లో అమెరికాకు చెందిన National Institute of Allergy and Infectious diseases (దీనికి డైరెక్టర్ Dr.Fauci), WHO తో కలిసి గ్లోబల్ వ్యాక్సీన్ ప్రాజెక్ట్ కోసం CEPI (Coalition for epidemic Preparedness Innovations) అనే సంస్థను స్థాపించారు. ప్రతీదానికీ వ్యాక్సీన్ తయారు చేసి మార్కెట్లో పెట్టడమే ఈ సంస్థ ఉద్దేశం. విచిత్రమేమంటే ఈ సంస్థ MERS-Cov, SARS-Cov-2, Nipah virus, Lassa fever virus, Rift Valley virus, Chikungunya లాంటి వాటి వ్యాక్సీన్ మాత్రమే కాదు, ఇంతవరకు అసలు తెలియని ఫ్యాథోజన్ అసలు ఉనికిలో లేని దానికి కోసం కూడా "Disease X"  పేరిట వ్యాక్సీన్ తయారీకి పూనుకుందంటే ఈ సంస్థ దేనికోసం పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

బిల్గేట్స్ HIV విషయంలో కూడా తప్పుడు సైన్స్ ని ప్రచారం చేసి, HIV కచ్చితంగా AIDS కి దారితీస్తుందనే భయాన్ని కలిగించి ACTI, IV drugs ప్రజలకు ఇచ్చేవారని దీనివల్ల శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిని చాలామంది చనిపోయారని శివ ఆరోపిస్తున్నారు. 

అసలు  వ్యాక్సిన్ అనేది అవసరమైతే తప్ప తీసుకోకూడదని, ఆహారంతోనే (విటమిన్లతోనే) వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవాలని ఈ విషయం వైద్యరంగానికి చెందిన Dr. Fauci కి బాగా తెలుసని, కానీ డబ్బుకోసం ఫేక్ సైన్స్ ప్రచారం చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని శివ అంటున్నారు. 

ఇదే విషయాన్ని ఆయన ట్రంప్ కి రాసిన లెటర్లో పేర్కొన్నారు. కనీసం ఇప్పుడైనా ఈ కరోనా పరిస్థితిలోనైనా అసలైన సైన్స్ ని ప్రజలకు చెప్పండి, ఇమ్యూనిటీకి సంబంధించి నిజాలను ప్రజలకు చెప్పి భయాన్నిపోగొట్టండని ట్రంప్ కి సూచించారు. కోవిడ్ని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవచ్చో ఆయన కొన్ని పాయింట్లను లెటర్లో పేర్కొన్నారు. ఇవి చాలా సింపుల్ గా ఉన్నాయి. డాక్టర్ Anna Lorraine కూడా ట్రంప్ కి రాసిన లెటర్లో ఇప్పుడు ప్రపంచం ఫాలో అవుతున్న పద్ధతి కరెక్టని ఫార్మాకంపెనీలతో సంబంధంలేని, తమకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలూ లేని సైన్స్ ఎక్స్ పర్ట్స్ ఒక పది మందితో చెప్పించండని చూద్దాం అని సవాలు విసిరారు.

*గుడ్డిగా నమ్మేస్తున్నారు*

ఇప్పుడు ప్రతిఒక్కరూ డాక్టర్లు అయిపోయారు. ఎవరకిి తోచింది వారు చెప్పేస్తున్నారు. చాలా వాటిని గుడ్డిగా నమ్మేస్తున్నాం. కానీ ఎపిడెమాలజిస్టులు, ఎక్స్ పర్ట్స్  చెబుతున్న మాటలు మాత్రం ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. 

ఈ వైరస్ కి ఎక్స్ పోజ్ కాకుండా దాక్కోవడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలం అవుతుందని ప్రముఖ ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ జయప్రకాష్ ముల్లియర్ చెప్పారు. శివ అయ్యాదొరై కూడా అదే చెబుతున్నారు. 

కానీ నిపుణుల గోడు వినే పరిస్థితిలో ఇప్పుడు ప్రపంచం లేదు. ప్రపంచం బిల్ గేట్స్  కనుసన్నలలోనే నడుస్తోంది. భారతదేశాన్ని అంబానీ ఎలా శాసించగలడో ప్రపంచాన్ని బిల్ గేట్స్ అలా శాసించగలడు. ప్రపంచ ఆరోగ్యసంస్థ ( WHO) అతడు చెప్పినట్టే వినాలి .  అతన్ని కాదని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అక్కడ లేదు అని వైట్ హౌస్ కరెస్ఫాండెట్ ప్రకటించింది. ఆయన ఇప్పటికే వ్యాక్సీన్ తయారీ కోసం 7 లాబ్స్ నిర్మించి సైంటిస్ట్లను ఆ పనికి ఎప్పుడో పురమాయించాడని. ఇప్పుడు ఆ వ్యాక్సీన్ మార్కెట్లోకి వస్తేనే ఈయనగారికి బిలియన్ బిలియన్ డాలర్ల లాభం వస్తుందని ఆవిడ చెప్పారు. అందులో .Dr. Fauci లాబ్ ఒకటి.

 ప్రపంచంలో మరే దేశం వారు కోవిడ్ కి వ్యాక్సీన్ కనిపెట్టినా దాన్ని మార్కెట్లోకి రాకుండా, వీళ్ళది మాత్రమే వచ్చేలా చూసుకోవాల్సిన పని చూడా వీళ్ళ మీద పడింది. 

*బిల్ గేట్స్ పెద్ద జోతిష్కుడు*

బిల్ గేట్స్  2015లో టెడ్టాక్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబోయే 3,4 సంవత్సరాల్లో అతి భయంకరమైన వైరస్ ఒకటి రాబోతోందని, దీంతో 6 నెలల్లోనే మూడు కోట్ల మంది చనిపోతారని చెప్పాడు. దీనికి వ్యాక్సీన్ కనిపెట్టడంలో వాళ్ళ సంస్థ నిమగ్నమై ఉందని, భారీగా విరాళాలు కావాలని చెప్పాడు. ఆయన భార్య మిలిందా గేట్స్ కూడా ఇదే మాట చెప్పింది. ఆ వైరస్ అతి భయంకరమైందని అది అంత తొందరగా పోదని, వ్యాక్సీన్ తప్పనిసరి అని చెప్పింది. ఇప్పుడు వచ్చిన కోవిడ్ 19 అదే. మరి ఈ విషయం వీళ్ళకు అన్ని సంవత్సరాల ముందుగానే ఎలా తెలిసింది?  వైరస్ రాకముందే వ్యాక్సీన్ ఎలా కనిపెట్టాలనుకున్నారు?  వీటికి సమాధానం కొంచం బుర్రపెడితే ప్రతీ ఒక్కరికీ ఈజీగానే అర్థం అవుతావు.

వీళ్ళు అనుకున్నట్టు లాభాలు రావాలంటే ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్కరూ వ్యాక్సీన్ తీసుకోవాలి. చిన్నాచితకా జబ్బులకు టీకా తీసుకోవాలని సామాన్యులు అనుకోరు. అందుకే ఇంతటి భయంకర వాతావరణం. ప్రపంచం అంతా లాక్డౌన్. ట్రంప్ అయినా, జాన్సన్ అయినా మరే పెట్టుబడిదారీ దేశమైనా బిల్ గేట్స్ చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. అందుకే Dr. Fauci అమెరికా ప్రజల్ని, ప్రభుత్వాన్నీ తప్పుదారి పట్టించాడు. ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నాడు. ఈయనకు ట్రంప్ సపోర్ట్ ఉంది. కానీ ఇప్పుడు ట్రంప్ అనుచరులే ఫౌసిని తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ట్రంప్ కొంచం తగ్గక తప్పని పరిస్థితి. 

*చ‌నిపోవ‌డం మంచిదే!*

ఇంకా భయంకరమైన విషయమేమంటే, బిల్ గేట్స్  depopulation గురించి మాట్లాడ్డం. ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది కాబట్టి ఇలాంటి వైరస్ లు వచ్చి చాలా మంది చనిపోతే (ప్రపంచ జనాభాలో సగం మంది. అది కూడా పేద ప్రజలు) చాలా మంచిది అని  చెప్పాడు. అంతేకాదు, వీళ్ళ వ్యాక్సీన్లలో కొన్ని రకాల మందులు వాడుతున్నారట, వాటి వల్ల ఫర్టిలిటీ రేట్ (సంతానాన్ని పొందే సామర్థం) గణనీయంగా తగ్గిపోతుందట. ఇలా depopulation పనులు చేపట్టారని (ఆ మందులు పరీక్షిస్తే తెలుస్తుందని) డా.శివ అయ్యాదొరై అంటున్నారు. 

*కరోనా ప్రాణాంతకమైనది కాదు* 

*కరోనా అనేది అతి సాధారణమైన జలుబు, జ్వరం లాంటి చిన్న జబ్బు. కొందరి స్వార్థం కోసం దీన్ని పెద్ద భూతాన్ని చేసి, భూతద్దంలో చూపిస్తున్నారు. ఇతర జబ్బులు ఏమీ లేకుండా,ఒక ఆరోగ్యవంతుడు కేవలం ఈ వైరస్ సోకి చనిపోయిన కేసు ఒక్కటి కూడా లేదు. జబ్బుకంటే భయంతోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా పాజిటివ్ అని తెలియగానే చాలామంది ఇక చావు తప్పదని వణికిపోతున్నారు. భయం వల్ల స్ట్రెస్ విపరీతంగా పెరిగి శరీరంలో ఇమ్యూన్ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. లక్షలాది మంది చాలా తేలికగా దీని నుంచి బయటపడుతున్నారు. కోవిడ్ పట్ల అవగాహన పెంచుకుని ధైర్యంగా ఉంటే వారిలో మనం కూడా తప్పకుండా ఉంటాం. కేవలం వయసుపైబడిన, రిస్క్ ఉన్నవారి మీద దృష్టి పెట్టి (మన దేశంలో వృద్ధుల సంఖ్య పది శాతానికి మించి లేదు), ప్రభుత్వం వారిని కాపాడడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే రిస్క్ గ్రూప్ లో కూడా మరణాలు చాలా తగ్గించే అవకాశం ఉండేది. కానీ మనవి పెట్టుబడిదారీ ప్రభుత్వాలు కదా వాళ్ళ కోసమే పనిచేస్తాయి. మనకోసం కాదు. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి*

*అవగాహన, ధైర్యానికి మించిన ఆయుధం లేదు!*
          (మిత్రుని వాల్ నుండి) *కరోనాకు భయపడకండి...* 
 *బోగస్ ప్రచారాలు నమ్మకండి...*

ప్రైవేట్ ఆసుపత్రులకు లక్షలు తగలెయ్యకండి.. ఇది పూర్తిగా చదవండి కరోనా చికిత్స పై ఒక ప్రాథమిక అవగాహన కోసం ఈ పోస్ట్.
  *కరోనాకు భయపడకండి.*      
కరోనా వచ్చింది అనగానే వారిని అంటరాని వారిగానో, ఎదో తప్పు చేసినా వారిగా చూడకండి. ఇది ఒక మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో అన్ని రకాల వారికి వస్తుంది. 

కరోనా వచ్చిన వారు first ధైర్యంగా ఉండాలి. 
Covid positive వచ్చిన వారికి ఇచ్చే, మెడిసిన్స్ 
* ప్యారసిటమాల్-500mg టాబ్లెట్స్, 
* B-Complex, 
* C Vitamin Tablets, 
* Citrizen Tab, 
* Ambroxel syrup (దగ్గు ఉన్న వారికి మాత్రమే.) 

డాక్టర్ల సూచన మేరకు మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత రోజుకు రెండు సార్లు paracetamol ట్యాబ్లేట్లు మూడు రోజులు వాడాలి. పొడి దగ్గు ఉంటే  దగ్గు సిరప్ ను ఉదయం 5ml, రాత్రి 5ml మూడురోజులు పాటు వాడాలి. రోజుకు ఒకటి B- complex tablet, ఒకటి C-Vitamin tablet మధ్యాహ్నం భోజనం తర్వాత వారం రోజుల పాటు ఇస్తారు. 
 మెడిసిన్ తో పాటు  పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే. తప్పనిసరిగా వేడి నీళ్లు తాగడం. రోజు ఉదయం, సాయంత్రం వేడి నీళ్లలో జండుబామ్ కానీ, పసుపు కానీ వేసుకొని ఆవిరి పట్టడం. రోజుకు మూడు సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేడి నీళ్లలో నిమ్మకాయ రసం, తేనె కలుపుకొని తాగడం. రోజుకు నాలుగైదు సార్లు వేడి నీళ్లు గొంతులో పోసుకొని gargling చేయడం (ఉక్కిలించడం). రాత్రి భోజనం అనంతరం పడుకునే ముందు సగం గ్లాసు పాలల్లో కొంచం పసుపు, నాలుగు మిరియాలు దంచి పొడి చేసుకొని పాలల్లో కలిపి తాగడం. 
''వీటన్నిటినీ  వారం రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడం వలన వారం రోజుల్లోనే  సాధారణ స్ధితికి వచ్చేస్తారు." 
వీటికి తోడు మంచి ప్రొటీన్ ఫుడ్, రోజుకు రెండు మధ్యాహ్నం, రాత్రి భోజనంతో ఉడకబెట్టిన కోడిగుడ్డు తినాలి. C-vitamin ఉన్న ఫ్రూట్స్ ఆపిల్, బత్తాయి, Orange వంటి పండ్లు ఎక్కువగా తినాలి, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తింటే కరోనా వచ్చిన వారు వారం రోజుల్లో సాధారణ స్థితికి వచేస్తారు. 

కరోనా వైరస్ ఒక వ్యక్తి శరీరంలో నుంచి మరో వ్యక్తికి వ్యాపించే సమయం 7 రోజులు మాత్రమే నని, 7 రోజుల తర్వాత వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే శక్తి కోల్పోతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఒక మనిషి శరీరంలోకి చేరిన కరోనా వైరస్ 10 నుంచి 12 రోజులకంటే ఎక్కువగా జీవించి ఉండదని, మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ తీసుకుంటే 7 నుంచి 10 రోజుల్లోనే కరోనాను జయించిన వారు ఉన్నారు, తప్పని సరిగా తాగే నీళ్లు వేడి నీళ్లు తాగడం, ఉదయం, సాయంత్రం వాకింగ్ కానీ, యోగ కానీ చేస్తే నాలుగు, ఐదు రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చేస్తారు. 

అలాగే ఉదయం, సాయంత్రం "మిరియాలు, దాచిన్ చెక్క, సొంటి, ధనియాలతో " చేసిన powder ను వేడినీళ్లలో వేసి టీ-లాగా మగ్గబెట్టి అందులో కొంచం బెల్లం వేసి ఉదయం ఒక టీ సాయంత్రం ఒక టి చాలు.

కరోనా వచ్చింది అనగానే చుట్టు పక్కల వారు వారిని చూసి ఎదో మాయ రోగం వచ్చింది అన్నట్టుగా చూడడం మానేయండి. కరోనా కూడా ఇతర వ్యాధుల లాంటిదే. మలేరియా, టైఫాడ్ వంటిదే. ఎవరూ వర్రీ కావద్దు. కాక పోతే జాగ్రత్తలు మాత్రం తప్పని సరిగా పాటించండి. ఈ వైరస్ మనిషి శరీరంలో  గరిష్టంగా 14 రోజులకు మించి ఉండదని, ఆ తర్వాత అది నశించిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి 15 రోజుల పాటు హోమ్ క్వరెంటైన్ కానీ, హాస్పిటల్ క్వరెంటైన్ కానీ పాటించాలి. ఈ 14 రోజుల్లో మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచుకునే ఫుడ్ తీసుకుంటే కరోనా ఖతం  మందులు, ఆహారం తీసుకుంటే చాలు అని చెబుతున్నారు.
 కరోనా రాకుండా సామాజిక దూరం పాటిద్దాం మస్కులు దరిద్దాం

ఒక వాట్సాప్ సమాచారం ఆధారంగా 

కామెంట్‌లు లేవు: