17, జులై 2020, శుక్రవారం

శ్రీ కృష్ణ భగవానుడు చెప్పిన కలియుగం తీరు⚜️

ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు.
శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను #వెదుక్కుంటూ వెళ్లారు.⚜️🌷🌹

#అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం
#వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అర్జునుడు నివ్వెర పోయాడు. తిరిగి #కృష్ణుడి దగ్గరకు బయలు దేరాడు.🍁🍀

#భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండి పోయిన బావి కనిపించింది. ఆశ్చర్య పోయాడు. కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు.🌸🌷🌹

#నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ వున్న జనం అతి కష్టమ్మీద ఆవు దూడలను విడదీశారు. నకులుడికి #ఆశ్చర్యమేసింది. వెనుదిరిగాడు.🌷🌸🌷

#ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పై నుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి అర్థం కాలేదు. #నలుగురూ కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు. ఆయన చెప్పనారంభించాడు. కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా #భక్తులను దోచుకుంటారు.⚜️🌷🌹

#కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు.🍀🌹
#కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా
#నాకిందో తలిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తారు.🌷🌹🍀

#కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్లుగా పతనం అవుతారు. భగవన్నామమనే చిన్న మొక్క తప్ప #ఎవరూ కాపాడ లేరు.🌷⚜️🌷⚜️

🙏⚜️🌷ధర్మో రక్షిత రక్షితః ⚜️🌷

కామెంట్‌లు లేవు: