1, మార్చి 2024, శుక్రవారం

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*చతుర్ధ స్కంధం*


*తోయరుహోదరాయ, భవదుఃఖహరాయ, నమోనమః పరే*

*శాయ, సరోజ కేసర పిశంగ వినిర్మల దివ్య నవ్య వ*

*స్త్రాయ, పయోజ సన్నిభ పదాయ, సరోరుహ మాలికాయ, కృ*

*ష్ణాయ, పరాపరాయ, సుగుణాయ, సురారి హరాయ, వేధసే.*


జనార్ధనా! నీవు బ్రహ్మ పుట్టుకకు కారణమైన పద్మాన్ని నాభియందు ధరించినవాడవు. సంసార దు:ఖాన్ని హరించివేస్తావు. పరమాత్మవు. నీవు ధరించిన పట్టువస్త్రం పద్మాలలోని కింజల్కాల పసిమివన్నెతో అత్యంతము, నిర్మలమై, దివ్యమై నవ్యమై ఒప్పారుతూ ఉంటుంది. నీ పాదాలు పద్మాలవలె కాంతులతో విరాజిల్లుతూ ఉంటాయి. నీవు మెడనుండి పాదాలవరకూ ధరించే వనమాల మనోజ్ఞమైన తమ్మిపూలతో నిండి చూచేవారికి చూడముచ్చటగా ఉంటుంది. నీవు ఇంద్రుడు, బ్రహ్మ, పరమేశ్వరుడు మొదలగు వారికంటె మహాత్ముడవు. సృష్టిలో ఉండే సుగుణాలన్నీ నిన్నే ఆశ్రయించుకుని ఒప్పారుతున్నాయి. మ్రుక్కడి రక్కసులను చంపివైచి సాధువులను సంరక్షిస్తూ ఉంటావు.నీవు బ్రహ్మదేవునకు కూడా తండ్రివి. అట్టి నీకు వేలకొలది నమస్కారాలు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

ఆధ్యాత్మిక ఆనందం*

 *ఆధ్యాత్మిక ఆనందం* 

                 ➖➖➖✍️

*ఆనందం అంటే బాధలు లేకపోవడం కాదు. బాధలు మనల్ని బాధించకపోవడం.*

*బాధ గురించిన భావనలే మనల్ని బాధకంటే ఎక్కువగా బాధిస్తాయి. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభించకుండానే అర్జునుడు విషాద యోగంలో మునిగిపోయాడు. బంధుమిత్రులను సంహరించి రాజభోగాలను అనుభవించలేనని వాపోయాడు. ధర్మానికి విరుద్ధంగా శత్రుపక్షంలో ఉన్న కౌరవులు పాండవుల పట్ల ఎప్పుడూ ద్రోహ బుద్ధితోనే ఉన్నారు.*

*ధర్మపక్షపాతి శ్రీకృష్ణుడు ఆ విషయాన్నే చెబుతూ ‘అర్జునా! నీవు చంపకపోయినా ఇందులో బతకగల వారెవ్వరూ లేరు... చంపడం, చావడం నీ చేతిలో లేదు. నీవు కేవలం నిమిత్తమాత్రుడివి. యుద్ధం చెయ్యడం వరకే నీ కర్తవ్యం. అది పాటించు చాలు’ అంటాడు.*

*అధర్మనాశనానికి అర్జునుణ్ని కేవలం ఒక ఉపకరణంగా, ఆయుధంగా శ్రీకృష్ణుడు ఉపయోగించుకున్నాడు. సంహార సంకల్పం పరమాత్మది.*

*నిర్మలమైన అంతరంగం గలవారికి సుఖదుఃఖాల అనుభూతి ఉండదు. శ్రీరమణులు క్యాన్సర్‌ వచ్చినప్పుడూ బాధపడిన సూచనలు ఆయన ముఖంలో ఎన్నడూ కనిపించేవి కావు.*

*అదే మందహాసం, అదే నిర్లిప్తత!సాధారణ వ్యక్తులకది అసాధ్యం. సాధనతోనే అసాధ్యాన్ని ఎవరైనా సుసాధ్యం చేసుకోగలరు.*

*ప్రతి మనిషికీ వారి వారి ఆలోచనలు, అభిరుచులను బట్టి జీవిత లక్ష్యాలు ఉంటాయి.*

*అవి ఎవరికి వారికే ప్రత్యేకం. ఆనువంశికంగా ప్రజ్ఞాప్రాభవాలు లభించవు.*

*అల్లసాని పెద్దన కొడుకు, కాళిదాసు కుమారుడు మహాకవులుగా రాణించిన దాఖలాలు లేవు.*

*రాజు కొడుకు రాజు అవుతాడు. కానీ, రాజ్యాన్ని రక్షించుకొనే సామర్థ్యం కచ్చితంగా ఉంటుందనీ చెప్పాడు


*అలా ఉండి ఉంటే రాజవంశాలు అంతరించేవి కావు. మహాకవి జాషువా చెప్పినట్లు- ఎంతటి చక్రవర్తులైనా కలకాలం ఇల మీద ఉండరు. అందరూ రుద్రభూమిలో శయనించవలసిన వారే.*

*ప్రాపంచిక సుఖాలన్నీ సంతోషాన్ని కలిగిస్తాయి తప్ప ఆనందాన్ని ఇవ్వలేవు. ఆధ్యాత్మిక జీవితానికి పూర్తిగా అంకితమైన వారు ఆనందభావనతో ఉంటారు.*

*ఆనందం అంటే మాటలకందని అనుభూతి. ఆ అనుభూతి వారి ముఖంలో నెలవై ఉంటుంది. ఎంతటి కష్టానికైనా వారు చలించరు. మేరుపర్వతంలా ధీరువై ఉంటారు. సేవను భాగ్యంగా భావిస్తారు. సహాయాన్నే వారు సేవగా తలుస్తారు.*

*ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, ఎక్కువ తక్కువల తేడా చూపకుండా, మానావమానాలు పట్టించుకోకుండా సేవలు చేసేవారే నిజమైన ఆధ్యాత్మిక జీవనం గడిపేవారిగా మనం గుర్తించవచ్చు. అలాంటివారు ఎంతో అరుదుగా కనిపిస్తారు. పురుషులందు పుణ్యపురుషులంటే అలాంటి వారే.*

*ఆదర్శం అంటే చెట్టును మెచ్చుకుంటూ నీడలో హాయిగా విశ్రాంతి పొందడం కాదు...! మరికొన్ని మొక్కల్ని నాటడం. వాటిని పెంచి పోషించడం, కాపాడటం. ఆ విధంగా మరెందరికో మేలు చెయ్యడం. అందరికీ మేలు జరిగే పనులు చెయ్యడంలోనే అనిర్వచనీయమైన ఆనందం లభిస్తుంది.*

*ఈ సత్యం తెలుసుకోలేక స్వార్థంలోనే ఆనందం లభిస్తుందని ఎందరో భావిస్తుంటారు.*

*ప్రాపంచిక ఆనందాలనేవి తాత్కాలికమే. మనకు ఎన్నో అనుభూతుల్ని ఇచ్చే శరీరమూ శాశ్వతం కాదు. ఒక్క ఆధ్యాత్మిక ఆనందమే శాశ్వతం. దాని చిరునామా అంతర్యామి అంతరాలయమే.*

*వెతుక్కోవలసింది మనమే. ఎవరెన్ని బోధలు చేసినా, అన్ని బాధలకూ ఓర్చి అంతర్యామిని దర్శిస్తే అప్పుడు తరగని ఆధ్యాత్మిక ఆనందం మన సొత్తవుతుంది.*✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

వేణువు అంటే

 *శ్రీకృష్ణుడుకి వేణువు అంటే ఎందుకు అంత ఇష్టం..?*

*ఒకసారి రాధకు ఇదే అనుమానం వచ్చింది, ఏముంది ఈ వేణువులో..? ఎందుకు దీనిని కృష్ణస్వామి వదలడు..? ఈ వేణువు రహస్యం ఏమిటో తెలుసుకోవాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ కూచుంది రాధ, ఒక రోజు కృష్ణుడు నిద్రపోతూ కనిపించాడు, అంతే దభాలున స్వామి పక్కన ఉన్న వేణువును తీసుకుని దానిలోకి తొంగిచూసింది, దానిలో ఏమీలేదు, అంతా ఖాళీ, రాధ అలా చూస్తుండగా కృష్ణుడు నవ్వుతూ లేచి "రాధా..! ఇప్పుడు అర్థం అయ్యిందా వేణువు రహస్యం, నిన్ను నీవు ఖాళీ చేసుకుంటే, నీలోకి కృష్ణ తత్వం ప్రవేశిస్తుంది, నిన్ను నీవు అనవసర విషయాలతో నింపేసుకుంటే, ఇక నాకు చోటేది"..? అప్పుడు రాధకు వేణువును కృష్ణుడు ఎందుకు ఇష్ట పడతాడో అర్థం అయ్యింది, భౌతికంగా చూస్తే మన వెన్నెముకనే వేణువు, దాని లోని రంధ్రాలు యోగ చక్రాలకు ప్రతీకలు, దాని గుండా ప్రాణాయామం ద్వారా శ్వాస నియంత్రణ చేసామంటే, కుండలిని సహస్రారానికి తగిలి కృష్ణ దర్శనం అవుతుంది, అర్థం అయ్యిందిగా కృష్ణస్వామికి వేణువు అంటే ఎందుకు ఇష్టమో..! ఇక శరీరాన్ని వెదురు చేసుకోవాలా..? వేణువు చేసుకోవాలా అనేది మన ఇష్టం..!!✍️*

స్థానబలం

 శ్లోకం:☝️

*నక్ర స్వస్థానమాసాద్య*

  *గజేంద్రమపి కర్షతి |*

*స ఏవ ప్రచ్యుతః స్థానాత్*

  *శునాపి పరిభూయతే ||*


భావం: మొసలి తన స్థానబలం వల్ల సరస్సులో నీరు త్రాగడానికి వచ్చిన పెద్ద ఏనుగును కూడా పట్టి లాగగలదు (గజేంద్ర మోక్షంలో లాగా). అయితే దాని స్వస్థలానికి దూరంగా ఉన్నప్పుడు ఒక ఊర కుక్కకి కూడా అది లోకువై అవమానించబడవచ్చు.

పంచాంగం 01.03.2024 Friday,

 ఈ రోజు పంచాంగం 01.03.2024 Friday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతు మాఘ మాస కృష్ణ పక్ష: షష్థి తిధి భృగు వాసర: స్వాతి  నక్షత్రం ధ్రువ యోగ: గరజి తదుపరి వణిజ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


షష్థి ఈ రోజు పూర్తిగా ఉంది.

స్వాతి మధ్యాహ్నం 12:45 వరకు.

సూర్యోదయం : 06:38

సూర్యాస్తమయం : 06:19


వర్జ్యం : సాయంత్రం 06:47 నుండి రాత్రి 08:30 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:58 నుండి 09:45 వరకు తిరిగి మధ్యాహ్నం 12:52 నుండి 01:39 వరకు.


అమృతఘడియలు : ఈ రోజు లేదు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 3:00 నుండి 04:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

29, ఫిబ్రవరి 2024, గురువారం

గాయత్రి జపించండి

 కంచి పరమాచార్య వైభవము…

0104b. 290224-2.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀362.



          *గాయత్రి జపించండి*

                ➖➖➖✍️


```

ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి మద్రాసులోని తేనంపేట్ నుండి నలభై మంది బ్రాహ్మణులు వచ్చారు. స్వామివారికి నమస్కరించి వారందరినీ బాధిస్తున్న ఒక సమస్య గురించి స్వామివారికి విన్నవించారు. వారు ఉంటున్న ప్రాంతంలో బ్రాహ్మణులు ధైర్యంగా తిరగడానికి సిగ్గుపడుతున్నారని, అక్కడ ఉన్న కొంతమంది నాస్తికవాదులు తమని చూసి గేలి చేస్తున్నారని, కనపడిన ప్రతిసారి వారి శిఖలు, యజ్ఞోపవితాలు, వైష్ణవ ప్రతీకలైన ఊర్ధ్వపుడ్రాలు చూసి చాలా హేళనగా మాట్లాడుతున్నారని స్వామివారితో వాపోయారు.


అంతా విన్నవెంటనే స్వామివారు వారిని ఇలా అడిగారు, “మీరందరూ రోజూ గాయత్రి జపం చేస్తున్నారు కదా?” అని.


అందరూ మౌనంగా ఉన్నారు. వారి మౌనంలోని సమాధానాన్ని స్వామివారు గ్రహించి, “ఇక రోజూ గాయత్రి జపం చెయ్యడం కొనసాగించండి. అంతా సర్దుకుంటుంది” అని ఆదేశించారు.


పరమాచార్య స్వామివారి ఆదేశం అనుసరించి వారు రోజూ గాయత్రి జపం చెయ్యడం మొదలుపెట్టారు. రెండు నెలల్లోనే పరిస్థితి మారిపోయింది. వారు చాలా సంతోషించారు. మహాస్వామి వారిని దర్శించి విషయం అంతా చెప్పారు.


మహాస్వామి వారందరితో ఇలా అన్నారు, “మీకు కలిగిన కష్టాలకు కారణం అంతా మీరు గాయత్రి జపాన్ని వదిలేయడమే. గాయత్రి మంత్రం యొక్క శక్తిని అంచనా వెయ్యడం, లెక్కగట్టడం సాధ్యమయ్యే పని కాదు!”


“మీ సమస్యలన్నిటికీ మూలం మీరు గాయత్రిని వదిలెయ్యడమే!”


ఇది కేవలం అక్కడున్న బ్రాహ్మణులకు మాత్రమే చెప్పిన విషయం కాదు. శాస్త్రం చెప్పినట్టు మన ధర్మాన్ని మనం తప్పక పాటించినట్లయితే ఎవరూ మనల్ని బాధపెట్టరు. అందరూ అందరిని గౌరవిస్తారు.✍️```


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్।

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  944065 2774.

లింక్ పంపుతాము.

దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

జ్ఞానాన్ని

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


 ||శ్లో||.    _

*ఏకమేవాక్షరం యస్తు-*

*గురుః శిష్యం ప్రబోధయేత్-।*

*పృథివ్యాం నాస్తి తద్ద్రవ్యం-*

*యద్ దత్త్వా చాఽనృణీ భవేత్-॥*


||తా|| *జ్ఞానాన్ని ఇచ్చే గురువు ఒక్క అక్షరమే బోధించినా, అతని ఋణం తీర్చుకోవడానికి ఈ భూమి మీద సరిసమానమైనది ఏదీ ఉండదు*......

కవి చమత్కారానికి

 6000లపై ఓ కవి చమత్కారం

🌹🌹🌹

ఒక కవి అనవేమారెడ్డి కొలువుకు వెళ్లి, ఆయన్ని కీర్తిస్తూ ఈ పద్యం చదివాడట.


*అనవేమ మహీపాల స్వస్త్వస్తు తవ బాహవే*

*అహవే రిపుదోర్దండ చంద్రమండల రాహవే*

(శత్రువులను అంతమొందించడంలో అనవేమ ప్రభువు చంద్రమండలంలోని రాహువు లాంటివాడని అర్థం.)

రాజు సంతోషించి, కవికి మూడువేల వరహాల బహుమానం ప్రకటించాడు. అప్పుడు కవి, ‘ప్రభూ, మీకు నేను నాలుగు ‘వే’లిచ్చాను. మీరు నాకు మూడు వేలివ్వడం ధర్మమా?’ అన్నాడు.

రాజు కవి చమత్కారానికి మళ్లీ సంతోషించి, ‘అయితే నాలుగు వేల వరహాలు పుచ్చుకోండి’ అన్నాడు. ‘నేను మీకిచ్చినంతే మీరు నాకు ఇస్తే మీ గొప్పేమిటి?’ అన్నాడు కవివర్యుడు.

రాజు పెద్దగా నవ్వి, బహుమానాన్ని అయిదు వేల వరహాలకు పెంచాడు. దానికి కూడా ఆ కవిపుంగవుడు, ‘నేను ఆరువేల నియోగిని మహాప్రభూ’ అన్నాడట.

కవి సమయస్ఫూర్తికి మెచ్చి, ఆరువేల వరహాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు రాజు. కానీ కవీంద్రడు ఊరుకున్నాడా! ‘నా దగ్గర వున్నదే నాకు ఇస్తే మీ ఘనత ఏమిటి ప్రభూ’ అన్నాడు.

కవి యుక్తి రాజుకు నచ్చి, ఏడు వేల వరహాలు చేశాడు బహుమానాన్ని. ఊహూ! ‘ఏడు అంకె శుభసూచకం కాదుగా’ అన్నాడు ఆ కవి.

చివరకు అనవేమారెడ్డి అక్షరాలా ఎనిమిది వేల వరహాలతో ఆ కవికేసరిని సత్కరించాడట.

పోతనగారి కవితా మాధుర్యం!

 శు భో ద యం🙏


పోతనగారి కవితా మాధుర్యం!


మందార మకరంద...


మందార మకరంద మాధుర్యమున దేలు

మధుపంబు వోవునే మదనములకు

నిర్మల మందాకినీవీచికల దూగు

రాయంచ చనునే తరంగిణులకు

లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు

కోయిల జేరునే కుటజములకు

పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక

మరుగునే సాంద్ర నీహారములకు


అంబుజోదర దివ్య పాదారవింద

చింతనామృత పాన విశేష మత్త

చిత్త మేరీతి నితరంబు జేర నేర్తు!

వినుత గుణశీల, మాటలు వేయునేల?


పోతన భాగవతంతో కాస్తంత పరిచయం ఉన్న ఎవరికైనా ఈ పద్యం తప్పకుండా తెలుస్తుంది. భక్తప్రహ్లాద సినిమా చూసినవాళ్ళకి కూడా ఇది తెలిసే ఉంటుందండోయ్! ప్రహ్లాదుడు మన తెలుగువాళ్ళ హృదయాల్లో నిలిచిపోడానికి ముఖ్య కారణం పోతనంటే అది అతిశయోక్తి కాదు. ఇందులో ఎన్నెన్ని ఆణిముత్యాల్లాంటి పద్యాలు తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరంగా నిలిచిపోయాయో!

కవిత్వంలో, చెప్పే విషయం ఎంత గొప్పదైనా, అది చెప్పే విధానంకూడా అంతగొప్పదీ అయితేనే పాఠకుల మనసులకి హత్తుకుంటుందనడానికి ఈ పద్యం ఒక చక్కని ఉదాహరణ.

విష్ణు భక్తిని వదలడం తన సాధ్యం కాదని చెప్పడం ఈ పద్యం సారాంశం. దాన్ని చక్కని నాలుగు ఉదాహరణల్తో సమర్ధిస్తున్నాడు ప్రహ్లాదుడు. ఆ తీసుకున్న ఉదాహరణల్లో ఎంతో ఔచిత్యం ఉంది. తేనెటీగ, హంస, కోయిల, చకోరం - ఇవన్నీ పురుగులూ, పక్షులూను. వాటికి ఇష్టమైన ఆ వస్తువులు భౌతికమైనవి, అశాశ్వతమైనవి. అలాటి ప్రాణులకే అలాటి వస్తువులమీద అంత వదల్లేని అనుబంధం ఉంటే, ఇంక మనుషులకి, అందులోనూ అమృత ప్రాయమైన హరి చింతన వదిలిపెట్టడం సాధ్యమౌతుందా? సాధ్యమవదు అన్న జవాబు మళ్ళీ ఆ ఉదాహరణల్లోనే దొరుకుతుంది. మందారాల తేనె, గంగా ప్రవాహము, మావిడి చిగురు, వెన్నెల - వీటితో తుమ్మెద, హంస, కోయిల, చకోరాలకి ఉన్న సంబంధం అతి సహజమైనది. ప్రకృతి సిద్ధమైనది. వాటికి తెలియకుండానే పుట్టుకతో వచ్చింది. ప్రహ్లాదుని భక్తి కూడా అలాంటిదే! అందుకే దాన్ని వదులుకోడం అసాధ్యం!


పద్యం ఎత్తుకోడంతోనే అందమైన పదాలకూర్పుతో చదివేవాళ్ళ, వినేవాళ్ళ మనసులని వశం చేసుకోడం ఒక నేర్పు. ఈ పద్యంలో మరింత లోతైన కూర్పు నేర్పు కూడా చూపించాడు పోతన. ఇష్టమైన వస్తువులను ఎక్కువ పదాలతో వర్ణించి, ఇష్టపడని వస్తువులను ఒకటి రెండు పదాలతో చెప్పి ఊరుకున్నాడు. మదనములు - ఉమ్మెత్త చెట్లు. తరంగిణులు - సెలయేళ్ళు. కుటజములు - (వానాకాలంలో పూసే)కొండ మల్లె చెట్లు. సాంద్ర నీహారము - దట్టని మంచు. అయితే వీటిగురించి చెడు విశేషణాలేవీ వాడకపోవడం ఒక విశేషం. ప్రహ్లాదుడు దేనిగురించీ చెడ్డగా మాట్లాడే వాడు కాదు కదా!వాడిన క్రియలుకూడా చెప్పిన ప్రాణులకీ వస్తువులకీ ఉన్న గాఢమైన అనుబంధాన్ని చెప్పేవే - తేలు, తూగు, సొక్కు, స్ఫురితము (చుంబించబడిన).


అంతా చెప్పి చివరికన్న మాట చూడండీ! "అయినా నువ్వు గొప్ప గుణాలున్న శీలవంతుడివి. నీకు నేనింతగా చెప్పాలా!" ఇదేదో ప్రహ్లాదుడు గడుసుగా అన్న మాటలు కావు. అతనికి తండ్రి మీదున్న అచంచలమైన గౌరవమే!

ప్రహ్లాదుని భక్తి మాట అటుంచి, కనీసం అతని సౌశీల్యాన్నయినా ఆదర్శంగా తీసుకుంటే, పిల్లలు మంచి మనుషులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అది మనందరి చేతుల్లోనే ఉంది!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

అహం ఉన్న వ్యక్తికి

 *🎻🌹🙏అహం ఉన్న వ్యక్తికి ఎన్ని తెలివితేటలు ఉన్నా పరాభవం తప్పదు....!!!*


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

                                       

🌿ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే, పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ పట్టలేక పోయేవారు. 


🌸ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే, అవన్నీ ప్రాణమున్న వాటివిగా, మన పక్కన వున్నట్టు, మనకు చేయి అందిస్తున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు ... సజీవంగా వుండేవి.. ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే! ఆ అసాధారణ ప్రతిభ, నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని నింపాయి


🌿ఇదిలావుండగా, ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని, జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి  'మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా!") అని చెప్పాడు


🌸శల్పికి చెమటలు పట్టాయి, ఆయన ఇలా అనుకొన్నాడు, నేను బ్రహ్మ లాంటివాడిని కదా! ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే, ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా.... అనిపించే శిల్పాలు సృష్టిస్తాను.. 


🌿కాబట్టి, నేను అపర బ్రహ్మ అవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కి వుంచుతాను. అపుడు మృత్యు దేవత ప్రాణమున్న శిల్పి ఎవరో, బొమ్మ ఏదో కనుక్కోలేక  వెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు


🌸అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి, మృత్యు దేవత వచ్చే రోజున ఒక దాని వెనుక దాక్కొన్నాడు


🌿మృత్యుదేవత ఆ గది లోకి వచ్చింది. శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు. దేవత వెతుకుతూ వస్తోంది. ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదులే అని అనుకొన్నాడు. 


 🌸శిల్పి ప్రతిభకు మృత్యు దేవత ఆశ్చర్య పోయింది.  ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో... శిల్పమేదో... కనుక్కోలేక పోయింది


🌿ఇక తనవల్ల కాదని వచ్చిన దారినే వెళ్ళి పోవాలనుకొని  వెనుతిరిగింది. శిల్పి ఆనందనాకి అవధులు లేవు. తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు. ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి "ఈ శిల్పి" ఎవరోకానీ, ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు! అంది


🌸అంతే !మన అపరబ్రహ్మకు అహం దెబ్బతింది. తన వృత్తి జీవితంలో ఇప్పటివరకు హేమాహేమీలు  ఒక్కరుకూడా వంక పెట్టలేదు. అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా! ఈ దేవత... అనుకున్నాడు.


🌿 వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో  '' 

ఏది ? ఎక్కడుంది తప్పు చూపించు? అంతా చక్కగావుంది. ఏ తప్పూ లేదు!" అనేసాడు


🌸అపుడు మృత్యుదేవత నవ్వుతూ.... నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని. కానీ నిన్ను గుర్తించడానికి  చెప్పానంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు, నీకు నువ్వే పట్టుబడ్డావు!ల్"ప్రాణాధార మైన నీ శ్వాసను కూడా నియంత్రించ గలిగావు కానీ, నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించ లేకపోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది" అని ఆయన్ను తీసుకెళ్ళి పోయింది


🌿మనం పెంచుకొనే అహంభావం 

 అంత ప్రమాదకరమైనది అది సత్యాన్ని చూడనివ్వదు, వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు, మనం అనుకొన్నదే సరైంది, ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది. 


🌸నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి ''నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు'' అనుకొంటాము. స్వార్థం ప్రకృతి విరుద్ధం, దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం

మీరు గమనించారా ?


🌿'' అహంభావం '' అనే పదం లోంచి అహం 'తీసేస్తే మిగిలేది ' భావం ' అంటే  ' అర్థం' అర్థమైతే అనర్థం జరగదు....నమస్కారం..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿